Palnadu District Latest News
-
అధిక రక్తపోటుతో అనేక అనర్థాలు
గుంటూరు మెడికల్: అధిక రక్తపోటు వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తున్న అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి, అదుపులో పెట్టుకోవడం ద్వారా, ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు భారతీయ విద్యా భవన్లో అధిక రక్తపోటుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది బీపీ, 25 లక్షల మంది షుగర్, బీపీ, షుగర్తో 22 లక్షల మంది బాధపడుతున్నట్లు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడేళ్లుగా రాష్ట్రంలో ఎన్సీడీ సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్, జ్వరాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. స్టెమీ కార్యక్రమం ద్వారా ఎనిమిది నెలల్లో 2,300 మందికి రూ. 40వేలు ఖరీదు చేసే ఇంజక్షన్ చేసి ప్రాణాలు కాపాడామని తెలిపారు. హార్ట్ ఎటాక్ మాదిరిగానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ప్రాణాలు తీస్తుందని, అధిక రక్తపోటును కంట్రోల్లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. బస్సు ద్వారా ఉచిత పరీక్షలు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ చెక్ బీపీ – స్టాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ – 2025లో భాగంగా తాము ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి, అన్ని గ్రామాల్లో ఉచితంగా అధిక రక్తపోటు పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. బీపీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును, బీపీ అవగాహన పోస్టర్లను కృష్ణబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, రెడ్క్రాస్ ట్రెజరర్ పి.రామచంద్రరాజు, రోటరీ ఇంటర్నేషనల్ రవి వడ్లమాని, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, ఐఎంఏ నేతలు, న్యూరాలజిస్టులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు బీపీ చెకప్ చేసేందుకు ప్రత్యేక వాహనం ప్రారంభం -
విద్యార్థినులకు కలెక్టర్ భరోసా
కారెంపూడి: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన కారెంపూడికి చెందిన కోనేటి కావ్యశ్రీ ఇంటిని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు శుక్రవారం సందర్శించారు. కారెంపూడి జెడ్పీ హై స్కూల్లో చదివిన కావ్యశ్రీ ఇటీవల ఫలితాల్లో 590 మార్కులు సాధించడంతో ఫలితాలు వెలువడిన రోజే బాలిక చదువుకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించి, దత్తత తీసుకున్నారు. కావ్యశ్రీ మున్ముందు ఏ కోర్సు చేయాలని భావిస్తున్నదో తెలుసుకునేందుకు కలెక్టర్ స్వయంగా శుక్రవారం విద్యార్థిని ఇంటికొచ్చారు. కావ్యశ్రీ తండ్రి రామయ్య గతంలోనే మృతి చెందగా, తల్లి కోటేశ్వరమ్మ ఉన్నారు. ఆమే ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. కావ్యశ్రీ తమ్ముడిని కూడా కలెక్టర్ దగ్గరకు తీసుకుని బాగా చదువుకోవాలని సూచించారు. సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యేలా సహకారం అనంతరం ఒప్పిచర్ల గ్రామానికి కలెక్టర్ చేరుకున్నారు. పదో తరగతిలో 598 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి టాపర్గా నిలిచిన అంగడి పావని చంద్రిక ఇంటికి వెళ్లారు. పావనికి అభినందనలు తెలిపారు. ఆమె ఉన్నత చదువుల కోసం ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజా నాయక్ దత్తత తీసుకున్న నేపథ్యంలో కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పావని తల్లిదండ్రుల కోరిక మేరకు సివిల్ సర్వీసెస్కు సన్నద్ధం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం దహనం
నరసరావుపేట టౌన్: ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు దహనం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరులో నివాసం ఉండే గోగుల శ్రీనివాస్ రోజు మాదిరిగానే తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి బయట నిలిపారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ద్విచక్ర వాహనం పక్కనే ఉన్న మరో టీవీఎస్ వాహనానికి కూడా మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతింది. -
జమ్మూకశ్మీర్లో మానవత్వంపై దాడి
చిలకలూరిపేట: జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగినట్టేనని, ఇలాంటి వాటిని సభ్య సమాజం హర్షించదని ముస్లిం జేఏసీ నాయకులు చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ, మృతుల ఆత్మ శాంతించాలని కోరుతూ పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న మర్కస్ మసీదు వద్ద శుక్రవారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముష్కరుల చేతిలో అమాయక ప్రజలు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ముఫ్తీ అనస్ఖాన్, మౌలానా అబ్బాస్ఖాన్, షేక్ జాన్సైదా, షేక్ అబ్దుల్ జబ్బార్, మొహమ్మద్ యూసుఫ్ అలీ, సీపీఐ సుభాని, షేక్ బాజి, అంజుమన్ అహమ్మద్, సయ్యద్ బడే తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన -
నేడు ఎస్సీ, ఎస్టీల పీజీఆర్ఎస్
నరసరావుపేట: ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ ఎస్)ను యథావిధిగా శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీర్ల అంకమ్మ కొలుపుల తిరునాళ్ల ప్రారంభం దాచేపల్లి: వీర్ల అంకమ్మ కొలుపుల తిరునాళ్ల శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. బొడ్రాయికి జలాభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. 28న మాచర్ల వైస్ చైర్మన్ ఎన్నిక మాచర్ల: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 28న కౌన్సిల్ హాలులో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు దీనిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండి, తాత్కాలిక చైర్మన్గా పనిచేసిన మాచర్ల ఏసోబు తన పదవికి మూడు నెలల క్రితం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కూటమికి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు 16 మంది టీడీపీలో చేరారు. మైనార్టీ నాయకుడు షేక్ మదార్ సాహెబ్కు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చేందుకు కూటమి రంగం సిద్ధం చేసింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. వాగులో పడి బాలిక మృతి నూజెండ్ల: ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో జారి పడి బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చీకటి విజయరాజు, కృపావరం దంపతుల కుమార్తె కీర్తి (10)నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావటంతో సమీపంలోని గుండ్లకమ్మ వాగు వద్దకు ఆడుకుంటూ వెళ్లింది. వాగులో జారిపడి మృతి చెందింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన స్థానికులు చూసి కన్నవారికి సమాచారం అందించారు. కాళ్లు పూడికలో కూరుకుపోవడంతో చనిపోయి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పారు. ఏఎన్ఎస్కు సామగ్రి అందజేత నరసరావుపేట: యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏ ఎన్ఎస్)లో పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బ్యాగులు, వాటర్ బాటిల్స్, టోపీలు అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, వీఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, నరసరావుపేట, సత్తెనపల్లి డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్లో విద్యార్థికి స్థానం సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం) పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రత్తిపాటి అంకిత్ పాల్ గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్లో సంగీతం నేర్చుకొని గతేడాది డిసెంబర్ ఒకటిన 18 దేశాల్లోని 1,046 మందితో కలిసి స్వరాలు ఆలపించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. శుక్రవారం గిన్నిస్ బుక్ రికార్డ్ ధ్రువీకరణ పత్రం, పతకాలను విజయవాడలో అందుకున్నాడు. బాలుడి తండ్రి ప్రత్తిపాటి బాబు జె.జె. ట్యూషన్ నిర్వాహకుడు (ఆంగ్ల అధ్యాపకుడు) కాగా, తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. ఈ సందర్భంగా పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
బాలికల వాలీబాల్ పోటీల విజేత వాల్తేరు
సత్తెనపల్లి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ 54వ రీజియన్ స్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ పోటీల్లో వాల్తేరు జట్టు విజేతగా నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని (రామకృష్ణాపురం) పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 8 జట్లు పాల్గొన్నాయి. వాల్తేరు, సత్తెనపల్లి, ఖమ్మం జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అపూర్వ వైద్యశాల అధినేత డాక్టర్ పాలేటి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఓటమితో కుంగిపోకుండా సాధన చేసి మరింతగా రాణించాలన్నారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. రిటైర్డ్ పీడీ ఐఎస్ నాగిరెడ్డి, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్ రెడ్డి, రిఫరీలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి 17 బాలుర జట్లు రెండు రోజులపాటు తలపడనున్నాయి. రెండో స్థానంలో నిలిచిన సత్తెనపల్లి జట్టు -
చంద్రబాబు పాపం – విద్యార్థుల పాలిట శాపం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలు దిగజారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవార ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి హయాంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిందని ఆరోపించారు. నాడు విద్యా సంస్కరణలతో పాటు అమ్మఒడి వంటి అనేక పథకాలతో జగనన్న అత్యుత్తమ ఫలితాలు రాబట్టారని తెలిపారు. నేడు ఆయా పథకాలన్నీ అటకెక్కించి పేద విద్యార్థులను చదువుకు దూరం చేశారని ఆరోపించారు. 2024లో మొత్తం 2,800 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. 2025లో అది 1,680 పాఠశాలలకు పడిపోయిందని తెలిపారు. గతంతో పోలిస్తే 5.5 శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంపై కక్ష, యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల తొలగింపు వంటి అస్తవ్యస్తమైన నిర్ణయాల వలనే ఫలితాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మరోవైపు గతేడాది సెప్టెంబర్ వరకు టీచర్ల సర్దుబాటు చర్యలతోనే విద్యా సంవత్సరంలో విలువైన సమయమంతా వృథా అయిపోయి ఫలితాలు అడుగంటాయని పేర్కొన్నారు. -
న్యాయమూర్తి ప్రవళికకు సన్మానం
నరసరావుపేట టౌన్: నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రవళికను న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. మూడేళ్లుగా సివిల్ జడ్జిగా సేవలందించి ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా పిడుగురాళ్ళకు వెళ్తున్న సందర్భంగా ఈ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 13 అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్.సత్య శ్రీ మాట్లాడుతూ.. న్యాయశాస్త్ర విద్యాభ్యాసంలో అత్యున్నత ప్రతిభ చాటి బంగారు పతకం సాధించిన ప్రవళిక వ్యక్తిగత జీవితంలో కూడా న్యాయవాదుల ఆదరాభిమానాలను చూరగొన్నారన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సీనియర్ సివిల్ న్యాయాధికారి కె. మధు స్వామి మాట్లాడుతూ న్యాయాధికారిగా అన్ని అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. న్యాయవాద సంఘ అధ్యక్షుడు మేదరమెట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యంత పిన్న వయసులో న్యాయాధికారిగా నరసరావుపేటకు వచ్చి పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించిన ఘనత సాధించారన్నారు. కాగా ఇటీవల నరసరావుపేటలో రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గాయత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో న్యాయవాద సంఘ ఉపాధ్యక్షురాలు అమూల్య, కార్యదర్శి అబ్బూరు ఏడుకొండలు, న్యాయవాదులు కె. విజయకుమార్, బి.సలీం, ఎస్.అయ్యప్ప రాజు, సీహెచ్ ఆంజనేయులు, ఎం.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు తగ్గించండి
నరసరావుపేట: జిల్లాలో పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల విషయంలో ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. యడ్లపాడు, చిలుకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో కోర్టు ఈ నెలలో నిందితులకు శిక్షలు విధించినందున సంబంధిత పోలీసు అధికారులను అభినందించారు. అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సూచన -
కవి కత్తి పద్మారావుకు ఘన సన్మానం
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్లో దళిత మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ నేతల రమేష్ ఆధ్వర్యంలో కవి డాక్టర్ కత్తి పద్మారావు, మాతా రమాబాయి అవార్డు గ్రహీత కత్తి స్వర్ణ కుమారిలను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కత్తి పద్మారావు, స్వర్ణ కుమారి అనేక ఉద్యమాలను నీతి, నిజాయతీగా చేసిన త్యాగమూర్తులని కొనియాడారు. కారంచేడు, చుండూరు, పిప్పర, కొత్తకోట, దంతారి, లక్ష్మీపేట వరకు ఎన్నో ఉద్యమాలు చేసిన పోరాట యోధులని పేర్కొన్నారు. దళిత మహాసభ ఆధ్వర్యంలో వారిని సన్మానించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తెచ్చిన ఘనత పద్మారావుకే దక్కుతుందన్నారు. దాని వల్ల దళిత బహుజనులకు రక్షణ, సంక్షేమం అందిందని, ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయని అభినందించారు. కార్యక్రమంలో దళిత మహాసభ ప్రతినిధులు చిగురుపాటి రత్నాకర్రావు, నేతలు భలేస్వామి, మాకారపు రాజు, గద్దె అచ్యుతరావు, పీఆర్వోలు గేరా ప్రసన్న కుమారి, శ్యామల, జొన్నలగడ్డ రాణిి పాల్గొన్నారు. -
గ్రామాల్లో అరాచక పాలన
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధికి బదులు అరాచక పాలన సాగుతోందని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలపై, పేదలపై, వైఎస్సార్ సీపీ అభినుమాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో ఎస్టీ వర్గానికి చెందిన వారిని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా గుర్తించిన టీడీపీ నాయకులు వేల్పూరు, గంటవారిపాలెంలోని వారి దుకాణాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఆమె వస్త్రాలలో దాచిన సెల్ఫోన్ను సైతం దుర్మార్గంగా లాక్కున్నారని ఆరోపించారు. అలాగే ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో కొండవర్జు నాగేశ్వరరావుపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు ఇబ్బందులకు గురిచేశారన్నారు. బొల్లాపల్లి మండలం పలుకూరు తండాలో 65 ఏళ్ల వృద్ధుడిపై, కొచ్చర్ల గ్రామంలో బాలుడిపై దాడి చేశారని చెప్పారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు కేబినెట్ హోదాలో చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు వినుకొండ అభివృద్ధి చెందుతుందని అందరూ ఊహించారన్నారు. దానికి భిన్నంగా గ్రామాల్లో అభివృద్ధికి బదులు అరాచక పాలన సాగుతోందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బ్యానర్ కనిపించకుండా చేశారని, గతంలో ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదన్నారు. బ్యానర్ కడితే కేసులు, జై జగనన్న అంటే కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. చేతనైతే అభివృద్ధి చేయండి... వినుకొండలో గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన అభివృద్ధి పనులైనా చేపట్టాలని జీవీకి బ్రహ్మనాయుడు సూచించారు. వంద పడకల ఆసుపత్రి, ముస్లిం కళాశాల, షాదీఖానా, మున్సిపల్ స్టేడియం, రైతు బజారు, గిరిప్రదక్షిణ రోడ్డు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అరాచక పాలన మానుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బొల్లా అన్నారు. -
దూరవిద్యలో ఉత్తీర్ణత దూరం
గుంటూరు ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారి కోసం ప్రవేశపెట్టిన దూర విద్యా విధానం సుదూరంగా పోతోంది. సమాజంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రవేశపెట్టిన దూర విద్య లక్ష్యానికి చేరలేక పోతోంది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) ద్వారా టెన్త్, ఇంటర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించి, వారికి చదువుకునే అవకాశాలను కల్పించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. బుధవారం రెగ్యులర్ టెన్త్ ఫలితాలతో పాటు ప్రకటించిన దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో దారుణమైన ఫలితాలు నమోదయ్యాయి. ఫలితాల్లో చతికిలపడిన జిల్లా రెగ్యులర్ టెన్త్ ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా దూరవిద్య టెన్త్ ఫలితాల్లో చతికిలపడింది. 5.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. పరీక్షలు రాసిన 939 మంది అభ్యర్థుల్లో కేవలం 55 మందే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రస్థాయిలో దూరవిద్య టెన్త్ ఫలితాల్లో 37.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో పడిపోయింది. సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత దూరవిద్య టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పడిపోవడం వెనుక ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకమే కారణంగా కనిపిస్తోంది. కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమైన అధికారులు, ఉత్తీర్ణతా శాతం దిగజారిపోవడానికి కారకులుగా నిలిచారు. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలు మినహా, మిగిలిన 20 జిల్లాల్లోనూ ఉత్తీర్ణత కూడా గణనీయంగా పడిపోయింది. గుంటూరు జిల్లాలో 5.86 శాతం నమోదు దూరవిద్య టెన్త్ పరీక్షలు రాసిన 939 మంది అభ్యర్థుల్లో ఉత్తీర్ణులైన వారు కేవలం 55 మంది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు పంపిణీలో తీవ్ర జాప్యంతో తప్పిన విద్యార్థులు సకాలంలో అందని మెటీరియల్ గుంటూరు కేంద్రంగా ఉన్న ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయం ద్వారా టెన్త్, ఇంటర్లో చేరిన అభ్యర్థులకు సకాలంలో మెటీరియల్ అందలేదు. 2024–25 విద్యా సంవత్సరంలో గతేడాది డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందలేదు. ఒకవైపు మార్చిలో జరగనున్న పరీక్షలకు ఫీజులు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ సొసైటీ తాపీగా పోస్టాఫీసులకు మెటీరియల్ పంపి, చేతులు దులుపుకుంది. గతేడాది డిసెంబరులో గుంటూరు చంద్రమౌళీనగర్లోని పోస్టాఫీసులో జిల్లాలకు పంపేందుకు గుట్టలుగా పడవేసిన మెటీరియల్ పార్శిళ్లు వెలుగు చూశాయి. గతంలో దూరవిద్య టెన్త్, ఇంటర్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అక్కడికక్కడే పాఠ్య పుస్తకాలు అందజేసే విధానాన్ని అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టల్ ద్వారా పుస్తకాలు పంపే విధానాన్ని ప్రవేశపెట్టడంతో పంపిణీలో నెలకొన్న జాప్యంతో అభ్యర్థులకు శాపంగా మారింది. -
అన్నన్నా... ఇది కన్నారా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి వారం చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నామమాత్రంగా సాగుతోంది. పట్టణంలోని రఘురామ్నగర్లో గల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం దీనిని నిర్వహించారు. ఇలాంటి వేదికపై ప్రజలు తమ సమస్యలపై వినతులు అందించడం సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి శుక్రవారం ఎమ్మెల్యేకు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాన్ని అందజేశారు. దీని ద్వారా ఏ సమస్య పరిష్కారం అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. – సత్తెనపల్లి -
అద్దంకిలో ఖర్జూరం సాగు
అద్దంకి: జిల్లాలో ఖర్జూరం సాగును రైతులు చేపట్టారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నకొత్తపల్లి గ్రామాల్లో మొత్తం ఐదు ఎకరాల్లో ఖర్జూర పంటను రైతులు సాగు చేశారు. ఈ తోటలు ప్రస్తుతం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నాయి. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు రెండు ఎకరాల్లో బరిహి రకం ఖర్జూరం పంటను, తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దగ్గర మొక్కను రూ.4500 చొప్పున కొనుగోలు చేసి తెచ్చి సాగు చేశాడు. ఈ తోట నాలుగు సంవత్సరాల వయసులో ఉంది. ఎండలు బాగా కాచి వాతావరణం అనుకూలంగా ఉంటే నాటిన మూడో సంవత్సరం నుంచే కాపుకు వస్తాయి. చెట్టుకు మొదటి సంవత్సరం 20 కిలోలు, రెండో సంవత్సరం 50, మూడో సంవత్సరం 100, అక్కడ నుంచి 300 కిలోల నుంచి 500 కిలోల వంతున 40 సంవత్సరాలపాటు దిగుబడిని ఇస్తాయి. కిలో ధర రూ.150 నుంచి 200 వరకు పలుకుతుంది. ఎకరాకు మొదటి సంవత్సరం రూ.75 వేలు ఆదాయం వస్తుంది. -
చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మీడియాపై ప్రజాప్రతినిధులే రౌడీలుగా మారి దాడులు చేయించడం క్షమార్హం కాని నేరమని విశ్రాంత పత్రికా సంపాదకులు, గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై ఈ తరహాలో దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించినందుకు, మహిళా ఎమ్మార్వోపై దౌర్జన్యం చేసిన నేరచరిత్ర కలిగిన చింతమనేని తీరును నాడు సభ్యసమాజం తీవ్రంగా నిరసించిందని గుర్తుచేశారు. ఆయన బుద్ధి మార్చుకోలేదంటే కారణం రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు వత్తాసు కారణాలన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని, చింతమనేనిని మందలించాలన్నారు. గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ -
టీడీపీలో కుమ్ములాట.. ఒకరి ఇంటిపై దాడి
నరసరావుపేటటౌన్: టీడీపీలో అంతర్గత పోరు ఆ పార్టీ వార్డు అధ్యక్షుడి ఇంటిపై దాడికి దారి తీసింది. క్రిష్టియన్ పాలెం 5వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ ఇంటిపై ఆ పార్టీ నేతలు గురువారం అర్ధరాత్రి బీరు సీసాలతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగాల వెంకటేశ్వర్లు 5వ వార్డుకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ నాయకులు గురువారం రాత్రి అతని ఇంటిపై బీరు సీసాలతో దాడి చేశారు. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడాడు. తాను నిద్రిస్తున్న సమయంలో కొందరు ఇంటిపై బీరు సీసాలతో దాడి చేశారన్నారు. వారంతా టీడీపీ పార్టీకి చెందిన వారేనని తెలిపారు. అర్ధరాత్రి ప్రాణ భయంతో పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాత కక్షలతో వ్యక్తిపై దాడి వెల్దుర్తి: పాత కక్షలతో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గుండ్లపాడులో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీనివాసరావుపై అదే గ్రామానికి చెందిన చిన ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, మరో ఐదుగురే ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడి తల్లి అలివేలమ్మ ఫిర్యాదు చేసింది. గాయపడిన శ్రీనివాసరావును మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆద్యంతం నవరసభరితం
రక్తి కట్టించిన ‘జనరల్ బోగీలు’ నాటిక మార్టూరు : మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ప్రదర్శనకు ముందు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా చైర్మన్ ఏ.వి.బాబూరావు శ్రీకారం రోటరీ కళాపరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నాటికలను ప్రారంభించారు. ‘వేదిక‘ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు ప్రదర్శనలలో పాల్గొన్న నటీనటులకు జ్ఞాపికలు అందజేశారు. సికింద్రాబాద్కు చెందిన మీనాక్షి సేతురామన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.వి.సేతురామన్, వసంత సేతురామన్ దంపతులు కళాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావు, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుమాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు, ఈశ్వర ప్రసాద్, శానంపూడి లక్ష్మయ్య, గరివిడి శ్రీనివాసరావు, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్లీన కోణాలను స్పృశించిన ‘(అ)సత్యం’ స్వార్థమైనా, నిస్వార్థమైనా, మంచి అయినా, చెడు అయినా, దైవత్వం అయిన, రాక్షసత్వం అయినా ఏదైనా సరే మనిషి హృదయానికి పరిమితమై ఉంటుంది. ప్రతి సత్యం వెనుక లేక అసత్యం వెనుక మనిషి స్వార్థం లేక భయం నిక్షిప్తమై ఉంటుంది. కంటికి కనిపించేదంతా సత్యం కాదు అలాగని కనిపించనిదంతా అసత్యం కూడా కాదు. యదార్థం అయినా సరే ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం. ఏది సత్యం? ఏది అసత్యం? అంటూ ప్రేక్షకులను ఆలోచింపజేసిన నాటిక శ్రీ చైతన్య కళా స్ర వంతి ఉక్కునగరం విశాఖ వారి ‘(అ)సత్యం ‘నాటిక. ఎం శ్రీ సుధరచించిన ఈ నాటికకు బి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు. మహిళల మనోగతాలకు దర్పణం పట్టిన ‘ఋతువు లేని కాలం’ స్వేచ్ఛ పేరిట ఉమ్మడి కుటుంబ వ్యవస్థలను, పురుషాధిక్యతా శృంఖలాలను తెంచుకుంటున్నామంటూ తమకు తామే బానిసలుగా మారుతున్న నేటి మహిళల పోకడను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన నాటిక కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘ఋతువులేని కాలం’. అపరిమితమైన ఆర్థిక స్వేచ్ఛతో ఆడంబరాలకు, ఫ్యాషన్లకు బానిసలౌతూ సంస్కృతీ సాంప్రదాయాలకు వక్ర భాష్యం చెప్పడం, మేము అనే భావన నుండి నేను మాత్రమే అనే భావన పెరుగుతూ ఒంటరితనానికి దగ్గరవుతున్న మహిళల అంతరంగాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ప్రదర్శించారు నాటికలోని నటీనటులు. మార్టూరులో రెండవ రోజు అలరించిన పరిషత్తు నాటికలు రైలు ప్రయాణం అందరికీ ఇష్టమైనది, సౌకర్యవంతమైనది. అయితే సామాన్యుడి నుంచి సగటు మధ్యతరగతి ప్రజల వరకు రైలులో జనరల్ బోగీలలో తక్కువ ఖర్చు కారణంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచాల్సిన రైల్వే శాఖ క్రమేపీ బోగీలను తగ్గిస్తూ ఉండటంతో రైలులోని బాత్రూములు, మరుగుదొడ్లలో సైతం ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన దుస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. తరచూ సంభవించే రైలు ప్రమాదాలలో జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికులు మరణించిన సందర్భాలలో వారి చిరునామాలు రైల్వే శాఖ వద్ద ఉండని విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ప్రమాదంలో తన కొడుకును దూరం చేసుకున్న ఓ తల్లి సావిత్రమ్మ రైల్వే శాఖతోపాటు ప్రజాప్రతినిధులకు ఉత్తరాల ఉద్యమం ప్రారంభించి సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిందన్న ఇతి వృత్తంతో సాగిన నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన‘ జనరల్ బోగీలు‘. పి.టి.మాధవ్ రచించిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. నాటికలో సావిత్రమ్మ పాత్రధారిగా నటించిన సీనియర్ నటి సురభి ప్రభావతి తన నటనా కౌశలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
ఐపీ పెట్టిన బంగారం వ్యాపారి
పిడుగురాళ్ల: వ్యాపారులకు బంగారం బిస్కెట్ ఎరగా చూపించి సుమారు రూ. 150 కోట్లకు మోసగించిన పెరుమాళ్ల రాజేష్పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటం, హవాలాలో డబ్బులు ఉన్నాయని, రాగానే ఇస్తానని చెప్పటంతో బాధితులు కొంత కాలం ఆగారు. తీరా ఇప్పుడు ఐపీ నోటీసులు చేతికి రావటంతో అందరు లబోదిబోమంటున్నారు. బిస్కెట్ వ్యాపారి పెరుమాళ్ల రాజేష్ ఈ నెల 12వ తేదీన ఐపీ నోటీసులను వ్యాపారులకు పంపించారు. సుమారు 63 మంది వ్యాపారులకు ఇవి అందించినట్లు సమాచారం. రాజేష్కు దుబాయిలో బిస్కెట్ సిండికేట్తో సంబంధం లేదని, విజయవాడలో కొనుగోలు చేసి పథకం ప్రకారం తక్కువ ధరకు బిస్కెట్లు ఇచ్చి పెద్ద మొత్తంలో వసూలు చేశాడని సమాచారం. హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదునరసరావుపేటటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిని హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరం గ్రామానికి చెందిన వడితే నాగేశ్వరరావు నాయక్ కు జీవిత ఖైదు, పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ గురువారం తీర్పు వెలువరించారు. హతుడు షేక్ ఖాదర్ బాబా(32) నిందితుడు నాగేశ్వరావు నాయక్ లది ఒకే గ్రామం. ఖాదర్ బాబా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో చికెన్ షాపు నిర్వహిస్తూ జీవిస్తుంటాడు. ఈ నేపథ్యంలో మురికిపూడికి చెందిన ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉంటున్నాడు. సదరు మహిళతో నిందితుడు నాగేశ్వరరావునాయక్ కూడా గతంలో సన్నిహితంగా మెలిగాడు. సదరు మహిళతో ఖాదర్ బాబా పరిచయం అయిన పిదప ఆమె నిందితుడు నాగేశ్వరరావునాయక్ ను దూరంగా పెట్టింది. కక్ష పెంచుకొని 2019 జులై 23వ తేదీ రాత్రి సమయంలో మురికిపూడి గ్రామంలో చికెన్ షాప్ లో నిద్రిస్తున్న ఖాదర్ బాబాను నాగేశ్వరరావు కత్తితో మెడ భాగంలో నరికి హతమార్చాడు. ఈ మేరకు మృతుడి భార్య షేక్ షాహిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ ఏపీపీ దేశి రెడ్డి మల్లారెడ్డి నిర్వహించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటిరెడ్డి
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తియ్యగూర కోటిరెడ్డిని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా సాదం పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సాదం వెంకటసత్యనారాయణను పార్టీ జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైద్య కళాశాలలో స్పోర్ట్స్ డే గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం పలు క్రీడలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ లాంచనంగా ప్రారంభించారు. వారం రోజులపాటు జరుగనున్న క్రీడల్లో క్రికెట్, షటిల్, చెస్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ జరుగనున్నాయి. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, స్పోర్ట్స్ పీఈటీ రాము, డాక్టర్భరత్, తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేసులో నిందితులకు మూడేళ్ల జైలు గుంటూరు లీగల్: చందోలు పోలీసులు 2017లో నమోదు చేసిన కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. ఔ. సత్యవతి బుధవారం తీర్పు వెలువరించారు. బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.కోటేశ్వరరావుకు చందోలు గ్రామం రసూల్ పేటలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడి చేశారు. గంజాయి విక్రయిస్తున్న షైక్ నజీర్ బాషా, కొనుగోలు చేస్తున్న చుండూరు మండలం దుండిపాలెంకు చెందిన మారెడ్డి రోహిత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 520 గ్రాముల గంజాయి, రూ. వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు. నజీర్ బాషా ప్రకాశం జిల్లా తిమ్మాసముద్రానికి చెందిన కర్ణం సుబ్బారావు వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలడంతో సుబ్బారావు నుంచి 4,050 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగా, విచారణ పూర్తిచేసి నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపించారు. -
ఎంతో మేలు చేకూరుస్తుంది...
వాహనాల్లో జీపీఎస్ ఏర్పాటు వల్ల యజమానికి ఎంతో మేలు చేకూస్తుంది. తద్వారా వాహనదారుడికి ఎనలేని భద్రత ఉంటుంది. నేరస్తులు తీసుకు వెళ్ళినా.. ఎక్కడైనా దాచిపెట్టినా.. వాహన కదలికలు మనకు తక్షణమే తెలిసిపోతాయి. ప్రతి వాహనానికి యజమానులు తప్పనిసరిగా జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా ఎవరైనా వాహనం తీసిన వెంటనే సెల్ఫోన్కు మెసేజ్ రావటంతో పాటు, తక్షణమే మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. వాహనదారులు జీపీఎస్ అమర్చుకోవటం ద్వారా చోరీలను నియంత్రించే అవకాశం కూడా ఉంది. – ఎం. రమేష్, డీఎస్పీ, ట్రాఫిక్, గుంటూరు -
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
సత్తెనపల్లి: చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ బి. కిరణ్రెడ్డి అన్నారు. సత్తెనపల్లి లోని పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఆవరణలో హైదరాబాద్ 54వ రీజినల్ స్థాయి అండర్–17 బాల, బాలికల వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు, అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలన్నారు. క్రీడల వల్ల శారీరక ధృఢత్వంతో పాటు చురుకుదనం ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల ప్రత్యేక అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అండర్–17 బాలికలు 8 జట్లు హాజరయ్యాయి. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం సత్తెనపల్లి, వాల్తేరు, విజయవాడ–1, బొల్లారం, హక్కింపేట, ఖమ్మం, తెనాలి జట్లు హాజరు కాగా లీగ్ కం నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం సత్తెనపల్లి, వాల్తేరు, ఖమ్మం, తెనాలి జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. శుక్రవారం సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు రిఫరీలుగా ఎం. శేషశ్రీనివాసరావు, ఈ రవీంద్ర, ఎం. నరసింహారావు, షేక్ మహమ్మద్ రియాద్, పాలపర్తి గోవింద్, టీ.లక్ష్మీపతి వ్యవహరించారు. క్రీడా పోటీలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ కిరణ్ రెడ్డి హైదరాబాద్ రీజినల్ స్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
వైద్య కళాశాలలో వెల్నెస్ క్లీనిక్ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ఫిజియాలజీ విభాగం వద్ద గురువారం వెల్నెస్ క్లీనిక్ను ప్రారంభించారు. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, సీనియర్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి వెల్నెస్ క్లీనిక్ను ప్రారంభించారు. వైద్య కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. కళాశాల అభివృద్ధికి డాక్టర్ సుందరాచారీ చేస్తున్న కృషిని కొనియాడారు. కళాశాలలో వైద్యులు, వైద్య సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించేందుకు వెల్నెస్ క్లీనిక్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ తెలిపారు. ప్రతిరోజూ పీజీ వైద్యులు వెల్నెస్ క్లీనిక్లో అందుబాటులో ఉండి సేవలందిస్తారన్నారు. ఉచిత క్లీనిక్ సేవలను కళాశాల సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు
సుమారు 300 గ్రాముల గంజాయి స్వాధీనం మంగళగిరి టౌన్: మంగళగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం రావడంతో గురువారం ‘ఈగల్’ టీమ్ పట్టణ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు ఈగల్టీమ్ గురువారం మధ్యాహ్నం ఆ యువకులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 200 నుంచి 300 గ్రాముల వరకు గంజాయిని, గంజాయిని వినియోగించే త్రైస్ అనే పేరు కలిగిన రోల్స్ను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ యువకుల్ని విచారించగా మంగళగిరిలో ఓ యువకుడి వద్ద కొన్నామని, అతని వద్ద సుమారు 4 కిలోల వరకు గంజాయి ఉందనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు జైలు బాపట్ల: గంజాయి కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష, పదివేలు జరిమానా విధిస్తూ గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఏ.ఎల్ సత్యవతి గురువారం తీర్పు చెప్పారు. బాపట్ల జిల్లా చందోలు పోలీసుస్టేషన్ పరిధిలోని రసూల్పేటకు చెందిన షేక్ నజీర్బాషా నివాసంలో 2017 నవంబరు 19న అప్పటి చందోలు ఎస్ఐ చెన్నకేశవులు దాడులు నిర్వహించగా 470 గ్రాములు గంజాయి దొరికిందని కేసు నమోదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన ఈ కేసులో నజీర్బాషా, మారెడ్డి రోహిత్కుమార్రెడ్డి, సుబ్రహ్మణ్యంలకు శిక్షపడింది. గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టులో కేసు విచారణకు రాగా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు సూచనలతో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ పర్యవేక్షణలో చందోలు ఎస్సై శివకుమార్, కోర్ట్ లైజనింగ్ ఏఎస్ఐ ఉప్పల భాస్కర్ ద్వారా సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏపీపీ వజ్రాల రాజశేఖర్రెడ్డి వాదనలు వినిపించి ముద్దాయిలపై మోపబడిన నేరాన్ని తగిన సాక్ష్యాలతో రుజువు చేయడంతో గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఏ.ఎల్ సత్యవతి గురువారం ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈమేరకు ఎస్పీ తుషార్ డూడీ పోలీసులను అభినందించారు. ఆటో బోల్తా.. మహిళ మృతి చినగంజాం : ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయలైన సంఘటన చినగంజాం మండల పరిధిలోని తిమ్మసముద్రం సైఫన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని కడవకుదురు గ్రామానికి చెందిన పలువులు మహిళా కూలీలు ఇంకొల్లు మండల పరిధిలోని పావులూరు గ్రామంలో మిర్చి పంట పనులకు గత మూడు నెలలుగా ప్రతి రోజు వెళుతున్నారు. రోజు మాదిరిగానే కడవకుదురు గ్రామం నుంచి గురువారం ఉదదయం 5 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళుతున్న వారి ఆటో ఇంకొల్లు రోడ్డులోని తిమ్మసముద్రం సైఫన్ వద్దకు వెళ్ళే సరికి ఆటో హ్యాండిల్ అకస్మాత్తుగా బిగుసుకొని పోవడంతో పక్కనే కుడివైపు ఉన్న పొలాల్లోకి దూసుకొని వెళ్ళి బోల్తా కొట్టింది. ఆ సంఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిలో నక్కల సోవమ్మ (79)ను తీవ్ర గాయలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న బత్తుల కమలమ్మ తలకు గాయం కాగా ఒంగోలు కిమ్స్కు, కొండేపు శేషమ్మ, డ్రైవర్ గొల్లపూడి వెంకటేశ్వర్లుకు గాయాలు కావడంతో వైద్యచికిత్స నిమిత్తం చీరాల తరలించారు. బాధితురాలు కొండేపు శేషమ్మ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శీలం రమేష్ తెలిపారు. -
ఏజెంట్లే కీలకం
యానిమేషన్ మాయలోసాక్షి, నరసరావుపేట, నరసరావుపేటటౌన్: యానిమేషన్ మాయలో ఏజెంట్ల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. రూపాయి పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడి అంటూ ప్రచారంతో రూ.వందల కోట్లు వసూల్ చేసి బోర్డు తిప్పేసిన యానిమేషన్ స్కాం లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థోమతకు మించి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగిరావని మనోవేదనకు గురై నరసరావుపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో బాధితుల చేత పెట్టుబడి పెట్టించడానికి యానిమేషన్ సంస్థ ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా సాగిన యానిమేషన్ స్కాంలో గుంటూరు వాసిది కీలకమని తెలుస్తోంది. ఆయన ఏజెంట్గా అవతారమెత్తి బడా వ్యాపారుల చేత దగ్గరుండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించాడట. ప్రధాన సూత్రధారి కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పెట్టుబడి దారుల నుంచి ఒత్తిడి పెరిగింది. పెట్టుబడి పెట్టే సమయంలో అంతా తనదే బాధ్యత అన్న గుంటూరు ఏజెంట్ నేడు నాకే సంబంధం అంటూ బుకాయిస్తున్నాడు. దీంతో అతను చేసిన మోసంపై బాధితులు నరసరావుపేట పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. చివరి వరకు వంచన... గత ఏడాది చివరిలో గడువు పూర్తి అయ్యి పెట్టుబడితో పాటు లాభం నగదు చాలమందికి చేతికి అందాలి. అయితే గత ఏడునెలలుగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల నగదు ఆగిపోయిందని, వచ్చే నెలలో వస్తాయంటూ ప్రతిసారి కిరణ్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికి డిసెంబర్, జనవరి మాసాల్లో సైతం పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకున్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితులంతా విజయవాడలోని కార్యాలయానికి వెళ్లి ఒత్తిడి తెచ్చారు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు తమిళనాడు వెళ్లి తలదాచుకున్నాడు. అక్కడి నుంచి బాధితులకు డబ్బు విషయంలో ఆధైర్యపడవద్దంటూ వీడియో సందేశాలను విడుదల చేశాడు. ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు... గుండా నాగేశ్వరరావు మృతి తరువాత బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మొదట రూ.400 కోట్లు అనుకున్న బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. బాధితులు ఒకరికి తెలియకుండా ఒకరు నేరుగా ఏజెంట్, కిరణ్లకు నగదు చెల్లించారు. ఇందులో కొందరు మాజీ పోలీసు అధికారులు, నరసరావుపేటకు చెందిన మహిళలు కూడా ఉండటం గమనర్హం. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో నరసరావుపేటకు చెందిన టి. శ్రీనివాసరావు, కె దిలిప్కుమార్లు తాము సుమారు రూ.16 కోట్లు చెల్లించి మోసపోయామని కిరణ్పై ఫిర్యాదు చేశారు. పెట్టుబడులు పెట్టించడానికి ప్రత్యేకంగా నియామకం ఒక్కొక్కటిగా బయటపడుతున్న లీలలు 30 శాతం కమీషన్ ముట్టజెప్పడంతో అధిక మొత్తంలో పెట్టుబడులు గుంటూరు కేంద్రంగా యానిమేషన్ ఏజెంట్ భారీగా పెట్టుబడుల సేకరణ రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య కుంభకోణంపై కేసులు... మాకు సంబంధం లేదంటున్న పోలీసులు 30 శాతం కమీషన్... మాకేం సంబంధం లేదు...! పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే తమకు న్యాయం జరుగుతుందేమోనని కొందరు భావించినా మొదట్లోనే వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కొందరు పోలీసు అధికారులను బాధితులు కలసి తాము డబ్బులు చెల్లించి నిండా మునిగామని చెప్పి చెప్పక ముందే యానిమేషన్ కార్యాలయం విజయవాడలో ఉన్న కారణంగా తమ పరిధి కాదని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ విషయానికొస్తే గత నాలుగు రోజులుగా పత్రికల్లో యానిమేషన్ స్కాంపై కథనాలు వస్తున్నప్పటికి కనీస స్పందన లేదు. జరిగిన ఆర్థిక నేరంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించి న్యాయం జరిగేలా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు. యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టించినందుకు గుంటూరుకు చెందిన రాజు అనే ఏజెంట్కు పెద్ద మొత్తంలో కమీషన్ ముట్టినట్టు బాధితులు తెలుపుతున్నారు. నరసరావుపేటకు చెందిన పొగాకు వ్యాపారి అతనికి బంధువు కావడంతో నమ్మి సుమారు రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. విషయం తెలుసుకొన్న మరో బంగారం వ్యాపారి రూ.20 కోట్ల వరకు యానిమేషన్లో పెట్టుబడి పెట్టారు. వీరి తో పాటు మరి కొందరు సుమారు రూ.30 కోట్ల వరకు రాజు ఆధ్వర్యంలో చెల్లించారు. అంతా తనదే బాధ్యతని, మీ డబ్బుకు నాది గ్యారెంటీ అంటూ నమ్మబలికి గుంటూరు కార్యాలయ కేంద్రంగా పెట్టుబడు లు సేకరించారు. నగదులో 30 శాతం కమీషన్ రాజు మినహాయించుకొని మిగిలిన డబ్బులు సంస్థ యజమాని కిరణ్కు అప్పగించేవాడని బాధితులు చెప్పుకొస్తున్నారు. తీరా కిరణ్ పరారవ్వడంతో కమీషన్ కోసం ఏజెంట్ తమను ముంచాడని బాధితులు వాపోతున్నారు. -
‘సాక్షి’పై దాడి హేయమైన చర్య
నరసరావుపేట: ఏలూరులో సాక్షి పత్రికా కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరుల దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టులాంటిదని జర్నలిస్టు, ప్రజాసంఘాలు, సీపీఐ, ఎంసీపీఐయూ, ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా రాసే ‘సాక్షి’పై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడిని నిరశిస్తూ గురువారం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పల్నాడు జిల్లా ప్రెస్, నరసరావుపేట, ఇతర జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ ఏకా మురళికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ వార్తలు రాశారనే ఉద్దేశ్యంతో పత్రికా కార్యాలయాలపై దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టులపై దాడులు ఏమాత్రం భావ్యంకాదని, పత్రికా స్వేచ్ఛపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్టు చేయాలి.. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహజంగానే రౌడీయిజం చేస్తుంటాడని, చంద్రబాబు మెప్పుకోసమే ఈ దాడి చేశాడన్నారు. కూటమి ప్రభుత్వానికి కావాల్సింది ఇదేనన్నారు. వెంటనే ప్రభాకర్పై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఒక వీధిరౌడీ అని, మాటలు, చేష్టలు ఆవిధంగానే ఉంటాయన్నారు. పల్నాడులో బాధితులు చెప్పిన వాస్తవాలను రాసిన ‘సాక్షి’ విలేకర్లపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రెడ్ బాష మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే పద్ధతులను పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎంఐఎం కరిముల్లా, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు నంద్యాల జగన్మోహన్రెడ్డి, వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా బాధ్యులు బి.ప్రసాదు, పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, నరసరావుపేట అధ్యక్షుడు సీహెచ్.వి.రమణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ‘సాక్షి’ స్టాఫ్ రిపోర్టర్ ఆర్.లవకుమార్రెడ్డి, షేక్ జిలాని, పి.కోటిరెడ్డి, జి.సాంబశివారెడ్డి, సుంకిరెడ్డి, నాగరాజు, బుచ్చిబాబు, అప్పారావు, శివ, స్వామి, షేక్ సాజిద్, పీడీఎం నాయకుడు నల్లపాటి రామారావు, బాదుగున్నల శ్రీను, బీసీ నాయకుడు బత్తుల వెంకటేష్, పీకేఎస్ నాయకుడు కంబాల ఏడుకొండలు పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలి నరసరావుపేటలో జర్నలిస్టులు, సీపీఐ, ఎంసీపీఐయూ, ఎంఐఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జిల్లా ఎస్పీ, డీఆర్ఓలకు వినతిపత్రాలు -
ముగిసిన సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం గురువారంతో ముగిసింది. సమావేశంలో ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో పరిశోధనలు, సాధించిన ప్రగతి, నూతన టెక్నాలజీ, మినీకిట్లు వంటి అంశాలపై చర్చించి సమాచారాన్ని అందించారు. యాంత్రీకరణపై శాస్త్రవేత్తలతో ప్రత్యేక చర్చా కార్యక్రమం, గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. వరి పంటలో బీపీటీ 5204 నాణ్యత కలిగిన సన్నగింజ రకాలు ఎగుమతికి అనువైనవని, 7 మిల్లీ మీటర్ల గింజ పొడవుగల వరి రకాలు, కలర్డ్ వరి రకాలపై పరిశోధనలు చేయాలని, అధిక దిగుబడిని ఇచ్చే తక్కువ ఎత్తుగల మొక్క జొన్న, జొన్న, హైబ్రిడ్స్ అపరాలలో కలుపు యాజమాన్యం, శనగలో పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు, కాండం తొలిచే పురుగులు, గజ్జి తెగులు యాజమాన్యం, తెగుళ్లను తట్టుకునే మినుము రకాలపై పరిశోధనలు చేపట్టాలని పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై, ట్రాష్ షెడ్డర్ ద్వారా పంట వ్యర్థాల వినియోగం వటి అంశాలపై రైతులకు అవగాహన పెంచాలని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ తెలిపారు. చెరకు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతున్న సందర్భంగా డ్రయ్యర్లు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. చెరకులో యాంత్రీకరణను పెంచి కూలీల ఖర్చు తగ్గించినపుడే పంటలో ఆశించిన లాభం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బొప్పూడి ఆలయంలో సీతారామ కళ్యాణం
చిలకలూరిపేట: బొప్పూడి గ్రామం డొంక వద్ద జాతీయ రహదారి పక్కన వేంచేసియున్న శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయ 42వ వార్షికోత్సవ వేడుకలు వైభంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి సంతోష్ చరణ్ దివి పవన్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఐఎఫ్సీ బృందం క్షేత్ర సందర్శన అమరావతి: మండలంలోని పలు గ్రామాలలో గురువారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) ప్రతినిధుల బృందం రైతులతో వ్యవసాయ క్షేత్ర సందర్శన, గ్రామసభలు నిర్వహించారు. తొలుత ఈ బృందం దిడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి మిర్చి రైతులను మిర్చి ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు అత్తలూరులో నిర్వహించిన వ్యవసాయక్షేత్ర సందర్శనలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. అనంతరం స్వయం సహాయక మహిళాసంఘాల సభ్యులు, రైతులతో ఆర్థిక అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్సీ బృంద సభ్యులు కె. విజయశేఖర్, హేమేంద్ర మెహర్, యువరాజ్ అహూజా, నవనీత్రాయ్, షెనాయ్ మ్యాధ్యు, ఇషాసర్, సీతల్ సోమనిలతో పాటు ఉద్యానవన శాఖ డీపీఎం అమలకుమారి, మండల, వ్యవసాయశాఖాధికారి అహ్మద్, ఉద్యాన అధికారి శ్రీనిత్య, అశోక్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన నగర కమిషనర్ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న బి.సాయి కళ్యాణ్ చక్రవర్తిని గురువారం జిల్లా కోర్ట్లోని ఆయన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొండపాటూరు పోలేరమ్మకు రూ. 22.46 లక్షల ఆదాయం ప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మకు తిరునాళ్ల సందర్భంగా రూ. 22.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బత్తుల సురేష్బాబు తెలిపారు. భక్తులు పోలేరమ్మ తల్లికి సమర్పించిన కానుకలు, హుండీలను తెరిచి ఆలయంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పాటల ద్వారా రూ. 3.90 లక్షలు, హుండీల ద్వారా 12.76 లక్షలు, టిక్కెట్ల ద్వారా 2.40 లక్షలు, చందాల రూపంలో రూ. 39 వేలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం 22,46,256 రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయశాఖ బాపట్ల ఇన్స్పెక్టర్ ఎం.గోపి, ఈవో బి. సురేష్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మువ్వా రామచంద్రావు, గ్రామపెద్దలు యర్రాకుల దానయ్య, పి. శ్రీనివాసరావు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి కౌన్సిల్ సమావేశం వాయిదా నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఈ నెల 25వ తేదీన జరగాల్సిన నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. -
