కోస్గి పట్టణంతో పాటు వీలిన గ్రామాలైన పోతిరెడ్డిపల్లి, సంపల్లి, మల్రెడ్డిపల్లి, మాసాయపల్లి నుంచి రోజూ చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డు కోసం పట్టణ శివారులో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి రూ.40 లక్షల నిధులు సైతం కేటాయించారు. ఈమేరకు టెండర్లు వేసి నెలలు గడుస్తున్నా నేటికి డంపింగ్ యార్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. అదే స్థలంలో రోజు చెత్తను డంపింగ్ చేస్తున్నారు. వారం పది రోజులకు ఒకసారి చెత్తకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగతోపాటు చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని జనం వాపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డి డంపింగ్ యార్డుపై దృష్టి సారించి రాష్ట్రంలోనే నంబర్ వన్ డంపింగ్యార్డును నిర్మించి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.