ప్రధాన వార్తలు

అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి టాస్క్ఫోర్స్: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరోవైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఫోన్ చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా మార్కెట్ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్కు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు.

ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి రా.1.11 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మూల తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.06 నుండి 1.50 వరకు, తదుపరి రా.3.37 నుండి 5.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: రా.10.15 నుండి 11.53 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.... పనుల్లో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.వృషభం... సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం... ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కర్కాటకం... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్థిరాస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కన్య.... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కనిపిస్తుంది.తుల... నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. భూలాభాలు పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృశ్చికం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.ధనుస్సు... వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. ఒప్పందాలు కుదురుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.మకరం.... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

కల్తీ కల్లు తాగి 13 మందికి అస్వస్థత
కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్): కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన కూకట్పల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే రకమైన అనారోగ్య సమస్యలతో 11 మంది అస్వస్థతకు గురై ఒకే ఆసుపత్రిలో చేరడంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వీరంత వాంతులు, విరోచనాలు, లో బీపీ , కడుపునొప్పి తదితర సమస్యలతో కూకట్పల్లి రాందేవ్ రావ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. బాధితులందరూ ఒక రోజు అటు ఇటుగా కల్లు తాగినవారే కావడంతో కల్తీ కల్లు కారణంగానే వారు అస్వస్థతకు గురై ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న వారిలో అడ్డగుట్టకు చెందిన యోబు, నడిగడ్డ తండాకు చెందిన దేవదాసు, గోకుల్ ప్లాట్స్ కు చెందిన పోచవ్వ, హెచ్ఏంటీ శాతవాహన నగర్ కు చెందిన చాకలిలక్ష్మి, శంశీగూడ ఇందిరానగర్ కు చెందిన గోవిందమ్మ, పెంటేష్, హెచ్ఎంటీ హిల్స్కు చెందిన యాదగిరి, నరసింహ, హైదర్ నగర్ కు చెందిన మాధవి, కోటేశ్వర్ రావు, మానప్ప ఉన్నారు. వీరందరూ హైదర్ నగర్, శాతవాహన నగర్, ఎల్లమ్మబండ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించటం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఈ విషయమై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఆరోగ్యస్థితిపై మేడ్చల్ జిల్లా వైద్యశాఖ అధికారి ఉమా గౌరి సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా కల్లు తాగినట్లు గుర్తించామని, అక్యూట్ గ్యాస్రై్టటిస్ తదితర లక్షణాలు ఉన్నాయని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.బుధవారం ఉదయం నిర్వహించే వైద్యపరీక్షల అనంతరం డయాలసిస్ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తామన్నారు. రాందేవ్ రావ్ ఆసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతున్నారని, మిగతా చోట్ల మరో ఇద్దరు ఉన్నట్లు చెబుతున్నారని మొత్తంగా 13 మంది ఆసుపత్రి పాలైనట్లు తెలిసిందన్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవరం పరామర్శ విషయం తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే ఆసుపత్రికి చేసుకుని వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ కల్లు విషయంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గాందీకల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన వారిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరామర్శించారు. అక్కడే ఉన్న వైద్యులను, పోలీసులు, ఎక్షైజ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలాకాలంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇదండీ బాబు సర్కారు తీరు..కిలో మామిడికి నాలుగు రూపాయలిస్తే చాలట!
ఢిల్లీః: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమో ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడూ రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. మరోసారి కూడా అదే పునరావృతం చేసింది. తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతుంటే.. బాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్ అయ్యింది. తాజాగా ఈరోజు(మంగళవారం. జూలై 08) ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాట ధర రూ. 4 ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు? వినతి పత్రం ఇవ్వడం ఎందుకు? అనే విమర్శ వినిపిస్తోంది. కనీసం కర్ణాటకకు ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా లేదు..ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు సర్కారుకు ఏపీలోని రైతులపై ఎంత శ్రద్ధం ఉందో అనే విషయం అవగతమవుతుంది. కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు రూ. 16గా ఉంది. మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్. మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండని అడగలేదు బాబు ప్రభుత్వం. దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్నెస్,సిన్సియారిటీ లేవని విషయం అర్థమైంది. మొక్కుబడిగా, హడావుడిగా..వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా, హడావుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. ఎంఐఎస్ స్కీం కింద కిలో నాలుగురూపాయల చొప్పున 260 కోట్లిస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్టను నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి.

ధ్వంసం చేస్తూ.. దిశ మార్చుకుంటూ
అహ్మద్నగర్: వేగంగా దూసుకెళ్తూ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ గురిచూసి లక్ష్యాలను ఛేదించే అధునాతన శతఘ్ని విభాగంలో భారత్ మరో ఘనత సాధించింది. తొలిసారిగా గరిష్టస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశవాళీ శతఘ్ని (మౌంటెడ్ గన్ సిస్టమ్–ఎంజీఎస్)ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రకటించింది.తద్వారా శతఘ్నుల్ని వేగంగా మోహరించే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆరి్టలరీ గన్ సిస్టమ్(ఏటీఏజీఎస్)లో భారత్ మరో ముందడుగువేసింది. త్వరలో ఈ ఎంజీఎస్ను పూర్తిస్థాయి పరీక్షల కోసం భారత సై న్యానికి అప్పగించనున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ పరీక్షల్లో ఎంజీఎస్ తన సత్తాను చాటితే ఆ తర్వాత దీనిని సైన్యంలో విలీనం చేస్తారు. బాలాసోర్, పోఖ్రాన్లో దీనిని విజయవంతంగా పరీక్షించి చూశా మని వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (వీఆర్డీఈ) చీఫ్ జి.రామమోహనరావు చెప్పారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు⇒ 155ఎంఎం/52 కాలిబర్ మందుగుండును పేల్చే సామర్థ్యంతో ఈ అధునాతన శతఘ్నిని రూపొందించారు. డీఆర్డీవోకు చెందిన అహ్మద్నగర్లోని వీఆర్డీ దీనిని తయారు చేసింది. ⇒ 85 సెకన్ల వ్యవధిలోనే వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్ చేసుకోగలదు. ఒక నిమిషంలో ఆరుసార్లు బాంబులను ప్రయోగించగలదు. ⇒ మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువులకు తెలీకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకుని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. ఒక చోట ఉండి భిన్న దిశలో బాంబులను ప్రయోగించగలదు. ⇒ ఇందులోంచి మందుగుండును పేల్చే గన్ బరువే ఏకంగా 30 టన్నులు. ⇒ గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దీని క్యాబిన్ను పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కవచంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు సైనికులు ప్రయాణించవచ్చు. ⇒ ఈ శతఘ్నిలో దాదాపు 85 శాతం పరికరాలు భారత్లో తయారైనవే. ⇒ దిగ్గజ ఫ్రాన్స్ సీజర్, ఇజ్రాయెల్ అ ట్మోస్ 2000 సిస్టమ్ల తరహాలో ఈ శ తఘ్నిని రూపొందించారు. ఒక్కో యూనిట్ ధర తో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ.

సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్లో తొలి సెట్ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. సెట్ను 6–2తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్లో సిగెముండ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 13 ఏస్లు సంధించి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్లో సెమీఫైనల్కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం.

గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. శతాబ్దాలుగా వినియోగం గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.గంజిలో ఉండే ఐనోసైటోల్ అనే కార్బోహైడ్రేడ్ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్న్, మిథియోనైన్లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్ మాస్్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే. గంజిని ఎలా వాడాలి? రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్ చేయండి.దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు.

జీఎస్టీ చిక్కుముళ్లు వీడేనా?
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఎన్నో ఏళ్లుగా పట్టిన మంకుపట్టు సడలించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించేందుకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొన్ని మార్పులు తేవడానికి సమాయత్తం అయింది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలఖరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థం అవుతున్నది. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరగడం వల్ల ఉత్పత్తి రంగం కళకళలాడే అవ కాశం ఉంది. గత కొన్నేళ్లుగా జీఎస్టీకి సంబంధించి ఎవరేమి మాట్లా డినా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశంలో వినిమయ సంస్కృతిని మరింత పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతున్నారు. పరో క్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.సరళతరం కాకపోగా చిక్కులు8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్)గా చెప్పబడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెట్టింది. నిజానికి, గత 8 ఏళ్లుగా జీఎస్టీపై జరిగినంత చర్చ, వాదోపవాదాలు మరే అంశం మీదా జరగలేదు. జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. అయితే, జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయనీ, ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందనీ చెప్పడం అర్ధ సత్యమే. జీఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు. పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 55 సమావేశాలు జరిపినప్పటికీ జీఎస్టీ మండలి భేటీలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.జీఎస్టీ చిక్కుళ్లలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1,400కు పైబడిన వస్తువులు, 500 రకాల సేవలను ఈ నాలుగు శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారు గానీ అందులో హేతుబద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహచర మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ఇంత మొత్తం జీఎస్టీ వేయడం వల్ల... వారు జీవిత, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై 5% జీఎస్టీ విధించినా కొంతవరకు అర్థం ఉందిగానీ... ఏకంగా 18% పన్ను వేయడం అన్యాయమని పాలసీదారుల అసోసియేషన్ సైతం కేంద్రానికి విన్న వించినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదు.నిత్యావసరాలపై ఇంతా?ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపు దారులకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తి చివ రకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహ కారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు కేంద్రం ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. దీన్ని ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను పెడచెవిన పెట్టింది.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపై, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపై 5% జీఎస్టీ మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులపై, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలపై 18% జీఎస్టీ విధించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మినహాయించి విలాస వస్తువుల పైననే పన్ను వేస్తామని చెప్పిన దానికీ, ఆచరణలో చేస్తున్న దానికీ పొంతన ఉండటం లేదు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎస్టీ విధించాలంటూ జీఎస్టీ రేట్ల హేతు బద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం జీఎస్టీ మండలికి ఓ నివేదిక అందించింది. పన్నులు పెంచితే ఆరోగ్య హానికర ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలు మానేస్తారా అన్నది చర్చనీయాంశం. అదే నిజ మైతే మద్యం మీద కూడా అధికంగా పన్నులు వేయాల్సి ఉంటుంది.ఎంఎస్ఎంఇలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న వాటిల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీ రంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఇ రంగం జీఎస్టీ కారణంగా కుదేలయిందన్నది చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలావరకు మూతబడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతిమంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ, మరోవైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్క రించుకోవడానికి జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవకాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసిపోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుకతోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. వీటి మాటెలా ఉన్నా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతున్నదా, లేదా అన్నదే కొలమానం. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి

త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్
న్యూయార్క్: ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంతమేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనాతో తాజాగా ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇకపై భారత్తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. లేఖలు పంపించడం వరకే తమ బాధ్యత అని, తమతో ఒప్పందానికి ముందుకు రావాలో వద్దో ఆయా దేశాలే తేల్చుకోవాలని, తుది నిర్ణయం వారిదేనని పరోక్షంగా స్పష్టంచేశారు. కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై 200 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయని, అమెరికాను దోచుకోవడమే వాటి విధానామా? అని ప్రశ్నించారు. ఇకపై అమెరికాలో ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే సుంకాలు చెల్లించకతప్పదని తేలి్చచెప్పారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, ఆ ఘనత తనకే చెందాలని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే వ్యాపారం, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు.విదేశాలపై ఏప్రిల్ 2న విధించిన సుంకాల తాత్కాలిక రద్దును ట్రంప్ సర్కారు ఆగస్టు 1వ తేదీ దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ సంతకంతో అమెరికా ప్రభుత్వం లేఖలు పంపించిన దేశాల జాబితాలో ఇండియా లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్, బోస్నియా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, టునీíÙయా తదితర దేశాలకు ఈ లేఖలు అందాయి. మయన్మార్, లావోస్పై 40 శాతం టారిఫ్ మయన్మార్, లావోస్పై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ మోత మోగించారు. రెండు దేశాల ఉత్పత్తులపై 40 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అలాగే కాంబోడియా, థాయ్లాండ్పై 36 శాతం, సెర్బియా, బంగ్లాదేశ్పై 35 శాతం, ఇండోనేíÙయాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జిగోవినాపై 30 శాతం, కజకిస్తాన్, మలేషియా, టునీíÙయాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టారిఫ్లకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు పెంచే ఆలోచన చేయొద్దని ఆయా దేశాల అధినేతలను సున్నితంగా హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్పై 10 శాతం సుంకాలుపునరుద్ఘాటించిన ట్రంప్న్యూయార్క్/వాషింగ్టన్: బ్రిక్స్ కూట మిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తమ దే శాన్ని, కరెన్సీ (డాలర్) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే అది ఆవిర్భవించిందని మంగళవారం ఆరోపించారు. ‘‘డాలర్కు అంతర్జాతీయంగా ఉన్న విలువను నాశ నం చేసేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయ త్ని స్తున్నాయి. తెలివైన అధ్యక్షుడెవరూ అలా జరగనివ్వరు. అది ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూడటం వంటిదే.అలా ఎప్పటికీ జరగనివ్వం. ప్రపంచ కరెన్సీల్లో ఇప్పటికీ, ఎప్పటికీ డాలరే కింగ్. దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలనుకుని బ్రిక్స్ దేశాలు అనుకుంటే, తద్వారా మాతో ఆటలు ఆడాలనుకుంటే అభ్యంతరం లేదు. కానీ అందుకు మూల్యంగా వాటన్నింటిపైనా మరో 10 శాతం సుంకాలు విధించి తీరతాం. కేవలం బ్రిక్స్కూటమిలో ఉన్నందుకు అవి చెల్లించాల్సిన భారీ మూల్యమిది. అందుకు అవి సిద్ధంగా ఉన్నాయని నేను భావించడం లేదు’’ అన్నారు.
మీ సేవ.. మరింత చేరువ!
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
ఏసీబీ వలలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్
కల్తీ కల్లు తాగి 13 మందికి అస్వస్థత
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
నైపుణ్యమే ఉన్నత..!
పోషకాహార లోపాన్ని.. ఏఐ పట్టేస్తుంది
బోధకులు లేరు.. రోగులు ఉండరు!
గుండె ‘కాయ’కు గాయం!
మహానేత వైఎస్సార్కు ఘన నివాళి
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
మీ సేవ.. మరింత చేరువ!
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
ఏసీబీ వలలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్
కల్తీ కల్లు తాగి 13 మందికి అస్వస్థత
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
నైపుణ్యమే ఉన్నత..!
పోషకాహార లోపాన్ని.. ఏఐ పట్టేస్తుంది
బోధకులు లేరు.. రోగులు ఉండరు!
గుండె ‘కాయ’కు గాయం!
మహానేత వైఎస్సార్కు ఘన నివాళి
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
సినిమా

'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో.

