
సర్కార్ బడిని బతికించండి
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ సర్కార్ బ డిలో మీ పిల్లలను చదివించి బడిని బతికించండి అంటూ వేడుకున్నారు. సోమ వారం గ్రామంలో వీడీసీ, వివిధ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి బడిని కాపాడుకోవాలని కోరారు. ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎంలు మంత్రి రమేశ్, ఓటర్కర్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.