ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం | - | Sakshi

ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం

Mar 15 2025 7:47 AM | Updated on Mar 15 2025 7:47 AM

ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం

ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం

పుట్టినరోజును పురస్కరించుకుని

ప్రత్యేక పూజలు

పటాన్‌చెరుటౌన్‌: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్‌ నేత నీలం మధుముదిరాజ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతీ గణేశ్‌ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండటంతోపాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement