ప్రధాన వార్తలు

బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్
సాక్షి, అమరావతి:‘చంద్రబాబునాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ ఇదీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతకంతో ఆ పార్టీ జారీ చేసిన ష్యూరిటీ బాండ్. ఇందులో పథకాలను 2024 జూన్ (ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల) నుంచే అమలు చేస్తామని కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ బాండ్ పేపర్లతో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ క్యాడర్... ఆ ఇంటిలో మొత్తం ఎందరు ఉన్నారు...? మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు, వారి పేర్లు తీసుకుని... వీరికి ఏ పథకం కింద ఎంతెంత వస్తుంది..? అని లెక్కలేసి మరీ చెప్పారు. బాండ్ పేపర్లను మొబైల్ ఫోన్లకూ పంపారు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ, సూపర్ సిక్స్ సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్లు మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు మాత్రం ‘‘సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసేశా.. ఎవరైనా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిõÜ్త వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ’’ ముందుగానే బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని... వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్ జగన్ కంటే ఎంత ఎక్కువ ఇస్తాం అనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచీ నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్ జగన్ ప్రజలను హెచ్చరించారు. కానీ.. చంద్రబాబు మాటలు, పవన్ కళ్యాణ్ గ్యారంటీలు.. ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.. సూపర్ సిక్స్ అతీగతీ లేదు.. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా’ అంటూ దబాయిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మెహరాజ్ బేగం షేక్కు ఐదేళ్లలో జరగబోయే లబ్ధికి సంబంధించి ఇచ్చిన హామీ ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు.. సూపర్ సిక్స్, ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురుచూస్తోంది.మహానాడు నుంచే మహా మోసానికి నాంది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే.. అంటే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి, తద్వారా ఒక కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు అనంతరం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబసభ్యుల పేర్లు ఆరా తీసి, ‘‘టీడీపీ మేనిఫెస్టో.కామ్’’ వెబ్సైట్లో ఆ వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి... ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనం ఎంతనో వివరించారు. తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు వెబ్సైట్కు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. బాండ్లను కుటుంబ సభ్యుల ఎదుటే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని బాండ్లలో తేల్చిచెప్పారు.ఇది కాదా మోసం..? 2024 జూన్ నుంచే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు... కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేశారు. కానీ, ఇందులో 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతిని అనుసంధానం చేశానని... 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. చంద్రబాబు మాటల్లోనే సూపర్ సిక్స్ సూపర్ మోసంగా మారిందని స్పష్టమవుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాల గ్రామానికి చెందిన పసాది సాలమ్మకు జరగబోయే లబ్ధికి సంబంధించి కూటమి నేతలు ఇచ్చిన బాండ్ ఆ బాండ్లు... మోసాలకు సాక్ష్యాలు ఏడాదిలో రూ.81,397.83 కోట్లు ఎగవేత ⇒ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ బాండ్లలో గ్యారంటీ ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ‘మోసపోయాం’ అంటూ ప్రతి ఇంట ప్రజలు నిట్టూర్చుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లు.. ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న బాండ్లను తీసుకుని.. ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాల కింద తమ కుటుంబానికి ఎంతమేరకు ప్రభుత్వం ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ⇒ సూపర్ సిక్స్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు బాకీ పడ్డారు. ⇒ పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ, తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18ృ59 ఏళ్ల మధ్య వయసు వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. మహిళలకు రూ.32,400 కోట్లు బాకీపడ్డారు. ⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్కు రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రకారం రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది మరో హామీ. దీనికోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది ఈ హామీ అమలు చేయలేదు. అంటే... ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ 50 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పింఛను ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పింఛనుగా ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఇది ఇవ్వలేదు. రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమందికి రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని బాబు వాగ్దానం చేశారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల చొప్పున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ పంటల బీమా పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలోని 53 లక్షల మంది రైతులకు టోపీ పెట్టిన మొత్తం రూ.1,385 కోట్లు. ఇక మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఎగ్గొట్టిన మొత్తం రూ.265 కోట్లు. ఇలా ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.81,397.83 కోట్లు బకాయి పడిందని ప్రజలు లెక్కలు వేస్తున్నారు. బాకీపడిన ఈ మొత్తంతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.బాబూ... ఇదిగో మీరిచ్చిన బాండు..! ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల నిలదీతకు ప్రజలు సిద్ధం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలును 2024 జూన్ నుంచే ప్రారంభిస్తామంటూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రతి ఇంటా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ఇంటింటా ఆగ్రహం పెల్లుబుకుతోంది. బాండ్లు చూపి చంద్రబాబును నిలదీయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుపై ఇప్పుడు ప్రతి ఇంట చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇచ్చిన బాండు ప్రకారం తమ ఇంటికి గత ఏడాది కాలంలో రావాల్సిన మొత్తంపై లెక్క వేసుకుని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తమ ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేశారు.పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025

తెరుచుకున్న ఇరాన్ గగనతరం.. ఢిల్లీకి మరో 290 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ‘ఆపరేషన్ సింధు’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత, 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్ తాజాగా వెయ్యిమంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్ మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తరువాత భారతీయులను రక్షణకోసం టెహ్రాన్(ఇరాన్) నుండి మషద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్ మహాన్ నడుపుతుండగా, న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది.‘సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనం అని జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిని అర్మేనియా, దోహాల మీదుగా భారత్ తరలించారు.ఇది కూడా చదవండి: ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న 110 మంది విద్యార్థులు

యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు పలువురు యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని మార్చింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా అద్భుతమైన సాధనం.యోగాతో వ్యతిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రపంచంతో మన అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్పూర్తిగా నిలిచింది. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోంది. యోగా గురించి మన్ కీ బాత్లో కూడా చర్చించాను’ అని చెప్పుకొచ్చారు.

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం; తిథి: బ.ఏకాదశి రా.1.43 వరకు, తదుపరి ద్వాదశి; నక్షత్రం: అశ్విని సా.5.38 వరకు, తదుపరి భరణి; వర్జ్యం: ప.1.48 నుండి 3.17 వరకు, తదుపరి రా.2.34 నుండి 4.03 వరకు; దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు; అమృత ఘడియలు: ఉ.10.54 నుండి 12.21 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు; యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం: 5.30; సూర్యాస్తమయం: 6.33; స్మార్త ఏకాదశి. మేషం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.వృషభం...అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.మిథునం...శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం...సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.సింహం....వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కన్య....సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.తుల....నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం...సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.ధనుస్సు....వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.మకరం......శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.కుంభం...పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.మీనం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ఇంద్రావతికి కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్గఢ్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్గఢ్ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోద్ఘాట్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్ఘాట్ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్లైన్స్గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి.

చంద్రబాబు సమర్పించు.. ‘రప్పా రప్పా’ డైవర్షన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు గంటల తన సుదీర్ఘ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పే ధైర్యం లేని చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చంద్రబాబు చేతిలో మోసపోయారని జననేత వైఎస్ జగన్ చెబుతూ శాంతిభద్రతల వైఫల్యం, ఏడాదిలోనే రాష్ట్రం అప్పులపాలైన పరిస్థితి, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, తాను అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేయడం, ఇసుక మాఫియా, అవినీతి, మద్యం... వంటి అనేక అంశాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు.దానికి కౌంటర్గా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించినా.. జగన్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఆయనలో కనిపించలేదు. అందుకే ఎప్పుడూ చేసే మాదిరిగానే టాపిక్ డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు. నిజానికి గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి.. టీడీపీ కార్యకర్త ‘రప్పా రప్పా’ డైలాగు రాసి ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించగా.. జగన్ దానిపై స్పందిస్తూ అసలు ఆ ప్లకార్డులో ఏం రాసి ఉందో తనను ప్రశ్నించిన విలేకరులనే అడిగారు. ‘అది సినిమా డైలాగ్ కదా?’ అని మాట్లాడితే జగనే ‘రప్పా రప్పా నరికేస్తా’ అన్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఐ–టీడీపీ ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. జగన్ ప్రశ్నించిన అంశాల్లో ఒక్క దానిపైనా మాట్లాడని చంద్రబాబు రప్పా రప్పా డైలాగు గురించే మాట్లాడి టాపిక్ డైవర్షన్ మొదలుపెట్టడం గమనార్హం.దేశం కార్యకర్త నుంచే వ్యతిరేకత వాస్తవానికి జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘రప్పా రప్పా’ అనే పుష్ప సినిమా డైలాగు రాసిన ఒక ప్లకార్డును పట్టుకున్నాడు. చంద్రబాబు పాలనలో మోసపోయానని కడుపుమండి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్సార్సీపీ ర్యాలీలోకి వచ్చి అలా ప్లకార్డు పట్టుకున్నాడంటే చంద్రబాబు సిగ్గుపడాలి. కానీ వక్రీకరణలో ఆరితేరిన చంద్రబాబు ఆ విషయాన్ని నిస్సిగ్గుగా వక్రీకరించేశారు. ఆ వాదనకు మద్దతుగా ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా, పవన్ కళ్యాణ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్ వంటి కొన్ని పాత్రలను రంగంలోకి దింపారు. ఏడాదిలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జగన్ అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఫేక్ ప్రచారాలు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్లు, 143 హామీల అమలు వైఫల్యం గురించి, ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లకు దాటిపోయిన అప్పుల గురించి, రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు.. చేస్తున్న దాడులు, దౌర్జన్యాల గురించి.. అనేక ప్రజా సమస్యల గురించి వైఎస్ జగన్ ప్రశి్నస్తే వాటిపై స్పందించకుండా కేవలం ఆయన అనని మాటలను వక్రీకరిస్తూ విష ప్రచారానికి దిగడాన్ని బట్టి వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదని స్పష్టమైంది.అమరావతి పేరుతో అవినీతి, ఇసుక, మద్యం దోపిడీ, ఎమ్మెల్యేల అవినీతితోపాటు మొత్తంగా చంద్రబాబు పాలనపై ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తాజా ఘటనలతో స్పష్టమవుతోంది. మరోవైపు జగన్మోహన్రెడ్డి పర్యటనలకు తరలివస్తున్న జనాన్ని చూసి కళ్లల్లో విషం నింపుకున్న కూటమి నేతలు తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి మరింత పదునుపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ను భూస్థాపితం చేస్తానని ఇటీవలే నోరుపారేసుకున్న చంద్రబాబు ‘డైలాగులు సినిమాలకే సరిపోతాయంటూ’ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ల బిజీలోనూ స్పందించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ‘కొడకల్లారా.. తోలు తీస్తాం.. తొక్క తీస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటూ పూనకం వచ్చినట్లు మాట్లాడింది ఆయనే. అంతెందుకు ఇటీవలే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు.. జగన్ను భూస్థాపితం చేస్తానని అన్నారు. సీఎం స్థాయిలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి.. ఒక మాజీ సీఎంను, ప్రతిపక్ష నేతను ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారు? ఎన్నికలకు ముందు అంగళ్లు సభలో చంద్రబాబు స్వయంగా అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడులు చేయించారు.ఈ దాడిలో రణ«దీర్ అనే కానిస్టేబుల్పై దాడి చేసి కన్ను పోగొట్టారు. జగన్ను గాజుగ్లాసుతో పొడవండి.. రాళ్లతో కొట్టండి.. సీసం పోసి చంపండి అని రెచ్చిపోయి మాట్లాడింది చంద్రబాబే. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అనిత అప్పట్లో జగన్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు జగన్ను భౌతికంగా లేకుండా చేయాలని అన్న వీడియో బయటకు వచ్చింది.అంత బరితెగించి మాట్లాడిన వారికి ఏం శిక్ష పడాలి? ఇప్పుడు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ, అందులో భాగంగా జగన్ తల నరికేయవచ్చు కదా? అసలు ఆయనకు జీవించే హక్కు ఉందా? అని టీడీసీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో చంద్రబాబు తన కడుపులోని విషాన్నంతా కక్కించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, నిర్భంధాలు, నోరెత్తితే అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్న వైనంపై జగన్ మాట్లాడితే బుచ్చయ్యచౌదరి దాన్ని వక్రీకరించి నక్సలైట్లను తయారు చేస్తావా? అంటూ తన నోటికి అడ్డూఅదుపూ లేదని నిరూపించారు.

అణు ఉపద్రవం
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్–ఇరాక్ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది. ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్లో విశిష్ఠ సభ్యుడు

పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
హారికకు మూడో స్థానం
లబుషేన్కు ఉద్వాసన
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అమెరికాతో పాక్ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్కే చెబుతా..
International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..
‘రాజాసాబ్’ సినిమా టీజర్ విజువల్స్ చోరీ
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
హారికకు మూడో స్థానం
లబుషేన్కు ఉద్వాసన
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అమెరికాతో పాక్ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్కే చెబుతా..
International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..
‘రాజాసాబ్’ సినిమా టీజర్ విజువల్స్ చోరీ
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సినిమా

స్టార్ హీరో కుమారుడిని గుర్తు పట్టలేదా?.. ఇజ్జత్ మొత్తం పాయే!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసేందుకు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే ఈ మూవీ వీక్షించేందుకు అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వచ్చాడు. థియేటర్ వద్ద అదే సమయంలో సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చేందుకు జునైద్ ఖాన్ యత్నించాడు. అయితే అతన్ని గుర్తుపట్టని బాడీగార్డ్స్ ఒక్కసారిగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టార్ హీరో కుమారుడిని కూడా గుర్తు పట్టలేరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు గతంలో విక్కీ కౌశల్తో ఇలాంటి సంఘటన జరిగిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 2023 ఐఫా అవార్డుల సమయంలో విక్కీ కౌశల్.. సల్మాన్ ఖాన్ను పలకరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని గార్డులు వెంటనే విక్కీ కౌశల్ను పక్కకు నెట్టారు.మరోవైపు అమిర్ ఖాన్- రీనా దత్తాల కుమారుడైన జునైద్ ఖాన్ 2024లో మహారాజ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏక్ దిన్ అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది ఖుషీ కపూర్తో కలిసి నటించిన లవ్యాపా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత జునైద్ ఖాన్ను దారుణంగా ట్రోల్ చేశారు. #SalmanKhan security 🤣 #JunaidKhan pic.twitter.com/cWXbxgxVaw— $@M (@SAMTHEBESTEST_) June 20, 2025

నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న స్టార్ హీరో భార్య!
ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్మెంట్ను లీజ్కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. ఈ ఏరియాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసమున్నారు.ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే మా అనే చిత్రంలో నటించారు. కాజోల్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తాడు. దీంతో పాటు ఫాతిమా సనా షేక్ జంటగా ఆప్ జైసా కోయి అనే సినిమాలో కూడా నటించారు. ఈ రొమాంటిక్ సినిమా జూలై 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. మాధవన్ చివరిసారిగా అక్షయ్ కుమార్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం కేసరి చాప్టర్-2లో కనిపించాడు.అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిసాబ్ బరాబర్ విడుదలైంది . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది. View this post on Instagram A post shared by Sarita Birje Madhavan (@msaru15)

కేరవాన్లో ఫుల్లుగా ఏడ్చేదాన్ని.. తర్వాత నవ్వుతూ..: అనన్య
ప్రేమలో మోసపోయానంటోంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో నా మనసుకు, మెదడుకు, చేతలకు సంబంధమే లేకుండా పోయింది. అతడికి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా నాకు తెలీకుండానే ఫోన్ చేసేవాడిని. ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదు. రెండు, మూడేళ్లపాటు చాలా బాధపడ్డాను. కేరవాన్లో ఏడ్చేసి..కానీ, చేసే పనిపై దాని ప్రభావాన్ని పడనివ్వలేదు. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. ఈ బాధలో నుంచి బయటకు వస్తానా? లేదా? అనుకున్నాను. తర్వాత ఇదంతా ఒక మాయ అని తెలుసుకుని బయటపడ్డాను అని తెలిపింది.తెలుగమ్మాయికి అవకాశాలు తక్కువ?తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్. హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారు. వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే వచ్చినన్ని అవకాశాలు.. తెలుగమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే రావట్లేదు. ఇదే నిజం. హిట్స్ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నాకోసం నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు నేనే మార్కెటింగ్సినిమాల్లో యాక్ట్ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్పై ఎక్కువగా ఫోకస్ చేశాను. దానివల్ల నాకంటూ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్టులు వస్తున్నాయి. బాలీవుడ్లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన అనన్య.. వకీల్ సాబ్, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్ సినిమాకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా

'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
బాలీవుడ్లో ప్రముఖ ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేసింది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించడంతో ఆర్జే పేరు వైరలైపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మహ్వశ్ మ్యాచుల్లో సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కోడై కూసింది. తనపై వస్తున్న రూమర్స్పై కూడా ఆమె స్పందించింది.తాజాగా ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అందులో నెటిజన్స్ చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. వాటికి వివరణ ఇస్తూ ఓ వీడియోను పంచుకుంది. 'యూజీ భాయ్నే ఇస్కా కెరీర్ బనా దియా'(యుజ్వేంద్ర చాహల్ ఆమె కెరీర్ను నిలబెట్టాడు) అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.నేను 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. 2023లో సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించానని ఆర్జే మహ్వశ్ తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా సెక్షన్-108 మూవీని నిర్మించినట్లు పేర్కొంది. అంతేకాకుండా మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు పుట్టకుముందు నుంచే తాను క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నానని కుల్దీప్ యాదవ్, ధోని, బ్రెట్ లీ, సురేశ్ రైనా, క్రిస్గేల్, అక్తర్, జాక్వస్ కలిస్తో దిగిన ఫోటోలను కూడా వీడియో చూపించింది. మీరు ఏదైనా మాట్లాడేముందు తన గురించి తెలుసుకోవాలని హితవు పలికింది. అంతేకానీ ఎవరో పంపిన వాటిని ఫార్వార్డ్ చేయకండి అంటూ మహ్వశ్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ లెక్కన ఆర్జే మహ్వశ్.. యుజ్వేంద్ర చాహల్ పరిచయానికి ముందే క్రికెట్తో అనుబంధం ఉందన్నమాట. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.144 బంతుల్లోనే జైశ్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించాడు.ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 1967లో భారత క్రికెట్ దిగ్గజం ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. టీమిండియా ఓపెనర్ లీడ్స్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పుడు 58 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు👉ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా జైశ్వాల్నిలిచాడు. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైశ్వాల్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ గడ్డపై జైశ్వాల్కే అదే తొలిటెస్టు మ్యాచ్.👉ఇంగ్లండ్పై గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025చదవండి: ENG vs IND: ఇషాన్ కిషన్కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?

ఇషాన్ కిషన్కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. డివిజన్–1 కౌంటీ చాంపియన్షిప్లో నాటింగ్హామ్షైర్ క్రికెట్ క్లబ్తో కిషన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయో కౌంటీ సీజన్లో కిషన్ నాటింగ్హామ్షైర్ తరపున రెండు మ్యాచ్లు ఆడనున్నాడు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ స్థానంలో కిషన్ను నాటింగ్హామ్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లనున్నాడు. వెర్రెయిన్ గైర్హజరీలో కిషన్ రెండు వారాల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. కిషన్ జూన్ 22 నుండి 26 వరకు ట్రెంట్ బ్రిడ్జ్లో యార్క్షైర్తో, జూన్ 29 నుండి జూలై 2 వరకు టౌంటన్లో సోమర్సెట్పై ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఇషాన్ ధ్రువీకరించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని కిషన్ తెలిపాడు. ఇక 10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఈ జార్ఖండ్ ఆటగాడు నిలిచాడు.కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్షైర్, హాంప్షైర్లతో జతకట్టారు. కాగా ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన కిషన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. ఇప్పుడు కౌంటీల్లో మెరుగ్గా రాణిస్తే.. భారత జట్టులోకి తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా కిషన్కు పిలుపు వచ్చే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ

ఇంగ్లండ్తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఐదో ఆటగాడిగా.కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025టీబ్రేక్కు భారత స్కోరంతంటే?ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025

యువీతో గిల్ గురించి మాట్లాడాను.. కపిల్ దేవ్ మాదిరే అతడు కూడా..
టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.శుబ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్రాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్గానూ కెప్టెన్ గిల్ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్ల గురించి నేను యువరాజ్ సింగ్తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్ అన్నాడు. అవును.. శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.కపిల్ దేవ్ మాదిరికెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్ నిండుతుంది. శుబ్మన్ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్కప్లో కపిల్ దేవ్ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్రాజ్ సింగ్ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.జైసూ అర్ధ శతకం పూర్తికాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్తో తలపడుతోంది. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42)- యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన అతడు డకౌట్ అయ్యాడు.ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
బిజినెస్

అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలు
బెంగళూరులో కఠినమైన అద్దె విధానాలపై రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో అద్దెదారులను ఇబ్బంది పెట్టేలా ఉన్న నిబంధనల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దెకు ఉండడం కంటే డబ్బు ఖర్చయినా సొంతంగా ఇళ్లు కొనడం బెటర్ అనే ధోరణికి వస్తున్నట్లు చెప్పారు.కొంతకాలంపాటు బెంగళూరు నగరం బయట అద్దెకు ఉన్న ఒక యూజర్ ఇటీవల నగరం లోపలకు మకాం మార్చినట్లు చెప్పారు. తమ కొత్త ఇంటి యజమాని అసంబద్ధమైన డిమాండ్లు పెడుతున్నాడని రాశారు. బెంగళూరులో ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తప్పుబడుతూ ‘మొదట వారు ఆరు నెలల డిపాజిట్, అడ్వాన్స్ రెంట్ తీసుకుంటారు. మీరు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇంటిని తిరిగి శుభ్రం చేయించేందుకు, కొత్తవారి కోసం మీరు వాడిన వస్తువులను మార్చేందుకు డబ్బు అవసరం అవుతుందని చెప్పి అధిక మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డిపాజిట్ తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా వారికి లేదు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!బెంగళూరు రియల్టీ మార్కెట్లో సాధారణంగా అద్దెదారుల నుంచి ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ను తీసుకుంటున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అందుకే నగరంలో స్వల్పకాలిక నివాసం ఉన్నవారు కూడా సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ దోపిడీ నుంచి బయటపడాలనుకుంటున్నారని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘వారు ఆ డిపాజిట్ను ఉపయోగించి ఇంటిని పునరుద్ధరిస్తారు. అది మా డబ్బు. ప్యూర్ టార్చర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నా మునుపటి ఇంటి యజమాని తన ఇంటి గోడలపై 1-2 చోట్ల పెయింటింగ్ పోయినందుకు మొత్తం పెయింటింగ్ అయ్యే ఖర్చును వసూలు చేశాడు’ అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు.

నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!
ప్రతి దేశంలో ఆరోగ్య సంరక్షణ, రవాణా, అద్దె, ఆహారం, యుటిలిటీల ఖర్చును పరిశీలించి చౌకైన దేశమా? ఖరీదైన దేశమా? అని నిర్ణయిస్తారు. విలియం రస్సెల్ అనే రిసెర్చ్ అనలిస్ట్ 2025లో మూడు చౌకైన ప్రాంతాల వివరాలు వెల్లడించారు. అందులో వియత్నాం ముందు వరుసలో నిలిచింది.వియత్నాం ప్రవాసులు జీవించడానికి అత్యంత చౌకైన దేశంగా ఉందని విలియం రస్సెల్ తెలిపారు. మంచి ఆహారం, స్నేహపూర్వక స్థానికులు, ఆధునిక సౌకర్యాలు, పురాతన సంప్రదాయాలు అన్నీ వియత్నాంలో ఉన్నాయని చెప్పారు. నెలకు సగటున సింగల్బెడ్రూమ్ అపార్ట్మెంట్కు 265 పౌండ్ స్టెర్లింగ్(రూ.30 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్కు 589 పౌండ్ స్టెర్లింగ్(రూ.68 వేలు) ఖర్చవుతుందని అన్నారు. వియత్నాంలో మొత్తం జీవన వ్యయం యూకే కంటే 59 శాతం చౌకగా ఉందని తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్లో ఏటా నర్సరీ ఫీజు రూ.1లక్షపైనే ఉందని కొందరు చెబుతున్న నేపథ్యంలో వియత్నాంలోని ఇంటి అద్దెలు వాటి కంటే చీప్గా ఉన్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: సన్టీవీ ఛైర్మన్కు ఆయన సోదరుడు నోటీసులుబొలీవియా ప్రవాసులకు రెండో అత్యంత చౌకైన దేశంగా ఉందని చెప్పారు. రాజధాని లా పాజ్లో ఒక పడకగది అపార్ట్మెంట్ ధర నెలకు 386 డాలర్లు(రూ.33 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్ ధర 707 డాలర్లు(రూ.45 వేలు) అని అన్నారు. జార్జియా మూడో చౌకైన గమ్యస్థానంగా ఉందని విలియం చెప్పారు.

రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సోదరుడు దయానిధి మారన్ కళానిధితోపాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి.కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.మీడియా, ఎంటర్టైన్మెంట్సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్.సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.కేఏఎల్ రేడియో / సౌత్ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.ఇదీ చదవండి: గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్ప్రింట్ మీడియాదినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.క్రీడలుసన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.గతంలోని వెంచర్స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు.

గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు.
ఫ్యామిలీ

Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా‘సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు, మానసిక వికాస సిద్ధి, శరీరం – మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగాఒక్కటే’ అనే నినాదం మార్మోగుతోంది. విశాఖపట్నంలో యోగా ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననుండడం మరో విశేషం. విద్యాలయాల్లో గతంలో ప్రతిరోజూ ఒక పీరియడ్ ‘డ్రిల్ క్లాసు’ కోసం కేటాయించేవారు. తొలుత పరు గుతో పాటు ఆపై అనేక క్రీడల్లో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడానికి పీఈటీ,ఎంపీఈడీ, బీపీఈడీ టీచర్లు, అధ్యాప కులు ఉండేవారు. ఆపై వేలాది మంది శిక్షకులు విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చే వారు. విద్యాలయాల్లో రానురాను వీరి నియామకాలు నిలిచిపోవడంతో, ఏకంగా పలు క్రీడాంశాలే మటు మాయమయ్యాయి.గతంలో ప్రతి ఏటా జోన్, సెంట్రల్ జోన్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇవి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేవి. ప్రస్తుతం జిల్లా స్థాయిలో మొక్కుబడిగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనూ అనేక విద్యా లయాలకు కనీస ప్రాతినిధ్యం కూడా లభించడం లేదు. నేడు అనేక పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాపరికరాలు సైతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక విద్యాలయాల్లో వ్యాయామ విద్యకు చోటెక్కడున్నట్టు? అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేలాది పాఠశాలలు జానెడు ఖాళీ స్థలానికి కూడా నోచుకోని అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. కచ్చితంగా ఆటస్థలం ఉండాలనే విద్యాశాఖ నిబంధనలున్నా, ఫలితం మాత్రం శూన్యం! ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?యోగా, వ్యాయామ విద్యల మధ్య పెద్దగా తేడాలేమీ లేవు. రెండింటిలోనూ శారీరక భంగిమలు 70 శాతం సమానం. వ్యాయామంలో తొలుత రన్నింగ్ ఉంటే, యోగాలో మెడిటేషన్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత యోగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఆధునిక కాలానుగుణంగా వ్యాయామ విద్యలో అవసరమైన మార్పు–చేర్పులు చేసి, ఉన్నత పాఠశాలల్లోని ప్రతి విద్యార్థీ విధిగా నిత్యం ‘స్పోర్ట్స్ పీరియడ్’లో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోగలిగితే... యోగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో సందేహించాల్సింది లేదు.చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో– నిమ్మరాజు చలపతిరావు ( జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం)

International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా
వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్ స్వప్న యోగాన్వేష్.‘లండన్లో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్ వంటి యోగిక్ ప్లేస్లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్గా, మెంటల్గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ హీలింగ్ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్ఫుల్నెస్ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్ మీడియా డీటాక్స్: రోజంతా మొబైల్, స్క్రీన్ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డీటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

