రైతులకు సమస్యలు లేకుండా చూడండి
రీసర్వేలో జాయింట్ కలెక్టర్
బొల్లాపల్లి : జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు వివరాలను తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రీసర్వే పనుల గురించి ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే పనుల్లో రెవెన్యూ శాఖ తరఫున ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. తహసీల్దార్ ఏవీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాకాని ప్రభకు ప్రమాదం
నరసరావుపేట రూరల్: కాకాని విద్యుత్ ప్రభ ప్రమాదానికి గురైంది. కోటప్పకొండ తిరునాళ్ల నుంచి తిరుగు ప్రయాణంలో గురవాయపా లెం సమీపంలోని 10ఆర్ మేజర్ కాలువపై అ దుపుతప్పి నేలకొరిగింది. హైటెన్షన్ వైర్లను దా టించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంట ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. మరో క్రేన్ సా యంతో ప్రభను కాలువనుంచి బైటికి తీసి సి ద్ధం చేశారు. తర్వాత గ్రామానికి తరలించారు.
ఘనంగా తెప్పోత్సవం
నకరికల్లు: మండలంలోని నర్సింగపాడు గ్రామంలో గల గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవం వేడుకలు గురువారం కనులపండువగా నిర్వహించారు. మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. చల్లగుండ్ల గ్రామానికి చెందిన మడకా వెంకటేశ్వర్లు, రామతులసి, పొట్లవీడు గ్రామానికి చెందిన చుండూరు శివశంకర శ్రీనివాసరావు, వెంకట్రావమ్మల ఆధ్వర్యంలో తెప్పోత్సవం జరిపించారు. ఆలయంలోని కోనేటిని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులు కొలువుదీరాయి. భక్తుల శివనామస్మరణ నడుమ తెప్పోత్సవం సాగింది.
రైతులకు సమస్యలు లేకుండా చూడండి
రైతులకు సమస్యలు లేకుండా చూడండి
Comments
Please login to add a commentAdd a comment