కార్పొరేట్ జాబ్ చేయకుండా.. రూ.2 వేల జీతానికే జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్)కాగా.. 3 బీహెచ్కే మూవీలో శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

జిమ్లో బిగ్బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్లో హీరోయిన్ ప్రణీత!
బిగ్బాస్ దివి జిమ్ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్పూల్లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

బూమ్ బూమ్ బుమ్రా
లండన్: ఇంగ్లండ్తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్గా మ్యాచ్కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్తో అతను బౌలింగ్ చేశాడు. నెట్స్కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో రివర్స్ స్వింగ్తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం

పాకిస్తాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజం, రిజ్వాన్లపై వేటు
బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. అయితే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్లపై సెలక్టర్లు వేటు వేశారు.ఈ జట్టులో ఈ సీనియర్ త్రయానికి చోటు దక్కలేదు. పాక్ కొత్త వైట్బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచన మేరకు వీరిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్టులు, వన్డేల్లో మాత్రమే భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఇక ఈ సిరీస్కు ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, స్పీడ్ స్టార్ హ్యారిస్ రవూఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే వెటరన్ ఆటగాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జూలై 20 నుంచి 24 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్లు కూడా ఢాకా వేదికగా జరగనున్నాయి.బంగ్లాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్.

స్టోక్స్ ఇదొక కఠిన పరీక్ష.. గిల్ మాత్రం అద్భుతం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన భారత జట్టు.. ఎడ్జ్బాస్టన్ మైదానంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో గిల్ సేన సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ విమర్శల వర్షం కురిపించాడు. స్టోక్స్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోతున్నాడని అథర్టన్ మండిపడ్డాడు. కాగా తొలి టెస్టులో పర్వాలేదన్పించిన స్టోక్స్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా.. ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు."ఈ సిరీస్కు బెన్ స్టోక్స్కు కఠిన పరీక్ష వంటింది. స్టోక్స్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ఫామ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు అతడి బ్యాటింగ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది.వన్డే, టీ20లకు దూరంగా ఉంటూ స్టోక్స్ కేవలం టెస్టుల్లో ఆడుతూ వన్-ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అతడు జట్టును ఒక ప్రణాళికపరంగా ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడి పేలవ ఫామ్ కెప్టెన్సీపై ఇంపాక్ట్ చూపుతోంది. అంతేకాకుండా స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు.కానీ ప్రత్యర్ధి కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్గా వ్యవహరిస్తునప్పటకి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లార్డ్స్లో జరగనున్న మూడో టెస్టులో కూడా భారత్ నుంచి ఇంగ్లండ్కు గట్టి సవాల్ ఎదురుకానుంది.ఈ మ్యాచ్లో స్టోక్స్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడన్నది చాలా ముఖ్యంమని" ది టైమ్స్ కాలమ్లో అథర్టన్ పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో స్టోక్స్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఈజ్ బ్యాక్

భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత మహిళలతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా భారత్తో టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది.అదేవిధంగా సోఫీ ఎకిలిస్టోన్, బౌచర్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నెలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు ఎకిలిస్టోన్ దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.కానీ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని సోఫీ మార్చుకుంది. ఈ క్రమంలోనే వన్డే జట్టులోకి ఆమె తిరిగొచ్చింది. ఈ సిరీస్ వన్డే వరల్డ్కప్-2025 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. జూలై 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20 సిరీస్లో తలపడతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.వన్డే సిరీస్ షెడ్యూల్:1వ వన్డే – జూలై 16, ది అగేస్ బౌల్, సౌతాంప్టన్2వ వన్డే – జూలై 19, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్3వ వన్డే – జూలై 22, సీట్ యూనిక్ రివర్సైడ్, చెస్టర్-లె-స్ట్రీట్భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్(కెప్టెన్),ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్భారత మహిళల వన్డే జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, అరుంధతి రెడ్డి, కె. సత్ఘరేచదవండి: IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం?
బిజినెస్

పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్ యూనియన్యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలువచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు.2026: 164,850 వర్క్ పర్మిట్లు2027: 166,350 వర్క్ పర్మిట్లు2028: 166,350 వర్క్ పర్మిట్లుసిబ్బంది అవసరమయ్యే రంగాలు..దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.వ్యవసాయంనిర్మాణ రంగంఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)టూరిజంతయారీ రంగంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్తో సహా డిజిటల్ సేవల రంగం.పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకు ఇలా చేస్తోందంటే..లేబర్ కొరతఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.జనాభా సంక్షోభంఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్కు మంచి డిమాండ్ ఉంది.ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్ చేయండివీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలుజాబ్ ఆఫర్ లెటర్ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్ పర్మిట్)వీసా దరఖాస్తు ఫారంపాస్పోర్ట్ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ లేదా స్పాన్సర్ లెటర్ ఉండవచ్చు.హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.ఇటలీలో డిమాండ్లో ఉన్న ఉద్యోగాలుస్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లుమెకానికల్ హెల్పర్లుసేఫ్టీ ఆఫీసర్లుహెల్త్ కేర్: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లుడిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్వేర్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.ఇదీ చదవండి: టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్..బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..
వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్ ప్రో పేరిట 4–వీల్ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ పినాకి హల్దార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్ చెప్పారు.క్యూ1లో జేఎల్ఆర్ అమ్మకాలు డౌన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) హోల్సేల్, రిటైల్ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్లో హోల్సేల్ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్!ఇక రిటైల్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్ మోడల్సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది.

రూ.100తో చోటాసిప్!
బజాజ్ ఫిన్సర్వ్ అస్సెట్ మేనేజ్మెంట్ చోటాసిప్ను తీసుకువచ్చే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో సాధ్యా సాధ్యాలను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండీ గణేష్ మోహన్ తెలిపారు. ఈ దిశగా టెక్నాలజీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..చోటాసిప్ అన్నది ఆసక్తికరమైన చొరవగా గణేష్ మోహన్ పేర్కొన్నారు. తగినంత అధ్యయనం అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుందన్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా సెబీ ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసిప్ను ఆవిష్కరించడం గమనార్హం. ఎస్బీఐ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే రూ.100 సిప్ను అందిస్తున్నాయి. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు

డోపమైన్ లోపం వణికిస్తుందా..?
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వాళ్లలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తించి, మొదట్లో దానికి ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... వ్యాధినిమొదట గుర్తించిన ఫిజీషియన్ పేరిట ఇది ప్రాచుర్యం పొందింది. కొందరిలో మెదడులోని డోపమైన్ అనే రసాయనం ఉత్పిత్తి తగ్గడం వల్ల, శరీర కదలికలను అదుపులో ఉంచే నాడీకణాలు తగ్గిపోతాయి. దాంతో దేహం వణకడం మొదలై పార్కిన్సన్స్ వ్యాధి మొదలువుతుంది. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం...పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లలోతొలుత నడకతో మొదలై... తర్వాత అన్ని రకాల కదలికలూ ప్రభావితమవుతాయి. ఇలా ఒక వ్యక్తి కదలికలు తగ్గిపోయే గుణాన్ని ‘హైపోకైనేసియా’ అంటారు. తర్వాత చెయ్యి వణకడం మొదలవుతుంది. ఈ వణకడమనేది ఏ పనీ చేయని దశలో... అంటే ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండా పూర్తిగా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఉంటుంది. కాబట్టి ఈ వణుకుడును ‘రెస్ట్ ట్రిమర్స్’గా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు పక్కకు తిరగబోయే ప్రయత్నంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇలా బ్యాలెన్స్ కోల్పోవడాన్ని పోష్చురల్ ఇన్స్టెబిలిటీ’ అంటారు. ఇవన్నీ ఈ జబ్బుకు ఉన్న ముఖ్యమైన లక్షణాలు. ఇవేగాక ఇంకా చాలా అనుబంధ లక్షణాలూ కనిపిస్తుంటాయి.కారణాలు... నిర్దిష్టంగా కారణం ఇదీ అని చెప్పలేనప్పటికీ కొన్ని పరిశీలనల ద్వారా పార్కిన్సన్ జబ్బు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నది వైద్య శాస్త్రవేత్తల మాట. అందులో ముఖ్యమైనది జన్యులోపం. ఈ జన్యులోపం ఉన్నవారిలో ఒక వయసు దాటాక ఈ జబ్బు తప్పనిసరిగా బయటపడుతుంది. అలాగే కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా డోపమైన్ సరిగా వెలువడక జబ్బు వస్తుంది. మరి కొందరిలో వారు తీసుకునే పానియాల్లో లేదా పీల్చే గాలిలో కొన్ని రకాల విషపదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) ఉన్న కారణంతో... ఆ విషాలు డోపమైన్ విడుదల చేసే కణాలను దెబ్బతీనందువల్ల డోపమైన్ సరిగా విడుదల కాకపోవడంతో ఈ జబ్బు వస్తుంది. అంతేకాకుండా మరికొందరిలో తలకు పదే పదే దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. ఇంకొందరిలో మెదడుకు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఈ జబ్బుకు కారణమయ్యే అంశాలు. అయితే ఈ జబ్బుకు గురైన దాదాపు 50 శాతం మందిలో మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఈ జబ్బు ఎలాంటి చెడు అలవాట్లు (అంటే స్మోకింగ్, ఆల్కహాల్) లేకపోవడం లేదా కనీసం కాఫీ, టీలు తాగని వారిలోనూ కనిపించడమన్నది చాలామంది వైద్యశాస్త్రవేత్తలూ, అధ్యయనవేత్తల దృష్టికి వచ్చిన ఆశ్చర్యకరమైన అంశం. ఏ వయసు వారిలో... పార్కిన్సన్స్ వ్యాధికి గురైన వారిలో 98 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం రెండు శాతం లోపు వారిలోనే ఇది 50 ఏళ్లలోపు వారిలో కనిపించింది. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో మరీ యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుడటంతో దీన్ని వంశపారంపర్యంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు.ఎందుకు వస్తుందీ జబ్బు? మన మెదడు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నది తెలిసిందే. అందులోని ఒక చిన్న భాగం పేరు ‘సబ్స్ట్రాన్షియా నైగ్రా’. దీని నుంచి డోపమైన్ అనే రసాయనం (బయోకెమికల్) వెలువడుతుంది. ఇది మన దేహం కదలికలను నియంత్రిస్తుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు కొందరిలో ఈ రసాయనం సరిగా వెలువడదు. ఆ రసాయనం లోపించడం వల్లనే కదలికల్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది.వ్యాధి నిర్ధారణ ఇలా... మెదడు ఎమ్మారై పరీక్ష, అయోఫ్లుపేన్ సింగిల్ ఫొటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (స్పెక్ట్) పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు ∙ఎఫ్–డోపల్–6 ఫ్లూరో –3, 4 డై హైడ్రాక్సీ ఫినైల్ అలనైన్ (18 ఎఫ్– డో΄ా) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ పరీక్ష. కొన్ని నివారణ పద్ధతులు వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో వచ్చే పాషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు రావడంతో పాటు అవే సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉన్నందున సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ కూడా అవసరం కావచ్చు. జబ్బు గురించి కొన్ని కొత్త విషయాలు : ఈ జబ్బుతో బాధపడేవారి జీవన పరిస్థితులను (క్వాలిటీ ఆఫ్ లైఫ్) మెరుగుపరిచేందుకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు ఉన్నవారిలో ఇదే పదార్థాన్ని బయట నుంచి టాబ్లెట్ల రూపంలో ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ.కొన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు : మెదడులో తగ్గిన డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతోపాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూపోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్నిస్తాయి. ఎమ్మారై ఇమేజింగ్ సమయంలో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీతో థలామస్లో కొన్ని లీజన్స్ కల్పించడమూ ఓ చికిత్సగా చెప్పవచ్చు. ఇదొక నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే... కత్తి కోత గానీ లేదా గాటు గానీ పడకుండా చేసే చికిత్స.పై చికిత్సలతో పాటు గత పది పదిహేనేళ్ల వ్యవధిలో దీనికి అనేక కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. డీబీఎస్ : డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే రూపానికి ఇంగ్లిష్ పొడి అక్షరాలే డీబీఎస్. ఇదో శస్త్రచికిత్స ప్రక్రియ. ఇందులో చాలా మోతాదులో తక్కువ కరెంట్ను పంపి డోపమైన్ కణాలను ఉత్తేజపరుస్తారు. జబ్బు బాగా ముదిరిపోయి, ఇక మందులు ఎలాంటి ప్రభావం చూపని దశలోనే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ కరెంట్ పంపే పరికరం గుండెకు అమర్చే పేస్మేకర్లా ఉంటుంది. మెదడు లోపల ‘సబ్స్ట్రాన్షియా నైగ్రా’ అనే ప్రాంతంలో దీని తాలూకు ఎలక్ట్రోడ్ను అమర్చుతారు. బయట దాన్ని అనుసంధానించడానికీ, మోతాదు నియంత్రించడానికీ ఒక బటన్ను అమర్చుతారు.మందుల దుష్ప్రభావాలు మొదలైతే ప్రత్యామ్నాయం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ...పార్కిన్సన్ వ్యాధిలో వాడుకునే మందులు మూడు నుంచి ఐదేళ్ల వరకు సమర్థంగా పనిచేసినా... ఆ తర్వాత రెండు రకాల దుష్ప్రభావాలు మొదలవుతాయి. కొందరిలో టాబ్లెట్ ప్రభావం కొనసాగినంతసేపు బాగానే ఉన్నా... దాని ప్రభావం తగ్గగానే లక్షణాలు బయటపడుతుంటాయి. దీన్నే ‘ఆన్ ఆర్ ఆఫ్ ఫినామెనా’ అంటారు. మరికొందరిలో మాత్ర వేసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా... దేహంలో కదలికలు మరింత పెరిగి΄ోతూ ఉంటాయి. ఈ రెండు రకాల దుష్ప్రభావాలూ సుదీర్ఘకాలం మందులు వాడినవారిలో కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందుల్ని ఆపలేక... కొనసాగించలేక బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అన్నది ఓ వరప్రదాయని అనుకోవచ్చు. డీబీఎస్ సర్జరీకి ముందు పరీక్ష... పార్కిన్సన్ వ్యాధి మందులతో అదుపు కావడంలేదని నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యులు ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో బాధితులకు మొదట మందులు ఇవ్వకుండా వారి చేత కొన్ని పనులు చేయిస్తారు. వాటితో మందు ప్రభావమూ, దుష్ప్రభావాల తీవ్రత తెలుస్తాయి. మందులతో ఇక ఏమాత్రమూ ప్రయోజనం కనిపించని బాధితులను మాత్రమే సర్జరీకి ఎంపికచేస్తారు. అంతేకాదు... వాళ్లకు ఎలాంటి మానసిక రుగ్మతలూ ఉండకూడదు. సర్జరీ తర్వాత కొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీకి ముందు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని సైకియాట్రిస్ట్ తొలుత నిర్ధారణ చేయాలి. డీబీఎస్ సర్జరీలో ఏంజరుగుతుందంటే... డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం మెడిట్రానిక్స్, బోల్టన్ సైంటిఫిక్, సెయింట్ జ్యూడ్ మొదలైన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే ఈ శస్త్రచికిత్సలో భాగంగా... ఎలక్ట్రోడ్లను కలిగిన లీడ్లను మెదడులో అమర్చుతారు. వాటికి విద్యుత్తును అందించే పల్స్ జనరేటర్ను ఛాతీలో అమర్చుతారు. ఈ రెండూ వైర్తో అనుసంధానమై ఉంటాయి. బ్యాటరీతో నడిచే ఈ పల్స్ జనరేటరు నిరంతరం పనిచేస్తూ, విద్యుత్ ప్రసారాన్ని వెలువరిస్తూ ఉండటం వల్ల మెదడుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాంతో లక్షణాలు అదుపులోకి వస్తాయి. బ్యాటరీతో పనిచేసే ఈ పల్స్ జనరేటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో రీచార్జ్, సింగిల్ యూజ్ అనే రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలు ఏకంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత చిన్న సర్జరీతో బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ బ్యాటరీ అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. వీటిని ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్లుగా, ఓ వైర్లెస్ ఛార్జర్ను ఛాతీకి కట్టుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే..? డోపమైన్ను బయటి నుంచి అందించకుండానే... ఆ న్యూరోట్రాన్స్మిటర్ శరీరంలో ఉందనే భావనను మెదడుకు కలిగించేలా చేసే సర్జరీ ఇది. ఇందుకోసం... మెదడులో శరీర కదలికలను నియంత్రించే ‘న్యూక్లియస్’లలోకి ఓ లీడ్ను అమర్చుతారు. దాన్ని బ్యాటరీకి అనుసంధానిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఆ బ్యాటరీని ఛాతీలో ఉంచుతారు. ఆ బ్యాటరీ నుంచి వెలువడే ‘ఎలక్ట్రిక్ ఇంపల్స్’ మెదడును ప్రేరేపిస్తాయి. దాంతో న్యూక్లియస్లన్నీ గాడిలో పడి, డోపమైన్ ఉన్నట్లుగా మెదడుకు భ్రమ కలిగిస్తాయి. ఫలితంగా పార్కిన్సన్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు... మందుల తాలూకు దుష్ప్రభావాలలో కనిపించే ‘ఆన్ అండ్ ఆఫ్ ఫినామినా’ కండిషన్ తొలగిపోతుంది. బ్యాటరీ నుంచి విద్యుత్తు నిరంతరాయంగా మెదడుకు ప్రసరిస్తూ ఉండటం వల్ల లక్షణాలు పెరగడం / తగ్గడం లాంటివి కూడా ఉండవు. అలాగే సర్జరీ తర్వాత మందుల మోతాదు కూడా తగ్గిస్తారు. దాంతో అదనపు కదలికలూ తగ్గుతాయి. డీబీఎస్ సర్జరీ ఫలితం ఇలా...ఈ శస్త్రచికిత్సతో పార్కిన్సన్ వ్యాధిని మరింత పెరగకుండా అక్కడికి అదుపుచేయవచ్చు. అయితే గతంలో జరిగి΄ోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం సాధ్యం కాదు. బాధితులు ఒకింత నాణ్యమైన జీవితం గడపడం కోసమే ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ చికిత్స ఉపయోగపడుతుంది తప్ప... ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయలేదని గ్రహించాలి. సర్జరీ సమయానికి రోగి శారీరక స్థితి ఎలా ఉందో, అదే పరిస్థితి కొనసాగడం లేదా అంతకంటే దిగజారకుండా ఉండటానికి మాత్రమే డీబీఎస్ ఉపయోగపడుతుంది.స్టెమ్సెల్ థెరపీ: పార్కిన్సన్ డిసీజ్కు శాశ్వత చికిత్స అందించే ప్రయత్నాల్లో ఈ చికిత్స ప్రక్రియను మొదటిదిగా పేర్కొనవచ్చు. మన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో ఉండే కణాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదా: మెదడు కణాలను న్యూరాన్లుగా, రక్తకణాల్లో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్గా, కాలేయకణాలు హెపటోసైట్స్, కండరకణాలు మయోసైట్స్గా, ఎముకకణాలు ఆస్టియోసైట్స్గా ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ ఉత్పత్తి అయ్యే మూల (ప్రిమిటివ్) కణాన్ని ఇంగ్లిష్లో ‘స్టెమ్సెల్’ అంటారు. ప్రస్తుతం బొడ్డుతాడునుంచి సేకరించిన కణాలను కొన్ని ప్రక్రియలు, దశల తర్వాత స్టెమ్సెల్గా మార్చి అమర్చితే... అది అమర్చిన ప్రదేశాన్ని బట్టి... అది సదరు అవయవానికి సంబంధించిన కణంగా మారి΄ోతుంది. ఈ తరహా చికిత్సనే స్టెమ్సెల్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో భాగంగా స్టెమ్సెల్స్ను మెదడులో సబ్స్ట్రాన్షియా నైగ్రా (ఎస్.ఎన్.) ఉన్న ప్రాంతంలో ప్రవేశపెడతారు. అక్కడ అవి కొత్త ఎస్.ఎన్. కణాలుగా తయారవుతాయి. దాంతో ఆ కొత్త కణాలనుంచి మళ్లీ శరీరానికి కావాల్సిన డోపమైన ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఈ జబ్బు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గి΄ోయేందుకు అవకాశముంది. స్టెమ్సెల్స్ ఉత్పత్తి ఇలా : మన శరీరంలో ఏదో ఒక శాంపుల్ నుంచి కణాలను సేకరిస్తారు. (ప్రధానంగా రక్తం లేదా బొడ్డు తాడులో ఉన్న రక్తంలో స్టెమ్సెల్స్ ఎక్కువగా ఉంటాయి). ఈ శాంపుల్ను ఒక యంత్రంలో ఉంచి మరిన్ని కణాలు ఉత్పత్తి అయి వాటి సంఖ్య పెరిగేలా ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా ఒక మూలకణం... కణవిభజన ప్రక్రియ ద్వారా మరెన్నో కణాలుగా విభజన అయి చాలా కణాలు తయారవుతాయి. వాటినే మనం మూలకణాలుగా అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి ఈ ప్రక్రియ ద్వారా రానున్న కొన్నేళ్లలో ఇవి కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని తప్పక చెప్పవచ్చు. ఫీటల్ సెల్ట్రాన్స్ప్లాంటేషన్ : ఈ ప్రక్రియలోనూ అనుసరించే విధానం ఇంచుమించు పైన పేర్కొన్నట్లుగానే ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఆ చిన్నారి బొడ్డుతాడును, దాంతోపాటు కొద్దిగా రక్తాన్ని (ఫీటల్ బ్లడ్)ను సేకరించి, ప్రత్యేకమైన ల్యాబ్లో ప్రాసెస్ చేసి, మూలకణాలను తయారు చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు కావాల్సిన చోట వాడుకుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో కొన్ని మూలకణాలను అమర్చగానే అది పూర్తి అవయవంగా రూపుదిద్దుకోవాలన్నదే ఈ ప్రక్రియ లక్ష్యం. జీన్ థెరపీ : ఈ ప్రక్రియపై గత 15–20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఈ జబ్బు... పార్క్’ అనే ఒక జన్యువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి ఈ జన్యువులో వచ్చే లోపాలను నివారిస్తే అసలు జబ్బు రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇలా అరికట్టడం అనే ప్రక్రియ రాబోయే దశాబ్దకాలంలో అందరికీ అందుబాటులోకి రావచ్చని ప్రస్తుతం ఉన్న పురోగతిని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రాసావిన్ చికిత్స : ప్రాసావిన్ అనే పదార్థాన్ని మెదడుభాగంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ బయోమెడికా సంస్థలో ఈ చికిత్స ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రైట్లైట్ : ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే కాంతి తరంగాలను ప్రసరింపజేయడం వల్ల మెదడులో ఉండే మెలటోనిన్ను తగ్గించి డోపమైన్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చనే అంశం ఆధారంగా జరిగే చికిత్స ఇది. ట్రాన్స్ క్రేనియల్ ఆల్టర్నేట్ కరెంట్ స్టిమ్యులేషన్స్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంట్ ఇచ్చి, నైగ్రల్ సెల్స్ను ఉత్తేజపరచి, డోపమైన్ ఉత్పత్తి జరిగేలా తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలతో పాటు న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్, జీడీఎన్ఎఫ్ (గ్లయల్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్) వంటి కొన్ని అంశాలను రక్తంలోకి ప్రవేశింపజేయడం వల్ల అవి మళ్లీ మెదడులోకి ప్రవేశించి అక్కడ నైగ్రల్ సెల్స్ను అభివృధ్ధి చేసేలా చూస్తే ప్రక్రియలపైన చాలా విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పార్కిన్సన్స్ డిసీజ్ను తగ్గించేందుకు కొంతమేర మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయని, కొన్నాళ్లలో ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు. డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరో సర్జన్(చదవండి: హీరో సల్మాన్ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)

