
ఉపాధ్యాయ ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయ ఉద్యమాల తో పాటు తెలంగాణ ఉద్యమంలో, అనేక సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని క్యాన్సర్తో చనిపోయిన టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి రమణ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలో జరిగాయి. రాష్ట్రం నలు మూలల నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉ పాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చా రు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హౌ సింగ్ బోర్డులోని ఆయన నివాసం నుంచి పెద్ద చె రువు దిగువన ఉన్న శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. పలువురు ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు.
కందుకూరి రమణ అంత్యక్రియలకు
తరలివచ్చిన టీచర్లు, ప్రజాసంఘాల నేతలు