అడిగే అధిపతులు లేరు.. | - | Sakshi
Sakshi News home page

అడిగే అధిపతులు లేరు..

Apr 11 2025 1:25 AM | Updated on Apr 11 2025 1:25 AM

అడిగే

అడిగే అధిపతులు లేరు..

నిజామాబాద్‌ నగరపాలక సంస్థలోని ప్రధాన విభాగాల్లో ఖాళీ పోస్టులతో అభి వృద్ధి పనులకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు బదిలీ అయినా, పదవీ విరమణ పొందినా వారి స్థానంలో కొత్తవారికి పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ తర్వాత మిగతా ప్రధాన పోస్టులు, విభాగాల అధిపతులు లేకపోవడంతో పురపాలన సక్రమంగా సాగడం లేదు.

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ బల్దియాలో ప్రధాన అధికారి కమిషనర్‌. ఆ స్థానం తర్వాత డిప్యూటీ కమిషనర్‌, అడిషనల్‌ కమిషనర్‌, ము న్సిపల్‌ వైద్యాధికారి (ఎంహెచ్‌వో), డిప్యూటీ సి టీ ప్లానర్‌, డిప్యూటీ ఈఈ వంటివి ప్రధానమైన పోస్టులు. కొన్ని నెలలుగా ఈ పోస్టులన్నీ ఖాళీ గానే ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, జిల్లా చీఫ్‌ ప్లానర్‌ శ్యాంకుమార్‌ పదవీ విరమణ పొందారు. అడిషనల్‌ కమిషనర్‌ ఎన్‌ శంకర్‌ బదిలీపై వెళ్లగా, ఎంహెచ్‌వో పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంటోంది. టౌన్‌ప్లానింగ్‌లో డీసీ పీ, ఏసీపీ, టీపీవో–1, టీపీఎస్‌–3, టీపీబీవో త దితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ వి భాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ప్రధాన పోస్టు లన్నీ ఖాళీగా ఉండడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులు లేకపోవడంతో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపైనే ఆధారపడా ల్సి వస్తుంది. దీంతో పైసలు లేనిదే ఏ ఫైలూ క దలలేని స్థితిలోకి వెళ్లింది. బల్దియా అవినీతికి కే రాఫ్‌గా మారిందంటూ స్థానిక ఎమ్మెల్యే ధన్‌పా ల్‌ సూర్యనారాయణ చేసిన బహిరంగ వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఉన్నతోద్యోగు లు లేకపోవడంతోనే పాలన గాడితప్పుతోంద న్న చర్చ సాగుతోంది.

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికే అందలం

రాష్ట్రంలోనే మూడో పెద్ద కార్పొరేషన్‌ నిజామా బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. రెండేళ్లుగా ఎంహెచ్‌వోను నియమించలేదు. హోటళ్లు, తినుబండా రాలపై తనిఖీలు లేవు. కల్తీ ఆహారంపై, అపరిశుభ్రతపై దృష్టి సారించడం లేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నలుగురూ అవుట్‌సోర్సింగ్‌కి చెందినవారే. ఇద్దరు పర్మినెంట్‌ ఉద్యోగుల్లో ఒకరిని డంపింగ్‌యార్డు, ఒకరిని కుక్కల నియంత్రణ విభాగానికి కేటాయించారు. మిగతా విభాగాల్లో అవు ట్‌ సోర్సింగ్‌ వారే పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ము డుపులు ముట్టనిదే పనులు కావడం లేదు. ఆ క్రమణలపై చర్యలు లేకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విభాగానికి అధిపతి పో స్టుతోపాటు టీపీవో పోస్టూ ఖాళీగానే ఉంది. కేవ లం ఇద్దరు టీపీఎస్‌లు రాజేంద్రప్రసాద్‌, రాజేశ్‌ ఉన్నారు. టీపీఎస్‌ రాజేంద్రప్రసాద్‌ డిప్యుటేషన్‌ పై ఒకరోజు మాత్రమే విధులు నిర్వహిస్తున్నా రు. చైన్‌మన్‌లు కూడా లేరు. ఉన్న ఒకరిద్దరిపైన అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికే కమిషనర్‌కు పలు ఫిర్యాదులు వెళ్లాయి.

పాలనపై దృష్టి సారిస్తున్నా..

కార్పొరేషన్‌లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఇద్దరు అధికారులు పదవీవిరమణ పొందా రు. ఎంహెచ్‌వో పోస్టు కావాలని సీడీఎంఏకు లేఖ రాశాం. అవుట్‌సోర్సింగ్‌ అధికారుల పనితీరుపై దృష్టిసారించాను. శానిటేషన్‌ను రోజూ పరిశీలిస్తున్నా. త్వరలోనే ప్రక్షాళన ఉంటుంది. – దిలీప్‌కుమార్‌, కమిషనర్‌

పాతుకుపోయిన సిబ్బంది

బల్దియాలో దాదాపు 1300 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. అధికారులు కేవలం ఫైళ్ల మీద సంతకాలకే పరిమితం కాగా, మిగతా పనులన్నీ కాంట్రాక్టు ఉద్యోగులే చేస్తుంటారు. ప్రతి ఫైలుకు ఇంత అని వసూలు చేసేదీ వారే. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, శానిటేషన్‌ విభాగాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా చెలామణి అవుతున్న వీరు ఏళ్లుగా ఒకే విభాగంలో పాతుకుపోయారు.

బల్దియాలో ప్రధాన పోస్టులు ఖాళీ

డీసీ, ఏసీ, ఎంహెచ్‌వోల భర్తీ ఎప్పుడో?

రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌లో వేధిస్తున్న అధికారుల కొరత

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే పనులు

గాడితప్పుతోన్న పాలన

అడిగే అధిపతులు లేరు..1
1/1

అడిగే అధిపతులు లేరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement