Palnadu District News
-
లోకేష్ రాజ్యాంగం మేరకే పోసానిపై అక్రమ కేసులు
నరసరావుపేట: సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లోకేష్ రాజ్యాంగం మేరకు తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాజంపేట పోలీసుల అదుపులో ఉన్న పోసానిని నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై కోర్టుకు తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు అక్కడకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 2023లో స్థానిక టీడీపీ నాయకుడు కొట్టా కిరణ్కుమార్ తమ నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్లను పోసాని అసభ్య పదజాలంతో తిట్టారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు పీటీ వారెంట్పై తీసుకొస్తున్నారన్నారు. ఈవిధంగా పోసానిని వేధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల కేసులు నమోదు చేయించి అతడిని అరెస్టుచేసి స్టేషన్ల వారీగా తిప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం దారుణమన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందనేది స్పష్టమవుతుందన్నారు. పోసానికి మద్దతుగా న్యాయవాదులు అందరూ వచ్చారని, కోర్టులో బెయిలు తీసుకుంటామని వెల్లడించారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, న్యాయవాదులు ఆర్.శ్రీనివాసరావు, ఆరె శ్రీనివాసరెడ్డి, సీతారామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ వర్కర్ల నిరసన
లక్ష్మీపురం: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. తీరా గద్దె నెక్కాక వాటిని మరిచిందని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేసి దాని స్థానంలో ప్రైవేట్ కంపెనీలకు, ఏజెన్సీలకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఉద్యోగుల జీవితాలతో వారు చెలగాటం ఆడతారని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని కోరారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ ఉద్యోగ, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి కోట మాలాద్రి, మంగళగిరి పట్టణ కార్యదర్శి దుర్గారావు, కార్మికులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం
ప్రత్తిపాడు: ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం అడ్డరోడ్డు సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు వెనుక భాగం ధ్వంసం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అదే మార్గంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్సు వెనుక భాగంలో ఇంజిన్ ఉండటం వల్ల లారీ ఢీకొట్టినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగటానికి గల కారణాలపై ఆరా తీశారు. రాత్రిళ్లు రహదారిపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంట పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ●ప్రయాణికులంతా క్షేమం ●సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు -
వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పాల్గొన్న ఐదు కళాశాలల జట్లు నరసరావుపేట రూరల్: మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. వర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలో ఐదు జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పీపీఎస్ పాల్కుమార్, టైనీటాట్స్ స్కూల్ అధినేత పాతూరి కోటేశ్వరమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్కు దూరంగా ఉంటూ ఆటలాడుతూ చదువులో కూడా ముందుండాలని సూచించారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో వర్సిటీ జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కరైకుడిలోని అల్లప్ప యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా అంతర వర్సిటీ పోటీల్లో వర్సిటీ జట్టు పాల్గొంటుందని తెలిపారు. పోటీలకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్కుమార్, ఇ.ఆదిబాబు, డాక్టర్ అరుణ సుజాతలు వ్యవహరించారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రామారావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మిర్చి రైతులకు అండగా ఉంటాం
లక్ష్మీపురం: మిర్చి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డును నేతలు సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రూ.11,781 మద్దతు ధరతో రైతుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. కనీసం రూ.20వేలు అయినా ప్రకటిస్తారని ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తే వ్యాపారస్తుల దోపిడీకి రైతులు బలి అవుతున్నారని చెప్పారు. మచ్చు, కమిషన్, గోతం పేరులతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్నాథం, కంజుల విఠల్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమారెడ్డి, వీరారెడ్డి, రామయ్య పాల్గొన్నారు. విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్కు మంటలు పర్చూరు(చినగంజాం): డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు చెలరేగడంతో తీవ్రంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన వరిగడ్డిని పొలం నుంచి ఇంటికి చేరుస్తున్నాడు. ఈక్రమంలో వరిగడ్డి ట్రాక్టర్ పంచాయతీ కార్యాలయం ముందుగా వెళ్తున్న సమయంలో ఆ మార్గంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావు చాకచక్యంగా వ్యవహరించాడు. తానేమాత్రం భయాందోళనకు గురికాకుండా గడ్డిని పక్కన పడేసి అందులో ఉన్న కూలీలను, ట్రాక్టర్ను కాపాడాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గడ్డి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం. -
శబ్దకాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి
బాపట్ల: శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన ప్రదర్శనను డాక్టర్ విజయమ్మ ప్రారంభించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వినికిడి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. చెవి వినడం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పెద్ద, పెద్ద శబ్దాల నుంచి చెవిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య సేవలు ప్రైవేటుకు అప్పజెప్పొద్దు
నరసరావుపేట: జీఓవెంటనే 279ని సత్వరం రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు పారిశుద్ధ్య సేవలు అప్పజెప్పే విధానాన్ని విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి లక్షలాదిగా తరలివెళ్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, దాసరి రాజు, జయరాజు, వరహాలు, వందనం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నేతలు, కార్మికుల ధర్నా -
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
మరో ఇద్దరు పరారీ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటనపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కల్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన గుమ్మడి సాయికుమార్ మరో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లామని తెలిపారు. ఈ దాడిలో సాయికుమార్ వద్ద 1050 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉండవల్లికి చెందిన మహేష్, విజయవాడకు చెందిన కోటి పరారయ్యారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న సాయికుమార్ను కోర్టుకు హాజరు పరచనున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలతో పాటు తాగే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చెత్త నుంచి సంపదపై దృష్టి పెట్టాలి
సత్తెనపల్లి: చెత్త నుంచి గ్రామ పంచాయతీలకు ఆదాయం చేకూర్చాలని జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కర్రెడ్డి అన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణపై జిల్లాలోని అన్ని మండలాల విస్తరణాధికారులకు సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి హరిత రాయబారుల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించి చెత్తను సంపద తయారీ కేంద్రానికి చేర్చి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, పొడిచెత్తను వేరుచేసి విక్రయించి గ్రామపంచాయతీలకు ఆదాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఎటువంటి చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. అలా చేయని పంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణాధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చెత్త సేకరణ చేయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణపై జిల్లా రిసోర్స్ పర్సన్లు ఆర్.నరసింహ నాయక్, విశ్వరూపాచారిలు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎస్డబ్ల్యూపీసీ షెడ్లో సామూహిక భోజనాలు చేశారు. తొలుత జిల్లాలోనే ఆదర్శంగా గుడిపూడిలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్డును తీర్చిదిద్దిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావును అభినందించారు. నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి వీవీఎం లక్ష్మణరావు, జిల్లాలోని 28 మండలాల మండల విస్తరణ అధికారులు, హరిత రాయబారులు, పాల్గొన్నారు. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలి జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కర్రెడ్డి జిల్లాలోని మండల విస్తరణ అధికారులకు గుడిపూడిలో శిక్షణ -
సన్మార్గ దర్శిని దివ్య ఖురాన్
చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్. దివ్యఖురాన్ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోఫానం దివ్యగ్రంథం పవిత్ర ఖురాన్. అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనిని దివ్యఖురాన్ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుగులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, రోజువారీ జీవితం ఎలా గడపాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇహ, పరలోకాల సౌఖ్యం, సాఫల్య జీవితానికి మూల సూత్రాలే దివ్యగ్రంథంలోని ప్రధాన అంశాలు. పవిత్ర ఖురానులో సూచించిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్లో 114 సూరాలు, 6,666 ఆయాత్లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్మాసంలో తరావి నమాజు కింద పూర్తిపఠనం గావిస్తారు. మహిమాన్విత వరం.. దైవం దివ్యఖురానును ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారుచీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పనిసరి అన్న సూచన అందుతోంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఈ సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్, ఫిత్రాలను ఖచ్చితంగా అందజేస్తే రంజాన్ ఈద్ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యపానం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రభోదిస్తుంది. ఖురాన్ను చదివి, దానిని పాటించేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించేవారికి ప్రశాంతతో పాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం. సాఫల్య జీవితానికి నిర్దేశిని శాంతియుత జీవనానికి సోపానం జీవితాంతం పఠించాలి.. దివ్యఖురాన్ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పఠించటం ముఖ్యమే అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించి, పాటించడం ముక్తిదాయకం. ఖురాన్ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు ఈ భూమిపై అందరికంటే ఉన్నతులు. – మౌలానా మొహమ్మద్ అబ్బాస్ఖాన్ నద్వి, ఇస్లామిక్ పండితుడు -
రజకులకు బడ్జెట్లో అన్యాయం
బాపట్ల: లాండ్రీలు, దోబీఘాట్ల విద్యుత్ అవసరాలకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాపట్ల వచ్చిన జయరాం స్థానిక మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రజకులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. రజకుల నిర్మాణాత్మకమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. లాండ్రీలకు ఇచ్చే 150 యూనిట్లకు, దోబీ ఘాట్లకు ఇచ్చే ఉచిత విద్యుత్ అవసరాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రాష్ట్రంలో రజకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. రజకులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆర్థిక భారం పడని హామీలు నెరవేర్చే అవకాశం ఉన్నా, కూటమి ప్రభుత్వం రజకులకు మేలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వానిది పెత్తందారుల ప్రభుత్వం కాబట్టే రజకుల ఈనాం భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రజకులకు ప్రత్యామ్నాయ భూములను కేటాయించడం లేదన్నారు. జగనన్న కాలనీలు, జగనన్న టౌన్స్ పేరుతో సేకరించిన కమ్యూనిటీ స్థలాల్లో రజకుల వృత్తి అవసరాలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొత్తగా పడే ఆర్థిక భారం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడి్డ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయూత కింద రజక వృత్తిదారులకు రూ.10 వేలు ఇచ్చారని, టీడీపీ పాలనలో రజకులు నిండా మోసపోయారని మండిపడ్డారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం -
చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి యత్నం
చెరుకుపల్లి: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన మండలంలోని ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం అదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల వయసు గల ఓ మైనర్ బాలుడు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె వెంటనే తెనాలి ఏరియా హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై స్థానిక ఎస్ఐను సంప్రదించగా చిన్నారి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యువతితో అసభ్య ప్రవర్తన
సత్తెనపల్లి: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మిరపకాయల కోతలకు ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన 40 మంది కూలీలు నెల క్రితం వచ్చి గుడారాలు వేసుకొని జీవనం వెళ్లదీస్తున్నారు. కూలీలలో ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో కుమార్తె ఇడ్లీ తెచ్చేందుకు సిద్ధమైంది. కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన హనిమిరెడ్డి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆ యువతిని ఎక్కించుకొని వెళ్లాడు. ఇడ్లీ తీసుకొని తిరిగి వస్తుండగా వాహనం నడుపుతూనే వెనుక కూర్చున్న యువతిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. గుడారాల వద్ద కాకుండా మరికొంత ముందుకు తీసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. గుడారాల వద్దకు చేరుకొని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి విలపించింది. గ్రామ పెద్దలు వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
గురజాల: నగర పంచాయతీలోని జంగమహేశ్వరపురంలో పలనాటి తిరుమలగా పేరుగాంచిన శ్రీ అలమేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. తొలుత దేవాలయ ప్రాంగణంలోని కల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మండపంలో అలమేలు మంగా పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని వేదపండితులు కారెంపూడి వరదాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు దంపతులు ఈ మహోత్సవంలో పీట్లపై కూర్చున్నారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నసంతర్పణ, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. మరోవైపు స్వామి వారి 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయంలో హోమం, బలిహరణంతో పాటుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎదురు కోల, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబసభ్యులు ఐదుగురు కలసి కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చారు. ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణ కాలికి గాయాలయ్యాయి. రామకృష్ణ నాయనమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబసభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. దెందులూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివాజీ తెలిపారు. డ్రైవరు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. -
ఆకట్టుకున్న గ్రామీణ కళారూపాలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో ఐదు చోట్ల ప్రదర్శించిన సంప్రదాయ గ్రామీణ కళారూపాలు భక్తులను, యాత్రికులను ఆకట్టుకున్నాయని మంచి చిత్రాల అభిమాన సంఘం ప్రతినిధులు ఈదర గోపీచంద్, కంచర్ల నాగవీరయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాలివాహన సత్రంలో కావూరు గ్రామానికి చెందిన కళాకారులు గొట్టం ఆంజనేయులు దర్శకత్వంలో ప్రదర్శించిన బ్రహ్మం గారి నాటకం అలరించిందని తెలిపారు. కాకతీయ కళావేదికపై సినిమా పాటల కచేరీతోపాటు గయోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాటల కచేరీ, మిమిక్రీ, ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. కావూరు ప్రభ వద్ద మహిళా కోలాటం, భట్రాజు సత్రంలో బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శించారని చెప్పారు. త్వరలో పట్టణంలో నిర్వహించే అభినందన సభలో వారిని సత్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సాంస్కృతిక వేదికపై ప్రదర్శనలు ఇవ్వలేకపోయామని పద్య కవి, నటులు ఈవూరి వెంకటరెడ్డి వాపోయినట్లు వివరించారు. -
చిరు వ్యాపారులకు అండగా నిలవాలి
నగరంపాలెం: చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమష్టి నిర్ణయంతో చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాలు ఇప్పించే దిశగా పయనించాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికై న యేల్చూరి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ సన్మాన మహోత్సవం, రజత కిరీటంతో ఆదివారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించారు. తొలుత అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అవగాహన కల్పించాలని అన్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ అందించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వ్యాపారులకు వివరించాలని అన్నారు. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో కొంతమేర నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఇకనైనా సభ్యత్వ నమోదు పక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా ఐసీసీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్మాన గ్రహీత ఐసీసీ అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యాపారులకు అండగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్కుమార్లు మాట్లాడారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్కృష్ణ, ఐసీసీ శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ సజల, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, నాయకులు కొనకళ్ల సత్యం, కొత్తూరు వెంకట్ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులుగా వెచ్చా కృష్ణమూర్తి, దేవరశెట్టి సుబ్బారావులు వ్యవహరించారు. ఐసీసీ అధ్యక్షుడి సన్మాన సభలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని -
రైలులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దాచేపల్లి: రేపల్లె ఎక్స్ప్రెస్ రైలులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాలు.. ఆదివారం రేపల్లె నుంచి సికింద్రాబాద్కు రైలు బయలుదేరింది. మొదటి లగేజీ బోగీలో ఇనుపరాడ్కి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రయాణికులు గుర్తించారు. గార్డుకు సమాచారం ఇవ్వటంతో రైలును నడికుడి స్టేషన్లో నిలిపివేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వెళ్లి పరిశీలన చేయగా దుప్పటితో ఉరేసుకుని వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని బాపట్ల జిల్లా చీరాల మండలం చిన్నగంజాంకి చెందిన బాలిగ రాంబాబు(43)గా గుర్తించారు. లారీ క్లీనర్గా పని చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో 15 నిమిషాలపాటు రైలును నడికుడి రైల్వేస్టేషన్లో ఆపారు. -
లింగంగుంట్ల భూ సమస్య పరిష్కారానికి మళ్లీ యత్నం
నరసరావుపేట: మండలంలోని లింగంగుంట్ల పుష్పగిరి పీఠం అగ్రహారం భూముల సమస్య పరిష్కారం కోసం మరోసారి ప్రయత్నం జరిగింది. ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి లింగంగుంట్ల గ్రామ నాయకులు హైదరాబాదులోని పుష్పగిరి స్వాముల వారిని కలిసి చర్చించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్వాముల వారికి, రైతుల మధ్య ఓ అంగీకారం కుదిరిన విషయం విదితమే. దీనిపై ఇరువర్గాల మధ్య ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా మళ్లీ భూముల విషయమై స్వాముల వారిని కలిసి చర్చించారు. మఠానికి ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వాముల వారు కోర్టు తీర్పు మేరకు రైతుల ఆధీనంలో ఉన్న తమ భూములు తమకు కావాల్సిందేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే చర్చలు నంతరం త్వరలో భూముల రిజిస్ట్రేషన్ జరగనున్నట్లుగా టీడీపీ నాయకులు ప్రకటించటం గమనార్హం. ఏమవుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది. స్వాముల వారిని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి, యన్నం రవీంద్రరెడ్డి, గుంగుల పెద్దిరెడ్డి, పొన్నపాటి వెంకటేశ్వరరెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ఏరువ బాలమోహనరెడ్డి ఉన్నారు. -
అమరేశ్వరుడి సేవలో ఐజీ హరికృష్ణ
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరుడిని ఆదివారం ఐజీ హరికృష్ణ, ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములునాయక్లు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు తొలుత వారికి స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరుడికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి శేషవస్త్రంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొలీస్ అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. శింగకొండ తిరునాళ్లకు ట్రాఫిక్ మళ్లింపు అద్దంకి రూరల్: ఈ నెల 14వ తేదీన శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా అద్దంకి వైపు వచ్చే వాహనాలను ఇతర దారులకు మళ్లిస్తున్నట్లు చీరాల డీఎస్పీ మొయిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్పీ వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనదారులు సంతమాగులూరు క్రాస్ రోడ్, నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వైపు, దర్శివైపు వెళ్లేవారు సంతమాగులూరు క్రాస్ రోడ్ నుంచి వినుకొండ, కురిచేడు మీదుగా దర్శి వైపునకు, రేణింగవరం నుంచి అద్దంకి మీదుగా దర్శి వెపు వెళ్లే వారు మేదరమెట్ల హైవే మీదుగా, ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లే వారు మేదరమెట్ల మార్టూరు వైపు హైవే మీదుగా హైదరాబాద్కు, దర్శి నుంచి అద్దంకి మీదుగా హైదరాబాద్ వెళ్లే వారు కురిచేడు, వినుకొండ, సంతమాగులూరు క్రాస్ రోడ్డు వైపునకు మళ్లాల్సి ఉంటుందని తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పైన నిర్ణయించిన సమయంలో కట్టెల ట్రాక్టర్లు, గడ్డి ట్రాక్టర్లు, పొట్టు ట్రాక్టర్లకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులకు, అంబులెన్స్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. యోగా, ధ్యానంతో పోలీసుల్లో ఒత్తిడి దూరం నరసరావుపేట: పోలీసుల విధి నిర్వహణలో ఎదురయ్యే అధిక ఒత్తిడిని యోగా, ధ్యానంతో అధిగమించవచ్చునని పరిపాలనా విభాగ అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పేర్కొన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్త వారోత్సవాలలో భాగంగా ఆదివారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీసు సిబ్బంది, సచివాలయం మహిళా పోలీసులకు యోగా, ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు జనార్దనరావు పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. స్థానిక మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. రేపు సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ జట్ల ఎంపిక బాపట్ల: గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక మంగళవారం 2గంటల నుంచి నిర్వహించనున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మంతెన సుబ్బరాజు ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 30–3–2009 తరువాత పుట్టిన వారై ఉండాలని, 55 కేజీల్లోపు బరువు ఉండాలని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన సూచించారు. -
నేటి నుంచి సీనియర్ ఇంటర్ పరీక్షలు
గుంటూరు జిల్లాలోని 87 కేంద్రాల్లో హాజరు కానున్న 35,946 మంది గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 35,946 మంది విద్యార్థులకు 87 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించిన తరువాత, 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు పరుస్తోంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా, ఏసీ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులకు పక్కనే ఉన్న ఏసీ లా కళాశాల ద్వారం నుంచి పరీక్ష కేంద్రంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. -
మెప్పించని రాష్ట్ర బడ్జెట్
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మెజారిటీ ప్రజలను మెప్పించలేకపోయిందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేని బడ్జెట్ అని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కోటప్పకొండరోడ్డులోని సీపీఎం కార్యాలయంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి అధ్యక్షతన రాష్ట్ర బడ్జెట్పై చర్చా గోష్టి నిర్వహించారు. పీడీఎం రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 70 శాతానికిపైగా ఉన్న వ్యవసాయ రంగానికి ఏడు శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వరికెపూడిశెల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూటమి నేతల ప్రాధాన్యతలు వేరని చెబుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు ఇచ్చే రాయితీలు ఎన్నటికీ పేదలకు ఇవ్వబోమని చెప్పినట్లుగా బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్ అంకెలు గారడీ మినహా మరేం కాదని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్ట్కు వెంటనే నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు కోసం సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, అన్నదాతా సుఖీభవ కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పినా అందుకు తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం మాట మార్చడం ప్రజల్ని వంచించడమేనని పేర్కొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చవ రామారావు, సీఐటీయూ నాయకులు షేక్ సిలార్ మసూద్, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చికినం చిన్న, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోటనాయక్ ప్రసంగించారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, దళితులు, గిరిజనులను ఈ బడ్జెట్ నిరాశకు గురిచేసిందని విమర్శించారు. లోపాలను సరిచేసి పేదలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు తగిన నిధుల కేటాయింపులో గారడీలు 70 శాతం మంది ఆధారపడిన సాగు రంగానికి 7 శాతమే నిధులా? చర్చా గోష్టిలో కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం -
పట్టభిషేకం ఎవరికో!
నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఎ.భార్గవ్ తేజతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములోకి భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. 28 టేబుళ్లు ఏర్పాటు ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్లో పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు.. ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఏసీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో పూర్తయిన ఏర్పాట్లు ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఓట్ల లెక్కింపు ఇక్కడే 2.41 లక్షల ఓట్లను లెక్కించేందుకు 28 టేబుళ్లు ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
పల్నాడు
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025అన్ని డబ్బులెక్కడివని ‘సాయిసాధన’ బాధితులకే ఎదురు ప్రశ్నలు 7మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ట కొల్లూరు: మండలంలోని చినపులివర్రు శివారు గురివిందపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామ దేవత మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు.గుంటూరు రేంజ్కు 53 మంది ప్రొబేషనరీ ఎస్ఐలునగరంపాలెం: సమర్థంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ప్రొబేషనరీ ఎస్ఐలకు సూచించారు. శిక్షణ పూర్తయి, గుంటూరు రేంజ్ పరిధిలో విధుల నిర్వహించేందుకు ఎంపికై న 53 (36 మంది పురుషులు, 17 మంది మహిళలు) మంది ప్రొబేషనరీ ఎస్ఐలు గుంటూరు నగరంలోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు. తద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు. అనంతరం వారికి జిల్లాలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను ఐజీ అందించారు. గుంటూరు జిల్లాకు 22 మంది, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతి జిల్లాకు నలుగురిని కేటాయిస్తూ నియామక ఉత్తర్వులు అందించారు. ఈనెల 2 నుంచి 6 వ తేదీ వరకు పీఎస్ఐలకు సెలవులని ఐజీ తెలిపారు. అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేహౌండ్స్ శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అనంతరం పీఎస్ఐలతో కూడా ఐజీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) నరసరావుపేట 6.13 5.10 గుంటూరు 6.22 5.10 బాపట్ల 6.21 5.08 పెద్దల హస్తంపై అనుమానాలు పుల్లారావు విషయంలో మొదటి నుంచీ పోలీసు శాఖలోని పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పెద్దలూ అతనికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నుంచీ పరిశీలిస్తే పుల్లారావు మోసాల చిట్టా బయట పడిన నెల తర్వాతగానీ ఆయన కోర్టులో లొంగిపోలేదు. ఈలోగా ప్రజల నుంచి దోచిన సొమ్మంతా వివిధ రూపాల్లో దారి మళ్లించాడు. పుల్లారావును అరెస్టు చేసి, దోచుకున్న సొమ్ము రికవరీ చేయడంపై పోలీసులు దృష్టి సారించలేదు. దీని వెనుక పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బాధితులు మండిపడుతున్నారు. సుమారు వెయ్యి మంది బాధితులు ఉంటే ప్రభుత్వం ఆర్థిక నేరగాడైన పుల్లారావుకు లబ్ధి చేకూరేలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదెలా పారదర్శక పాలన అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇచ్చిన మొత్తం తిరిగి వస్తుందో రాదో.. ఎవరికి చెబితే వేదన తీరుతుందో.. అనే దిగులుతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సాయిసాధన చిట్ఫండ్ బాధితులకు సీఐడీ షాక్ ఇస్తోంది. ఉన్న కొద్దిపాటి ఆశలను ఆదిలోనే సమాధి చేస్తూ సీఐడీ అధికారులు అడిగే ప్రశ్నలు బాధితుల గుండెల్లో మరింత వేదన మిగులుస్తున్నాయి. అయ్యా.. కష్టపడి రూపాయి రూపాయిగా కూడబెట్టుకున్న డబ్బులను వడ్డీ ఆశతో పుల్లారావుకు ఇస్తే నిండా మునిగిపోయామని చెప్పేలోగానే అధికారులు వారి అసలు నైజం చాటుతున్నారు. పోయిన డబ్బుల సంగతి సరే.. అసలు మీకు అంత మొత్తం ఎలా వచ్చాయి.. వాటికి లెక్కలు చెప్పండి.. అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బాధితులు చేసేది లేక అంతులేని వేదనతో వెనుదిరుగుతున్నారు. ఇదేం అన్యాయమంటూ గుండెలు బాదుకుంటున్నారు. చీటర్కే అనుకూలంగా వ్యవహరిస్తున్న నిస్సిగ్గు సీఐడీ, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట టౌన్: రెండు నెలల క్రితం గుంటూరు, పల్నాడు జిల్లాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా సంచలనం సృష్టి్ంచిన సాయిసాధన చిట్ఫండ్ పాలడుగు పుల్లారావు స్కాం కేసులో బాధితుల వేదన అంతా ఇంతా కాదు. అధిక వడ్డీ ఆశ చూపి, లేని ఆస్తులు ఉన్నట్లు మాయ చేసి సుమారు వెయ్యి మంది వద్ద రూ.400 కోట్లకుపైగా పుల్లారావు వసూలు చేశాడు. ఈ నగదుతో రాత్రికి రాత్రే కుటుంబంతో ఉడాయించాడు. బాధితులు ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు. కమిటీగా ఏర్పడి పుల్లారావు ఆస్తులెంత.. అప్పులెంత ? అంటూ ఆరా తీశారు. ఇప్పటికే ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి, హోంమంత్రి అనితలను సైతం కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఐడీకి కేసు అప్పగించవద్దంటూ విన్నవించుకున్నారు. ఎవరికి వారు తాము అండగా నిలబడతామని చెప్పారేగానీ.. బాధితులను న్యాయం చేసే దిశగా మాత్రం చర్యలు శూన్యం. బాఽధితులు భయపడినట్టే కేసు చివరకు సీఐడీకి చేరింది. అయినప్పటికీ న్యాయం జరిగే అవకాశాలు లేకపోవడంతో ఆదివారం నరసరావుపేటలోని ఓ హోటల్లో బాధితులంతా సమావేశమై పలు తీర్మానాలు చేశారు. పుల్లారావు స్కాంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబును కలసి విన్నవించారు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పండి.. కూటమి ప్రభుత్వం ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా పుల్లారావు కేసును నీరుగార్చేలా సీఐడీకి అప్పగించింది. సీఐడీ బాపట్ల ఎస్పీ తుషార్తో కలసి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సీఐడీకి బదిలీ అయ్యాక 15 రోజులకుగానీ బాధితులతో సిట్ అధికారులు మాట్లాడలేదు. సీఐడీ బృందం ఒక్కసారి కూడా నరసరావుపేటలోని సాయిసాధన చిట్ఫండ్కు వచ్చి తనిఖీలు చేపట్టలేదు. బాధితులను మాత్రం ఫిరంగిపురం పోలీస్స్టేషన్, గుంటూరు సీఐడీ కార్యాలయానికి పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. అక్కడ తమనే దోషుల్లాగా చూస్తూ సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. అసలు పుల్లారావుకు ఇచ్చేందుకు మీకు డబ్బులు ఎలా వచ్చాయో లెక్కలు చెప్పండంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. దీంతో బాధితులు ఇదెక్కడి దారుణమంటూ బోరున విలపిస్తున్నారు. సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో బాధితులు వారి వద్దకు వెళ్లేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఉన్న కష్టాలకు తోడు కొత్త సమస్యలు వస్తాయేమోనన్న ఆలోచనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేస్తారని ఆశించి వస్తే ఇదేం తీరని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దర్జా అంటే పుల్లారావు కుటుంబానిదే.. పుల్లారావుకు చెందిన సాయిసాధన చిట్ఫండ్తోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, అత్తమామలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ చీటింగ్ వ్యవహారంలో వీరంతా దోషులే. అయితే పుల్లారావు కోర్టులో లొంగిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆయన కుటుంబ సభ్యులపై కనీస చర్యలు కూడా లేవు. వీరంతా ప్రజల సొమ్ముతో దర్జాగా బయట తిరుగుతున్నారు. పుల్లారావుతోపాటు అతని కుటుంబసభ్యులపై నరసరావుపేట వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవ్వడంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారిని అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బాధితులు బోరున విలపిస్తుంటే.. పుల్లారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎంచక్కా దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాల వారీగా కేటాయింపులు నియామక ఉత్తర్వులు అందించిన రేంజ్ ఐజీన్యూస్రీల్ పుల్లారావు కేసు విషయంలో దారుణంగా సీఐడీ ధోరణి మోసపోయిన మొత్తం వదిలేసి.. ఎలా వచ్చాయంటూ నిలదీత ఇదెక్కడి తీరంటూ గుండెలు బాదుకుంటున్న బాధితులు పుల్లారావుకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం ఆయన కుటుంబంపైనా ఇప్పటివరకు చర్యలు లేవంటూ ఆవేదన పుల్లారావు స్కాంపై అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేకు వినతి -
చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి యత్నం
చెరుకుపల్లి: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన మండలంలోని ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం అదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల వయసు గల ఓ మైనర్ బాలుడు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె వెంటనే తెనాలి ఏరియా హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై స్థానిక ఎస్ఐను సంప్రదించగా చిన్నారి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కూటమి ప్రభుత్వానిది దగా బడ్జెట్
జె.పంగులూరు: ఎన్నో మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, తప్పించుకునే వీల్లేక, రాష్ట్ర ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పి పుచ్చేందుకు చివరికి ఒక దగా బడ్జెట్ ప్రకటించిందని రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చందోలు రాజ్కుమార్ దుయ్యబట్టారు. మండల పరిధిలోని పంగులూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్న పథకం ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం అభాసు పాలైందని, అనేక కారణాలతో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గించే విధంగా చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.10 లక్షలు, ప్రతి మహిళకు రూ.1500 సంగతి ఎటు పోయిందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడకి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికే రూ. లక్ష కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం మరో రూ.80 వేల కోట్లు తీసుకురావాలని ప్రకటించడం సంపద సృష్టిలో భాగమా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చందోలు రాజ్కుమార్ -
పెనుమాకకు ‘సాహితీ రత్న’ ప్రదానం
అద్దంకి రూరల్: ప్రముఖ కవి పెనుమాక నాగేశ్వరరావుకు సాహితీ మిత్రమండలి సాహతీ రత్న బిరుదును ప్రదానం చేసింది. ఆదివారం స్థానిక చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవాసదన్లో సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లక్కరాజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి పెనుమాక నాగేశ్వరరావు రచనలపై పాలపర్తి జ్యోతిష్మతి, కుందుర్తి స్వరాజ్యపద్మజ విశ్లేషించారు. పెనుమాక నాగేశ్వరరావు మాట్లాడుతూ తానురచించిన నాన్న నువ్వు సున్నానా, ఫారెన్సెంటు, బార్తం, నైతరుణి, ఆలయం, దేవుడిపాట నవల గురించి వర్ణించారు. కార్యక్రమంలో యు. దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, ఎ.లెవీ ప్రసాద్, ఆర్వీ రాఘవరావు, చందలూరి నారాయణ, పీసీ మెచ్ కోటయ్య, ఎల్.శివరావు, చప్పిడి వీరయ్య, ఎల్.శ్రీనివాసరావు, చుండూరి మురళీ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముక్కు మూసుకోవాల్సిందే..
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ పుణ్యక్షేత్రం చెత్తతో నిండిపోయింది. తిరునాళ్లతో పోగైన వ్యర్థాలను తొలగించడంలో పంచాయతీ రాజ్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా గుట్టలుగా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట కుళ్లిన వాటితో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులతోపాటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తిరునాళ్ల గత నెల 26వ తేదీన నిర్వహించారు. లక్షలాది మంది పాల్గొన్నారు. ఇది గడిచి నాలుగు రోజులైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు. కొండ దిగువున ప్రధాన రహదారులు వెంట చెత్త పేరుకుపోయింది. తాత్కాలిక దుకాణాలు, చెరకు రసం దుకాణాల వ్యర్థాలు పోగయ్యాయి. ప్రభల నిధి, అధికారుల తాత్కాలిక వసతి గృహాల ప్రాంతం వద్ద ప్లాస్టిక్ కవర్లు, పేపర్ టీకప్పులు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన సెంటర్లోని దుకాణాదారులు వ్యర్థాలను గోతాలలో రోడ్ల వెంట పడేశారు. అధికారులు వాటిని తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నవితరణ చేసి ఆకులను వదిలివెళ్లడంతో అవీ పోగయ్యాయి. ముక్కు మూసుకొని భక్తులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ రాజ్ శాఖ 350 మంది వరకు కూలీలను తిరునాళ్లకు విధుల్లో నియమించింది. సగం మంది కాంట్రాక్ట్ కార్మికులు. మూడు రోజులపాటు వీరు కొండ దిగువున పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరునాళ్ల అనంతరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏటా తిరునాళ్ల ముగిసిన మరుసటి రోజు నుంచే పారిశుద్ధ్య పనులు జరిగేవి. వారం రోజులపాటు చెత్తను తొలగించేవారు. ఈ ఏడాది కనీసం ఇటువైపు చూసిన వారే కరవయ్యారు. కోటప్పకొండలో పేరుకుపోయిన చెత్త తిరునాళ్లతో రోడ్ల వెంట భారీగా పోగు పడిన వ్యర్థాలు నాలుగు రోజులైనా పారిశుద్ధ్య పనులు శూన్యం గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు కూలీల కొరతే కారణం తిరునాళ్ల ఏర్పాట్ల కోసం మండలంలోని కాంట్రాక్ట్ కూలీలతోపాటు రోజువారీగా కొంతమందిని నియమించాం. తిరునాళ్ల తరువాత కూలీలు అందుబాటులో లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్ట్ కూలీలకు ఆరోగ్య సమస్యలు కూడా మరో కారణం. సోమవారం నుంచి వ్యర్థాలు తొలగించే పనులు ప్రారంభిస్తాం. – నాగానంద్, ఈవోపీఆర్డీ, నరసరావుపేట మండలం -
యువతితో అసభ్య ప్రవర్తన
సత్తెనపల్లి: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మిరపకాయల కోతలకు ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన 40 మంది కూలీలు నెల క్రితం వచ్చి గుడారాలు వేసుకొని జీవనం వెళ్లదీస్తున్నారు. కూలీలలో ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో కుమార్తె ఇడ్లీ తెచ్చేందుకు సిద్ధమైంది. కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన హనిమిరెడ్డి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆ యువతిని ఎక్కించుకొని వెళ్లాడు. ఇడ్లీ తీసుకొని తిరిగి వస్తుండగా వాహనం నడుపుతూనే వెనుక కూర్చున్న యువతిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. గుడారాల వద్ద కాకుండా మరికొంత ముందుకు తీసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. గుడారాల వద్దకు చేరుకొని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి విలపించింది. గ్రామ పెద్దలు వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
కూటమి బడ్జెట్ మోసపూరితం
వినుకొండ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం మోసమేనని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలూ అమలు చేస్తామని చంద్రబాబు, హామీలు కచ్చితంగా అమలు చేసేలా చూసుకుంటామని పవన్ మాట్లాడిన మాటలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. కనీసం ప్రటించిన పథకలకన్నా పూర్తిస్థాయి కేటాయింపులు చేయలేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలకు సగం నిధులను కేటాయించడం, మహిళలకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని నమ్మబలికి వాటి ప్రస్తావనే బడ్జెట్లో లేకపోవడం ప్రజలను దగా చేయడమేనని బొల్లా విమర్శించారు. పల్నాడు ప్రాంతానికి జీవనాడిలాంటి వరికపూడిశెల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంపై బొల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో వరికపూడిశెల పథకానికి అన్ని రకాల అనుమతులను తీసుకురావడంతోపాటు శంకుస్థాపన చేసి కొంత నిధులనూ కేటాయించామని వివరించారు. ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన నెలలోనే వరికపూడిశెల పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలపై పగ తీర్చుకోవడానికే సమయం సరిపోతోందని, పాలనను పట్టించుకోవడం లేదని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని, పోలీసులు దీనికి వంతపాడుతున్నారని బొల్లా ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు
నరసరావుపేట: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ మెంబెర్ అప్రాప్రియేట్ అథారిటీ డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు హెచ్చరించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్నీ స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 175 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ చట్ట పరిధి కింద అనుమతులు ఇవ్వటం జరిగిందని, వీరందరూ కూడా నిబంధనలకు లోబడి అన్నీ రకాల రికార్డులను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో నూతనంగా రెండు స్కాన్ సెంటర్లు, రెండు రెన్యువల్స్కు, తొమ్మిది మార్పులకొరకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, నోడల్ అధికారి డాక్టర్ బి.గీతాంజలి, సత్తెనపల్లి గైనకాలజిస్టు డాక్టర్ శోభారాణి, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ గిరిరాజు, డెప్యూటీ డెమో కె.సాంబశివరావు, షేక్ ఖాజావలి పాల్గొన్నారు. డీటీఓ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ నూతన జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారిగా కె.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ముగిసిన బ్రహ్మోత్సవాలుఅమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. అలాగే రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి ఏకాంతసేవా మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వసంతోత్సవ అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ‘భరోసా’ తగ్గించారు తొమ్మిది నెలల్లో 10,161 పింఛన్ల తొలగింపు నరసరావుపేట: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందే వారి సంఖ్య జిల్లాలో క్రమంగా తగ్గిపోతుంది. గత తొమ్మిది నెలల కాలంలో 10,161మంది పింఛన్లను కూటమి సర్కారు కోత వేసింది. ఫిబ్రవరితో పోల్చితే మార్చి నెలకు 977 పింఛన్లు తగ్గాయి. గత నెల 2,72,932 మందికి అందజేయగా ఈనెల 2,71,955 మందికి అందజేయాల్సివుంది. ఒకటో తేదీ శనివారం నుంచి జిల్లాలో పంపిణీ మొదలు పెట్టగా సాయంత్రానికి 2,51,008 (92.30శాతం) మందికి అందజేశారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట పట్టణంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. గత ప్రభుత్వం ముగిసి నూతన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జిల్లా వ్యాప్తంగా 2,82,126మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతేడాది జూలై మొదటి తేదీన నూతన ప్రభుత్వం పింఛన్లు అందజేసింది. ప్రస్తుత నెల లబ్ధిదారులతో పోల్చితే తొమ్మిది నెలల్లో 10,161మంది లబ్ధిదారులు తగ్గటం గమనార్హం. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో శనివారం ప్రశాంత వాతారణంలో ప్రారంభమయ్యాయి. సిద్ధంగా ఉంచిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలలో సెట్–2 ప్రశ్నాపత్రాన్ని ప్రకటించారు. పరీక్షల తొలిరోజు కావటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8గంటలకే చేరుకున్నారు. విద్యార్థుల హాల్టిక్కెట్లు పరిశీలించి లోపలికి అనుమతించారు. జిల్లాలోని 48 పరీక్షా కేంద్రాలలో 18,481 మంది విద్యార్థులకు గాను 17,591మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మరో 890మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 17,313 మందికి గాను 16,554మంది హాజరు కాగా మరో 759మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,168మందికి గాను 1,037మంది హాజరు కాగా మరో 131మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ, మౌలిక వసతులను పరిశీలించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, చీఫ్ సూపరింటెండెంట్ రాజనాల వేణుమాధవ్లకు పలు సూచనలు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా ఈనెల 3వతేదీ సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ అరుణ్బాబు తొలిరోజు 95.18 శాతం హాజరు నమోదు -
పెన్షన్ నగదుతో ఉడాయింపు
దాచేపల్లి: పింఛన్దారుల సొమ్ము తీసుకుని వార్డు సెక్రటరీ పరారైన ఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని వార్డు సచివాలయం–3లో వెల్ఫేర్ సెక్రటరీగా సంపతి లక్ష్మీప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు నెలల కిందట గుంటూరు నుంచి డిప్యూటేషన్పై వచ్చాడు. బ్యాంక్ నుంచి రూ.8.43 లక్షల పింఛన్ నగదు డ్రా చేసుకుని తన వద్ద పెట్టుకున్నాడు. ఇతను పిడుగురాళ్లలో నివాసం ఉంటున్నాడు. 200 మందికి పింఛన్ నగదు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయాన్నే పింఛన్ నగదు కోసం లబ్ధిదారులు ఎదురు చూశారు. ఉదయం 11 గంటలైన పింఛన్ నగదు పంపిణీ చేసేందుకు ఎవరూ రాకపోవటంతో పింఛన్దారులు నగర పంచాయతీ కమిషనర్ ఎంవీ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. సచివాలయం–3 వద్దకు పింఛన్దారులు చేరుకుని పడిగాపులు కాశారు. ఎంతసేపటికీ సెక్రటరీ రాకపోవటంతో ఆందోళన చేశారు. లక్ష్మీప్రసాద్ ఆచూకీ కోసం కమిషనర్ ప్రయత్నాలు చేశారు. అతని సెల్ఫోన్ స్విచ్ఆఫ్ కావటంతో పిడుగురాళ్లలోని ఇంటికి సిబ్బందిని పంపి ఆరా తీస్తే అందుబాటులో లేడని తెలిసింది. దీంతో కమిషనర్ అప్పారావు దాచేపల్లి పోలీస్స్టేషన్లో లక్ష్మీప్రసాద్పై ఫిర్యాదు చేశారు. సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్డు సెక్రటరీ లక్ష్మీప్రసాద్పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు కమిషనర్ అప్పారావు చెప్పారు. రూ.8.43లక్షలతో వార్డు సెక్రటరీ పరారీ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ -
సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారి ఆగడాలు
సాక్షి,నరసరావుపేట: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారి ఆగడాలు శృతిమించాయి. సత్తెనపల్లికి చెందిన పోలిశెట్టి ఆంజనేయ తరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటళ్ల వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. గతంలో సత్తెనపల్లి పోలీస్స్టేషన్ ఎదుట రాయల్ మండి బిర్యానీ హోటల్ సైతం నిర్వహించాడు. మూడు నెలల క్రితం వ్యాపార అవసరాల నిమిత్తం నగదు అవసరం కావడంతో బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంకు చెందిన వడ్డీ వ్యాపారి సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా వద్ద రూ.40 లక్షలు అరువుగా తీసుకున్నాడు. దానికి వారం రోజుల క్రితం మరో రూ.60 లక్షలు వడ్డీ కలిపి మొత్తం రూ.కోటి ఇవ్వా లంటూ ఆంజనేయ తరుణ్ను సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా వేధింపులకు గురి చేస్తున్నాడు. గత నెల 25న పోలిశెట్టి ఆంజనేయ తరుణ్ను నన్నేతో పాటు మరో ముగ్గురు కలిసి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. చండ్రాజుపాలెం, పులిచింతల డ్యామ్, బెల్లంకొండ, గుంటూరు తదితర ప్రాంతాలకు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఆంజనేయ తరుణ్ ఎడమ చేయి మణికట్టు వద్ద మూడు అంగుళాల మేకును సైతం దించారు. అంతేకాక ఇనుప రాడ్డుతో దాడి చేసి మలద్వారంలోకి ఆ రాడ్డును దించారు. తట్టుకోలేక విలపిస్తుంటే రూ.కోటి డబ్బులు ఇవ్వకపోయినా, పోలీసుల దగ్గరకు వెళ్లినా నీ కొడుకును చంపేస్తామంటూ తరుణ్ తండ్రి ఆంజనేయ శ్రీనివాస్కు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. సెల్ఫోన్ సిగ్నల్ సాధారణంగా ట్రేస్ చేయగా పేరేచర్లలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆంజనేయ తరణ్ను విడిపించి కిడ్నాపర్లు నలుగురుని అదపులోకి తీసుకున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కూటమి నేతల అండతో రౌడీషీట్ ఎత్తివేత.... వడ్డీ వ్యాపారి సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా పై గతంలో కూడా అనేక ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అవసరాలకు నగదు ఇచ్చి అత్యధిక వడ్డీలు వసూలు చేసేవాడు. డబ్బు తిరి గి ఇవ్వకపోతే చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇతనిపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల రౌడీషీట్ను ఎత్తివేశారు. దీంతో మళ్లీ ఆగడాలు శృతి మించాయి. ప్రస్తుతం కేసును కూడా నీరుగార్చేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారికి రూ.40 లక్షలు ఇచ్చి రూ.కోటి ఇవ్వాలంటూ బెదిరింపులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి చిత్రహింసలు ఎట్టకేలకు విడిపించిన పోలీసులు -
కార్మిక శాఖ అధికారిని అంటూ వ్యక్తి హల్చల్
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో సహాయ కార్మిక శాఖ అధికారిని అంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పట్టణంలోని పలు దుకాణాల వద్దకు ఓ వ్యక్తి శుక్రవారం వెళ్లి సహాయ కార్మిక శాఖ అధికారిగా పరిచయం చేసుకుని లైసెన్స్ రెన్యూవల్ పేరిట పలు షాపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే అతడిని నకిలీ అధికారిగా గుర్తించిన వ్యాపారులు కార్మిక శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. తమ శాఖ తరఫున ఎలాంటి లైసెన్స్ రెన్యూవల్ చేయడం లేదని వారు చెప్పడంతో వ్యాపారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శుక్రవారం రాత్రి షాపుల వద్దకు చేరుకొని వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ముప్పాళ్లకు చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు. మూడు రోజులుగా పట్టణంలోని పలు దుకాణాల వద్ద రూ.వెయ్యి నుంచి అందినకాడికి దండుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. మాచర్ల, పిడుగురాళ్ల, తదితర మున్సిపాలిటీలలోనూ వెంకయ్య వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. -
రేపు, ఎల్లుండి పల్నాటి వెంకన్న తిరునాళ్ల మహోత్సవం
గురజాల : పల్నాటి వెంకన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన జంగమహేశ్వరపురం శ్రీ అలివేలు మంగా పద్మావతీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరునాళ్లకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం స్వామికి హోమం, బలిహరణం, ఎదురుకోలు ఉత్సవం నిర్వహిస్తామని, అన్నసంతర్పణ కార్యక్రమ జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం కోలాట ప్రదర్శన నిర్వహిస్తారని వెల్లడించారు. రాత్రికి సాసం్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. 3న హోమం, బలిహరణము, గరుడసేవ, పూర్ణాహుతి, నాగవల్లి, ఉద్వాసన, ధ్వజపట ఉద్వాసన, 4న హనుమంత్ వాహనసేవ, రథోత్సవం, వసంతసేవ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. -
మహిళా పోలీసుల కోసం మెడికల్ క్యాంపు
ప్రారంభించిన ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసుల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మ్యాక్సీ విజన్ కంటి వైద్యశాల డాక్టర్ రామలింగారెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్, గాయత్రి స్కిన్ కేర్ వైద్యశాల, లిఖిత ఆర్థో వైద్యశాల, హన్విత జనరల్ వైద్యశాల, వసంత డెంటల్ కేర్ వైద్యశాల, హిమబిందు గైనిక్ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొని 151 మంది మహిళా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదనపు ఎస్పీ (పరిపాలన) జేవీ.సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, వెల్ఫేర్, అడ్మిన్, హోంగార్డు ఆర్ఐలు గోపీనాథ్, రాజా, కృష్ణ పాల్గొన్నారు. -
● దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు ● రశీదు ఇచ్చి మరీ దోపిడీ ● ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులు ● పంచాయతీ ఆదాయానికి గండి ● చర్యలకు వెనకడుగు వేస్తున్న అధికారులు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో టీడీపీ నాయకుల దందా ఆలస్యంగా వెలుగు చూసింది. తిరునాళ్లలో దుకాణాల నుంచి ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరు పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండ జాతర జరిగే ప్రాంతంలో పెద్దఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ప్రధాన రహదారికి ఇరువైపులతో పాటు ప్రభల వద్దకు వెళ్లే ప్రాంతంలో కూడా దుకాణాలు ఏర్పాటవుతాయి. ఈ దుకాణాల నుంచి గ్రామ పంచాయతీ కొంత రుసుము వసూళ్లు చేస్తుంది. ప్రతి ఏడాది సాధారణంగా జరిగే వ్యవహారం ఇది. వందల సంఖ్యలో ఏర్పాటయ్యే దుకాణాలు నుంచి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. ప్రైవేటు స్థలంపై పెత్తనం కొండ దిగువున జెడ్పీ స్థలం పక్కనే మెయిన్రోడ్డు వెంట ప్రైవేటు స్థలం ఉంది. ఈ స్థలంలో జెయింట్వీల్, ఇతర ఆటల పరికరాలు వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏడాది స్థానికంగా ఉన్నవారు స్థలయజమానితో ముందుగా ఒప్పందం చేసుకొని, కొంత లాభం చూసుకొని జెయింట్వీల్ నిర్వాహకులకు స్థలం అద్దెకు ఇస్తారు. టీడీపీ నాయకులు ఈ ఏడాది స్థానికులను బెదిరించి స్ధల యజమానితో ఒప్పందంచేసుకొన్నారు. గత ఏడాది కంటే రెట్టింపు అద్దెను జెయింట్వీల్ నిర్వాహకుల నుంచి వసూళ్లు చేశారు. కిమ్మనని అధికారులు దుకాణాల నుంచి ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లు చేయడంపై పంచాయతీ రాజ్ అధికారులు చర్యలకు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 23 నుంచే ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లను ప్రారంభించారు. జిల్లా పంచాయతీ అధికారి తిరునాళ్ల మూడు రోజులు కోటప్పకొండలోనే ఉండి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సమయంలో ఈ వ్యవహరం జిల్లా అధికారుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. అయినా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పంచాయతీయే వసూళ్లు చేయాలి తిరునాళ్లలో ఏర్పాటైన దుకాణాల నుంచి పంచాయతీ సిబ్బంది వసూళ్లు చేస్తారు. ఈ సారి కూడా అలాగే సిబ్బంది వెళ్తే అప్పటికే ప్రైవేటు వ్యక్తులకు చెల్లించామని దుకాణాదారులు తెలిపారు. దీంతో మా సిబ్బంది వెనక్కి రావాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యక్తుల వసూళ్లతో పంచాయతీ ఆదాయానికి గండిపడిన మాట వాస్తవం. – భాస్కరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
ఉపమాసం ప్రారంభం
● మాసమంతా మహిమాన్వితమే! ● నేటి నుంచి నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు, దానధర్మాలు ● మత సామరస్యానికి ప్రతీక రంజాన్యడ్లపాడు: రంజాన్ మాసం ముస్లింల జీవితాల్లో అత్యంత పవిత్రమైనది. చేతికి దానం..బుద్ధికి భక్తి..దేహానికి క్రమశిక్షణ..మనసుకు ప్రేమ ఒక్క నెలరోజులు అలవాటు చేసే అపురూపు మాసమిది. హీజ్రీ క్యాలెండర్ ప్రకారం రమజాన్ అన్నది సంవత్సరంలోని 12 నెలల్లో 9వ నెల పేరు. షాబాన్ మాసం ముగిసే చంద్ర దర్శనంతో రంజాన్ మాసం ఆరంభమవుతోంది. ముస్లింలందరూ నెలరోజులు రోజాతో ఆధ్మాత్మిక చింతన, భక్తిశ్రద్ధలతో గడిపే మాసం రంజాన్. ఈనెల ఆధ్యాత్మిక ప్రయాణానికి, మనో నిగ్రహానికి, మానవీయతకు ప్రతీక. శనివారం నెలవంక దర్శనం అయింది. దీంతో ఆదివారం నుంచి రోజా (ఉపవాసవ్రతం) ముస్లింలు చేపడతారు. సహరీతో ఆరంభం ఇఫ్తార్తో విరమణ సూర్యోదయానికి ముందే తీసుకునే ఆహారం(సహరీ) అనంతరం భగవంతుని అనుగ్రహాన్ని పొందే ఉద్దేశంతో ఉపవాసాన్ని పాటిస్తారు. దివ్య సూర్యకిరణాలు నడుస్తూ సాగిన అనంతర ఘడియలలో, దాహాన్ని, ఆకలిని అనుభవిస్తూ ఇబాదత్ ద్వారా మనస్సును నిర్మలంగా మార్చుకుంటారు. సూర్యాస్తమయం (ఇఫ్తార్) కాగానే కుటుంబసభ్యులు అంతా కలిసి సామూహికంగా పండ్లు, ఫలహారాలతో దీక్షను విరమిస్తారు. ఇది భౌతిక అవసరాలను మాత్రమే కాదు, మానసిక స్థైర్యాన్ని కూడా పరీక్షించే సమయం. వీరికి మినహాయింపు.. రంజాన్ నెలలో బలమైన కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా ఇక తర్వాత ఏడాదంతా ఉపవాపం పాటించినా సరే..దానితో సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే బాలింతలు, రుతుక్రమంలో ఉన్న సీ్త్రలు, రోగులకు ఇలా కొందరికి మాత్రం మినహాయింపు ఉంది. వీళ్లు ఉపవాసాలు చేయకపోయినా మిగతా రోజుల్లో పాటించి, ఆ సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. నెలవంక దర్శనం.. దీక్షలు ప్రారంభం యడ్లపాడు: అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు (రోజా) ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో శనివారం సాయంత్రం మగ్రిబ్ నమాజు అనంతరం ముస్లింలు నెలవంక దర్శనం చేసుకుని ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మసీదులు, మదరసాలు, ముస్లిం వాడల్లో రంజాన్ ఆధ్యాత్మిక శోభ మొదలైంది. చంద్రదర్శనంతో ప్రత్యేక దువాలు నిర్వహించి, రోజా దీక్షను నిష్టగా కొనసాగించేలా అల్లాహ్ అనుగ్రహించాలని భక్తులు ప్రార్థించారు. దయాగుణం.. రంజాన్ సాధారణ జీవితం నుంచి సమాజానికి ఉపయోగపడే సద్గుణాలను నింపి వారిలో దానగుణాన్ని పెంపొందిస్తుంది. సోదరభావాన్ని కలిగిస్తుంది. ఇదే ఇస్లాం మూలసూత్రాల్లో ప్రధానమైన లక్ష్యం. ఈ మాసంలో చేసే ఒక్కో ఆధ్మాత్మిక, సేవా కార్యానికి అల్లా 70 రెట్లు అధిక పుణ్యఫలం ప్రసాదిస్తారని ప్రవక్త బోధించారు. తమ సంపాదనలో 2.5 శాతం ధనాన్ని పేదలకు పంచాలని అల్లాహ్ ఖురాన్లో శాసనం చేశారు. సదఖా, జకాత్, ఫిత్రా దానాల ద్వారా ఈనెలలో పేదలకు ఆర్థిక సాయం విరివిగా అందుతుంది. దీంతో వారి అవసరాలు తీరి ఆనందోత్సవాలతో పండుగను జరుపుకొంటారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
అమరావతి: మండలంలోని మండెపూడి గ్రామపరిధిలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 75 త్యాళ్లూరు నుంచి గుంటూరు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్ మండెపూడి గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న పల్లెపోగు వెంకటేశ్వరరావును ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఘటనలో పల్లెపోగు వెంకటేశ్వరరావు (70) అక్కడికక్కడే మరణించాడు. అమరావతి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహన్ని పోష్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటి హెల్త్ సెంటర్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన అర్టీసీ బస్ను అమరావతి పోలీస్ష్టేషన్కు తరలించారు. పది విద్యార్థుల సందేహాల నివృత్తి డీఈఓ కార్యాలయంలో ర్యాంక్ సాధన కార్యక్రమం నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ నిపుణులతో ర్యాంక్ సాధన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ వెబ్ బాక్స్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యార్థుల సందేహాలకు సబ్జెక్ట్ నిపుణులు సమాధానాలిచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 500 మార్కులకుపైబడి వచ్చే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించే దిశగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యడ్లపాడు విద్యార్థిని ప్రతిభకు రాష్ట్రస్థాయి గౌరవం చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నోస్కూల్ –2 బ్రాంచ్కు చెందిన 9వ తరగతి విద్యార్థిని రావిపాటి ఉషశ్రీ, ఆమె బృందం రూపొందించిన నాసా ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయిలో ఎంపికై ంది. యడ్లపాడు గ్రామానికి చెందిన ఉషశ్రీ అద్భుతమైన నైపుణ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్కు విశేషమైన గుర్తింపు లభించడంతో, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉషశ్రీతోపాటు బృందసభ్యుల్ని శనివారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ ‘మన ప్రాంతం నుండి ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు వెలుగులోకి రావడం గర్వించదగిన విషయమన్నారు. -
జిల్లా సైన్స్ క్విజ్ పోటీలో ద్వితీయ స్థానం
నరసరావుపేటరూరల్: జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలలో ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్ధులు ద్వితీయ స్ధానం సాధించినట్టు పాఠశాల ప్రధానోపాద్యాయుడు కె.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో జిల్లాలోని 20 పాఠశాలల నుంచి టీమ్లు పాల్గొన్నాయని వివరించారు. పాఠశాల విద్యార్ధులు టీవీ కల్యాణ్, వర్షిత, మహాలక్ష్మీలు పోటీలో పాల్గొని ప్రతిభ కనభర్చి ద్వితీయ స్ధానం పొందారని తెలిపారు. విద్యార్ధులను శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాద్యాయుడు శ్రీనివాసరావు, సైన్స్ ఉపాద్యాయుడు ఏఏ మదుకుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. -
వ్యవసాయ బడ్జెట్పై చిత్తశుద్ధేదీ!
వైఎస్సార్సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ చూస్తే కూటమి సర్కారుకు చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడడం లేదని వైఎస్సార్సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెంపున్నారెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.10,700కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300కోట్లు మాత్రమే కేటాయించారని, అదే గత ప్రభుత్వంలో రూ.3వేల కోట్లు కేటాయించారని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి, రైతు సేవా కేంద్రాల గురించి బడ్జెట్లో ఊసేలేదని విమర్శించారు. భూసార పరీక్షలు చేసే అగ్రి ల్యాబ్ నిర్వహణకూ నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కొన్ని వేల ఎకరాల్లో రెండో పంట సాగు చేశారని, సాగునీరు విషయంలో అవగాహన లేకుండా అధికారులు వారబందిగా సాగునీరు ఇస్తామని ప్రకటన చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం కౌలు రైతులకూ పథకాలు వర్తింపజేసిందని, కూటమి ప్రభుత్వం ఆ విషయం గురించి మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు.. ఇప్పటికై నా రైతులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని మిగతా నియోజకవర్గ ఇన్చార్జీల అందరితో కలిసి రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. -
మోసంలో పీహెచ్డీ చేసిన బాబు
నరసరావుపేట: రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీరు గమనిస్తే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టుకోకుండా మోసం చేశారని, అందులో ఆయన పీహెచ్డీ చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి 80 లక్షల మంది విద్యార్థులకు రూ.13,113 కోట్లు అవసరమైతే కేవలం రూ.9407కోట్లు మాత్రమే కేటాయించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు పంగనామం పెట్టబోతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి 55 లక్షల మంది రైతులకు రూ.10,717 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించారంటే 22 లక్షల మంది అన్నదాతలకు ఎగనామం గ్యారెంటీ అన్నారు. దీపం పథకానికి ఈ ఏడాది రూ.4వేల కోట్లు అవసరమైతే రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. 1.50 లక్షల దీపం కుటుంబాలు ఉంటే 90 లక్షల మందికి నిధులు కేటాయించి 58 లక్షల పైచిలుకు మందికి ఎగ్గొడుతున్నారన్నారు. ఉచిత బస్సుకు రూ.3,600 కోట్లు అవసరమైతే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, అసలు ఈ పథకం అమలు చేస్తారా లేదా అనేది తెలియని సందిగ్ధం నెలకొందని గోపిరెడ్డి పేర్కొన్నారు. గత 20ఏళ్ల నుంచి చంద్రబాబు ఎన్నికల ముందు ఎప్పడూ నిరుద్యోగ భృతి ఇస్తానని చెబుతూనే ఉన్నాడని, ఇంతవరకు ఎక్కడా ఈ పథకాన్ని నెరవేర్చిన పాపాన పోలేదని, ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసేలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలుచేస్తానని వాగ్దానం చేసి బడ్జెట్లో ప్రస్తావించలేదని అన్నారు. నాడు–నేడు పథకానికి రూ.8వేల కోట్లు అవసరమైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.4వేల కోట్లు కేటాయించారని, మరో రూ.4వేల కోట్లు కేటాయిస్తే మిగిలిన పనులు పూర్తయ్యేయని, కానీ బడ్జెట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించారని వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు ద్రోహం ఉద్యోగులకు 29 శాతం ఐఆర్, 23 శాతం పీఆర్సీ గతంలో వైఎస్ జగన్ ప్రకటించారని, 23 శాతం అందించడం జరిగిందనీ, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని స్థితిలో ఉందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఉద్యోగస్తుల్లో ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నా ప్రస్తుతం ఎవరూ బయటపడటంలేదనీ అన్నారు. వరికెపుడిశెల ప్రాజెక్టుకు తీరని అన్యాయం ఉద్యోగులు, నిరుద్యోగులకూ మోసం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం సూపర్ 6ను మడతేసిన కూటమి సర్కారు డీఎస్సీ ఊసేదీ? ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా మెగా డీఎస్సీ ఊసే లేదనీ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.5వేల కోట్లు తగ్గించారని, రానున్న రోజుల్లో సుమారు 10 లక్షల పింఛన్ల ఎత్తివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని గోపిరెడ్డి విమర్శించారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అన్నిటికీ పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. వరికెపుడిశెల ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. పల్నాడు ప్రాంతానికి ఈ బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఖరీఫ్ ప్రణాళికకు సిద్ధంగా ఉండాలి
నరసరావుపేట రూరల్: 2025–26 ఖరీఫ్ ప్రణాళిక రూపొందించేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ఖరీఫ్ ప్రణాళికపై జిల్లా కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క రైతు తమ పంట సాగు చేసే విధానం, కుటుంబ వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు (ఆర్ వై ఎస్ ఎస్) రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామనితెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీపీఎం ప్రేమ్ రాజు, జిల్లా సిబ్బంది ఎన్ఎఫ్ఏలు, నందకుమార్, సైదయ్య,సౌజన్య, మేరీ పాల్గొన్నారు. -
సబ్జైలు సందర్శన
గురజాల రూరల్ : సబ్ జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జియావుద్దీన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు భోజనం, వైద్య సేవలు, సకాలంలో అందుతున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ సలహాలకు ఎవరైనా న్యాయవాది లేకుంటే ఉచితంగా సలహాలు ఇచ్చేందుకు న్యాయ సేవా కేంద్రంకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించారు. తనిఖీల్లో ఆయన వెంట పీడీఎం కోర్టు న్యాయమూర్తి కె. సత్యనారాయణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. అలేఖ్య, న్యాయవాది కలివెల ప్రభుదాసు, జైలు సూపరింటెండెంట్ సీహెచ్.అచ్చినాయుడు, అదాలత్ సిబ్బంది ఉన్నారు. ఆర్థిక స్థోమత లేకుంటే ఉచిత న్యాయం సాయం సత్తెనపల్లి: ఆర్థిక స్థోమత లేని రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయం అందించే సదుపాయం చట్టం కల్పిస్తుందని సత్తెనపల్లి మండల న్యాయ సేవ అధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) పి.విజయ్కుమార్రెడ్డి అన్నారు. సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ జైలును శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. సబ్జైలులోని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నవా లేవా అనేది క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు. అక్కడ ఉన్న ఆహార పదార్థాలను, సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వసతులు గురించి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ప్యానల్ న్యాయవాది బీఎల్ కోటేశ్వరరావు, సబ్జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం ఉన్నారు. నేటి నుంచి గాలికుంటు వ్యాధి టీకాలు నరసరావుపేట రూరల్: పశువులకు ఉచితంగా గాలికుంటు, బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాల కార్య క్రమం శనివారం నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధి కారి డాక్టర్ కె.కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పశువులకు వేసేందుకు 4,59,600 డోసులు గాలికుంటు వ్యాధి టీకాలు, నాలుగు నుంచి ఆరు నెలల వయస్సు గల పెయ్యి దూడలకు వేసేందుకు 14,600 బ్రూసెల్లోసిస్ టీకాలు సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. మూడు నెలలు నిండిన ప్రతి పశువుకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, నాలుగు నుంచి ఎనిమిది నెలల వయస్సు గల పెయ్య దూడలకు బ్రూసెల్లోసిస్ టీకాలు వేయించాలని సూచించారు. ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సస్పెన్షన్ నరసరావుపేట: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లింగంగుంట్ల ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓ అండ్ ఎం) సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.వెంకటరమణారెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరైన పద్ధతిలో సెలవు తీసుకోకుండానే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలు, సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లకు అందుబాటులో లేకపోవటంపై వారు చేసిన ఫిర్యాదుల మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెండ్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్ వదిలి వెళ్లరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్లకు పటిష్ట భద్రత నరసరావుపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లకు పటిష్ట భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను అధికారులతో కలసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ కేంద్రంలోని సిబ్బంది బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ సమయంలో బాక్స్లకు ఉన్న సీళ్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. బాక్సుల స్వీకరణ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆహారం, అల్పాహారాలను ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
టీడీపీ అరాచకాలపై విచారణ చేపట్టాలి
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ వారిపై తెలుగుదేశం పార్టీ దమనకాండపై విచారణ చేసి, నిందితులను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అరాచక సంప్రదాయాలకు టీడీపీ తెరతీసిందని చెప్పారు. తిరునాళ్లలో ఎన్నో ఏళ్లుగా ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభలు కట్టుకోవచ్చునని, ఎవరికి ఇష్టమైన పాటలు వాళ్లు వేసుకోవచ్చునని గుర్తు చేశారు. ఈ తిరునాళ్లలో గోనెపూడి గ్రామానికి వైఎస్సార్ సీపీ ప్రభ వద్దకు ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు, అభిమానులు వచ్చి డీజేలో పాటలకు నృత్యాలు చేశారని చెప్పారు. టీడీపీ వర్గీయులు ప్రభ వద్దకు వచ్చి డీజేను, లారీను ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన పులుసు కోటేశ్వరరావు, రాంబాబులపై జనసేన, టీడీపీలకు చెందిన వారు దాడులు చేయడం అమానుషమని అన్నారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు డీజే తీసుకొని పై వారి ఇళ్ల మీదుగా వెళుతూ వారి ఇళ్ల వద్ద గంటల తరబడి రచ్చ రచ్చ చేస్తుంటే, ఆడవాళ్లు వచ్చి ముందుకు వెళ్లండయ్యా అని కోరిన రాంబాబు భార్య, ఆమె కూతుర్ని ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డొచ్చిన రాంబాబును దారుణంగా కొట్టారని చెప్పారు. రాష్ట్ర మంత్రికి తప్పని ట్రాఫిక్ కష్టాలు తిరునాళ్లలో మొదటి నుంచి కూడా భక్తులు అనేక కష్టాలు పడ్డారని, పట్టపగలే మధ్యాహ్నం ఒంటిగంట దగ్గర నుంచే పెట్లూరివారిపాలెం వద్ద ట్రాఫిక్ జామ్ అయిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు త్రికోటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా చిక్కుకున్నారని చెప్పారు. అన్నదానంపైనా ప్రతాపం.. కొండపైన భక్తులకు చిలకలూరిపేటకు చెందిన తేళ్ల సుధీర్, శ్రీధర్ అనే వ్యక్తులు మూడేళ్ల నుంచి 20వేలమంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారని, అటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారని, ఇది దారుణమైన విషయమని అన్నారు. సమావేశంలో గోనేపూడి, అరవపల్లి గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులే లేవు.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోటప్పకొండలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని టీడీపీ వారు స్టేట్మెంట్లు ఇవ్వటం సిగ్గుచేటని, గడిచిన తొమ్మిది నెలల్లో కొండపై ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయటం చేతకాని ఈ ప్రభుత్వం మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. తమ ప్రభు త్వ హయాంలో సుమారు రూ.17 కోట్లతో యలమందరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని, మూ డు ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటుచేశామని, కాల్వకట్ట దగ్గర రూ.90లక్షలు ఖర్చుపెట్టి తారురోడ్డు వేశామని చెప్పారు. రూ.4.5కోట్లతో జేఎన్టీయూ రోడ్డు వేయడం జరిగిందని, ఈ రోడ్డు భక్తులు తిరుగు ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉందని, ఈటీ రోడ్డు–యక్కలవారిపాలెం–యాదవ సత్రం రోడ్డును రూ.కోటితో నిర్మించడం జరిగిందని వివరించారు.శివ కుటుంబం విగ్రహాలు కట్టామని, సెంట్రల్ డివైడర్ ఏర్పాటుచేసి లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని, నందీశ్వరుడు, దక్షిణామూర్తి విగ్రహాలు తమ హయాంలోనే ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. -
పల్నాడుకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని విధాలా వెనుబడిన పల్నాడుకు తీవ్ర అన్యా యం జరిగింది. ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకోలేదు. పల్నాడు ప్రజలను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వరికపూడిశెల విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు గుర్తు రాలేదు. కొత్త జిల్లా అవసరాలు, మౌలిక సదుపాయాల కల్ప న, మూలనపడిన లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మ తుల నిధులు, ఉపాధి హామీ పథకం, రైతులకు, కౌలు రైతులకు బడ్జెట్లో ఉపయోగపడే ఊసేలేదు. పరిశ్రమల స్థాపనకు భూము లు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నా డు వెనుకబడింది. రాజధాని నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో రాజధాని అభివృద్ధి చేయాలి. సూపర్ సిక్స్తో ప్రజలను నమ్మించి మోసం చేశారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు పెట్టుబడి సాయానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. – గుంటూరు విజయ్ కుమార్, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి -
ముగిసిన విశిష్ట గుర్తింపు నమోదు గడువు
అచ్చంపేట: సొంత భూములు కలిగిన రైతులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే రాయితీలను పొందాలన్నా, పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా తప్పనిసరిగా 14 అంకెలుగల విశిష్ట గుర్తింపు సంఖ్యను (యునిక్ఐడి నెంబరును) కలిగి ఉండాలి. గుర్తింపు సంఖ్య నమోదుకు తుది గడువు శుక్రవారంతో ముగిసింది. మండలంలోని చామర్రు రెవెన్యూ కింద 1200 మంది, కోగంటివారిపాలెం గ్రామానికి చెందిన మరో 500 మందికి రైతులు ఒక్కరూ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోలేకపోయారు. గడువు ముగియడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఓ కారణం. మొరాయిస్తున్న ఆన్లైన్ సేవలు రైతు సేవా కేంద్రాలలో ఆన్లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 7697 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు సగం మంది రైతుల పేర్లు కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. వారికి 14 అంకెల యూనిక్ ఐడీ నెంబరు కేటాయించలేదు. ముఖ్యంగా మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉండగా చామర్రు రెవెన్యూ కింద 1200, కోగంటివారిపాలెం కింద 500మంది రైతులు ఉన్నారు. ఒక్కరి భూమి కూడా ఆన్లైన్ కాలేదు. వ్యవసాయశాఖ సూచించిన విధంగా రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు లింకై న ఫోన్ నెంబరుతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లినా ఆన్లైన్ సేవలు మొరాయిస్తున్నాయే తప్ప నమోదు కావడంలేదు. చివరకు గడువు ముగియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో చామర్రు రైతులు మరికొంత సమయం ఇస్తారంటున్న వ్యవసాయాధికారులు -
డ్రగ్స్ రహిత జిల్లాగా పల్నాడు
నరసరావుపేట: పల్నాడును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అన్నీ ప్రభుత్వ శాఖలు సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో జిల్లాలో డ్రగ్స్ జాడ్యంపై పోరాటం చేయాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇరువురూ కలిసి బాలలు–మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు నియంత్రణ చర్యలపై పోలీసు, విద్య, ఎకై ్సజ్, సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్, సమాచార–పౌర సంబంధాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలు, రైల్వే విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివిధ శాఖల అధికారులకు వివరించారు. కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ మెడికల్ షాపులు, మద్యం దుకాణాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. లిక్కర్ షాపులు, బార్లు పాఠశాలలకు దూరంగా తరలించాలన్నారు. విద్యాలయాల్లో క్యాంపస్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి కమిటీలు, మీటింగ్లు నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు శాఖ వైపు నుంచి మత్తు పదార్థాల నివారణపై మెరుగైన ప్రచార వీడియోలు రూపొందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నరసరావుపేటఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు పరీక్ష జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఇంట ర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కా నున్నాయి. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 30,560 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,874 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులలో బాలికలు 9,219, బాలురు 8,686 మంది, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 7,608, బాలురు 6,921 మంది ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఒక్కొక్క పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 500మంది విద్యార్థులు దాటిన కేంద్రాలలో అదన పు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ.. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాలలోని పరీక్ష జరిగే గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సేపు సీసీ కెమెరా లైవ్ స్ట్రీమింగ్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలను ఇంటర్మీడియెట్ బోర్డుతోపాటు బోర్డు జిల్లా కార్యాలయానికి అనుసంధానం చేశారు. పరీక్ష నిర్వహణ తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. నో ఫోన్ జోన్.. పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఆయా కేంద్రాల సీఎస్, డీఓలతో సహా సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించేందుకు వీలులేదు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయటంతోపాటు చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08647–223355 నంబర్కు ఫోన్చేసి సమస్యకు పరిష్కారం పొందవచ్చు. కంట్రోల్ రూమ్లో ముగ్గురు పరీక్షల నిర్వహణ అధికారులు(డీఈసీఓ) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు హాజరు కానున్న 32,434 మంది విద్యార్థులు జనరల్ 30,560 మంది, ఒకేషనల్ 1,874 మంది విద్యార్థులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ జిల్లాలో పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తాం. విద్యార్థులకు హాల్ టికెట్లు వాట్సాప్ గ్రూప్ల ద్వారా పంపించాం. ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్షకు అనుమతించాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలిచ్చాం. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాం. విద్యార్థులు సకాలంలో హాజరై ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. – ఎం.నీలావతిదేవి, డిఐఈఓ, పల్నాడుజిల్లా -
ఏమాత్రం చిత్తశుద్ధి లేదు
బడ్జెట్పై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నామ్కే వాస్తేగా కేటాయింపులు చేశారు. సూపర్ సిక్స్ ఊసే లేదు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చట్లు ఆడుతున్నారు. కొంతమంది నిద్రపోవటం కన్పించింది. పూర్తిస్థాయి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రవేశపెట్టినా అందులో పేదల వాటా ఎంత? మైనార్టీలకు ఏం కేటాయించారు? వంటివి స్పష్టంగా చెప్పలేకపోయారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవలకు కొన్ని నిధులే కేటాయించారు. అవి ఎవరికి ఇస్తారు? ఎంతమందికి సరిపోతాయి? బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించి ప్రజలకు మంచి చేద్దామనే చిత్తశుద్ధి కనిపించలేదు. అంకెలు చూస్తుంటే రాష్ట్రం దివాళా తీసేలా ఉంది. –షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు -
ఎన్నికల హామీలకు పాతర
సాక్షి,నరసరావుపేట: ఎన్నికల్లో గెలవడానికి సూపర్–6తోపాటు అలవిగాని హామీలను ఎన్నింటినో ఇచ్చిన కూటమి ప్రభుత్వం తీరా వాటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపింది. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం కోసం ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తారని ఆశించిన పేదోడికి చేదువార్తను వినిపించారు. ముఖ్యంగా సూపర్–6 పథకాలను ఈ ఆర్థిక సంవత్సరమైనా అమలు చేస్తారనుకుంటే వాటి ప్రస్తావనే చేయలేదు. నెలనెలా రూ.1,500 కోసం జిల్లాలో 7,80,538 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కోసం జిల్లాలో 10,92,752 మంది మహిళలు అర్హులున్నారు. ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీ అమలు కోసం జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాటి ఊసేలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తల్లికి వందన, సుఖీభవ వంటి పథకాల ప్రస్తావన ఉన్నా వాటికి ఇచ్చిన అరకొర నిధులతో లబ్ధిదారుల వడపోతతో ఎంతమందికి మోసం చేస్తారో అనే భయం ప్రజల్లో మొదలైంది. రాష్ట్ర బడ్జెట్లో టీడీపీ హామీలకుకేటాయింపులేవి మహిళకు ఆర్థిక సాయం, ఉచిత బస్సు పథకాల ఊసేది నిరుద్యోగులకు మరోసారి మొండిచేయి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర కేటాయింపులు లబ్ధిదారుల జాబితాలో కోతలు ఉంటాయని భయపడుతున్న మహిళలు, రైతులు వరికపూడిశెల ప్రాజెక్ట్ పనులకు నిధులు కేటాయించని కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవకు సరిపడా కేటాయింపులు లేవు... వ్యవసాయ బడ్జెట్లో నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉంది. ఇది రైతులకు భరోసా ఇచ్చేదిగా లేదు. రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకి రూ.20,000 సహాయం అందిస్తామని ఊదరగొట్టారు. 2024 సంవత్సరంలో అమలు చేయలేదు. 2025 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పఽథకంతో కలిపి రూ.9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే కొంత మంది రైతులకు ఎగనామం పెట్టడమే. ముఖ్యంగా కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో చెప్పలేదు. – వై రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. వరికపూడిశెలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పల్నాడు ప్రాంతానికి ఎంతో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒక్క నయా పైసా కూడా కేటాయించకపోవడం దారుణం. వరికిపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు శాఖల నుంచి అనుమతులు తీసుకుని వచ్చారు. వాటిని కొనసాగించి ఉంటే బాగుండేది. –ఎంఎన్ ప్రసాద్, సీనియర్ అడ్వకేట్, వినుకొండ. సంక్షేమ పథకాలకు నిధులేవి..? సుమారు రూ.3 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికీ పేదలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలకు కేటాయింపుల్లో రిక్తహస్తం చూపారు. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే. ఎన్నికల హామీలైన సూపర్–6 పథకాలకు నిధులు కేటాయింపులు లేవు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలకు తక్కువ నిధులు కేటాయింపులు చేశారు. మరి వీటిని ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి. –కాసా రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నరసరావుపేట. వరికపూడిశెలకు కేటాయింపులేవి? పల్నాడు ప్రజలకు ఎంతో కీలకమైన వరికపూడిశెలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయింపులేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రాజెక్టు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరికపూడిశెలకు అడ్డుగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చేలా చూశారు. అంతేకాకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. దాన్ని కొనసాగించాల్సిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టును అటకెక్కిస్తున్నారని జిల్లా వాసులు వాపోతున్నారు. సాగర్ కాలువల ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు అవసరమైన నిధులు కేటాయింపులలో సైతం బడ్జెట్లో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాకు ఏం చేస్తున్నారో పేర్కొనలేదు. దివాళా కోరు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరును గమనిస్తే దివాళాకోరుతనం స్పష్టంగా కన్పిస్తుంది. అన్నింటిలోనూ కోత పెట్టారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే సూపర్ సిక్స్ అమలుచేయాలనే దృక్పథం కన్పించటంలేదు. –ఈదర గోపీచంద్, గ్రామ, వార్డు వలంటీర్ల సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారు -
బయటకు నెట్టి.. రిగ్గింగ్ చేసుకున్నారు
ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తిరుగుతూ పీడీఎఫ్ ఏజెంట్లు, ఓటర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. రిగ్గింగ్ చేస్తాం సహకరించమని మమ్మల్ని టీడీపీ నేతలు ఉదయం అడిగారు. ఒప్పుకోకపోవడంతో మధ్యాహ్నం నుంచి నన్ను బయటకు నెట్టేశారు. న్యాయం చేయమని చిలకలూరిపేట టౌన్ సీఐను అడగ్గా టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి నా హక్కులు కాలరాశారు. ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా రిగ్గింగ్ చేసుకున్నారు. మా పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. – పేరుబోయిన వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట 384 పోలింగ్ స్టేషన్ పీడీఎఫ్ ఏజెంట్ -
పల్నాడు
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 530.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,364 క్యూసెక్కులు విడుదలవుతోంది. స్వామివారికి విశేష అలంకరణ పిడుగురాళ్ల: పట్టణంలోని నాగులగుడిలోని గంగా పార్వతి సమేత భవానీ శంకరస్వామికి గురువారం విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్ట్రాంగ్ రూంల పరిశీలన లక్ష్మీపురం: ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో పోలింగ్ బాక్సులను భద్రపరిచే ప్రక్రియను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి,జేసీ ఏ భార్గవ్ తేజ పరిశీలించారు. I -
‘పెద్దల’ ఎన్నికపై
● బెదిరింపులు.. ప్రలోభాలు ● ప్రజాస్వామ్యానికి కూటమి తూట్లు ● పీడీఎఫ్ సానుభూతిపరులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా బెదిరింపులు ● బెల్లంకొండ, వెల్దుర్తి, మాచర్లలో పీడీఎఫ్ ఏజెంట్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు ● విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేసిన కూటమి కార్యకర్తలు ● దొంగ ఓట్లు అడ్డుకున్నందుకు పిడుగురాళ్ల పీడీఎఫ్ ఏజెంట్ పై దాడికి యత్నం ● కూటమి నేతలు రిగ్గింగ్ చేస్తూ ఎన్నికలను అపవిత్రం చేశారన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ● ఎన్నికల్లో గెలవడానికి ప్రభుత్వం బరితెగించిందన్న వామపక్షాలు సాక్షి, నరసరావుపేట: పట్టభద్రుల కోటాలో పెద్దల సభకు జరిగిన ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగ్గా, పల్నాడు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు బరితెగించారు. పోటీలో 25 మంది ఉన్నప్పట్టికీ ప్రధానంగా పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాల మధ్య జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా గ్రూప్–2, డీఎస్సీ లాంటి ఉద్యోగ నియామకాల వ్యవహారం, నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం లాంటి ఎన్నికల హామీలను ఏవీ అమలు చేయకపోవడంతో పట్టభద్రులు కూటమి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆ ప్రభావంతో కూటమి అభ్యర్థి ఓడిపోతున్నాడని గ్రహించిన ఆపార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. గతంలో ఎన్నడూ రాజకీయాలకు అతీతంగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఈదఫా కూటమి నేతలు బరితెగించారు. కూటమి అక్రమాలు కొన్ని... ● బెల్లంకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కూటమి నేతల అక్రమాలను ప్రశ్నించిన సీపీఎం మండల కార్యదర్శి చిన్నం పుల్లారావుపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ● వెల్దుర్తి మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన 331 పోలింగ్ కేంద్రంలో పీడీఎఫ్ ఏజెంట్లను కూటమి నేతలు బయటకు నెట్టేశారు. దీంతో ఓటింగ్ రాని ఓట్లను సైతం టీడీపీ నేతలే రిగ్గింగ్ చేశారు. ఇదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో సైతం ఏజెంట్లను ఉండనివ్వలేదు. ఒకవేళ ఉండనిచ్చినా నోరు మెదపనివ్వకపోవడంతో మిన్నుకుండిపోయారు. ● చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుల్లారావు పోలింగ్ కేంద్రాలలో హల్చల్ చేశారు. అన్ని కేంద్రాలను పదే పదే తిరుగుతూ ఏజెంట్లను భయాందోళనకు గురిచేసి తన అనుచరుల చేత రిగ్గింగ్ చేయించారు. రిగ్గింగ్ ఆపండి అన్నందుకు పీడీఎఫ్ ఏజెంట్ పేరుబోయిన వెంకటేశ్వర్లను బలవంతంగా బయటకు నెట్టి దాడిచేశారు. ● అమరావతి మండలంలోని పోలింగ్ బూత్ నెంబర్ 339లో కూటమి నాయకులు దొంగ ఓట్లు పాల్పడుతున్నాన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుతో కూటమి నేతలు వాగ్వివాదానికి దిగారు. దీంతో తాను ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని లక్ష్మణరావు తెలిపారు. ● రొంపిచర్లలో టీడీపీ నాయకులు వందకు పైగా దొంగ ఓట్లు వేశారని పీడీఎఫ్ ఏజెంట్లు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ● పిడుగురాళ్లలో మధ్యాహ్నం తరువాత కూటమి నేతలు దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారు. దీన్ని పీడీఎఫ్ ఏజెంట్లు అడ్డుకోవడంతో కూటమి నేతలు పెద్దసంఖ్యలో వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులతో గొడవకు దిగారు. జిల్లాలో పోలింగ్ శాతం 77.33 నరసరావుపేట: కృష్ణా– గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 77.33శాతం పోలింగ్ జరిగినట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు గురువారం సాయంత్రం వెల్లడించారు. మొత్తం ఓటర్లు 56,964మందికాగా, వారిలో పురుషులు 30,643, మహిళలు 13,640మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ‘పట్టభద్రుల’ పోలింగ్లో బరితెగించిన టీడీపీ నేతలు -
తిరుగు ప్రభల సందడి
నరసరావుపేట ఈస్ట్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ శ్రీత్రికూటేశ్వరస్వామి సన్నిధిలో జాగరణ చేసి మొక్కులు తీర్చుకున్న ప్రభలు గురువారం పట్టణానికి చేరుకున్నాయి. పట్టణం నుంచి బుధవారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన ప్రభలు రాత్రి స్వామివారి సన్నిధిలో ఉండి గురువారం ఉదయం బయలుదేరి వచ్చాయి. ప్రభల నిర్వాహకులకు మార్గమధ్యంలో పలువురు ఉచిత అల్పాహారం అందచేశారు. అలాగే పట్టణంలో శివునిబొమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్ ప్రాంతాల్లో సైతం అల్పాహారాలు అందించారు. మరోవైపు దూరప్రాంతాలకు వెళ్లే యాత్రికులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. గత మూడురోజుల నుంచి కోటప్పకొండ వద్ద వ్యాపారాలు సాగించిన బొమ్మల దుకాణదారులు పట్టణంలోని ప్రధాన రోడ్లపై అమ్మకాలు జరిపారు. దీంతో పల్నాడు బస్టాండ్ ప్రాంతం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్ను మళ్లించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...
విద్యావంతులు, ఉన్నత ఆలోచనలు కలిగిన వారిని చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నికలను టీడీపీ అపహాస్యం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను ఏజెంట్లగా కూర్చొబెట్టి దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఓటమి భయంతోనే కూటమి నేతలు ఈ కుట్రలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా అధికారులు తయారు చేశారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ ఓట్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఎన్నికల సంఘం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే -
చూసిన కనులదే భాగ్యము
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాలలో అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమరావతి, ధరణికోట గ్రామాలకు చెందిన చింకా, ఆలపాటి, కోనూరు వారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ పర్యవేక్షణలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, వాస్తు మండపారాధన, రథాంగ హోమం, రథ సంప్రోక్షణ, రథబలి కార్యక్రమాలను నిర్వహించి అష్టదిక్పాలకులు శాంతి కోసం కుంభంపోసి దీపారాధన చేయటంతో రథోత్సవం ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. సర్వాంగ సుందరం.. వివిధ రకాల, రంగురంగుల పూలతో సర్వాంగసుందరంగా అందంగా అలంకరించిన దివ్యరథంపై ఉభయదేవేరులతో కూడి న అమరేశ్వరుని కొలువుదీర్చారు. స్వామి వారి రథోత్సవాన్ని సుమారు నాలుగున్నర గంటలకు ప్రారంభించారు. ఆలయ గాలిగోపురం వద్ద నుంచి ప్రారంభమైన రథోత్సవం వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని గాంధీబొమ్మ సెంటర్ వరకు అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథశాలలోకి చేర్చారు. మండల పరిధి గ్రామాల నుంచే కాక ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అమరావతి భక్తజన సంద్రమైంది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ఈ కల్యాణోత్సవానికి ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాసరచయిత పీసపాటి నాగేశ్వరశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, పాలక మండలి చైర్మన్ రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. కీలు గుర్రంపై.. బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి గురువారం రాత్రి కీలుగుర్రంపై గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత అమరేశ్వరాలయం నుంచి గాంధీబొమ్మ సెంటరు వరకు ఈఉత్సవాన్ని నిర్వహించారు. బాలచాముండేశ్వరిదేవితో అమరేశ్వరుడు కీలుగుర్రంపై ఎక్కి నాలుగుదిక్కులు తిరుగుతూ ఉంటే భక్తజనం ఆసక్తితో తిలకించారు. ఘనంగా కల్యాణోత్సవంవైభవంగా గ్రామోత్సవం కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం ఉదయం నంది, చిలుక, చిన్నరథంపై స్వామివారిని వైభవోపేతంగా ఊరేగింపు నిర్వహించారు. తొలుత కల్యాణ వేదికపై నుంచి అమ్మవార్లను, స్వామివారిని వాహనాలపై అలంకరించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. వైభవంగా అమరేశ్వరుని దివ్య రథోత్సవం ఉభయ దేవేరులతో ఊరేగిన అమరేశ్వరుడు శివపంచాక్షరి నామంతో మార్మోగిన అమరారామం భక్తజన సంద్రంగా అమరావతి అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరారామ క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘశుద్ధ చతుర్ధశి నాడు ప్రధానమైన కల్యాణోత్సవం నిర్వహించారు. తొలుత బుధవారం రాత్రి స్వామివారికి లింగోద్భవకాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం, రాత్రి రెండుగంటలకు స్వామివారికి, అమ్మవారికి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో విఘ్నేశ్వర పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు. -
త్రికోటేశ్వరుని తిరునాళ్ల ఆదాయం రూ. 1.77 కోట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి రూ.1,77,68,172 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. ఆలయ హుండీ కానుకల లెక్కింపు గురువారం నిర్వహించారు. కానుకల ద్వారా రూ.73,47,918, పూజా టికెట్లు విక్రయం ద్వారా రూ.65,01,070, ప్రసాదాల ద్వారా రూ.38,17,395, అన్నదానం, ఇతర సేవలు, స్కీములకు రూ.1,01,789 లభించినట్టు వివరించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది రూ.14.19లక్షల అదనంగా వచ్చినట్టు పేర్కొన్నారు. దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీధర్రెడ్డి, సుధాకర్లు పర్యవేక్షించారు. యల్లమంద చైతన్య గోదావరి బ్యాంక్, దేవదాయ, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. వైభవంగా లింగోద్భవ పూజలు నరసరావుపేట రూరల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి లింగోద్భవ పూజలు వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభమైన పూజలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పంచామృత ఫలరసాలు, సుగంధద్రవ్యాలతో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాన్ని కనుల పండుగ్గా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రకుమార్లు అభిషేకాల్లో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో లింగోద్భవ పూజలను తిలకించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ‘క్వారీ’ తిరునాళ్ల ఆదాయం రూ.16.37 లక్షలు చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం తిరునాళ్ల ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు దేవదాయశాఖాధికారులు తెలిపారు. దేవస్థానం వద్ద గురువారం దేవదాయశాఖాధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమంను నిర్వహించారు. హుండీ కానుకల ద్వారా రూ.6,72,636, అభిషేకం, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.6,76,195, వివిధ రకాల వేలం ద్వారా 2,88,800 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవస్థానానికి మొత్తంగా రూ.16,37,631లు ఆదాయం సమకూరిందని దేవదాయశాఖాధికారి పోతుల రామకోటేశ్వరరావు తెలిపారు. గత ఏడాది రూ.14,00,692 ఆదాయం రాగా గత ఏడాది కన్నా ఈ దఫా రూ.2,36,939 అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నందివాహనంపై మల్లేశ్వరుడు మంగళగిరి టౌన్: మంగళగిరిలోని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం ఉదయం స్వామివారు నందివాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ఈఓ జేవీ నారాయణ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. గ్రామోత్సంలో గంగా భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో విహరించారు. యార్డులో 1,03,526 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 99,747 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,03,526 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. -
వైద్యం నిరాకరించిన ప్రభుత్వ డాక్టర్
చీరాల: తాను చెప్పిన చోట మందులు కొనలేదని ఓ ప్రభుత్వ డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు చీరాల ఆర్డీఓకు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుమార్తె టి.మల్లేశ్వరి తెలిపిన వివరాల మేరకు.. మరియమ్మపేటకు చెందిన గుంజి వెంకాయమ్మ అనే వృద్ధురాలు ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 19వ తేదీ రాత్రి చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న ఓ డాక్టర్.. చీరాల మసీదు సెంటర్లోని ప్రాణహిత మల్టీస్పెషాలిటి, క్యాన్సర్ హాస్పిటల్లో మందులు తెచ్చుకోవాలని రిఫర్ ( ఈ ఆస్పత్రులు సదరు డాక్టర్వి అని ఆరోపణలు ఉన్నాయి.) చేశారన్నారు. అయితే ఆ ఆస్పత్రుల్లో మందులకు బిల్లులు ఇవ్వాలని కోరగా దానికి వారు నిరాకరించడంతో తాము బయట మెడికల్ షాపులో తెచ్చి ఇచ్చామన్నారు. అందుకు డాక్టర్ కోపగించుకున్నారని ఆరోపించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా రిపోర్టు ఫైల్ విసిరేశారన్నారు. తన కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పిటల్ నుంచి బయటకు పంపించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఆస్పత్రుల్లోనే చేసిన పరీక్షల రిపోర్టులు ఇవ్వాలని కోరగా అడ్రస్ లేని ఆస్పత్రుల రిపోర్టులు ఇస్తున్నారన్నారు. మళ్లీ గట్టిగా ప్రశ్నిస్తే మిత్ర డయాగ్నోస్టిక్, డిజిటల్ ఎక్స్రేకి చెందిన రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. సదరు డాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన బాధితులు -
భవనంపై నుంచి జారి పడిన కూలీలు
సత్తెనపల్లి: బిల్డింగ్ పై నుంచి జారిపడి ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని నాగన్న కుంటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని నాగన్న కుంటలో మున్సిపల్ ఉద్యోగి మొహిద్దిన్ ఇంటిపై వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసేందుకు పట్టణంలోని బాణావత్ రాంబాబు నాయక్, ఖాజావలి అనే ఇద్దరు కూలీలను పని నిమిత్తం మాట్లాడుకున్నారు. వారు వాటర్ ట్యాంకు లాగేందుకు తాళ్లు కట్టగా, తాడు సరిపోకపోవడంతో అదనపు తాడు కట్టి పైకి లాగే క్రమంలో తాడు తెగిపోయింది. కార్మికులు ఒక్కసారిగా మూడు అంతస్థుల భవనం పై నుంచి జారిపడ్డారు. ఈ ఘటనలో బాణావత్ రాంబాబు నాయక్ నడుముకు తీవ్ర గాయాలు కాగా, ఖాజావలికి తలకు, తదితర చోట్ల గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అవ్వారు ప్రసాదరావు ఇలాంటి కూలీలకు అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
శాసనమండలి వ్యవస్థను కలుషితం చేసిన టీడీపీ
నరసరావుపేట: విద్యావంతులు, పట్టభద్రులను శాసనమండలికి పంపించాల్సిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా రాజకీయ నాయకులను పోటీకి నిలబెట్టి వ్యవస్థను కలుషితం చేసిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్థానిక మున్సిపల్ హైస్కూలులోని బూత్ వద్దకు వచ్చిన ఆయన సాధారణ ఓటర్లతో కలిసి అరగంటసేపు క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం బూత్ బయట విలేకరులతో మాట్లాడారు. విద్యావంతులు, పట్టభద్రులను చట్టసభలకు పంపించి ప్రజలకు ఉపయోగపడే మంచి చట్టాలను అందించేందుకు రాజ్యాంగం శాసనమండలి అనే వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. వారిని ఎన్నికల ద్వారా మండలికి పంపే వీలును ప్రజలకు కల్పించిందన్నారు. అయితే టీడీపీ ఈ ఎన్నికల్లో కూడా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులను పోటీలో నిలిపి వ్యవస్థను కలుషితం చేసిందన్నారు. బూత్లలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఏజెంట్లుగా కూర్చోబెట్టి దొంగ ఓట్లు పోల్ చేయించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఓటర్ జాబితా కూడా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, తక్షణమే పోలింగ్ అధికారులు, కలెక్టర్ స్పందించి అక్రమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను నిజాయతీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు హాలీవుడ్ రఘు, అచ్చి శివకోటి ఉన్నారు. ఆ పార్టీ అక్రమాలు అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగం -
దొంగ ఓట్లు వేయించిన అధికారపక్షం
కొల్లూరు: అధికార పక్షం తప్పొప్పులు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతిపక్షానికి స్వేచ్ఛ అవసరం అని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి అన్నారు. గురువారం కొల్లూరులో పీడీఎప్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తరఫున ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ఆమె వచ్చారు. టీడీపీ నాయకులు పోలింగ్ బూత్ల వద్ద వ్యవహరిస్తున్న తీరు చూసి మండిపడ్డారు. టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఏజెంట్లను బెదిరించి కూర్చోకుండా చేయడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరులో ఓ యువకుడు పీడీఎఫ్ అభ్యర్థికి ఏజెంట్గా ఉంటున్న విషయాన్ని తెలుసుకొని ఇసుక క్వారీలో పనిలేకుండా చేస్తామని బెదిరించారు. చుండూరు మండలంలో సైతం ఏజెంట్లుగా ఉన్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పలు మండలాలతోపాటు, కొల్లూరులో సైతం టీడీపీ నాయకులు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని దొంగ ఓట్లు వేయించారన్నారు. పట్టభద్రులు, ఉద్యోగులపై సైతం టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే కాదు, అధికార పక్షానికే నష్టమన్నారు. బెదిరింపులకు పాల్పడటంపై ఆమె ధ్వజమెత్తారు. పట్టభద్రులకు సరైన స్వేచ్ఛ ఇవ్వకుండా టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం మంచి చర్యకాదన్నారు. ఆమె వెంట ప్రజాసంఘాల నాయకులు బి. సుబ్బారావు, బీఎల్కే ప్రసాద్ ఉన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి -
ఓటమి భయంతోనే కూటమి దాడులు
నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు బరితెగించారని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన ఏజంట్లపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పల్నాడురోడ్డులో పోలింగ్ బూత్ సమీపంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికలలో టీడీపీ రాజకీయ నిరుద్యోగిని అభ్యర్థిగా నిలబెట్టి దౌర్జన్యానికి పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. టీడీపీ ఓటమి భయంతో రిగ్గింగ్ పాల్పడడం సిగ్గుచేటని చెప్పారు. నరసరావుపేట పట్టణం బరంపేట పోలింగ్ కేంద్రంలో స్వయంగా ఎమ్మెల్యే దగ్గర ఉండి కూలీలతో ఓట్లు వేయించడం దారుణమన్నారు. దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దురదృష్టకరమని, అయినప్పటికీ కేఎస్ గెలుపు ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. సీఐటీ యూ నాయకుడు కొమ్ముల నాగేశ్వరరావుపై దాడి జరిగిందన్నారు. న్యాయవాదుల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, న్యాయవాది బి.సలీమ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఎన్నికల అ క్రమాలపై పోలింగ్ కేంద్రంలో ఉన్న వెబ్ కెమెరాల ఆధారంగా విచారణ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. కూటమి నాయకులు మధ్యాహ్నం నుంచి దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఎమ్మెల్యే దగ్గర ఉండి ఓట్లు వేయించటం సిగ్గుచేటు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 శాతం దొంగ ఓట్లు వేయించారన్నారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రెడ్బాషా మాట్లాడుతూ కూటమి నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. లక్ష్మణరావు గెలుపు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందన్నారు. దొంగ ఓట్ల కోసం రంగంలోకి ఎమ్మెల్యే దిగటం సిగ్గుచేటు ప్రజాసంఘాల నాయకుల ఆరోపణ -
ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జన్యం దారుణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పీడీఎఫ్ ఏజెంట్లపై కూటమి నాయకుల దాడులు ఖండనీయం అని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఈ దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంభాక భవన్ నుంచి తాలూకా సెంటర్ వరకు గురువారం జరిగిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా ఒకవిధంగా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. పలువురు పచ్చ నేతలు పీడీఎఫ్ ఏజెంట్లుపై దాడులు, దౌర్జన్యాలు చేసి రిగ్గింగు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కి మద్దతుగా నిలిచే ఓటర్లు అధికంగా బెంగళూరు, హైదరాబాద్, విదేశాలలో ఉన్నారని గుర్తుచేశారు. వారు రాకపోయినప్పటికీ వారి బదులు దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్కు పాల్పడడంతో ఒక్కో పోలింగ్ బూత్ లో 80 నుండి 91 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి సాధారణ ఎన్నికలలో కూడా 80 శాతం నుంచి పోల్ కాని పరిస్థితులు ఉంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో 80 నుండి 90 శాతం వరకు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 80 శాతం మించి పోలైన బూత్లలో రీపోలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకుడు గద్దె చలమయ్య, కౌలు రైతు సంఘం నాయకుడు పెండ్యాల మహేష్, చేనేత కార్మిక సంఘం నాయకుడు కె. శివదుర్గారావులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డి విమల, జి ఉమాశ్రీ, మునగాజ్యోతి, ఎ వీరబ్రహ్మం, డి పుల్లారావు, పి ప్రభాకర్, పి.సూర్యప్రకాశరావు, రాజ్కుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్ సత్తెనపల్లిలో ప్రజాసంఘాల నాయకుల నిరసన ప్రదర్శన -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో సాయంత్రం 4.15 గంటల సమయంలో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత గొలపల శ్రీనుతోపాటు మరికొందరు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. నిబంధనలకు విరుద్దంగా వారిని ఎలా లోపలికి అనుమతిస్తారని ఎస్ఐను ప్రశ్నించానని తెలిపారు. ఇంతలో ‘నువ్వు ఎవడవిరా ఇక్కడ మాట్లాడటానికి‘ అంటూ తనపై ఒక్కసారిగా దాడికి దిగారన్నారు. గొలపల శ్రీనుతోపాటు మరికొంతమంది దాడి చేశారని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. -
గుండెపోటుతో పీఏసీఎస్ మాజీ చైర్మన్ మృతి
అచ్చంపేట: వైఎస్సార్ సీపీ నాయకులు, అచ్చంపేట పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ తుమ్మా చిన్నపరెడ్డి (67) గురువారం తెల్లవారుజామును 4 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత నెలరోజులుగా గుంటూరులో చికిత్స పొందుతూ, నాలుగు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం వారి కుమారులు హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 4 గంటల సమయంలో మృతి చెందారు. మండలంలో వైఎస్సార్ సీపీకి పెద్దదిక్కుగా, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఆత్మీయునిగా పేరుంది. 2019లో వైఎస్సార్ సీపీకి మెజార్టీ రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. చిన్నపరెడ్డి కన్నుమూసిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వారి సతీమణి వసంతకుమారి, వారి తనయుడు కళ్యాణ్బాబులు చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. పార్టీకి పెద్దదిక్కును కోల్పోవడం చాలాబాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ, నాయకులు, అభిమానులు అచ్చంపేట నుంచి స్వగ్రామమైన తాళ్లచెరువు వరకు భారీ ఉరేగింపు, బైక్ర్యాలీతో అంత్యక్రియల్లో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు తుమ్మా విజయప్రతాప్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిల్కా చంద్రయ్య, ఎంపీపీ గంగసానిబాబు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ మజీ డైరెక్టర్ నెల్లూరి చంద్రబాబు, అచ్చంపేట సర్పంచ్ షేక్ జాని, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు తదితరులు మృతదేహాన్ని సందర్శించి తమ గ్రాఢ సంతాపాన్ని తెలిపారు. -
పాత జాతీయ రహదారిపై బైకు ప్రమాదం
తాడేపల్లి రూరల్: మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్కు వెళ్లే పాత జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంక్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విజయవాడకు చెందిన విద్యార్థి స్నేహితుడితో కలసి బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పాత జాతీయ రహదారిపై పోలకంపాడు లారీ స్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న అగ్నిమాపక వాహనాన్ని రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు టైర్ ఊడిపోయి నుజ్జునుజ్జయింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన విద్యార్థిని ప్రైవేటు వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నుజ్జు నుజ్జయిన ద్విచక్ర వాహనం స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థి -
రైతులకు సమస్యలు లేకుండా చూడండి
రీసర్వేలో జాయింట్ కలెక్టర్ బొల్లాపల్లి : జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు వివరాలను తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రీసర్వే పనుల గురించి ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే పనుల్లో రెవెన్యూ శాఖ తరఫున ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. తహసీల్దార్ ఏవీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కాకాని ప్రభకు ప్రమాదం నరసరావుపేట రూరల్: కాకాని విద్యుత్ ప్రభ ప్రమాదానికి గురైంది. కోటప్పకొండ తిరునాళ్ల నుంచి తిరుగు ప్రయాణంలో గురవాయపా లెం సమీపంలోని 10ఆర్ మేజర్ కాలువపై అ దుపుతప్పి నేలకొరిగింది. హైటెన్షన్ వైర్లను దా టించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంట ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. మరో క్రేన్ సా యంతో ప్రభను కాలువనుంచి బైటికి తీసి సి ద్ధం చేశారు. తర్వాత గ్రామానికి తరలించారు. ఘనంగా తెప్పోత్సవం నకరికల్లు: మండలంలోని నర్సింగపాడు గ్రామంలో గల గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవం వేడుకలు గురువారం కనులపండువగా నిర్వహించారు. మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. చల్లగుండ్ల గ్రామానికి చెందిన మడకా వెంకటేశ్వర్లు, రామతులసి, పొట్లవీడు గ్రామానికి చెందిన చుండూరు శివశంకర శ్రీనివాసరావు, వెంకట్రావమ్మల ఆధ్వర్యంలో తెప్పోత్సవం జరిపించారు. ఆలయంలోని కోనేటిని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులు కొలువుదీరాయి. భక్తుల శివనామస్మరణ నడుమ తెప్పోత్సవం సాగింది. -
గుర్తుతెలియని యువకుడు మృతి
చీరాల: మున్సిపల్ కార్యాలయం ఎదుట గల కాలువ వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గురువారం రాత్రి గుర్తించారు. ప్రమాద వశాత్తు మరణించాడా.. లేక ఇతర కారణాలా అని తెలియాల్సి ఉంది. అయితే మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. అడ్డంగా బుక్కయ్యాడు మార్టూరు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ ఇంటి యజమానులకు అడ్డంగా దొరికిపోయిన దొంగ ఉదంతం గురువారం సాయంత్రం మార్టూరులో జరిగింది. బాధిత కుటుంబం వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక మద్ది సీతాదేవి కాలనీకి చెందిన దంపతులు పచ్చవ శరణ్య, వెంకటేశ్వర్లు గురువారం మధ్యాహ్నం పనిపై బయటకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతాల్లో ఇంటికి వచ్చిన శరణ్య తమ ఇంట్లో ఎవరో ఉన్నట్లు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా 50 సంవత్సరాల వయసు గల అపరిచిత వ్యక్తి ఇంటి లోపల కనిపించాడు. బీరువా లోపల ఉండాల్సిన సుమారు రూ.5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు అతని చేతిలో ఉండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని స్టేషన్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరవ పటాలంలో శివరాత్రి వేడుకలు మంగళగిరి: నగర పరిధిలోని 6వ బెటాలియన్లో గురువారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. నగేష్బాబు దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం భక్తులకు కమాండెంట్ అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ డి. ఆశ్వీర్వాదం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చోరీకి పాల్పడుతూ దొరికిన దొంగ రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
