ముందస్తుగానే లారీలు | - | Sakshi

ముందస్తుగానే లారీలు

Apr 12 2025 2:16 AM | Updated on Apr 12 2025 2:16 AM

ముందస్తుగానే లారీలు

ముందస్తుగానే లారీలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో

ఉంచుతున్న పౌర సరఫరాల శాఖ

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు

తరలించడానికి ముమ్మర ఏర్పాట్లు

మోర్తాడ్‌: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యంను మిల్లులకు తరలించడానికి అధికారులు ముందస్తుగానే లారీలను అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో ధాన్యం తూకం వేసిన తర్వాత లారీలు రావాలంటే నాలుగైదు రోజుల సమయం పట్టేది. దీనివల్ల ధాన్యం మిల్లులకు సకాలంలో చేరకపోవడం, తూకం వేసిన ధాన్యం ఎండలో ఎండటం, లేదా అకాల వర్షాల వల్ల తడిసి ముద్దయ్యేది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యంను తూకం వేసిన వెంటనే తరలించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం విశేషం. పౌర సరఫరాల శాఖ లారీల టెండర్లను పూర్తి చేయడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే ధాన్యం లెక్కలను పరిగణలోకి తీసుకుని లారీలను అందుబాటులో ఉంచుతున్నారు. మోర్తాడ్‌ పరిధిలో ఇప్పటికే 25 లారీల ధాన్యంను మిల్లులకు తరలించారు. ఆరు ఖాళీ లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద నిలిపి ఉంచారు. మిల్లులోనూ అన్‌లోడింగ్‌ వేగంగా సాగంతో వాహనాలను వెంటవెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మోర్తా డ్‌, వడ్యాట్‌, దోన్‌పాల్‌, పాలెం, తిమ్మాపూర్‌ సహా పలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలిస్తుండటంతో రైతులకు ఊరట లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement