
కల్తీ కల్లుతో ప్రయోగాలు!
నిజామాబాద్నాగారం: సంపాదనే ధ్యేయంగా కల్లు వ్యాపారులు ఇష్టారీతిన కల్తీ కల్లు తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్లీ కల్లు తయారు చేయడంలో ప్రయోగాలు చేస్తూ ఏళ్ల తరబడిగా క్లోరోహైడ్రేట్, అల్ప్రాజోలం, డైజోఫామ్ తదితర మత్తు పదర్థాలు వాడుతున్నారు. దీంతో ఆ కల్తీకల్లు తాగిన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల నస్రూల్లాబాద్ మండలం దుర్కీలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంతమందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా, మరికొంతమందిని నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు.
72గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే..
దుర్కిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో శివలక్ష్మి, బుజ్జీ, లక్ష్మణ్, నరేష్, తులసవ్వ, అర్వింద్, లచ్చవ్వ, కాశీరాం, రవి, మారుతి, మోహన్, బాలమణి, మధు, నాగర్జున్లు జీజీహెచ్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
బాధితులను వైద్యులు పరీక్షించగా, కల్లు వ్యాపారులు ప్రయోగాలు చేయడానికి యాంటి సైకియాట్రిక్ గ్రూప్స్కు సంబంధించిన కొత్త మందును కలిపినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కోలుకోవడానికి 72గంటల సమయం పడుతుందని మంగళవారం తెలిపారు. ఈ కల్తీ కల్లు తాగడం వల్ల బాధితులకు గంటల వ్యవధిలోనే నాలుక దొడ్డుగా మారడం, సిరలు పడిపోవడం, నొప్పులు తదితర వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు వారిని హుటాహుటిన ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కల్తీ వ్యాపారులకు, అక్రమార్కులకు పేదల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. కల్లులో ప్రయోగాలు చేయడంలో ఎవరైనా చనిపోతే రూ. 20వేల నుంచి రూ. 80వేల వరకు కుటుంబ సభ్యులకు ముట్టజెప్పి చేతులు దులుపుకున్న ఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కల్తీకల్లు విక్రయాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
దుర్కిలో కల్తీకల్లు తాగి
పలువురికి అస్వస్థత
జీజీహెచ్లో చికిత్స అందిస్తున్న వైద్యులు
మాట్లాడ రాలేదు..
కల్తీకల్లు తాగిన కొద్దిసేపటికే నాలుక దొడ్డుగా అయ్యింది. మాట్లాడటం రాలే దు. సిరలు మొత్తం పడిపోయాయి. మా నాన్న చూసి వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకవచ్చి చికిత్స అందించారు.
– అర్వింద్, కల్తీకల్లు బాధితుడు

కల్తీ కల్లుతో ప్రయోగాలు!