
స్వల్పంగా పెరిగిన ఉపాధి కూలి ధర
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధిహామీ పథకంలో చె ల్లించే కూలి స్వల్పంగా పెరిగింది. రూ.300 నుంచి రూ.307కు కూలిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకోగా, ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూలిని ఏకంగా రూ.28కి పెంచారు. అంతకు ముందు రూ.15 పెంచారు. కూలి ధర పెరగడంతో జిల్లా లోని 5.55లక్షల మంది ఉపాధి కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే కూలి ఽమరింత పెంచితే బాగుండేదని కూలీలు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన కూలి ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయని కమ్మర్పల్లి ఏపీవో విద్యానంద్ ‘సాక్షి’తో చెప్పారు.
రూ.300 నుంచి రూ.307కు పెంపు
రేపటి నుంచి అమలులోకి..