కుబేర : ఆర్కిటెక్చర్ టు అసిసెంట్ ఆర్ట్ డైరెక్టర్
ఇంద్రాణి పూర్తి పేరు అక్కరాజు వెంకట నాగ ఇంద్రాణి. పుట్టింది గుంటూరు సిటీ మధ్యతరగతి కుటుంబం. నాన్న శ్రీనివాస్ అమ్మా పద్మావతి. తండ్రి హిందీ టీచర్గా పనిచేస్తుండేవారు. కన్హా కాన్సెప్ట్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. తల్లికి కర్ణాటక సంగీతం, కూచిపూడి పట్ల ఆసక్తి ఉన్నా.. కలగా మిగిలిపోయింది. ఆ కలను కూతురుగా తను నేర్చుకుని పాఠశాల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ ప్రదర్శనలిచ్చారు. అన్న ప్రసాద్తోపాటు బొమ్మలు గీయటం అలవర్చుకుంది. చిన్ననాటి అభిరుచి సినిమాలవైపు నడిపించింది.. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి ఆర్ట్ ఆసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగి వెండి తెరపై తన పేరును లిఖించుకుంటోంది.. ఓ వైపు తోట తరణి.. మరోవైపు శేఖర్ కమ్ముల దిశానిర్దేశంలో తన భవితకు బాటలు వేసుకున్నారు ఇంద్రాణి. ప్రస్తుతం ఫిలింనగర్లో ఉంటూ అనేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు. – బంజారాహిల్స్ నగరానికి ప్రయాణం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం జెఎన్ఎఫ్యులో చేరడం.. సినిమా సెట్స్ డిజైనింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వాటిని స్టడీ చేయడం.. నెమ్మదిగా స్క్రిప్ట్ రైటింగ్ పట్ల వీకెండ్ కోర్స్ చేయడం.. చకచకా జరిగిపోయాయి. మొదల్లో సినిమాల్లోకి కుటుంబ సభ్యులు నిరాకరించినా తర్వాత ఒప్పించారు. ‘కుబేర’లో లాస్ట్ ఆర్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. బిల్స్, రిఫరెన్సులు, ఫొటోషాప్ డిజైనింగ్లు చేశారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అరవింద్ ఏవి, ఈ.పి నాగేశ్వరరావు వల్ల తోట తరణి, శేఖర్ కమ్ముల మరల చేర్చుకున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో లైవ్ లొకేషన్స్లో పని నేర్చుకుంటూ పోయారు. సినిమాల పట్ల ఆసక్తి.. ఇంట్లో మామయ్య నాటకాలకు దర్శకత్వం వహించడం, మరోవైపు నటిస్తుండడంతో ఎప్పుడూ సందడిగా వుండేది. తండ్రి సాయంతో హిందీ నేర్చుకుంటూ బాలీవుడ్ కథల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరిగింది. షూటింగ్ సమయాల్లో కెమెరా వెనుక జరిగే విషయాల పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయి. అనంతరం మసూద సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేరడం.. ఆర్ట్ డైరెక్టర్ ప్రియం క్రాంతి ప్రోత్సాహంతో డైరెక్షన్ పట్ల ఇష్టంతో కన్యాశుల్కం వెబ్ సిరీస్లో, హరిహర వీర మల్లు సినిమాలో డైరెక్షన్ టీంలో ఆర్ట్ పనులను సమన్వయం చేసే బాధ్యతను నిర్వహించింది. డైరెక్టర్ క్రిష్ కుటుంబ సభ్యులు సుహాసిని, రాజు మద్దతుతో, ఆర్ట్ అసిస్టెంట్ అక్బర్ సహకారంతో మెంబర్గా అయ్యారు. ఈ క్రమంలో స్నేహితురాలు భార్గవి, ప్రమీల, కష్ణ శశాంక్ అండగా నిలిచారు. (300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు)లెజండరీ మనుషులతో.. చిన్నప్పుడు విడుదలైన అంజలి నుంచి పొన్నియన్ సెల్వన్ వరకూ పద్మశ్రీ తోట తరణి వర్క్ ఎంతగానో ఇష్టపడడం, ఆయన నీడలో నిలబడటం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమే. ఆయన స్కెచ్ వేస్తుంటే ప్రతిసారీ విస్మయానికి గురవ్వడం.. ఆర్డినరీ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుండడం నేర్చుకున్నా.. ఆనంద్, గోదావరి సినిమాలు చూస్తూ పెరిగా. కట్చేస్తే శేఖర్ కమ్ముల సెట్లో ప్రతిరోజు పేరు పెట్టి పలకరించడం ఆనందం అనిపించింది. కుబేర గొప్ప అవకాశం కల్పించింది. – ఇంద్రాణి, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్

