ఆధ్యాత్మికం.. | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం..

Published Mon, Jun 24 2024 2:10 AM | Last Updated on Mon, Jun 24 2024 2:10 AM

ఆధ్యా

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన

ధర్పల్లి: మండలంలోని సల్ఫాబండ తండాలో ఆదివారం గిరిజన ఆరాధ్య దైవం రామారావు మహారాజ్‌ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో విగ్రహానికి ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించారు. గిరిజనులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి బండారు నిర్వహించారు.

నృసింహస్వామికి జెడ్పీచైర్మన్‌ పూజలు

నిజామాబాద్‌ రూరల్‌: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ నృసింహస్వామి ఆలయాన్ని ఆదివారం నిజామాబాద్‌ జిల్లాపరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సన్మానించారు. ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామదేవతలకు జలాభిషేకం

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని ముబారక్‌నగర్‌లో ప్రజలు ఆదివారం గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో గంగాజలాన్ని గ్రామంలో డప్పువాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి, పంటలు పండాలని కోరుతూ, జలాభిషేకం నిర్వహించినట్లు వీడీసీ ప్రతినిధులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆధ్యాత్మికం..1
1/1

ఆధ్యాత్మికం..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement