
సార్లు.. మారండి మీరు
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీ ఉద్యోగుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డీఎంహెచ్వో ఒకవైపు పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, నర్సింగ్ కళాశాలలను తనిఖీ చేస్తూ సమయ పాలన పాటించాలని ఆదేశిస్తున్నా.. మార్పు రావడం లేదు. నగరంలోని జీజీహెచ్(ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి) ఆవరణలో ఉన్న నర్సింగ్ కాలేజ్లో బుధవారం 10.30గంటల వరకు ఒకే ఒక్క అటెండర్ మినహా ఉద్యోగులెవరూ విధులకు హాజరుకాలేదు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ సమయపాలన పాటించడం లేదని, ఉద్యోగులు రాకపోవడంతో విద్యార్థులు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
నర్సింగ్ కాలేజ్లో సమయపాలన పాటించని ఉద్యోగులు
డీఎంహెచ్వో ఆదేశాలు బేఖాతరు