మాగనూర్: వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ.. అంగరంగ వైభవంగా పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల రథోత్సవం సాగింది. మండలంలోని నేరడగంలో సోమవారం ఉదయం నుంచి మఠంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలలో ప్రధాన ఘటమైన స్వామివారి రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. మఠంలో ప్రత్యేక పూజలు ఆనంతరం సిద్ధలింగ మహాస్వాముల వారి విగ్రహాన్ని పురోహితుల వేదమంత్రాలు.. భక్తుల శరణుఘోష.. కాగడాల నడుమ రథంపై ఉంచారు. అనంతరం తేరును ముందుకు లాగారు.
ఘనంగా సామూహిక వివహాలు..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం మఠం ఆవరణలో సామూహిక వివాహాలు నిర్వహించారు. మొత్తం 14 జంటలకు వివాహాలు జరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు.
నేరడగంలో రథాన్ని ముందుకు లాగుతున్న భక్తులు
పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాములకు ప్రత్యేక పూజలు
నేరడగంలో కనులపండుగగా సామూహిక వివాహాలు