సాహిత్యమే పిల్లలకు మంచి చెప్పాలి
‘మేము చదువుకునే సమయంలో రోజూ మోరల్ ఇన్స్ట్రక్షన్ (ఎం.ఐ.) అనే క్లాస్ ఉండేది. పిల్లల్ని కూచోబెట్టి సార్లు ఒక కథ వినిపించి అందులోని నీతి వివరించేవారు. అసలు నేడు పిల్లలకు ఇంటా బయటా మౌలిక భావాలు ఎవరు చెబుతున్నారు? పెద్దవాళ్లకా టైమ్ లేదు. మరి పిల్లలకు పరోపకారం చేయాలని, దేశభక్తి కలిగి ఉండాలని, మూఢ భావాలు ఉండకూడదని, అందరి పట్లా సమ భావన కలిగి ఉండాలని, ఆధునిక భావాలు కలిగి ఉండాలని... ఎవరు చె ప్పాలి? బాల సాహిత్యమే చె ప్పాలి. పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే తప్ప ఇవాళ వారిలో కనిపిస్తున్న దుర్లక్షణాలు పోవు’ అన్నారు గంగిశెట్టి శివ. 71 ఏళ్ల శివకుమార్ దాదాపు యాభై ఏళ్లకు పైగానే బాల సాహిత్యం రాస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయన పుస్తకం ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్యం కేటగిరిలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ‘సాక్షి ఫీచర్స్ ప్రతినిధి’తో శివకుమార్ సంభాషణ...→ బాల సాహిత్యంలోకి ఎలా వచ్చారు?శివకుమార్: మాది నెల్లూరు జిల్లా రాపూరు. మా నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు. తరుచూ బాలమిత్ర, చందమామ ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో వాటిని చేత్తో తాకడమే పెద్ద సంబరం. 13 ఏళ్ల వయసులో అవి చదివి అలా నేను కూడా కథలు రాయాలనుకునేవాణ్ణి. 14వ ఏట మొదటి కథ పోస్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లల కథలు రాసి పత్రికలకు పంపించడం మొదలుపెట్టాను.→ కథల్లో పిల్లలకు ఏం చెబుతుంటారు?జ: నేను కొడవటిగంటి కుటుంబరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనలాగే పిల్లల్లో ఆలోచన, విచక్షణ పెరిగే సాహిత్యం ఉండాలని కోరుకుంటాను. మంత్రాలు, తంత్రాలు కాకుండా హేతువుకు ప్రాధాన్యం పెరిగేలా రాశాను. బాలసాహిత్యం చదివిన పిల్లలు తమకు తాము మేలు చేసుకోవాలి, సమాజానికి మేలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కల్పించని సాహిత్యం మంచి బాల సాహిత్యం కాదు. ఇవాళ్టి పిల్లలు రేపటి ΄ పౌరులు మాత్రమే కాదు మహా పురుషులు కావాలి. కాని ఏ మహాపురుషుడి గురించి వీరు తెలుసుకుంటున్నారు... చదువుతున్నారు? మనందరం గాంధీ, నెహ్రూ గాథల నుంచి కదా ఇన్స్పయిర్ అయ్యింది?→ ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు రాశారు?జ: పది పుస్తకాలు రాశాను. కథలు వందల కొద్దీ రాశాను. నేను బి.ఎస్సీ చదివి తెలుగు ఎం.ఏలోకి వచ్చాను భాష మీద ప్రేమతో. ఇవాళ ఎంతమంది అలా వస్తున్నారు? భాష, సాహిత్యాలకు బడులలో ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు ప్రధానమయ్యాయి తల్లిదండ్రులకు. వ్యక్తిత్వం మార్కులతో, ర్యాంకులతో రాగలదా? వ్యక్తిత్వ నిర్మాణమే దేశ నిర్మాణం అని తెలుసుకోవాలి. ఇవాళ టీచర్ల మీద దాడి చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులను ఆదరించని పిల్లలు ఏ సంస్కృతికి ప్రతిఫలం? ఇలాంటి పిల్లలు గొప్ప సాహిత్యం, నైతిక విలువలు పాదుకొలిపే పుస్తకం ఒక్కటి కూడా చదివి ఉండరు. వీరి చేత చదివించని పెద్దలు వీరి నుంచి మంచి నడవడికను మాత్రం ఆశిస్తారు. అదే విచిత్రం.→ ‘కబుర్ల దేవత’ పుస్తకానికి మీకు పురస్కారం వచ్చింది. ‘కబుర్ల దేవత’ కథ పేరు. అందులో ఏముంది?జ: కొంతమంది మాటలు చెప్పి బతగ్గలరు. అదొక స్కిల్. అది అందరికీ రావాలని లేదు. అంతమాత్రాన పనిమంతుడికి విలువ తగ్గదు. పని తెలిసినవాడు తన పని తాను చేసుకెళ్లాలి. దానికీ ఫలితం ఉంటుంది. మాట్లాడేవాళ్లను చూసి బెదరిపోవద్దు అనే వ్యక్తిత్వ వికాస కోణంలో ఆ కథ పిల్లలకు చె ప్పాను.→ మీకు నచ్చిన బాల సాహిత్యకారులు?జ: కలువకొలను సదానంద గారు మంచి సాహిత్యం రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే శైలి వారిది. కె.సభా కూడా మంచి బాల సాహిత్యం రాశారు. → మీ ఇతర వివరాలుజ: నేను నెల్లూరు జిల్లాలోనే వివిధ చోట్ల ఉ పాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యాను. మ అబ్బాయి చెన్నైలో, అమ్మాయి నెల్లూరులో స్థిరపడ్డారు. రిటైరయ్యాక కూడా ఒక స్కూల్ బాధ్యతలు చూస్తున్నాను. పిల్లలను కంట్రోల్ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. పిల్లలు ఇలా ఎందుకు ఉన్నారో అందరూ కలిసి ఆలోచించాలి. పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అనుకోనంత వరకూ బాలల వికాసం పరిపూర్ణంగా జరగదు.