షాకింగ్.. హైదరాబాద్లో రోజుకి 8 వేల టన్నుల వ్యర్థాలు!
హైదరాబాద్ ఒక అందమైన నగరం.. ఆధునిక జీవనశైలి, అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ సంస్థలు, సినిమాలు మొదలు క్రీడల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది భాగ్యనగరం.. వెరసి టాప్ వరల్డ్ సీటీస్లో స్థానం సంపాదించుకుంది. ఐతే ఇదంతా నగరానికి ఒక వైపు మాత్రమే.. మరోవైపు నగరం ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చిక్కుకుపోతోంది. ఆధునిక జీవనశైలిపై వ్యామోహంతో పాటు సౌలభ్యం కోసం ప్లాస్టిక్పై అతిగా ఆధారపడే మోడ్రన్ కల్చర్ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల సుడిగుండంలోకి తోసేస్తుంది. ఇది కేవలం నగర పరిశుభ్రత సమస్య మాత్రమే కాదు.. నగరవాసుల ఆరోగ్యం, జీవవైవిధ్యం, జల వనరుల భద్రత పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి పలు పరిశోధనల అత్యవసర హెచ్చరిక. ప్లాస్టిక్ నియంత్రించకపోతే మనం మన నగరంలోనే శ్వాస తీసుకోడానికి ప్రాణం ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఇది కేవలం భవిష్యత్తు హెచ్చరిక కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో ప్రతి రోజూ 8,000 టన్నుల వ్యర్థాలు ప్రతిరోజూ హైదరాబాద్ నగరం సుమారు 8,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఈ వ్యర్థాల్లో 14 శాతం పైగా ప్లాస్టిక్ ఉండటం శోచనీయం. అంటే రోజుకు సుమారు 1,120 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ ఏడాది ముగింపునాటికి ఇది 9,000 టన్నులకు చేరనుందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే రోజుకు 495 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చే ప్రమాదం ఉందని ఐసీఎల్ఈఐ– దక్షణాసియా సూచించింది. ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ అంతర్భాగమవుతుండగా, దాని ప్రభావాలు బయటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జీవరాశులకు పెనుముప్పు.. హుసేన్ సాగర్, దుర్గం చెరువు వంటి నగర సరస్సులు ఇప్పుడు సింగిల్–యూజ్ ప్లాస్టిక్తో నిండిపోయాయి. ఇందులో సుమారు 70 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ ఉండటం విషాదకర పరిణామం. దీంతో సరస్సుల ఇన్లెట్లు, అవుట్లెట్లు పూర్తిగా ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి. నీటి ప్రవాహం ఆగిపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, చేపల మరణం, గాలి, నీరు రసాయనాలతో కలుషితమవ్వడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేపలు, తాబేళ్లు, సరీసృపాలు, క్షీరదాలతో పాటు ఇతర చిన్న కీటకాల వినాశనానికి దారితీస్తోంది. జీవవైవిధ్యంపై పెను ప్రభావం.. వానాకాలం వచి్చందంటే సరస్సుల దగ్గర ఎగ్రెట్లు, హెరాన్లు, కార్మోరెంట్లు వంటి పక్షులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు ఆ జీవుల మనుగడకు పెను ప్రమాదంగా మారాయి. ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరి అరగించలేక మృత్యువాత పడుతున్నాయి. కొన్ని పక్షులు గూళ్లు నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగించడంతో ఆ గూటిలోని పిల్ల పక్షులు ఈ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు నగరంలోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్, మాదాపూర్ వాకింగ్ ట్రాక్ల వద్ద ప్లాస్టిక్ మింగిన పెంపుడు కుక్కలు, పిల్లుల గ్యాస్ట్రో బ్లాకేజ్, ఊపిరితిత్తుల ఇబ్బందులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నివాసితులు స్వయంగా క్లీనప్ డ్రైవ్స్ నిర్వహించాల్సి వస్తోంది.మానవ దేహాల్లో నానో ప్లాస్టిక్.. నగరవాసులకు పెట్ బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ‘సేఫ్’ అనిపించవచ్చు. కానీ, వాటి నుంచి వెలువడే పాలీకార్బొనేట్స్, బిస్ఫినాల్ ఏ, యాంటిమోనీ వంటి రసాయనాలు మన హార్మోన్లను దెబ్బతీస్తాయి. పిల్లల ఎదుగుదలకు అడ్డుపడతాయని ఐఐటీఆర్, సీడీఎస్సీఓ, ఎన్టీహెచ్ వంటి పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాకుండా నగరవాసుల శవ పరీక్షల్లో నానోప్లాస్టిక్.. మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నానోప్లాస్టిక్ పరిమాణం మెదడులో సగటున 171 నానోమీటర్ల వరకూ ఉండడం పరిశోధకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటివి మానవ కణజాలాలను దాటి మన శరీర వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏం చేయాలి? హైదరాబాద్ నగర వాసులు ప్లాస్టిక్ను తిరస్కరించడం ఒక ప్యాషన్గా, బాధ్యతగా మార్చుకోవాలి. మట్టితో, కర్రతో, దారంతో చేసిన సహజ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. జీహెచ్ఎంసీ విధించే సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్లాస్టిక్ బహిష్కరణ కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పెంపొందించాలి. ప్రతి ప్రాంతంలో స్థానికులు వారం వారం లేక్ క్లీనప్ డ్రైవ్స్ చేపట్టాలి. దైనందిన జీవితంలో ప్యాకేజింగ్ ఉత్పత్తులను నివారించాలి. ప్లాస్టిక్ సంచులను, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలి. ఇదీ చదవండి : జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కి చెందిన కుటుంబం సజీవ దహనం
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.పశుపతినాథ్ కొంపల్లి ఎన్సీఎల్లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్ లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్ తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది. ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

