
సీఎంను డిచ్పల్లి ఖిల్లాకు తీసుకొస్తా..
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): చారిత్రక డిచ్పల్లి ఖిల్లా రామాలయానికి సీఎం రేవంత్రెడ్డిని త్వరలో తీసుకొస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం డిచ్పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుద్దులం వద్ద మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని, అదే సమయంలో సీఎంను రామాలయానికి తీసుకువస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఎకో టూరిజంలో భాగంగా రామాలయం వద్ద పార్కు, పక్కనే ఉన్న చెరువులో బోటింగ్, గుట్టపై ఉన్న ఆలయం వరకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, బూస సుదర్శన్, మహేందర్రెడ్డి, రాములు, ఏజీ దాస్, నర్సారెడ్డి తదితరులున్నారు.