మిసెస్ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!
ఇటీవల మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనం వారు సాధిస్తున్న విజయాలే. పెళ్లిచేసుకుని, పిల్లలను కని..అక్కడితో తమ జీవితాన్ని పరిమితం చేయడం లేదు. కొన్నేళ్లు విరామం ఇచ్చి మళ్లీ తమ కెరీర్లో పుంజుకోవడమో లేదా తమకు నచ్చిన వ్యాపకంతోనో ముందుకు సాగుతున్నారు. పైగా అందులో అనూహ్యమైన విజయాలు అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఐశ్వర్య రాజ్ఇటీవల బిహార్లో మిసెస్ బిహార్ 2025 పోటీలు ముగిశాయి. ఆ పోటీల్లో భోజ్పూర్ జిల్లా, తరారి బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య ఐశ్వర్య రాజ్ మిసెస్ బిహార్గా కిరీటాన్ని దక్కించుకోవం విశేషం. ఆమె ఆధునిక ఆశయాలు, సంప్రదాయ విలువలు కలిగిన శక్తిమంతమైన మహిళ. బిహార్లోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్న మహిళ ఐశ్శర్య రాజ్. ఈ పోటీలో 14 మంది మహిళలు కిరీటం కోసం పోటీపడగా..ఐశ్వర్య తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో విజయం సొంతం చేసుకుని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేగాదు తన గెలుపుతో మహిళలు కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా తమదైన రంగంలో ఎలా గెలవాలో ప్రేరణగా నిలిచారామె. ఇక పాట్నాలో పెరిగిన ఐశ్వర్య చదువంతా ఢిల్లీలోనే సాగింది. అక్కడే ఫైనాన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే కార్పొరేట్ ప్రపంచంలో కూడా తనదైన ముద్రవేసింది. కాగా, పలువురు నెటిజన్లు ఆమె గెలుపుని బిహార్కే గర్వకారణం. పైగా ప్రతిభ, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అంటూ ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తు పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by 👑 AISHWARYA RAJ 👑 (@aishwarya.raj95) (చదవండి: ఐదు పదుల వయసులోనూ యువకుడిలా రాహుల్ గాంధీ..! రీజన్ అదే..)
ఫొటోలు
అంతర్జాతీయం

ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్తో యుద్ధం కారణంగా వాయిదా పడింది.

భారత్ దాడులతో వణికిపోయాం.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై స్పందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్ సిందూర్పై ఇషాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, షోర్కోట్ ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్ వేగంగా స్పందించింది. భారత్తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేసిన దాడులను పాక్ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్ఖాన్ ఎయిర్బేస్తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం
వాషింగ్టన్: ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ‘సోషల్ మీడియా తనిఖీల ద్వారా మా దేశంలోకి రావాలనుకునే ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించడానికి వీలవుతుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవసీ సెట్టింగ్స్ను ‘పబ్లిక్’గా మార్చుకోవాల్సి ఉంటుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా స్టూడెంట్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూల్ను ట్రంప్ సర్కార్ ఈ ఏడాది మే చివరి వారంలో తాత్కాలికంగా నిలిపేసింది. అమెరికా రావాలనుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. అందుకే వీసాల జారీని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా వెట్టింగ్ కంపల్సరీ చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునఃప్రారంభించింది.‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటే?‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు అనుమతి ఇవ్వొచ్చా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించడానికి వారి ఆన్లైన్ కార్యక లాపాలను, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం. విద్యార్థి సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో పాలస్తీనా అనుకూల పోస్టులు, అమెరికా వ్యతిరేక పోస్టులు ఏమైనా ఉన్నాయా? అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. వారివల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే స్టూడెంట్ వీసా మంజూరు చేస్తారు.

టార్గెట్ ‘ఫోర్డో’
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే. ఏమిటీ అణుకేంద్రం? అణు బాంబు తయారీపై ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్లు ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్–గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్ వల్ల సాధ్యమేనా? ప్రత్యామ్నాయ మార్గం ఇదే.. ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్ బాంబుఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్ఫోర్స్ మాజీ కల్నల్ సెడ్రిక్ లైటన్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

‘తెలంగాణతో చర్చించకుండా.. ఢిల్లీ నుంచి అనుమతులు కోరడం సరైంది కాదు’
ఢిల్లీ: పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఏపీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే చంద్రబాబుతో చర్చలకు తామే ముందడుగు వేస్తామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీ నుంచి అనుమతులు కోరతామని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైనది కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, జూన్ 20వ తేదీ) ఢిల్లీ నుంచి బయల్దేరి క్రమంలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ‘టిఆర్ఎస్ వల్లే తెలంగాణకు కృష్ణా నీటి పంపకాల్లో అన్యాయం జరిగింది. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావే. కృష్ణానదిలో మేము 500 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నాం. బిజెపికి టిఆర్ఎస్ అవయవ దానం చేసింది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను బీజేపీ గెలిపించడంలో బీఆర్ఎస్ సహాయం చేసింది. టీఆర్ఎస్ చరిత్రలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండటం ఇదే తొలిసారి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.

అవినీతి అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమా?: సుప్రీం కోర్టు
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కేసు ఏంటంటే.. గుజరాత్లోని ఒక రైల్వే ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్స్పెక్టర్ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
పురులియా: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం లారీని బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు వివరాలు ప్రకారం.. అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని నిమ్దిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తిలైటాండ్కు వెళ్తుండగా, బొలెరో వాహనం అతివేగంగా ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.అయితే, తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదంలో ముంచెత్తింది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.