వహ్.. శుభాంశు శుక్లా! కుపోలా విండో ఎందుకంత స్పెషల్?
భారతదేశపు వ్యోమగామి.. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 👨🚀 మరో అదరుదైన ఫీట్ సాధించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ప్రసిద్ధ కుపోలా విండో వద్ద నుంచి భూమిని వీక్షిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. నాసా-ఇస్రో జాయింట్ మిషన్ యాక్సియమ్ మిషన్ 4లో భాగంగా శుభాంశు శుక్లా ISS చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఈ మిషన్లో భాగంగా.. శుక్లా కమాండర్ పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కాపులతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మైజెనెసిస్, స్ప్రౌట్స్ ప్రాజెక్ట్, మైక్రో ఆల్గీ ప్రయోగాలు వంటి అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొంటున్నారు. తాజాగా.. ఐఎస్ఎస్లోని కుపోలా నుంచి ఆయన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. కుపోలా మాడ్యూల్ అనేది ఐఎస్ఎస్లోని అత్యంత ప్రత్యేకమైన భాగం. అంతరిక్షం నుంచి భూమిని ప్రత్యక్షంగా చూడటానికి రూపొందించిన ఒక విండో గ్యాలరీలా ఉంటుంది.భూమి, నక్షత్రాలు, అంతరిక్ష నౌకలు వంటి వాటిని పరిశీలించేందుకు, ఫోటోలు తీయడానికి, రోబోటిక్ ఆర్మ్ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు.ఇది ఏడు విండోలతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్యానోరమిక్ వ్యూ (360 డిగ్రీల దృశ్యం) అందించగల సామర్థ్యం ఉంది. దీనిని ఇటలీ అంతరిక్ష సంస్థ (ASI) రూపొందించి, నాసాకి అందించింది. 2010లో ISSకి ఇది జత చేయబడింది.కుపోలా ద్వారా భూమిని చూడటం అనేది చాలా భావోద్వేగపూరితమైన అనుభవంగా ఉంటుంది. ఈ విండో గుండా తీసిన భూమి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని విండో టు ది వరల్డ్గా దీనిని వ్యవహరిస్తారు. Finally, we have some awesome images of Astro Shubanshu shukla 🇮🇳🧑🏻🚀Thank you @Axiom_Space for uploading these 📸#Ax4 #ISRO #Shubanshushukla pic.twitter.com/lfwm8PC6OI— ASTROSPACE (@Arslanshaikh_) July 5, 2025ఇదిలా ఉంటే.. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో పరిశోధనలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, విద్యార్థులతో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలాంటి సరిహద్దులు కనిపించవు, అందులో భారతదేశం ఎంతో విశాలంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలాగే.. జూలై 3, 4 తేదీల్లో తిరువనంతపురం, బెంగళూరు, లక్నోలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం.. జులై 10వ తేదీతో శుక్లా బృందం అంతరిక్ష యాత్ర ముగియాల్సి ఉంది.

యెమెన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించారు.ఎర్ర సముద్రంలో గ్రీకు యాజమాన్యం ఆధీనంలోని కార్గో షిప్ మ్యాజిక్ సీస్పై ఆదివారం దాడి జరిగిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపిన తర్వాత బాంబులతో కూడిన డ్రోన్లు.. పడవలు, ఓడలను ఢీకొట్టాయని యెమెన్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన గురించి హౌతీ మీడియా వెల్లడించినప్పటికీ, అధికారికంగా తమ బాధ్యతను ప్రకటించలేదు.ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు ఇరాన్ నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ ఆయుధాలను వారు ఇజ్రాయెల్తో పాటు దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తిరుగుబాటుదారులు అంతర్జాతీయ సముద్ర ట్రాఫిక్ను ట్రాక్ చేయడానికి, మరిన్ని దాడులను ప్లాన్ చేయడానికి ఓడలో రాడార్ పరికరాలను అమర్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. 🚨 Israel Launches Over 60 Airstrikes on Houthi-Controlled Yemen Ports in Retaliatory OperationIn the early hours of July 7, Israel initiated a large-scale military campaign named Operation Black Flag, targeting Houthi-controlled infrastructure across Yemen. The Israeli Defense… pic.twitter.com/jRXzxmPLeL— The Tradesman (@The_Tradesman1) July 7, 2025ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులను హౌతీలు అంగీకరించినా, నష్టం ఏ మేరకు జరిగిందో వెల్లడించలేదు. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఇంకా అనిశ్చితంగా ఉంది. అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్ అణు చర్చలపై తన వైఖరి ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు.
జాతీయం

ఆ కామాంధుడు.. కన్నతండ్రే!
చాప్రా: బీహార్లో వావివరుసలు మరచి ప్రవర్తించిన ఒక తండ్రి ఉదంతం కలకలం రేపుతోంది. రైలు టాయిలెట్లోని ఒక బ్యాగులో నవజాత శిశువు లభ్యమైన దరిమిలా పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రైలులోని టాయిలెట్లో శిశువు ఏడుపు విన్న ప్రయాణికులు, వెంటనే ఆ శిశువును బయటకు తీసి, మొరాదాబాద్లోని రైల్వే పోలీసులకు అప్పగించారు.పోలీసుల విచారణలో బీహార్కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైందని, అయితే వారి కుటుంబ సభ్యులు దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని తేలింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన సమాచారంలో.. తన తండ్రి మద్యం సేవించేవాడని, ఏడాదిగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గర్భవతి అయిన బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం రైలులో ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు శిశువుకు జన్మనిచ్చిందని వెల్లడయ్యింది.వారు ప్రయాణిస్తున్న రైలు వారణాసి సమీపంలో ఉండగా, ఆమె టాయిలెట్లో మగబిడ్డను ప్రసవించింది. అయితే కుటుంబ సభ్యులు ఆ శిశువును ఒక బ్యాగులో ఉంచి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్లో పడవేసి, రైలు నుంచి దిగిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బరేలీ సమీపానికి రైలు చేరుకున్నంతలో ప్రయాణికులు ఆ శిశువును గుర్తించారు. వెంటనేవారు ఆ శిశువును టికెట్ తనిఖీ సిబ్బందికి అప్పగించారు. వారు ఆ శిశువును ఎయిర్ కండిషన్డ్ కోచ్కు తరలించారు. తరువాత ఆ శిశువుకు మొరాదాబాద్లో వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.బాధిత బాలిక కుటుంబ సభ్యులు వదిలివెళ్లిన బ్యాగులో లభ్యమైన సిమ్ కార్డ్ ఆధారంగా పోలీసులు బాధితురాలి ఆచూకీ తెలుసుకున్నారు. తరువాత ఆమెను మొరాదాబాద్కు తీసుకువచ్చారు. అయితే బాధితురాలు అక్కడి అధికారులతో ఆ శిశువును తాను పోషించలేనని లిఖిత పూర్వకంగా తెలిపింది. బాధితురాలితో పాటు వచ్చిన బంధువులు కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు స్పష్టం చేశారని సమాచారం. దీంతో ఆ శిశువును మొరాదాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..హిమాచల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో.. మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట.

పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం?
సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ్య శక్తియోజన కింద మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. మూడేళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పురుషులు తాము కూడా ఓటు వేశామని, తామేం పాపం చేశామని చర్చించుకుంటున్న తరుణంలో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై అధిక టికెట్ ధరలను విధించినట్లు కూడా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులు అటకెక్కించారని విమర్శలు ప్రజాకర్షక హామీలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలను రద్దు చేస్తే అభివృద్ధి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ నిధి, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2000 ఇచ్చేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతోంది. బాంబు పేల్చిన బసవరాజ రాయరెడ్డి ఈ తరుణంలో సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. సోమవారం కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సమాలోచన చేస్తోందన్నారు. ఈ విషయంలో సాధక బాధకాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వంలో నిధుల కొరత లేదని, గ్యారెంటీలను చక్కగా అమలు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు రూ.2 వేలు, ఉచిత బస్సు తదితర గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే చర్యలు తీసుకుంటుందని వివరించారు.

రూ.200 మోసం .. 30 ఏళ్ల తరువాత అరెస్టు
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు. నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు.
ఎన్ఆర్ఐ

మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్లోని హోటల్కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)

ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్కు వచ్చే రెమిటెన్స్లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్టైమ్పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్లోని బక్సర్కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..)

గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
క్రైమ్

రూ.200 మోసం .. 30 ఏళ్ల తరువాత అరెస్టు
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు. నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు.

డీఎస్పీ వివాహేతర సంబంధం.. కేసు నమోదు
కర్ణాటక: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో శంకరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. భార్య ప్రశ్నించడంతో ఆమెను కొట్టి వేధించేవాడు. మరింత కట్నం తేవాలని బెదిరించడంతో పాటు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈశాన్య విభాగం మహిళా పోలీస్టేషన్లో శంకరప్ప పై కేసు నమోదైంది.

వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
ఖమ్మం: వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించినా భర్త అనుమానంతో విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవితఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీని వాస్ సోమవారం తీర్పు వెలువరించారు. బోనకల్ కు చెందిన పాలెపు సునీత తన మామ(భర్త తండ్రి) నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత, తండ్రి నర్సింహారావు కలిశారు. ఈ విషయాన్ని అప్పుడు 11ఏళ్ల సునీత పెద్దకుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆపై భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రు వీకరించారు. అయితే, హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీ సులు సునీత, నర్సింహారావును విచారించగా అసలు విషయం బయటపడడంతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ అబ్దుల్బాషా వాదించగా, కేసు విచారణలో కీలకంగా వ్యహరించిన సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బంది బి.అరవింద్, శ్రీకాంత్ను పోలీస్ కమిషనర్ సునీల్దత్ అభినందించారు.

జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఎన్నికల వేళ.. బీహార్లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్యాదవ్ అనే షూటర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.