ప్రకృతి సాగుతో రైతులకు లాభం
పెదకూరపాడు: ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంట సాగు చేస్తూ అంతర పంటలు వేయటం వల్ల లబ్ధి కలుగుతుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే అమలకుమారి రైతులకు సూచించారు. గురువారం పెదకూరపాడు మండలం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర పరిశోధన బృందం మిరప పంట పొలాలను పరిశీలించింది. ప్రకృతి సాగు, ఆదాయం, ఖర్చుల వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.అమలకుమారి మాట్లాడారు. మిరప వేసే ముందు 31 రకాల విత్తనాలను బీజామృతం విత్తన శుద్ధి చేసి పొలంలో చల్లి 45 రోజుల అనంతరం కలయ దున్నటం వలన ప్రయోజనం కలుగుతుందని రైతులు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న మిరప మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి 20 నుంచి 23కు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పరిశోధన బృందం సభ్యులు హిమ బిందు, లీలావాణి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మధుబాబు, అమూల్య, ఉదయలక్ష్మి, జోత్స్న, రైతులు పాల్గొన్నారు. -
ముళ్ల పొదల్లో నవజాత శిశువు
● ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత ● వినుకొండ రూరల్ మండలం నడిగడ్డలో ఘటనవినుకొండ: వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో నవజాత శిశువును ముళ్లకంపలో పడేసిన దారుణ సంఘటన గురువారం ఉదయం జరిగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే శిశువు ప్రాణాలు కోల్పోయింది. సేకరించిన వివరాల ప్రకారం... గ్రామంలోని రోడ్డు పక్కన ముళ్ల కంపలో శిశువు ఏడుపు వినిపిస్తుండటంతో స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి మగ శిశువుగా గుర్తించారు. శిశువును బతికుండగానే ముళ్ల పొదల్లో వదిలిపెట్టడం చూపరులను సైతం కలచివేసింది. కదలలేని స్థితిలో ఉన్న శిశువును ఓ వైపు చీమలు కుడుతుండగా.. ముళ్లు గుచ్చుకుంటూ రక్తం కారింది. తొలుత ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత స్పందించారు. ప్రథమ చికిత్స అనంతరం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా పేరేచర్ల వద్దకు వెళ్లగానే శిశువు మృతి చెందింది. తిరునాళ్లలో దొంగల చేతివాటం పెద్ద ఎత్తున సెల్ఫోన్లు, బైకులు చోరీ నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. తిరునాళ్లకు వచ్చిన యాత్రికుల పర్సులు, సెల్ఫోన్లు అపహరించారు. ఈ మేరకు బాధితులు పలువురు రూరల్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. నరసరావుపేటకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు టిక్కెట్టు తీసుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే జేబులోని డబ్బును దొంగలు కాజేశారు. గత్యంతరం లేక బస్సులో నుంచి దిగిపోయాడు. తిరునాళ్లలో ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శన చూసే సమయంలో, ప్రధాన రహదారుల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలు చేతికి పనిచెప్పారు. అలాగే ద్విచక్రవాహనాలు కూడా చోరీకి గురయ్యాయి. ఖాళీ ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపి తిరునాళ్లకు వెళ్లిన వారి వాహనాలను చోరీ చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చిలకలూరిపేట టౌన్: మహా శివరాత్రి పర్వదినం జాగారం చేసి తిరిగి ఇంటి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చిలకలూరిపేట మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన కొందరు పర్చూరు మండలంలోని అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి ఇటీవల పొగాకు కోతలకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం మహా శివరాత్రి నేపథ్యంలో కోటప్పకొండకు కొమరగిరి శ్రీకాంత్, చౌటురి సురేంద్రబాబులు బైక్పై బుధవారం రాత్రి వెళ్లారు. రాత్రంతా జాగారం చేసి తిరిగి వచ్చే క్రమంలో గురువారం తెల్లవారుజాము 4.30 సమయంలో పోతవరం బటర్ఫ్లై వెంచర్ సమీపంలో వీరు నడుపుతున్న బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైక్పై వెనుక కూర్చున్న సురేంద్రబాబు(21)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న శ్రీకాంత్కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి సోదరుడు శివకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్వారీ కిటకిట
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాలకోటేశ్వరస్వామిని దర్శించుకుని తరించారు. ఆలయ ఆవరణకు సుమారు 15 భారీ విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి. వందల సంఖ్యలో చిన్న, బాల ప్రభలు తరలివచ్చాయి. స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష ఆధ్వర్యంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు పర్యవేక్షణలో 12 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 300 మందికిపైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఆలయ సమీపంలో అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద పులిహోర, పొంగలి, లడ్డూ, మజ్జిగ పంపిణీ చేశారు. -
ఏలేశ్వరం.. సుమనోహరం
విజయపురిసౌత్: శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా మహోన్నత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరం స్వామి జాతరకు బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏలేశ్వరం గట్టు హర నామస్మరణతో మారుమోగింది. అర్చకుడు శ్రీ పాద సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఏలేశ్వరస్వామి ఆలయం, అనుపులోని రంగనాథస్వామి ఆలయాల వద్ద మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఏలేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 12 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనుపు నుంచి ప్రత్యేక లాంచీ సర్వీసులను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుపు వద్ద విజయపురిసౌత్ ఎస్ఐ షేక్ మహహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పర్యాటక శాఖకు లాంచీల ద్వారా రూ.3.60 లక్షలు ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ అడపా శివారెడ్డి తెలిపారు. ఏలేశ్వరస్వామి ఆలయ చైర్మన్ చిన్నరామ స్వామి, లాంచీ యూనిట్ సిబ్బంది వినయతుల్లా, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయపురి సౌత్లోని లాంచీస్టేషన్ వద్ద శివాలయం, శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామివారి ఆలయం, భైరవుని పాడులోని కాలభైరవేశ్వర ఆలయం, శివ నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ●ఏలేశ్వరం స్వామి గట్టుకు పోటెత్తిన భక్తులు ●ఏపీ టూరిజంకు రూ.3.60 లక్షల ఆదాయం -
పట్టభద్రుల పిడికిలి
నరసరావుపేట: కృష్ణా–గుంటూరు పట్టభ ద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లాలోని 56,964 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 90 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పురుషులు 37,831 మంది, మహిళలు 19,129 మంది, ఇతరులు నలుగురు ఓటర్లుగా ఉన్నారు. 38 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిపి పీవో, ఏపీవోలు, ఓపీవోలు 270 మంది ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళ, బుధవారాల్లో పరిశీలించారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి పోలింగ్ సామగ్రిని పీవోలు, ఏపీవోలు, పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది పోటీలో ఉండగా వారిలో టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను చేయటంలో తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే ఓటరు స్లిప్లు ఇంటింటికి తిరిగి అందజేయాల్సిన సచివాలయ కార్యదర్శులు చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఫోన్ చేసి కార్యాలయానికి రప్పించుకొని అందజేయడం గమనార్హం. పోలింగ్కు సర్వంసిద్ధం నేడు 90 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పల్నాడు జిల్లాలోని ఓటర్లు 56,964 మంది ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు -
ప్రభంజనం
ప్రమదగణాలు ప్రణవనాదంతో పరవశించాయా.. జంగమదేవర శంఖారావంతో దిక్కులు పిక్కటిల్లాయా.. అభిషేక ప్రియుని సిగన కృష్ణాజలాలు ఆనంద తాండవమాడాయా.. వేదమంత్రోచ్చరణలకు లయబద్ధంగా గుడిగంటలు మార్మోగాయా.. అన్నట్టు మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ఆధ్యాత్మికోత్సాహంతో ఉప్పొంగాయి. జనహృదయాలు మనోహరుడి ముందు ప్రణమిల్లాయి. పాహిమాం.. అహరహం రక్షమాం అంటూ శరణువేడాయి. సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు బుధవారం పోటెత్తారు. స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు బిందెతీర్థంతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామి దర్శనభాగ్యం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోపాన మార్గం నుంచి భక్తులు మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట, నంది విగ్రహం వద్ద భక్తులు పూజలు చేశారు. త్రిముఖ శివలింగం వద్ద యాత్రికులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పలువు రు భక్తులు కాలినడకన పాత కోటయ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. కొండ కింద నుంచి 65 సప్తగిరి బస్సుల్లో ఆర్టీసీ యాత్రికులను చేరవేసింది. ప్రభల వద్ద కోలాహలం.. కోటప్పకొండకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీ విద్యుత్ ప్రభల వద్ద కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రభల నిధి వద్దకు 20 భారీ విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి. వీటి ముందు నిర్వహకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. వీఐపీ క్యూలైన్లో భక్తుల తోపులాట గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వీఐపీ దర్శన పాసులను అధికారులు భారీస్థాయిలో జారీ చేశారు. ఓపక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సుమారు 30 వేల వీఐపీ పాసులు జారీ చేశారని సమాచారం. ఫలితంగా పలుమార్లు ఈ క్యూలైన్లో తోపులాట జరిగింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీఐపీ క్యూలైన్లో వారిని వీవీఐపీ క్యూలైన్ లోకి అనుమతించారు. ఫలితంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వీవీఐపీలకు రూ.200 టికెట్ కొన్న భక్తుల క్యూలైన్ ఆపి దర్శనం కల్పించాల్సి రావడంతో ఆ క్యూలైన్లోని భక్తులు మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. పెట్లూరువారిపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్ నరసరావుపేట మండలం పెట్లూరువారిపాలెం వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి పెట్లూరివారిపాలెం నుంచి కొండకు వెళ్లే దారులన్నీ స్తంభించాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు విమర్శించారు. పోలీసు డ్రోన్కు ప్రమాదం కోటప్పకొండ వద్ద శాంతి భధ్రతల పర్యవేక్షణకు పోలీసులు వినియోగించిన డ్రోన్కు ప్రమాదం జరిగింది. పైకి లేచిన డ్రోన్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. విద్యుత్ తీగలపై పడటంతో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు విద్యుత్ నిలిపివేయించి తీగలపై పడిన డ్రోన్కు కిందకు దించారు. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రి టీజీ భరత్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్బాబు, యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, కొలికిలపూడి శ్రీనివాసరావు, మాజీమంత్రి మేరుగ నాగార్జున, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్, పల్నాడు కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు తదితరులు స్వామిని దర్శించుకుని తరించారు. కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా హాజరైన భక్తులు అధిక సంఖ్యలో వీఐపీ పాసుల జారీతో క్యూలైన్లలో రద్దీ కోటయ్యను దర్శనం చేసుకున్న రాజకీయ ప్రముఖులు భారీ విద్యుత్ ప్రభల వద్ద భక్తుల కోలాహలం పెట్లూరివారిపాలెం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ -
అమరారామం.. ఆనంద పరవశం
అమరావతి: బాల చాముండికా సమేత అమరేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున మూడుగంటలకే స్వామికి అభిషేకాలు ప్రాంభమయ్యాయి. అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ప్రథమ దర్శనం కల్పించారు. అమరేశ్వర స్నానఘట్టంలో భక్తులు పితృదేవతలకు కార్యాలు జరిపించుకున్నారు. జంగమదేవర ఆశీర్వచనాలు పొందారు. రాత్రి లింగోద్భవ కాలంలో అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈవో సునీల్కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాన్ని, తాగునీటిని అందించారు. బుధవారం 20 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు అంచనా. దర్శించుకున్న వీఐపీలు అమరేశ్వరుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తులు జ్యోతిర్మయి, సుమతి, రవినాథ్ తివారి, రిటైర్డ్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఆర్పీ ఠాకూర్, డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మె ల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, జగన్మోహనరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితరులు దర్శించుకున్నారు. -
నేడు పాఠశాలలకు సెలవు
నరసరావుపేట ఈస్ట్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 27న గురువారం పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ బుధవారం తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. కాకతీయ కమ్మ సత్రానికి రూ.1.85 లక్షలు విరాళంశావల్యాపురం: మండలంలోని పోట్లూరు గ్రామంలో కాకతీయ కమ్మ సేవా సమితి సారథ్యంలో కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా కాకతీయ కమ్మ సత్రానికి రూ. లక్షా 85 వేల 66 విరాళంగా అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఏటా గ్రామస్తుల సహకారంతో విరాళాల రూపంలో నగదు అందజేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. వైభవంగా ఆది దంపతుల కల్యాణోత్సవంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పర్యవేక్షణలో ఈ వేడుక వైభవంగా జరిగింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. మరో వైపు అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గాన్ని సైతం పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని మామిడి తోరణాలు, అరటి చెట్లతో పచ్చటి పందిరిని తలపించేలా తీర్చిదిద్దారు. మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని స్వామిని దర్శించుకుని అభిషేకాలు జరిపించారు. రాజధానిలో దొంగల కలకలంతాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం నెక్కల్లులోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం నెక్కల్లు గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గేట్లు పగులగొట్టి ప్రవేశించి అమ్మవారి వెండి వడ్డాణం, కిరీటం, హుండిలో నగదు, కానుకలు, అపహరించారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సమాచారం తెలియకుండా ఉండేందుకు బాక్సులు సైతం తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూజారి గుమ్మా గంగయ్య రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పూజా కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం దేవస్థానానికి రాగా ఆలయం గేటు, తాళం, హుండీ తాళం పగులగొట్టి ఉండటం, పోలేరమ్మ విగ్రహంపై ఉన్న నగలు కనిపించకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి పట్నంబజారు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకాని రోడ్డులోని వేదాంత ఆసుపత్రి సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై నలుగురు వ్యక్తులు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనం ఢీకొందనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎన్టీఆర్ నగర్కు చెందిన చల్లా వెంకటేష్ (15), లాలాపేటకు చెందిన షేక్ అబ్దుల్ అలీ (28) మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
భక్తజన సంద్రం.. కాకాని శివాలయం
పెదకాకాని: పెదకాకాని శైవక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా బుధవారం భక్తజనం పరవశంతో పులకించింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారు స్వర్ణకవచాలంకృత భ్రమరాంబదేవిగా భక్తులను అనుగ్రహించారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున స్వామి దివ్యకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం ఒక్కరోజులో స్వామికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా 6,50,000 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పులిహోర, పొంగలి, దద్దోజనం పంపినీ ఉదయం నుంచి రాత్రివరకూ సాగుతూనే ఉంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న చిన్న పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు గుణరంజన్, హరిహరనాథ్శర్మ, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. నేడు రథోత్సవం పెదకాకానిలో గురువారం స్వామి దివ్య రథోత్సవం జరుగుతుందని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఆలయంలో భ్రమరాంబ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులను కటాక్షిస్తారని వివరించారు.పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి మూలవిరాట్