
కొత్త రేషన్కార్డులపై మళ్లీ సర్వే
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో అందించిన దరఖాస్తులపై మరోసారి సర్వే మొదలైంది. రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఉద్యోగులకు నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు ఒక లింకును పంపించి ఆ యాప్లోనే కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఏడేళ్లుగా నిలిచిన రేషన్కార్డుల జారీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోక్షం లభిస్తుందని అంతా ఊహించారు. కానీ, గడిచిన ఏడాది నుంచి రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. గణతంత్ర దినోత్సవం రోజు మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్త కార్డులను జారీ చేశారు. మిగిలిన గ్రామాల్లో పంపిణీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కోడ్ ముగిసినా కార్డుల జారీలో వేగం పెరగలేదు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కా ర్డుల కోసం 81,148 దరఖాస్తులు అందగా, జనవరి 26న 31 గ్రామాల నుంచి ఎంపిక చేసిన 1066 కు టుంబాలకు కొత్త కార్డులను జారీ చేశారు. మరో 80వేలకు పైగా కుటుంబాలు కొత్త కార్డుల కోసం ని రీక్షిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేందుకు రేషన్కార్డు ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. రేషన్కార్డులు లేకపోవడంతో సన్నబియ్యం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ ఉద్యోగులకు
పౌర సరఫరాల శాఖ ఆదేశాలు
సర్వే అనంతరం కొత్త కార్డుల
జారీకి అవకాశం
జాప్యం చేస్తున్నారు
కొత్త రేషన్కార్డుల జారీకి మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించడం సరైంది కాదు. సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొత్త కార్డులను అర్హులైన కుటుంబాలకు వెంటనే అందించాలి.
– ఏనుగు రాజేశ్వర్, మోర్తాడ్
నిర్లక్ష్యం తగదు
ఎంతో మంది అర్హులు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. కార్డులను జారీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్డులను జారీ చేయాలి.
– తక్కూరి సాగర్, మోర్తాడ్

కొత్త రేషన్కార్డులపై మళ్లీ సర్వే

కొత్త రేషన్కార్డులపై మళ్లీ సర్వే