నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులతో నిర్బంధించడం దారుణమని తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. పోలీసులచే ఆశావర్కర్లను అరెస్టు చేయించిన మాత్రాన తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆశావర్కర్ల ఆందోళనకు వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిర్మల, లక్ష్మి, శివమ్మ, నర్సమ్మ, రాధిక, మహేశ్వరి, నాగమణి, నర్మద పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ఆశావర్కర్ల నిర్బంధం దారుణం
Mar 26 2025 1:21 AM | Updated on Mar 26 2025 1:19 AM
Advertisement
Related News By Category
-
‘మత్తు రహిత జిల్లానే లక్ష్యం’
నారాయణపేట క్రైం: మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్...
-
బెడ్ల కొరత
ఐదు రోజుల క్రితం కలరా సోకడంతో ఆస్పత్రికి వచ్చి, అడ్మిట్ అయ్యాను. ఒకే బెడ్పై నాతో పాటు మరో వ్యక్తికి వైద్యం చేశారు. మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఒకే బెడ్ ఇద్దరం సైలెన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నె...
-
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
మాగనూర్: మొక్కలు సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీడీఓ శ్రీనివాసులుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ...
-
దంచికొడుతున్న వాన
నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను సీపీఓ యోగానంద్ వెల్లడించారు. జిల్లాలో అత్య...
-
కష్టాల కడలిలో ‘గంగ’మ్మ
మృతి చెందిన హరిబాబు ఫొటో చూపిస్తూ ఆదుకోవాలని దీనంగా అర్ధిస్తున్న ఆయన భార్య గంగ, తల్లి మల్లమ్మ, తండ్రి మిద్దె పెద్ద లక్ష్మయ్యను పైదృశ్యంలో చూడవచ్చు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర...
Related News By Tags
-
‘మత్తు రహిత జిల్లానే లక్ష్యం’
నారాయణపేట క్రైం: మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్...
-
బెడ్ల కొరత
ఐదు రోజుల క్రితం కలరా సోకడంతో ఆస్పత్రికి వచ్చి, అడ్మిట్ అయ్యాను. ఒకే బెడ్పై నాతో పాటు మరో వ్యక్తికి వైద్యం చేశారు. మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఒకే బెడ్ ఇద్దరం సైలెన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నె...
-
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
మాగనూర్: మొక్కలు సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీడీఓ శ్రీనివాసులుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ...
-
దంచికొడుతున్న వాన
నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను సీపీఓ యోగానంద్ వెల్లడించారు. జిల్లాలో అత్య...
-
కష్టాల కడలిలో ‘గంగ’మ్మ
మృతి చెందిన హరిబాబు ఫొటో చూపిస్తూ ఆదుకోవాలని దీనంగా అర్ధిస్తున్న ఆయన భార్య గంగ, తల్లి మల్లమ్మ, తండ్రి మిద్దె పెద్ద లక్ష్మయ్యను పైదృశ్యంలో చూడవచ్చు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర...
Advertisement