కామారెడ్డి క్రైం: దోమకొండ మండలం చింతమాన్పల్లి శివారులో గురువారం వేకువజామున ఈరబోయిన రమేష్ (38)అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని తీవ్రంగా కొట్టి హత్య చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. ముత్యంపేట గ్రామానికి చెందిన రమేష్ తన కారును డిసెంబర్లో రూ.3.85 లక్షలకు చింతమాన్పల్లికి చెందిన పల్లె పోచయ్యకు విక్రయించాడు. కారుపై తీసుకున్న లోన్కు సంబంధించిన వాయిదాలు, మిగిలిన డబ్బుల చెల్లింపుల విషయంలో ఇదివరకే పలుసార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. రమేష్ గురువారం వేకువజామున చింతమాన్పల్లి శివారులో పోచయ్య నిర్వహిస్తున్న ఇటుకబట్టీ వద్దకు వెళ్లి తన కారును తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడే నిద్రపోతున్న పోచయ్య లేచి రమేష్ను అడ్డుకున్నాడు. పోచయ్య అతని బంధువు హరి, ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు రమేష్, రాజు, బిదేశీ నాయక్లు కలిసి రమేష్పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రమేష్ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించామన్నారు.
Breadcrumb
- HOME
హత్య కేసులో ఐదుగురి అరెస్టు
Mar 29 2025 1:10 AM | Updated on Mar 29 2025 1:08 AM
Advertisement
Related News By Category
-
క్రెడిట్ కార్డు నోటీసులకు భయపడి..
నిజామాబాద్: క్రెడిట్ కార్డు నోటీసులు రావడంతో ఆందోళన చెందిన ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బండాగల్లీకి చెందిన బశప్ప (35) క్రెడిట్ కార్డుపై రూ.70 వేలు అప్పు చ...
-
29న పసుపు బోర్డు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈ నెల 29న నిజా మాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. అదే రోజు జరిగే...
-
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా శ్యాంబాబు నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది ముత్యాల శ్యాం బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు ...
-
జిల్లా కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా జిల్లా కేంద్ర పర్యటన సందర్భంగా నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఈనెల 29న నగరానికి రానున్న విషయం తెలిసిందే. కంఠేశ్వర్ బైపాస్ వద...
-
బల్దియాలో అధికారుల కొరత
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమైన అధికారులు లేకపోవడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో మున్సిపల్...
Related News By Tags
-
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా శ్యాంబాబు నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది ముత్యాల శ్యాం బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు ...
-
జిల్లా కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా జిల్లా కేంద్ర పర్యటన సందర్భంగా నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఈనెల 29న నగరానికి రానున్న విషయం తెలిసిందే. కంఠేశ్వర్ బైపాస్ వద...
-
బల్దియాలో అధికారుల కొరత
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమైన అధికారులు లేకపోవడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో మున్సిపల్...
-
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
సిరికొండ: మండలంలోని వర్జన్తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మోజీరాం గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాడు సొంత ఇళ్లు కలగానే మిగిలిపోయిందని, కాంగ్రెస్ ప...
-
ప్రమాదకరంగా లోలెవల్ వంతెన
● నర్సింగ్పల్లి లోలెవల్ వంతెనతో పొంచి ఉన్న ప్రమాదం ● ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు తిప్పలు సిరికొండ: లోలెవల్ వంతెనతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. నర్సింగ్పల్లి వాగుపై ఉన్న వంతెన ఇరుగ్గా ఉండట...
Advertisement