ఆసుపత్రులకు ఫైర్ నిబంధనలను సవరించండి
ఫైర్ డీజీకి ఐఎంఏ విజ్ఞప్తిగుంటూరు మెడికల్: రాష్ట్రంలో క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ విషయంలో ఫైర్ ఎన్ఓసీ చాలా సమస్యగా ఉందని, ఫైర్ నిబంధనలను కొన్ని సవరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ను కోరింది. విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ ఆధ్వర్యంలో గురువారం మాదిరెడ్డి ప్రతాప్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్’ సందర్భంగా ఐఎంఏ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులకు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి. నందకిషోర్, ఐఎంఏ ఫైర్ సేఫ్టీ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.శ్రీనివాస రాజు, ఫైర్ ఎన్ఓసీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను డీజీ దృష్టికి తీసుకువెళ్లారు. క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల్లో సైతం భారీ అగ్నిమాపక పరికరాలు అమర్చుకోవాలనడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. వీటివల్ల ఆర్థిక భారం తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. డీజీ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ వైద్యులు ఫైర్ ఎన్ఓసీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానన్నారు. డీజీని కలిసిన వారిలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మోటూరు సుభాష్ చంద్రబోస్, ఐఎంఏ జాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి. ఫణిధర్, కోశాధికారి డాక్టర్ టి.కార్తీక్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్, డాక్టర్ డి.అమరలింగేశ్వర రావు తదితరులు ఉన్నారు. -
పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏడు సెంటర్లలో శుక్రవారం నిర్వహించనున్న ఏపీఆర్ఎస్ కాట్, ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలకు 2,650మంది విద్యార్థులు హాజరవుతున్నందున పరీక్షా కేంద్రాల్లో కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని డీఆర్ఓ ఏకా మురళి పేర్కొన్నారు. గురువారం జరగబోయే పరీక్షలపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ 5,6,7,8 తరగతుల్లో ప్రవేశానికి ఏపీఆర్ఎస్ కాట్, ఇంటర్, డిగ్రీలలో ప్రవేశానికి ఏపీఆర్జేసీ, డీసీ సెట్ను ఉదయం 10 గంటల నుంచి 12గంటలు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. తాగునీరు, విద్యుత్, వైద్యసౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ ఎల్.చంద్రకళ, డీసీఓ ఎన్.సరోజని, ఆర్డీఓ కె.మధులత, ఆర్టీసీ, పోలీసు, హెల్త్ డిపార్టుమెంట్ అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన డీఆర్ఓ మురళి నేడు ఏడు కేంద్రాల్లో జరగనున్న ఏపీఆర్ఎస్ కాట్, ఏపీఆర్జేసీ, డీసీ సెట్ -
భావన్నారాయణ స్వామి దేవాలయం వారసత్వ బైలాస్కు శ్రీకారం
బాపట్ల: శ్రీభావన్నారాయణస్వామి దేవాలయం దేవాలయ కట్టడాల పరిరక్షణకు అవసరమైన వారసత్వ బైలాస్ రూపొందిస్తున్నామని ‘ఇంటాక్,’ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) జాతీయ వారసత్వ డైరెక్టర్ ఎ.విజయ చెప్పారు. గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటాక్ బృందం దేవాలయాన్ని సందర్శించింది. ఇటువంటి చారిత్రక దేవాలయాల అద్భుత వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారితో కలిసి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దేవాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉన్న పలు వారసత్వ కట్టడాలను వారు సందర్శించారు. ఇందులో భాగంగా శ్రీపాద, నోరి, కంభంపాటి, దేశరాజు వారి భవనాలను వారు పరిశీలించారు. దేవాలయంతో పాటు, మిగతావాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆమె వివరించారు. ఇంటాక్ బృందంలో విజయతో పాటు, ఆర్కిటెక్ కన్జర్వేషనిస్ట్ దీప్తి శర్మ, ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన డి.ఫణీంద్రలు ఉన్నారు. వారికి ఇంటాక్ బాపట్ల జిల్లా కన్వీనర్ డాక్టర్ పీసీ సాయిబాబు స్వాగతం పలికారు. బృందం సభ్యులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫోరం సభ్యులు జి.వెంకటేశ్వర్లు, ఎం.నరసింహారావు, దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త దేశిరాజు రమణబాబు, శ్రీరామచంద్రమూర్తి, ఉమాదేవి, రాజేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
మాచవరం: వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నేల బావిలో కూరుకుపోయి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమవరపు శ్రీను కుమారుడు జస్వంత్ (9) స్థానిక దళితవాడలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. పప్పుల ఏసయ్య కుమారుడు యేసురాజు (16) మాచవరం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇరువురు మధ్యాహ్న సమయంలో సైకిల్ పై గ్రామ సమీపంలోని శివాలయం పక్కనే ఉన్న పెద్దబావి వద్దకు వచ్చి, దుస్తులు విడిచి ఈత కొట్టేందుకు బావిలోకి దూకారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక చనిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈత కొట్టేందుకు బావిలోకి దూకాడు. బావి అడుగు బాగాన ఇద్దరు చిన్నారులు మృతి చెందడాన్ని గమనించి, విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసాడు. అప్పటికే చిన్నారులు కనిపించకపోవడంతో గ్రామంలో వెతుకుతున్న తల్లిదండ్రులకు విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చి చూడగా దుస్తులు, సైకిల్ను గుర్తించి బోరున విలపించారు. గ్రామస్తుల సహాయంతో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మృత దేహాలను చూసిన తల్లిదండ్రులు, బందువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురజాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సాయి కర్ణకుమార్ ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ విజయ్ శేఖర్ తెలిపారు. నేల బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి మాచవరం మండలం కొత్తపాలెంలో ఘటన -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు
ఈపూరు(శావల్యాపురం): వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడుల పర్వం కొనసాగుతుంది. సంఘటనలో ఒక వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావటంతో వైద్యశాలకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లె తండాకు చెందిన వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యకర్తలకు ఈనెల 22వ తేదీన చిన్నపాటి ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరగటం అక్కడున్న వారు సర్ది చెప్పటంతో అంతటితో గొడవ సద్దుమణిగింది. దీన్ని మనసులో ఉంచుకున్న టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి బుధవారం సాయంత్రం సమయంలో తండాకి వెళ్లి అక్కడున్న వారితో వాగ్వివాదానికి దిగారు. ఇంతలో తండాకు చెందిన భూక్యా సోమ్లానాయక్ పొలం నుంచి వస్తూ వారిని నిలవరించటానికి యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలైన సోమ్లా నాయక్, భూక్యా సరోజనీ బాయి, తిరపతి బాయి, లక్ష్మీబాయి పై అందిన వస్తువులతో దాడి చేశారు. వారిలో సోమ్లా నాయక్కు తీవ్ర గాయాలు కావడంతో చుట్టుపక్కల వారు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. దాడిలో సోమ్లానాయక్ తలకు 13 కుట్లు పడినట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న ఈపూరు పోలీసులు వైద్యశాలకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. నేటి నుంచి టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సాధారణ బదిలీల కొరకు పెట్టుకునే ప్రభుత్వ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణ బదిలీ కోసం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం కౌంటర్లో రూ. 1,500లు ఫీజు చెల్లించాలన్నారు. అభ్యర్థులు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఉద్యోగ గుర్తింపు కార్డు తీసుకుని ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99637 66638 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. సూదివారిపాలెం సర్పంచ్కు పంచాయతీ రాజ్ అవార్డు ఇంకొల్లు(చినగంజాం): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని సూదివారిపాలెం గ్రామ సర్పంచ్ గోరంట్ల జయలక్ష్మికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన పంచాయతీ రాజ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖా మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డుతో ఆమెను సత్కరించారు. వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా? ● పోలీసుల అదుపులో వెదుళ్లపల్లి రైస్మిల్లు యజమాని ● ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా పాత్రపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు రేషన్ మాఫియాపై అనుమానాలు తలెత్తినట్లు సమాచారం. నాగులుప్పలపాడుకు చెందిన చౌక బియ్యం వ్యాపారితో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి వ్యాపారం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని వెదుళ్లపల్లికి చెందిన రైస్మిల్లు యజమానిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యలో నిజంగా రేషన్ మాఫియా హస్తం ఉండా లేక మరేదన్నా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసుల అదుపులో ముగ్గురు..? పొన్నూరు: పట్టణంలోని నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో వీరి పాత్రపై అనుమానంతో తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ ముగ్గురు వెదుళ్లపల్లి మిల్లుకు రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు, ఈ క్రమంలో వీరి ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. -
ఉగ్రవాదుల దాడులు హేయం
మాచర్ల: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు 28 మందిని దారుణంగా హతమార్చడం అత్యంత హేయమైన ఘటన అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) పేర్కొన్నారు. బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వందలాది మందితో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నల్లబ్యాడ్జీలు ధరిస్తూ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే అంశమని, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి.. ఉగ్రవాదులను తరిమికొడదాం. సమైఖ్యంగా ఉందాం.. జై భారత్, జై జై భారత్ అంటూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మాచర్ల ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, జెడ్పీటీసీ మండ్లి పెద మల్లుస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, మాజీ జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల నాయకుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీను, మంచికల్లు చంద్రారెడ్డి, సర్పంచ్ గొట్టం బ్రహ్మారెడ్డి, నాయకులు బూడిద సైదులు, నవులూరి చెన్నారెడ్డి, పఠాన్ సత్తార్ ఖాన్, షేక్ నాగూర్, కౌన్సిలర్లు మందా సంతోష్, మాచర్ల సుందరరావు, దుర్గి మండల నాయకులు ఉన్నం వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయ్), షేక్ మస్తాన్, కో–ఆప్షన్ మెంబర్ అల్లి జీవన్, మైనార్టీ నాయకులు సయ్యద్ బాషా, షేక్ ఉస్మాన్, షేక్ జాని, సయ్యద్ బాబా వలి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. కశ్మీర్ మృతుల ఆత్మశాంతి కోరుతూ ర్యాలీ అమరావతి: కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల చేతిలో బలైన 28 మంది పర్యాటకుల ఆత్మశాంతికి బుధవారం అమరావతిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమరేశ్వరాలయం నుంచి నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకుడు కోలా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈర్యాలీ మెయిన్ రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్, దుర్గావిలాస్ సెంటర్ల మీదుగా మద్దూరు డౌన్ సెంటర్ వరకు సాగింది. బీజేపీ నాయకులు మద్ది ధాత్రినారాయణ, రమణ, నేరెళ్ల హనుమంతరావు, మేకల శివశంకర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
రమణీయం..చారిత్రక దృశ్యకావ్యం
విజయపురిసౌత్: విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్ను కుటుంబ సమేతంగా వేసవి సెలవుల్లో చూడాల్సిందే. సాగర్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన ప్రాంతమే కాకుండా సాంకేతిక పరంగా సాగర్ ప్రాజెక్టు సందర్శన ఎంతో విజ్ఞానదాయకంగా నిలుస్తోంది. కృష్ణా జలాశయంలో లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం. లాంచీలో ప్రయాణించి జలాశయం మధ్యన ఎనలేని ప్రశస్తి ఉన్న నాగార్జునకొండ మ్యూజియం సందర్శించాల్సిందే. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్ మ్యూజియంలలో నాగార్జునకొండ రెండవది. ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్లో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి, నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. మహా చైత్యం ఇది బుద్ధ దాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈస్థూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారనాథ్లో ఉంచి, పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మంచి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలతో కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు. హారతీ దేవాలయం విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. హారతీ దేవాలయంలో ప్రవేశానికి ముందు ఈ సరస్సులో స్నానమాచరించేవారు. ప్రాచీన విశ్వవిద్యాలయం నాగార్జున కొండకు ఇలా చేరుకోవాలి.. చారిత్రక సంపదకు, ప్రకృతి సోయగాలకు నెలవు నాగార్జున కొండ నాటి చరిత్రకు ప్రతిరూపం అనుపు వేసవి సెలవుల్లో వినోదం.. విజ్ఞానదాయకం ఈ విశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కృష్ణానది తీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమై, ప్రపంచఖ్యాతి గాంచింది. నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి 14కి.మీ. దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్లో లాంచీస్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, 6 నుంచి 12 సంవత్సరాల చిన్నారులకు లాంచీకు రూ.150, మ్యూజియం సందర్శనకు 14 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీటిక్కెట్పై 20 శాతం రాయితీని పర్యాటకశాఖ ఇస్తుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్ను సంప్రదించవచ్చు. -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటెన్
● కావ్యశ్రీని దత్తత తీసుకున్న కలెక్టర్ ● పావని చంద్రికను దత్తత తీసుకున్న ఆర్అండ్బీ ఎస్ఈ నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలలో 591 మార్కులు సాధించిన కారెంపూడి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కోనేటి కావ్యశ్రీని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు దత్తత తీసుకున్నారు. రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల పుత్రిక అయిన కావ్యశ్రీ ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే మంచి మార్కులు రావనే అభిప్రాయాలను పటా పంచలు చేస్తూ జిల్లా విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో స్టేట్ టాపర్గా నిల్చిన పావని చంద్రికకు స్వీటు తినిపించి అభినందించారు. కలెక్టర్ అడుగుజాడల్లో నడుస్తూ రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ రాజనాయక్ 598 మార్కులు సాధించిన పావని చంద్రికను దత్తత తీసుకున్నారు. అదేవిధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం కలెక్టరేట్కు ఆహ్వానించి అభినందించారు. జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్, డీఈఓ ఎల్.చంద్రకళ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో సర్కార్ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పది ఫలితాలలో రాణించారు. బుధవారం ప్రకటించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలల నుంచి 25,382 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 21,358 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 84.15 శాతంగా ఉంది. కాగా, గతేడాది 25,207 మంది హాజరు కాగా, 23,792 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఉత్తీర్ణతా శాతం 86.05 శాతంగా ఉంది. గతేడాది రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఈఏడాది 11వ స్థానానికి ఎగబాకినప్పటికీ ఉత్తీర్ణత శాతం 2 శాతం దిగజారింది. కాగా, జిల్లాలో బాలుర ఉత్తీర్ణత 81.39 శాతం ఉండగా, బాలికలు పైచేయి సాధిస్తూ 86.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 16,887 మంది ఫస్ట్ డివిజన్, 3,070 మంది సెకండ్ డివిజన్, 1,401 మంది థర్డ్ డివిజన్ సాధించారు. ● జిల్లాలోని కారెంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని అంగడి పావని చంద్రిక 598 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే షేక్ సమీర 596 (జడ్పీ బాలికల హైస్కూల్, మాచర్ల), ప్రత్తిపాటి అమూల్య 593 (జడ్పీ హైస్కూల్, తూబాడు), తన్నీరు సాయిరామ్ 591 (ఏపీ మోడల్ స్కూల్, చీకటీగల పాలెం), పిట్టల విజయలక్ష్మి 591 (జడ్పీ హైస్కూల్, చిరుమామిళ్ల), జె.ఖాతీజా 591 (జడ్పీ హైస్కూల్, వినుకొండ), చప్పల నవ్వ 590 (జడ్పీ హైస్కూల్, ఓబులేసునిపల్లె), జి.రాధిక 590, (జడ్పీ హైస్కూల్, నకరికల్లు), అనుముకొండ రేవతి 590 (జడ్పీ హైస్కూల్, శంకరభారతీపురం), కోనేటి కావ్యశ్రీ 590 (జడ్పీ హైస్కూల్, కారంపూడి) మార్కులు సాధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే, డీఈఓ తదితరులు టాప్ ర్యాంకర్లను అభినందించారు. కారెంపూడి: టెన్త్ పరీక్షా ఫలితాలలో కారెంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కె.కావ్యశ్రీ 591 మార్కులు సాధించిందని ఎంఈఓ రవి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పావని చంద్రిక, తల్లి సంధ్యలను అభినందిస్తున్న డీఈఓ చంద్రకళ, హెచ్ఎం మీ భవితకు అండగా నిలుస్తాం ‘పది’ ఫలితాల్లో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచిన పల్నాడు 598 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ టాపర్గా నిలిచిన ఒప్పిచర్ల విద్యార్థిని పావని చంద్రిక విద్యార్థులను అభినందించిన ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ 598 మార్కులు సాధించిన ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కారెంపూడి: పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అంగడి పావని చంద్రిక పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చంద్రిక 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించింది. హిందీ, ఇంగ్లిషుల్లో ఒక్కో మార్కు తగ్గింది గానీ మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి. మట్టిలో మాణిక్యం అంగడి పావని చంద్రిక తండ్రి సాంబశివరావు వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో అటెండర్గా, తల్లి సంధ్య పిడుగురాళ్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో వాచ్మెన్గా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం పిడుగురాళ్ల.. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కడ ఇంటిని అమ్మేశారు. అప్పటి నుంచి పావని చంద్రిక ఒప్పిచర్లలో ఉన్న అమ్మమ్మ సామ్రాజ్యం సంరక్షణలో ఉంటూ ఇంటికి దగ్గర్లోని జెడ్పీ హైస్కూల్లో చదువుతోంది. చంద్రిక తమ్ముడు లక్ష్మణ్ పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి పరీక్షలు రాశాడు. అమ్మమ్మ సామ్రాజ్యం, మేనమామ లక్ష్మణ్ల సంరక్షణలో పావని చంద్రిక చదువుపై శ్రద్ధ చూపింది. అల్లుడు, కూతురు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మనవరాలిని దగ్గరకు తీసుకుని చదివించింది చంద్రిక అమ్మమ్మ సామ్రాజ్యం. కరోనా కాలంలో సామ్రాజ్యం భర్త వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో మనవరాలు పావని చంద్రిక అమ్మమ్మకు తోడుగా ఉంటూ బాగా చదువుకుంది. పల్నాడుకు ఖ్యాతి పావని చంద్రిక ప్రత్యేకంగా ఏ ట్యూషన్కు వెళ్లలేదు.. స్కూల్లో ఏ రోజు చెప్పినవి అదే రోజు చదువుకునేది. అమ్మమ్మ తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేపేది. స్కూలుకు వెళ్లేలోగా అమ్మమ్మకు ఇంటి పనిలో సాయం కూడా చేసేది. ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూరులో నివాసం ఉంటూ జెడ్పీ హైస్కూల్లో చదివి అత్యుత్తమ మార్కులతో పల్నాడుకే పేరు తెచ్చింది పావని చంద్రిక. బాలికా విద్యలో వెనుకబడిన పల్నాడు నుంచి, పైగా గిరిజన తెగకు చెందిన బాలిక పావని చంద్రిక విజయకేతనం ఎగురవేసి రాష్ట్రమంతా తన వైపు చూసేలా సత్తా చాటింది. అభినందనల వెల్లువ.. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ టాపర్గా నిలిచిన పావని చంద్రికను జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డీఈఓ చంద్రకళలు అభినందించారు. చదవులో మొదటి నుంచి పావని చంద్రిక ప్రతిభ చూపుతోంది. 8వ తరగతిలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికై ంది. ఆ తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిల్లో నిర్వహించిన టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ చూపింది. హెచ్ఎం విజయలలిత, ఉపాధ్యాయులు రమాదేవి, దుర్గాదేవి, కిరణ్ కుమారి, అబ్ధుల్ రఫీ, సీతామహాలక్ష్మి, సునీత, హనుమంతరావుల శిక్షణలో స్టేట్ టాపర్గా నిలిచింది. -
జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు
నరసరావుపేట: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లాలోని ప్రధాన రహదారులు, పలు ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ మద్యం సేవించటం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై దృష్టి సారిస్తూ విస్తృతంగా వాహనాల తనిఖీలు చేశారు. నగర శివారు ఖాళీ ప్రదేశాలు బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై దాడులు నిర్వహించి 132 కేసులు నమోదు చేశారు. సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. అలాగే జిల్లాలోని నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని వరవకట్ట, ఈపూరు మండలం బొగ్గరం గ్రామం, అచ్చంపేట, పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం, దుర్గి మండలం ఆత్మకూరు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. -
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత
నాలుగు కేజీబీవీల్లో 100 శాతం ఉత్తీర్ణత నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని ఏపీ మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87 శాతం ఉత్తర్ణత సాధించారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్ల నుంచి 1,072మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 936 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 87.31 శాతంగా ఉంది. అలాగే జిల్లాలోని 24 కేజీబీవీ పాఠశాలల నుంచి 877 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు కాగా, 763 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 87 శాతంగా ఉంది. చిలకలూరిపేట, అచ్చంపేట, నాదెండ్ల, నూజెండ్ల కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాజుపాలెం: మండలంలో పదవ తరగతి విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ–1, 2 మల్లిఖార్జునశర్మ, నరసింహరావులు బుధవారం తెలిపారు. మండలకేంద్రంలోని నవోదయ పాఠశాల నుంచి 37 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 34 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. నవోదయ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి శీలం ఈశ్వర్ 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించాడన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా మాచవరం: మండలంలోని మోర్జంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మూలగుండ్ల సాక్షితారెడ్డి 589 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలో మొత్తం 464 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాగా 334 మంది ఉత్తీర్ణులై 74 శాతం ఉత్తీర్ణత శాతం సాధించినట్లు ఎంఈఓలు డి.శ్రీధర్, ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేమవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని గంగవరపు ప్రణతి 582 మార్కులు సాధించి రెండవ స్థానంలో, మాచవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బద్దిశెట్టి గంగహర్షిత 581 మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. 88త్యాళ్లూరు జెడ్పీ పాఠశాలలో.. క్రోసూరు: పదవతరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని 88 త్యాళ్లూరు జెడ్పీ పాఠశాల 93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్ఎం వి.లక్ష్మీనారాయణరావు బుధవారం తెలిపారు. పాఠశాలకు చెందిన షేక్ షాహిద్ 587 మార్కులు సాధించాడన్నారు. ఎం.ఊర్మిళ 574, డి.శ్రేయ 572 మార్కులు సాధించినట్లు చెప్పారు. దూరవిద్యలో 52.65 శాతం ఉత్తీర్ణత నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి దూరవిద్య పరీక్షా ఫలితాలలో పల్నాడు జిల్లా 52.65 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. పరీక్షకు 1,077మంది విద్యార్థులు హాజరు కాగా 567మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే దూరవిద్య ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో 56.51 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. పరీక్షకు 1,196మంది విద్యార్థులు హాజరు కాగా, 1,128 మంది ఉత్తీర్ణులయ్యారు. దూరవిద్య అభ్యాసకులు రీ కౌంటీంగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 26వ తేదీ నుంచి మే నెల 5 వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. దూరవిద్య అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వతేదీ నుంచి 24 వరకు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు. బెల్లంకొండ: పది ఫలితాలలో మండలంలో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ బి.రాజకుమారి తెలిపారు. మండలంలో 248 మంది పరీక్షలు రాయగా 210 మంది పాసైనట్లు తెలిపారు. మండలంలోని కేజీబీవీకి చెందిన బి.ప్రసన్న 580 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
ధూళిపాళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సత్తెనపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో బుధవారం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో మృతదేహం ఉందని స్థానికులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహంపై మెరూన్ రంగు టీ షర్ట్, దానిపై ఎవరెస్ట్ అని ప్రింట్ చేసి ఉంది. గ్రే రంగు పాయింటు ధరించి ఉన్నాడు. నలుపు రంగు బెల్టు ఉండి బెల్ట్ బకెట్ ఆరంజ్, నలుపు రంగులో ఉంది. మృతుడి మెడకి రెండు తాయిత్తులు, కుడి చేతికి రబ్బర్ బ్యాండ్, నడుముకు నాలుగు పేటల నలుపు, ఎరుపు రంగుల మొలతాడు ఉంది. మృతుడు పొడవు సుమారు 5 అడుగుల 2 అంగుళాలు, నలుపు రంగులో ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు సత్తెనపల్లి రూరల్ సీఐ 94407 96231, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ 80199 98643 నెంబర్లకు తెలియ చేయాలని పోలీసులు కోరారు. వైభవంగా సీతారాముల ప్రతిష్టా మహోత్సవం అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానసాగమంలో చంచాహ్నికహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహించారు. ప్రతిష్టా సుముహుర్తమైన 8గంటలకు తొలుత యంత్ర స్థాపనచేసి యాగశాల నుంచి స్వామివార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం అత్యంత వైభవంగా జీవధ్వజ ప్రతిష్టాకార్యక్రమం నిర్వహంచారు. మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ మహా సమారాధన నిర్వహించారు. ఽవిగ్రహ ప్రతిష్ట అనంతరం మొదట ధేను దర్శనం, దిష్టికుంభం, కన్యాదర్శనం అనంతరం ప్రథమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘ప్రభుత్వ’ విద్యార్థులు గొప్పగా రాణించారు
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 598 మార్కులు జిల్లా నుంచే నమోదయిందన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 18వ స్థానంలో ఉన్న పల్నాడు జిల్లా ఈ ఏడాది 11వ స్థానానికి ఎగబాకిందన్నారు. అద్భుత ఫలితాలు సాధించడంలో కృషిచేసిన డీఈఓ చంద్రకళ, విద్యా శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులను అభినందించారు. రానున్న విద్యా సంవత్సరంలో మరింత గొప్ప ఫలితాలు సాధించేలా పని చేయాలన్నారు. డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల వల్లే 2024–25 విద్యా సంవత్సరంలో పల్నాడు జిల్లా మెరుగైన ఫలితాలు సాధించగలిగిందని అన్నారు. టాపర్లకు, చదువుల్లో వెనకబడిన విద్యార్థులకు వేరు వేరుగా లక్ష్యాలు నిర్దేశించుకుని పరీక్షలకు సన్నద్ధం చేశామన్నారు. భవిష్యత్తులో 7,8 తరగతుల నుంచి చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను పాటించనున్నామన్నారు. -
నేటి నుంచి రీజినల్ వాలీబాల్ స్పోర్ట్స్ మీట్
● హజరుకానున్న 25 జట్లు ● సత్తెనపల్లిలో నాలుగు రోజుల పాటు పోటీలు ● 27న జాతీయ స్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక సత్తెనపల్లి: క్రీడల పండుగకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ (రామకృష్ణాపురం) ప్రాంగణంలో కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి అండర్–17 బాల, బాలికల వాలీబాల్ స్పోర్ట్స్మీట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి వాలీబాల్ స్పోర్ట్స్మీట్ ఈ నెల 27 వరకు నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగనున్నాయి. దీనికిగాను 8 బాలికల జట్లు, 17 బాలుర జట్లు వెరశి మొత్తం 25 బాల, బాలికల జట్లు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్నాయి. బాలికల విభాగం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం, విజయవాడ, తెనాలి, హకీంపేట, బొల్లారం, సత్తెనపల్లి, బాలుర విభాగానికి సంబంధించి విజయవాడ–1, విజయవాడ –2, ఒంగోలు, తెనాలి, కర్నూలు, వాల్తేరు, బొల్లారం, కంచనబాగ్, హకీంపేట, సత్తెనపల్లి, హైదరాబాద్, సీఆర్పీఎఫ్, బార్కాన్, పికెట్, సూర్యలంక, ఖమ్మం నుంచి జట్లు రానున్నాయి. ఈనెల 24, 25న అండర్–17 బాలికలకు, ఈ నెల 26, 27న అండర్–17 బాలురకు పోటీలు జరుగుతాయి. జూలైలో పంజాబ్లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల జట్టును ఈ నెల 27న ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీలకు మొత్తం 260 మంది బాల బాలికలు, 40 మంది కోచ్లు, ఇతర అఫీషియల్స్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్తెనపల్లి పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. -
ఉగ్రదాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
సత్తెనపల్లి: ఉగ్రవాద దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని తాలూకా సెంటర్లోని న్యాయస్థాన ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద బుధవారం న్యాయవాదులందరూ సమావేశమై కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పౌరుల ఆత్మకు సద్గతులు కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదులు కశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన పౌరులను లక్ష్యంగా చేసుకొని వారి మతం అడిగిమరీ హిందువులను అతిహేయంగా హతమార్చారన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజవరపు శివనాగేశ్వరావు, సూరే వీరయ్య, రామిరెడ్డి, దివ్వెల శ్రీనివాసరావు, కళ్ళం వీరభాస్కర్రెడ్డి, శాస్త్రి, పూజల వెంకట కోటయ్య, చలపతి తదితరులు ఉన్నారు. -
చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాద్కు ఇంద్ర బస్సులు
నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి డిపోల నుంచి రిజర్వేషన్ సౌకర్యం చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. డిపో వినియోగదారుల అవసరాలు పరిశీలించి హైదరాబాద్, బీహెచ్ఈఎల్ మార్గాల్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రిజర్వేషన్ను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ (మియాపూర్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్) సెక్టార్లో ఇంద్ర ఏసీ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పట్టణ డిపో నుంచి 7 సర్వీసులు, అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు 7 సర్వీసులు ఉన్నాయన్నారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాద్కు డిపోనుంచి ఆయా సర్వీసులకు నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లిలో తగినంత సీట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రంగాకాలనీలో కార్డెన్ సెర్చ్ సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతురావు మాట్లాడుతూ రంగా కాలనీలో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరికలు చేశారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టడంతో రంగాకాలనీలో ఏదో జరిగిందంటూ కొంత సేపు కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. తనిఖీల్లో ఆయుధాలు ఏమి దొరక లేదని, ఎటువంటి కాగితాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని పోలీస్టేషన్కు తరలించారు. సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు. -
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
80 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం మాచర్ల రూరల్: పట్టణంలో నగల దుకాణ యజమాని ఇంటి గ్రిల్స్ తాళం పగులకొట్టి, లోపలకి వెళ్లి బీరువా పగులకొట్టి లాకర్లోని 80 గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన సంఘటన మంగళవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని 17వ వార్డు సాయిబాబా గుడి దగ్గరలో నివసిస్తున్న వుస్తేపల్లి రామలింగేశ్వరరావు (రాంబాబు) అనే అతను రామాటాకీస్ లైన్లో జ్యూయలరీ షాపు నిర్వహిస్తుంటాడు. ఉదయమే ఇంటికి తాళం వేసి భార్య ధనలక్ష్మితో కలిసి షాపునకు వెళ్ళి, తిరిగి రాత్రి 9.30సమయంలో ఇంటికి వస్తుంటారు. ఇదే క్రమంలో మంగళవారం షాపునకు వెళ్ళిన వారు తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి గ్రిల్స్ తాళం పగలకొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో లాకర్ను పగలకొట్టి అందులో వున్న 80 గ్రాముల విలువైన బంగారపు కమ్మలు, ఉంగరాలు, చైన్, నక్లెస్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. బుధవారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహులు పేర్కొన్నారు. -
విద్యార్థినికి కలెక్టర్ అభినందనలు
మాచర్ల రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. పట్టణంలోని బాలికల పాఠశాల విద్యార్థిని షేక్ సమీరా 596 మార్కులు సాధించి పట్టణంలోనే రికార్డు నెలకొల్పింది. ఆమె తండ్రి సాధారణ మోటార్ మెకానిక్ షేక్ జాన్, తల్లి అబీదా గృహిణి. షేక్ సమీరాను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళి, డీఈఓ చంద్రకళ అభినందించారు. అదేవిధంగా తమ పాఠశాల విద్యార్థిని సజ్యశ్రీకి 586 మార్కులు, ధరణికి 581 వచ్చాయని, 18 మంది 550 పైగా మార్కులు, 32 మందికి 500కి పైగా మార్కులు పొందారని హెచ్ఎం తెలిపారు. ● స్థానిక జెడ్పీహెచ్ఎస్ బాలురు పాఠశాల విద్యార్ధి బి.మల్లిఖార్జున 585 మార్కులు సాధించాడని హెచ్ఎం ఎం.రామారావు తెలిపారు. తమ పాఠశాల 95శాతం ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు. -
అగ్గి బండి వచ్చేలోపు బుగ్గి!
● అమరావతిలో అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు ● ఎటు చూసినా 30, 40 కి.మీల దూరంలో కేంద్రాలు.. అక్కడి నుంచి వచ్చేలోపు నష్టం జరుగుతున్న వైనం ● సొంత స్థలం ఉన్నా నిర్మాణానికి నోచుకోని వైనం అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన అమరావతి, పరిసర ప్రాంతాలలో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు, ప్రమాదంలో బాధితుల ఆస్తులు రక్షించేందుకు అగ్నిమాపక కేంద్రం అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రానికి స్థల సేకరణ జరిగినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఫైర్స్టేషన్ దూరంగా ఉండటం వల్ల సకాలంలో ఫైరింజన్ రాక ప్రజల ఆస్తులు అగ్నికి ఆహూతవుతున్నాయి. 30 కి.మీ దూరం నుంచి వచ్చే లోపు.. మండలంలో ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా క్రోసూరు ఫైర్ స్టేషన్పై ఆధార పడాల్సి వస్తుంది. అమరావతికి 40కి.మీ దూరంలో మంగళగిరి, 30 కి.మీ దూరంలో క్రోసూరు, సత్తెనపల్లి అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. దీంతో సమాచారం అందుకుని ఫైరింజను వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. క్రోసూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో సుమారుగా 120 నుంచి 150కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 20కి పైగా అగ్నిప్రమాదాలు నమోదు అయినట్లు సమాచారం. ఇందులో ఎక్కువశాతం సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోవటంతో ఆస్తులు బుగ్గిపాలు అయ్యాయి. ఈక్రమంలో ప్రమాదాల నివారణకు అమరావతి కేంద్రంగా మరో అగ్నిమాపక కేంద్ర ఏర్పాటు చేస్తే గుంటూరు రూట్లో నిడుముక్కల వరకు, విజయవాడ రూట్లో తుళ్లూరు వరకు, సత్తెనపల్లి రూట్లో పెదకూరపాడు వరకు, క్రోసూరు రూట్లో ఊటుకూరు వరకు ప్రమాదం జరిగిన 15 నిముషాలలో చేరుకునే అవకాశం ఉంది. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.. ప్రమాదాలు సంభవించినప్పుడు అమరావతిలో అగ్నిమాపకదళ కేంద్రం ఉంటే ఆస్తులు, ప్రాణాలను కాపాడొచ్చు. ఎక్కడో దూరం నుంచి వచ్చేటప్పటికి నష్టం జరిగిపోతుంది. గతంలో ఉన్నతాధికారులకు ఎన్నో వినతులు సమర్పిస్తే మంజూరైన అగ్నిమాపక కేంద్రానికి స్థలసేకరణ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం చేయకపోవడం శోచనీయం. – కారసాల కుమార్, రాజీవ్కాలనీ, అమరావతి జిల్లా కలెక్టర్కు నివేదిస్తాం.. గతంలో అమరావతి గ్రామ పంచాయతీ 17 సెంట్లు స్థలం ఇస్తున్నట్లు తీర్మానం చేశారు. కానీ మాకు అందులో రెవెన్యూ శాఖ 12 సెంట్లు మాత్రమే అప్పగించింది. మిగిలిన ఐదు సెంట్లకు కూడా జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున అనేకమార్లు రెవెన్యూశాఖకు రిమైండర్స్ పంపాం. ఈరోజుకు పెండింగ్ లోనే ఉంది. స్థలం 17 సెంట్లు అప్పగిస్తే గానీ అగ్నిమాపక కేంద్రానికి అంచనాలు వేస్తాం. జిల్లా కలెక్టర్కు ఈ సమస్యను నివేదిస్తాం. – శ్రీధర్, పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ -
డ్రోన్ సాంకేతికతతో అధిక దిగుబడులు
నరసరావుపేట: రైతులు డ్రోన్ సాంకేతికతను వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జేసీ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్లకు ఎంపిక కాబడిన రైతు సంఘాల కన్వీనర్లు, కో–కన్వీనర్లు, వ్యవసాయ సంచాలకులు, డ్రోన్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. వారిని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో అందజేస్తున్న డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డివిజన్, మండల స్థాయి అధికారులు రైతుసంఘాలకు తగిన సూచనలు ఇచ్చి సహాయపడాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాదికారి ఐ.మురళి మాట్లాడుతూ ఐదు నుంచి ఆరుగురు రైతులు ఒక సంఘంగా ఏర్పడి 80 శాతం సబ్సిడీతో అందజేసే కిసాన్ డ్రోన్కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో రెండు కంపెనీలైన డ్రాకో డ్రోన్ టెక్నాలజీ లిమిటెడ్ వారు రూ.9.80లక్షలు, విహంగా టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ రూ.9.81లక్షలకు డ్రోన్లు అందుబాటులో ఉంచారని, వాటిలో ఏదో ఒకటి రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలుత బ్యాంకు నుంచి 50శాతం రుణం లభిస్తుందని, అనంతరం డ్రోన్ కంపెనీ నుంచి మంజూరైన తర్వాత వ్యవసాయశాఖ ద్వారా రూ.7.84లక్షలు (80శాతం) సబ్సిడీ రైతుసంఘాల ఖాతాలకు జమచేయబడుతుందన్నారు. జిల్లాలో మండలానికి మూడు చొప్పున 84సంఘాలు లక్ష్యంగా అందజేయాలని మండల అధికారులకు నిర్ధేశించామని చెప్పారు. తొలుత మొదటి దఫాగా 43 సంఘాలకు సబ్సిడీతో డ్రోన్లు అందజేస్తామన్నారు. ఈసందర్భంగా డ్రోన్ ద్వారా అందజేసే పరికరాలను గురించి కంపెనీ ప్రతినిధులు వివరించారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బిజినెస్ మేనేజర్ జె.సుమన్, సహాయ వ్యవసాయాధికారి సీహెచ్ రవికుమార్, వ్యవసాయాధికారులు ప్రవీణ్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ డ్రోన్లు పొందే విధానంపై కలెక్టరేట్లో అవగాహన సదస్సు -
ప్రాథమిక విద్య మా గ్రామంలోనే కొనసాగించాలి
అచ్చంపేట: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తమ గ్రామంలోనే నిర్వహించాలని, పాఠశాలను పక్కగ్రామాలకు తరలిస్తే తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండలంలోని ఓర్వకల్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలు తమ గ్రామంలోనే చదువుకోవాలంటూ నినాదాలు చేశారు. ఓర్వకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు వరకు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి 1,2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి 3,4,5 తరగతుల వారిని పక్క గ్రామమైన రుద్రవరానికి మార్చారు. దీంతో ప్రాథమిక విద్య మొత్తం తమ గ్రామంలోనే నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీఈఓ, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేసిన ఓర్వకల్లు గ్రామస్తులు -
ఉపాధ్యాయుల కేటాయింపుల్లో అసమానతలు సరిదిద్దాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో నెలకొన్న అసమానతలను సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను నాలుగు రకాలుగా విభజించిన ప్రభుత్వం, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని వేర్వేరుగా నిర్ణయించడం తగదన్నారు. ఫౌండేషన్ స్కూల్లో 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్లో 20 మంది పిల్లలకు ఒకరు, హై స్కూల్ ప్రైమరీలో 10 మంది పిల్లలకు ఒక్కరు చొప్పున కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో కేటాయింపులు ఒకే విధంగా ఉండాలని అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ యూపీ పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను కేటాయించాలని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల లభ్యతను బట్టి విద్యా విధానాన్ని మార్పులు చేయటం తగదన్నారు. దీనికి బుదులుగా ఒక ఉన్నతమైన విద్యా విధానాన్ని రూపొందించి, దానికి తగ్గట్టు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవగాహన సదస్సులో జిల్లా గౌరవ అధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎం. గోవిందు, ఎండీ షకీలా వేగం, కె.రంగారావు, బి.ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి
నరసరావుపేట: జిల్లాలో ఆయుష్మాన్భవ, రాష్ట్ర వైద్యఆరోగ కుటుంబ సంక్షేమశాఖల కింద పనిచేస్తున్న తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్ల సాధనకోసం పట్టణంలోని స్టేషన్రోడ్డులో గల గాంధీపార్కు ఎదుట ఏపీ మిఢ్లెవెల్ హెల్తె ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఎ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం.అనుపమ, ఉపాధ్యక్షుడు కె.వినోధ్, జిల్లా కో–ఆర్డినేటర్ బి.సాగర్, ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ జిల్లాలో తాము 361మంది పనిచేస్తున్నామన్నారు. తామందరమూ ఆరేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్నామని, నిబంధనల ప్రకారం తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సిఫార్సుకూడా చేసిందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని తమతో పాటు పనిచేసే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దెబకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని, నిర్ధిష్టమైన జాబ్చార్టు అందజేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలుచేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ సెక్రటరీ శివానాయక్, కె.శివ, కోటి, పెద్దసంఖ్యలో సీహెచ్ఓలు పాల్గొన్నారు. నరసరావుపేటలో సీహెచ్ఓల ధర్నా -
తుమృకోట అర్చక ఇనాము భూములకు విముక్తి
తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలోని ఆలయాలకు చెందిన 56 ఎకరాల అర్చక ఇనాములకు రైతుకూలీ సంఘం వారి నుంచి విముక్తి లభించినట్లు ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి అన్నారు. మంగళవారం తుమృకోట గ్రామంలో ఆయా ఆలయాలకు చెందిన భూములకు చెందిన పత్రాలను అర్చకులకు అందచేసి మాట్లాడారు. శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ జనార్ధన స్వామి ఆలయం, శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన అర్చకమాన్యం భూములను గత మూడు సంవత్సరాల నుంచి రైతు కూలీ సంఘం వారు సాగుచేసుకుంటూ ఎలాంటి కౌలు చెల్లించలేదన్నారు. దీంతో మండల ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో కలిసి వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ భూములకు మొదటి సంవత్సరం రూ.5 వేలు, రెండవ సంవత్సరం రూ. 5,500, మూడవ సంవత్సరం రూ. 6 వేలుగా నిర్ణయించి ఈ కౌలును వారు ప్రతి ఏటా మే నెలాఖరులోపు చెల్లించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు గొట్టిపాళ్ల కృష్ణమాచార్యలు, అర్చకులు చిట్టేల మల్లిఖార్జున శర్మ, రైతులు పాల్గొన్నారు. ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రామలింగేశ్వర శాస్త్రి -
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువకండి
నరసరావుపేటటౌన్: ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువ కావాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. దీర్ఘకాలిక పెడింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. విచారణలో ఉన్న కేసుల పురోగతి, దర్యాప్తు అంశాలను పరిశీలించారు. విచారణ దశలో ఉన్న ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులకు సంబంధించి పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరక్కుండా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పోలీస్ సిబ్బంది సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టంపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు, లోన్యాప్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు మోసగాళ్ల బారిన పడకుండా కాపాడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పలు పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు -
ముగిసిన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ బూట్ క్యాంప్
పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో రెండు రోజుల నుంచి జరుగుతున్న బూట్ క్యాంప్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, హై సెక్యూరిటీ డోర్ లాకింగ్ సిస్టం, డిజైనింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ కార్డ్స్, ఈ–వేస్ట్ కలెక్షన్ వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మకతతో ప్రాజెక్ట్లను తయారు చేశారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషించబోతుందని, ఇన్నోవేటివ్ స్పిరిట్ తో విద్యార్థులు ముందడుగు వేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్ మరియు యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ అన్నారు. స్టేట్ హబ్ మెంటార్ వెంకటేష్ మాట్లాడారు. క్యాంపులో బృగుబండ, ఆర్.కె.పురం పిన్నెల్లి, అమరావతి, 75 త్యాళ్లూరు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంప్ ముగిసిన అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. హెచ్ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్చారి్జ్ కె.వి.సుబ్బారావు, మెంటర్స్ వేణు, సుజిత, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైభవంగా వ్రిగహ ప్రతిష్టా మహోత్సవాలు అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో నూతనంగా నిర్మితమైన దేవాలయంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చతుస్థానార్చనలు, శాంతిహోమాలు జరిపించారు. పవిత్ర కృష్ణానది జలాల్లో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహలను, జీవధ్వజాన్ని జలాధివాసం చేసిన అనంతరం అమరావతి పురవీధులలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. పలువురు భక్తుల వార్లు పోసి పూజలు నిర్వహించారు. 26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు లక్ష్మీపురం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బందెల నాసర్జీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఈ సంవత్సరం అమలు చేయలేమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, వెంకట్, అజయ్, అమీర్, సాయి గణేష్, చందు, కిషోర్, ఏలియా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన గోదాటి కిరణ్ (35) ఆటోలో గుంటూరులో ముగ్గురు ప్రయా ణికులను ఎక్కించుకొని బాపట్లకు బయలు దేరాడు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు దాటిన తరువాత వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఇంద్ర వాహనం ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న కిరణ్ తలకు బలమైన గాయవటంతో ఆటోలోనే అక్కడక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. చేబ్రోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ బాపట్ల పట్టణంలోని బేతానీ కాలనీ వాసిగా గుర్తించారు. -
4న శ్రీవాసవీ దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే నెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు పాలకవర్గ బాధ్యులు మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావులు మాట్లాడారు. ముందుగా ఏప్రిల్ 13వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపేందుకు నిర్ణయించి, ఆ ప్రకారం వెయ్యిమంది సభ్యులకు నోటీసులు పంపినట్టు గుర్తుచేశారు. దేవస్థానం కమిటీ జనరల్ బాడీలో సభ్యులు కానివారు, అన్య కులస్తులు వచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించిన కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలంటే కార్యవర్గం సమావేశమై, తేదీని నిర్ణయించి వెయ్యిమంది సభ్యులకు నోటీసుల ద్వారా తెలియపరచాల్సి ఉందన్నారు. నిర్ణయించిన తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ తీసుకునే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. ఎవరుపడితే వాళ్లొచ్చి, ఏవేవో పుస్తకాలు పెట్టుకుని సభ్యులు కానివారితో సహా సంతకాలు పెట్టించుకుని తామే కమిటీగా ఎన్నికయ్యాం అంటే చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 13న రసాభాసతో సమావేశం వాయిదా పడిన తర్వాత ట్రైనీ అడిషనల్ ఎస్పీ సుప్రజ వచ్చి బైలా తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. 15 రోజుల సమయం తీసుకుని సమావేశం జరుపుదామని చెప్పినట్టే, వైశ్య కులదేవత శ్రీవాసవీ అమ్మవారి సాక్షిగా మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. సభ్యులంతా హాజరై తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. అంతా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. సభ్యులకు నోటీసులు పంపుతున్నామని, ఆధార్ కార్డు, సమావేశం నోటీసు, ఐడీ కార్డు సహా సభ్యులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పోలీసు బందోబస్తుతో సభ్యులనే లోనికి అనుమతిస్తారని తెలిపారు. వక్కలగడ్డ గంగాధర్, అన్నవరపు నరసింహారావు, గ్రంధి విశ్వేశ్వరరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, గొడవర్తి సాయి హరేరామ్, సుగ్గుల మల్లికార్జునరావు, నూకల భాస్కరరావు, కొల్లా గురునాథగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నరసరావుపేటటౌన్: హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ హైమారావు తెలిపారు. మంగళవారం స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బరంపేటకు చెందిన నాగమ్మకు, అమె అల్లుడు ఆకుల కిషోర్కు మధ్య ఆస్తి వివాదం ఉంది. గుంటూరులో నివాసం ఉండే కిషోర్ మద్యం సేవించి తరుచూ వచ్చిపోతూ ఆస్తి పంచటంలేదంటూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. నాగమ్మ గృహంలో అద్దెకు ఉండే గోపిదేశి వెంకటేష్(30) చూసి అనేకమార్లు కిషోర్తో గొడవ వద్దని వారించాడు. తన అత్తకు సపోర్ట్గా వెంకటేష్ వస్తున్నాడని కక్ష పెంచుకున్న ఆకుల కిషోర్ ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఉన్న వెంకటేష్పై కర్రతో దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతూ 20వ తేదీ వెంకటేష్ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడు ఆకుల కిషోర్పై ఇప్పటికే గుంటూరులో ఎనిమిది దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ అశోక్, ఎస్ఐ లేఖ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వారంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు.. తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఎలాగైనా దేశ అత్యున్నత సర్వీసుల్లో చూడాలని కలలు కన్నారు. వారి కలలను సాకారం చేసేలా.. కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అభ్యర్థులు నిరూపించారు. ఎలాగైనా సివిల్ సర్వీసుల్లో చేరి దేశ సేవ చేయాలనే వారి సంకల్పం ముందు పేదరికం ఓడిపోయింది.. ఓటములు ఎదురైనా నిరాశపడకుండా, పట్టువిడవకుండా.. వాటినే విజయానికి మెట్లుగా మలచుకుని, విజేతలైన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మంగళవారం విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 2024 పరీక్ష ఫలితాల్లో పల్నాడు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చి.. ప్రజా సేవలో అంకితం అయ్యేందుకు సిద్ధమయ్యారు. సివిల్స్లో 146వ ర్యాంకు సాధించిన అచ్చంపేట మండల రుద్రవరంకు చెందిన పవన్ కల్యాణ్ 7న్యూస్రీల్ -
సివిల్స్లో విజయ్బాబుకు 681వ ర్యాంక్
ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా చేస్తున్న విజయ్బాబు తెనాలి: సివిల్స్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు మరోసారి విజయం సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయనకు 681వ ర్యాంకు లభించింది. ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి మధుబాబు, రాజ్యలక్ష్మిల కుమారుడు విజయ్బాబు. 2021లోనే సివిల్స్ రాసి అప్పట్లో 682 ర్యాంకు సాధించారు. 22 ఏళ్ల వయసులోనే ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్/ఐపీఎస్ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతూ సివిల్స్ రాశారు. ప్రస్తుతం 681 ర్యాంకుతో మళ్లీ మెరిశారు. -
నిండా మునిగి.. గుండె పగిలి..
కొద్ది రోజులుగా మనుషులతో మాట్లాడుతున్నాడేగానీ గుండె నిండా దిగులు పొరలే... చెమట చుక్కలు చిందించిన తన కష్టమే కాదు.. కన్న కొడుకు సంపాదన కూడా చిక్కుల్లో పడిందనే ఆలోచనలు కన్నీటి సుడిగుండాలై చుట్టుముట్టాయి. అనుకోనిది ఏదైనా జరిగితే, తన నమ్మకం మోసానికి బలైతే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులు కన్నీళ్లతో నిండిన గుండె ఉక్కిరిబిక్కిరైంది. అంతులేని ఆలోచనలతో, ఎవరికీ చెప్పుకోలేని ఆవేదనతో నరసరావుపేటలో యానిమేషన్ మోసానికి మంగళవారం ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ సభ్యులకు అంతులేని వేదన మిగిల్చింది. ప్రభుత్వానికి పట్టని బాధితుల గోడు నరసరావుపేట కేంద్రంగా సాయిసాధన చిట్ ఫండ్ అధినేత పుల్లారావు ప్రజల నుంచి సుమారు రూ.400 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై బాధితులు రోడ్డెక్కి ధర్నాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. చివరకు సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే మేమున్నామని ధైర్యం చెప్పి పంపించిన వారు అనంతరం గాలికొదిలేశారు. దీంతో బాధితులు తాము ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో అర్థంగాక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా యానిమేషన్ సంస్థ కూడా సుమారు రూ.400 కోట్లకు బోర్డు తిప్పేసిందని తెలిసి, బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా నాగేశ్వరరావు మానసిక ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి బాధితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక నేరాలకు ప్రాణాలు పోతున్నా ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే తమకు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నరసరావుపేటటౌన్: నరసరావుపేటలోని బరంపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు (48) ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. విజయవాడ కేంద్రంగా కిరణ్ అనే వ్యక్తి ప్రారంభించిన యానిమేషన్ సంస్థలో గుండా నాగేశ్వరరావు రెండేళ్లుగా పెట్టుబడులు పెడుతున్నారు. తొలుత లాభాలు రావడంతో ఏడాదిగా కుమారుడు విదేశాల నుంచి పంపుతున్న నగదుతోపాటు అప్పులు చేసి మరీ యానిమేషన్ సంస్థలో సుమారు రూ.10 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేశాడు. అయితే కొద్ది నెలలుగా ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏమి చేయాలో అర్థంగాక, విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పే ధైర్యం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. నాలుగు రోజులుగా మరింత దిగులుగా ఉన్న నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మానసిక వేధనలో బాధితులు యానిమేషన్ సంస్థలో పెట్టిన రూ.కోట్లు పోయాయని తెలుసుకున్న బాధితులు మనోవేధనకు గురవుతున్నారు. తిండి సహించక..సరిగ్గా నిద్ర పట్టక సతమతవవుతున్నారు. కోటి పెట్టుబడి పెడితే 70 శాతం వడ్డీతో రూ.1.70 కోట్లు వస్తాయన్న అత్యాశకు పోయి ఉన్న సొమ్ముతో పాటు బయట వడ్డీలకు తీసుకొచ్చి మరీ పెట్టుబడిలో పెట్టారు. అవి తిరిగి రావన్నా విషయం తెలుసుకొని లోలోపల కుమిలి పోతున్నారు. భారీ మొత్తలో సొమ్ములు పోగొట్టుకోవటంతో తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారు. అప్పులు ఇచ్చినవారికి అవి ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఉన్న ఆస్తులు అమ్మి అప్పులోళ్లకు చెల్లిస్తుండగా, మరి కొందరు డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఐపీ పెట్టెందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఒత్తిడి భరించలేకే నాగేశ్వరరావు మృతి చెందాడని అతని స్నేహితులు చెప్పుకొస్తున్నారు. ‘యానిమేషన్’ మోసానికి వ్యక్తి బలి సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిన నరసరావుపేట వాసి నాగేశ్వరరావు మోసపోయానని తెలిసి గుండెపోటుతో మృతి ఆందోళన చెందుతున్న బాధితులు ఆర్థిక నేరాలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం -
కమర్షియల్ ట్యాక్స్ ఏసీ నుంచి...
పిడుగురాళ్ల: సివిల్స్ ఫలితాల్లో పిడుగురాళ్ల వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న వావిలపల్లి భార్గవ ఆల్ ఇండియా స్థాయిలో 830 ర్యాంక్ సాధించారు. భార్గవ పిడుగురాళ్ల వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా 2025 ఫిబ్రవరిలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్న క్రమంలోనే సివిల్స్ ఫలితాల్లో 830 ర్యాంక్ సాధించటం జరిగిందని భార్గవ తెలిపారు. విజయనగరం జిల్లాలోని రాజాం గ్రామానికి చెందిన వావిలపల్లి విష్ణు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడైన భార్గవ బీటెక్ పూర్తి చేశారు. 2010 నుంచి 2019 వరకు ఎస్బీఐలో ఉద్యోగం చేసిన భార్గవ ప్రస్తుతం పిడుగురాళ్లలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని భార్గవ తెలిపారు. నిరుద్యోగ యువత తమ లక్ష్యాల పట్ల దృష్టిసారిస్తే ఉన్నత శిఖరాలను ఆధిరోహిస్తారని ఆయన సూచించారు. -
పత్తి రైతుపై విత్తన భారం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సీజన్లో సుమారు 1.22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఇందులో గుంటూరు జిల్లాలో 25 వేల హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 97 వేల హెక్టార్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇది ప్రధాన పంటల్లో ఒకటి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు సుమారు 11 లక్షల విత్తన ప్యాకెట్లు డిమాండ్ ఉంటుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 475 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర గతంలో రూ.864 ఉండగా, ప్రస్తుతం రూ.901లకు చేరింది. అంటే ప్యాకెట్కు రూ.37 పెరిగింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల రైతులపై అదనంగా రూ.4.07 కోట్ల భారం పడనుంది. గత ఏడాది సాగు సమయంలో సరిగా వర్షాలు లేక, తర్వాత అధిక వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఆ బాధ నుంచి కోలుకోకుండానే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరగడం ఇబ్బంది కలిగిస్తోంది.ధరలు పెంచడం బాధాకరం అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచడం పుండు మీద కారం చల్లినట్లే. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తుంటాను. సుమారు 30 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. అంటే విత్తనాల కోసం అదనంగా రూ.వెయ్యికిపైగానే వెచ్చించాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం. ఏటా నష్టాలు చవిచూస్తున్నాం. ఇప్పటికై నా పత్తి విత్తన ధరలను తగ్గించాలి. – వంగా నవీన్రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు రూరల్ మండలం -
కష్టపడ్డారు.. కలలు నెరవేర్చుకున్నారు
సివిల్స్లో 797వ ర్యాంకు సాధించిన సత్తెనపల్లికి చెందిన పెండెం ప్రత్యూష్సత్తెనపల్లి: లక్ష్యం, కృషి, పట్టుదల, ప్రణాళిక ఉంటే అపురూప విజయం సాధ్యమవుతుందని పేద కుటుంబానికి చెందిన విద్యార్థి నిరూపించారు. అందుబాటులోని వనరులను వినియోగించుకొని సివిల్స్ విజేతగా నిలిచారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన పెండెం ప్రత్యూష్. సివిల్స్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో ప్రత్యూష్ 797వ ర్యాంకు సాధించారు. సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ప్రత్యూష్ బాల్యం నుంచి ఎంతో ఇష్టంతో చదివారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ విజేతగా నిలిచి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 31వ వార్డు అంబేడ్కర్నగర్కు చెందిన పెండెం బాబురావు, యనమాల పద్మ దంపతుల కుమారుడు ప్రత్యూష్. తండ్రి పెండెం బాబురావు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తల్లి యనమాల పద్మ గృహిణి. ప్రత్యూష్ రెండు పర్యాయాలు ప్రయత్నించి, మూడవసారి కసితో రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో జాతీయస్థాయిలో 797వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రత్యూష్ సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివి, టెన్త్లో 9.7 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్లో 970 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యనభ్యశించాడు. 2023–24 ఆంత్రోపాలజీ ఆప్షన్గా తీసుకొని ఓ పక్క వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తూనే మరో పక్క సివిల్స్కు ప్రిపేర్ అవుతూ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించాడు. చదువుకు పేదరికం అడ్డం కాదు చదువుకు పేదరికం అడ్డం కాదు. విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యం పెట్టుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి. ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా పట్టుదలతో చదివితే ఖచ్ఛితంగా విజయం సాధించవచ్చు. – పెండెం ప్రత్యూష్, సివిల్స్ ర్యాంకర్ -
25న ‘ఏపీ గురుకులాల’ ప్రవేశ పరీక్ష
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ ఎన్.సరోజిని మంగళవారం తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 944మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. వీరికి శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్ష 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 7 పరీక్షా కేంద్రాలలో 1,706మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. వీరికి శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, శ్రీకృష్ణ చైతన్య హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోలేరమ్మ వారి వార్షికోత్సవాలు తెనాలి: స్థానిక వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని శ్రీ పోలేరమ్మ వారి ఆలయం 27వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం విశేష పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, విశేష అలంకరణతో మేళతాళాలు, కాళికా వేషం, భాజా భజంత్రీలతో తెనాలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. బుధవారం ఉదయం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చకు వినతి గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. జేఎస్సీ సమావేశం ఏర్పాటుతో అనేక అంశాలు చర్చించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. -
ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం
అమరావతి: అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రామేశ్వరం యాత్రకు వెళ్లి, గుర్తుగా రామలింగేశ్వర విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించి, స్థానికంగా ఆలయ నిర్మాణం చేశారు. అప్పటినుంచి ఆలయంలోని రామలింగేశ్వరునికి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఏళ్లతరబడి ఆదరణ లేక నిర్లక్ష్యానికి గురైంది. ఈక్రమంలో ఇటీవల గాలివానకు ఆలయ విమాన శిఖరం ఒరిగి వేలాడుతోంది. ఆలయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ శిఖరానికి దూరం నుంచి నమస్కారం చేసుకుంటే స్వామివారికి నమస్కరించినట్లేనని భక్తుల నమ్మకం. ఆటువంటి శిఖరానికి అపచారం జరిగినా పట్టించుకోని దేవాలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి విస్తరణ సలహా మండలి సమావేశాలు గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో 2024–25 ఏడాదికిగానూ కృష్ణ మండలం పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు లాంఫాం ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గత ఏడాది కార్యచరణ, సలహాల మేరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి, రానున్న ఏడాది నిర్వహించే కార్యక్రమాలు, పరిశోధన, విస్తరణపై చర్చలు జరుగుతాయన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొంటారన్నారు. ఘనంగా సివిల్ సర్వీసెస్ డే నరసరావుపేట: సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయలను అధికారులు సత్కరించారు. సోమవారం టౌన్హాలులో వారిద్దరికీ దుశ్శాలువాలు కప్పి పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలియచేశారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 3.02 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకుగాను రూ. 3,02,92,986 నగదు, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. కానుకల లెక్కింపును ఈవో పర్యవేక్షించగా, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఆలయ అధికారులు, సిబ్బంది, సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతలు గుంటూరు లీగల్ : జిల్లా జడ్జిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.కల్యాణ్ చక్రవర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ తుబాటి శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మనాయక్లు న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. సెక్రటరీ నవీన్, స్టేట్ జనరల్ సెక్రటరీ పి. రాంగోపాల్, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య, శేషగిరి, హరిబాబు, ఖాజా, కల్యాణి పాల్గొన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 202527న చండీ హోమం దుగ్గిరాల: కంఠంరాజు కొండూరు లోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 27న అమావాస్య సందర్భంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ కె. సునీల్ కుమార్ తెలిపారు. దేవస్థానం వార్షికోత్సవం క్రోసూరు: క్రోసూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శీతలాంబ ఆలయ వార్షికోత్సవం ఫిరంగిపురం: వేమవరం గ్రామంలో శీతలాంబ ఆలయం 34వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పొంగించి, మొక్కులు తీర్చుకున్నారు. 7న్యూస్రీల్ -
యానిమేషన్ స్కాంలో రూ. కోట్లు పోతున్నా ఫిర్యాదుకు బాధితులు వెనకడుగు
న్యాయపరంగా నిలుస్తాయా..? ఇలాంటి పత్రాలను పట్టుకొని ఏ కోర్టు మెట్లు ఎక్కినా ఉపయోగం లేదన్న భావన బాధితుల్లో నెలకొంది. దీంతో పాటు లెక్కల్లో చూపని బ్లాక్మనీ అధిక మొత్తంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారికి ఒత్తిళ్లు అధికమయ్యాయి. యానిమేషన్లో పెట్టిన డబ్బులు తిరిగిరావని భావించిన బాధితులు ఉన్న ఆస్తులను అమ్మి తెచ్చిన అప్పులను తీర్చే పనిలో ఉన్నారు. మరికొంత మంది ఉన్న ఆస్తుల కంటే అప్పులు అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
వేగవంతంగా మాదిపాడు బ్రిడ్జి నిర్మాణం
అచ్చంపేట: మండల సరిహద్దులోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై వంతెన నిర్మాణ ఆవశ్యకతను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అభ్యర్థన మేరకు 2023 జూన్ 12న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మాదిపాడు నుంచి ముక్త్యాలవరకు కృష్ణానదిపై 600 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పు, 14 పిల్లర్లతో వంతెన నిర్మాణం చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం కృష్ణానదిలో రెండు పిల్లర్లకు అవసరమైన ఐరన్ బిగించి, బీములను భూమి లెవెల్ వరకు పోశారు. బ్రిడ్జి నిర్మాణానికి 13.45 ఎకరాల భూ సేకరణ వంతెనకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 13.45 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకుగాను రూ.60.50 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారు. పల్నాడు జిల్లా మాదిపాడు వైపు 4.45 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాలవైపు 9 ఎకరాల భూమిని సేకరించారు. బ్రిడ్జి పొడవు 450మీటర్లు కాగా, వెడల్పు 12మీటర్లు. ముక్త్యాలవైపు కిలోమీటరు, మాదిపాడు వైపు అరకిలోమీటరు రోడ్డు వేయనున్నారు. కృష్ణానదిపై 14 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన 13.45 ఎకరాలు భూసేకరణ చేసి రూ.60.50 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వం -
అంతా..గప్చుప్
మూడు స్కీములు, ఆరు స్కాములతో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సాయి సాధన ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణ వాసులు తాజాగా యానిమేషన్ స్కాం మాయలో పడి నిండా మునిగారు. రూ.వందల కోట్లు పెట్టుబడులు పెట్టినా సరైన ఆధారాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలీక లోలోన మధన పడుతున్నారు. పోలీస్ స్టేషన్ గడప తొక్కితే అసలు పెట్టుబడి పెట్టిన కాసులకు లెక్కలు అప్పజెప్పమంటారేమోనని వెనకడుగు వేస్తున్నారు. సాయిసాధన చిట్ఫండ్ స్కాం జరిగి మూడు నెలలు అవుతున్నా బాధితులకు నేటికీ ప్రభుత్వం నుంచి న్యాయం జరగకపోవడంతో ఇక తమకేమి భరోసా వస్తుందన్న మీమాంసలో యానిమేషన్ స్కాం బాధితులున్నారు. ● విజయవాడ కేంద్రంగా యానిమేషన్ స్కాం.. బాధితుల్లో నరసరావుపేట వాసులే అధికం ● ఒక్కొక్కరి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన స్కామర్ కిరణ్ ● కనీసం కార్యాలయ సీల్, అడ్రస్ కూడా లేకుండా అగ్రిమెంట్ కాగితాలు జారీ ● న్యాయపరంగా వెళ్లాలంటే చెల్లవేమోనన్న భయం ● పెట్టుబడి పెట్టింది బ్లాక్మనీ కావడంతో ఫిర్యాదుకు అవకాశం లేదంటూ వాపోతున్న వైనం ● అధిక వడ్డీల ఆశతో గుల్లవుతున్న ప్రజలు సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట టౌన్: సాధారణంగా రూ.వెయ్యి పోతే.. పోలీస్స్టేషన్కు పరుగులు తీసి ఫిర్యాదు చేస్తాం. దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే వెంటనే అతన్ని పట్టుకొని నగదు రికవరీకి ప్రయత్నిస్తాం. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.400 కోట్లకు పైగా మోసం చేసిన వాడు ఎవడో తెలుసు.. అయినా ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు అందడం లేదు. బాధితుల సంఖ్య సుమారు వందల్లో ఉన్నా ఒక్కరూ ముందుకు రాకపోతే తామేమి చేయలేమని పోలీసులు చేతులెత్తుస్తున్నారు. ఇది యానిమేషన్ స్కాం ఉదంతంలో బాధితులు తీరు. విజయవాడ కేంద్రంగా యానిమేషన్ ప్రోగ్రామింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ ఆర్థిక నేరానికి తెరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితుల్లో నరసరావుపేట వాసులు అధికంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేకమంది స్తోమతకు మించి అప్పులు చేసి మరీ భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కిరణ్ మోసం చేసి పరారవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీల్ కూడా లేని అగ్రిమెంట్ కాపీలు... రూ.లక్ష పెట్టుబడి పెట్టే సమయంలో సైతం ఇరువర్గాల మధ్య జరిగే అగ్రిమెంట్లు చాలా పక్కాగా ఉండేలా చూస్తారు. అలాంటిది పదుల కోట్ల రూపాయాలను యానిమేషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా సరైనా పత్రం బాధితుల వద్ద ఒక్కటీ లేదంటే స్కాం ఎంత పక్కాగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ పేరుతో పెట్టుబడిదారులకు జారీ చేసిన ఒప్పంద పత్రాలలో ఎక్కడా కంపెనీ పర్మినెంట్ అడ్రస్ లేదు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయాన్ని నెల రోజుల క్రితం ఖాళీ చేయడంతో బాధితులకు ఎక్కడికిపోవాలో కూడా పాలుపోవడం లేదు. మరోవైపు అగ్రిమెంట్ కాపీలో పెట్టుబడులు స్వీకరించే కంపెనీ సీలు ఉండటం రివాజు. అయితే యానిమేషన్ కంపెనీ జారీ చేసిన అగ్రిమెంట్లలో ‘ఓకే’ అన్న అక్షరాలతో మాత్రమే సీల్ వేసి స్కామర్ కిరణ్ సంతకం చేసిన పత్రాలను జారీ చేశారు. రూ.వందల కోట్ల విలువైన కంపెనీకి సీల్ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించలేదంటే బాధితులు అధిక వడ్డీలకు ఆశపడి ఎలా మోసపోయారో అర్థమవుతోంది. పెట్టుబడి పెట్టిన వారికి జారీ చేసిన ఒప్పంద పత్రాలలో ‘ఓకే’ అని మాత్రమే ఉన్న సీల్ 2.5 లక్షల టన్నుల ఇసుక నిల్వచేయండి నరసరావుపేట: వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోనున్న కారణంగా జూన్ నాటికి జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వచేయాలని, అందుకు స్టాక్ పాయింట్లు గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. అన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక నిర్వహణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రీచుల్లో ఇసుక తవ్వకాల కోసం ఏజెన్సీల నియామక ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ముందుగా దిడుగు–1 రీచ్లో ప్రయోగాత్మకంగా నామినేషన్ విధానంలో ఏజెన్సీని నియమించాలన్నారు. నామినేషన్ విధానం ఫలితాలను బట్టి మిగిలిన రీచుల్లో ఏజెన్సీల నియామకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలోని ఐదు ఇసుక రీచులలో అక్టోబరు వరకు తవ్వకాలు చేపట్టేందుకు పర్యావరణశాఖ నుంచి అనుమతి లభించిందన్నారు. దీంతో 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అందుబాటులోకి వస్తుందన్నారు. అంబడిపూడి–1,2,3 రీచులు, కోనూరు –1 రీచుల్లో అక్టోబరు 22 వరకు, దిగుడు –1 రీచులో డిసెంబరు 30 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతి లభించిందన్నారు. సదరు రీచుల పర్యవేక్షణకు ఇన్చార్జిలను నియమించాలని ఆదేశించారు. జిల్లా మైన్స్ – జియాలజీ అధికారి నాగిని, ఆర్డీఓ రమణాకాంత్రెడ్డి, జిల్లా రవాణా అధికారి సంజీవ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పలు సంక్షేమ పథకాలు, వసతులను కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాన్సిషన్ కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ అరుణ్బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఆర్డీఓ మధులత, డీఈఓ ఎల్.చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్పందించని ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోటు ఆర్థిక నేరాలు వెలుగుచూస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాఽధితులకు న్యాయం చేయకపోగా నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఇటీవల సాయిసాధన చిట్ఫండ్ స్కాం బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
● జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ● పీజీఆర్ఎస్లో 410 వినతులు స్వీకరణ నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన వినతులను తమ సొంత సమస్యగా భావించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, 48 గంట్లలో పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. నరసరావుపేట నియోజకవర్గస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం స్థానిక టౌన్న్ హాలులో సోమవారం నిర్వహించారు. దీనికి వివిధ ప్రాంతాలకు చెందిన 410 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టరు, జేసీ సూరజ్ గనోరే, ఇతర అధికారులు స్వీకరించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఐ.మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.మధులత పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయాలి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో మూడుసెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండుసెంట్లు చొప్పున సుమారు 3వేలమందికి ఇళ్ల స్థలాలు అందజేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. విప్పర్లపల్లిలో 40ఏళ్ల నుంచి ఉంటున్న ఎస్సీ వర్గాలవారికి పట్టాలు మంజూరు చేయాలి. – కాసా రాంబాబు, సత్యనారాయణరాజు, సీపీఐ నాయకులు అసెంబ్లీ తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. సవరణ బిల్లులోని అంశాలన్నీ రాజ్యాంగ వ్యతిరేకం. ఈ చట్టంతో ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. సవరణ చట్టంకు ముందున్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలుచేయాలి. –షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఉద్యోగం కల్పించరూ.. మేము దివ్యాంగులం. ఇద్దరం పదోతరగతి వరకు చదువుకున్నాం. మాకెటువంటి ఆదరువు లేదు. ఉపాధి కల్పించి న్యాయం చేయండి. –కనుమూరి గోపి, సంతోషి, అంధ దంపతులు, అప్పాపురం రూ.5వేలు బోనస్ ప్రకటించాలి ప్రభుత్వం మిర్చి రైతుకు ప్రకటించిన మద్దతు ధర రూ.11,784లు ఏమాత్రం గిట్టుబాటు కాదు. రైతుల వద్ద నుంచి రూ.6వేలు, రూ.7వేలకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్యార్డులో అమ్ముకున్న రైతుల వివరాలు ఆర్బీకేలలో ప్రకటించాలి. తక్కువధరకు అమ్ముకున్న ప్రతి రైతుకు క్వింటాకు రూ.5వేలు బోనస్ ప్రకటించాలి. అలా చేస్తేనే రైతు నష్టాల బారినుంచి బయటపడి వచ్చే ఏడాది మళ్లీ సాగుచేయగలడు. –ఏవూరి గోపాలరావు, ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి రెండోసారి అర్జీ ఇస్తున్నా.. ఆరోగ్యం కోసం చేసిన అప్పును తీర్చేందుకు ఉన్న ఇంటిని అమ్ముతానంటే కుమారులు ఒప్పుకోవడం లేదు. నాకు ఐదుగురు కుమారులు, భార్య చనిపోయింది. నా ఇంట్లో ముగ్గురు కుమారులు నివాసం ఉంటున్నారు. నేను రెండో కుమారుడితో ఉంటున్నాను. చేసిన అప్పు తీర్చమంటే తీర్చరు. నేనే తీరుద్దామని ఇల్లు అమ్ముతానంటే చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిపై చిలకలూరిపేటలో పీజీఆర్ఎస్ పెట్టిన సమయంలో అర్జీ పెట్టుకున్నా. అధికారులు ఎవరూ స్పందించలేదు. –దౌరావత్ చినబికారీ నాయక్, చిలకలూరిపేట -
భళా.. రామకృష్ణ విద్యా తృష్ణ
● 58 ఏళ్ల వయస్సులో కార్డియాలజీ పీజీ పూర్తి చేసిన గుంటూరు వైద్యుడు ● గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుదైన రికార్డు ● నాలుగు పీజీలు పూర్తి గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. కార్డియాలజీలో పీజీ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు పీజీ వైద్య విద్యలు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ అభ్యసించారు. ఇన్ఫెక్షన్ డిసీజెస్, డయాబెటాలజీలో డిప్లొమో కోర్సులు పూర్తి చేశారు. చావలి వాస్తవ్యులు గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలికి చెందిన గాజుల వీరశేఖరరావు, లీలావతి దంపతుల కుమారుడు రామకృష్ణ గుంటూరు ఎల్ఈఎం స్కూల్లో 7వ తరగతి వరకు చదివారు. బాలకుటీర్ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు, గుంటూరు జేకేజీ కళాశాలలో ఇంటర్ అభ్యసించారు. గుంటూరు వైద్య కళాశాలలో 1986 – 92లో ఎంబీబీఎస్, 1998– 2000లో పల్మనాలజీలో పీజీ చేశారు. 2001 నుంచి 2004 వరకు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ట్యూటర్గా పని చేశారు. 2006 నుంచి 2009 వరకు జనరల్ మెడిసిన్లో గుంటూరులో పీజీ అభ్యసించారు. 2009 నుంచి 2011 వరకు గుంటూరు జీజీహెచ్లో జనరల్ మెడిసిన్ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతి సిమ్స్లో న్యూరాలజీలో పీజీ వైద్య విద్యను అభ్యసించారు. 2014 నుంచి నేటి వరకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ 2022లో అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. పీజీ నీట్ ఎంట్రన్స్లో ర్యాంకు సాధించి కార్డియాలజీ సూపర్స్పెషాలిటీ పీజీలో మంగళగిరి ఎన్నారైలో చేరారు. నేడు విజయవంతంగా కార్డియాలజీ పీజీ కోర్సు పూర్తి చేసుకుని, నాలుగు పీజీలు చదివిన ఏకై క వైద్యుడిగా అరుదైన రికార్డు డాక్టర్ రామకృష్ణ సొంతం చేసుకున్నారు. క్రీడల్లోనూ ప్రతిభ తిరుపతిలో పీజీ వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో డాక్టర్ గాజుల రామకృష్ణ 86 స్పోర్ట్స్ మెడల్స్ దక్కించుకున్నారు. 33 న్యూరాలజీ క్విజ్ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో నేషనల్ క్విజ్ పోటీలో విన్నర్గా నిలిచారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
డీఎఫ్ఓ శ్రీధర్బాబు దాచేపల్లి: వేసవిలో అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్ఓ) పి.శ్రీధర్బాబు కోరారు. మండలంలోని గామాలపాడు సాగర్ సిమెంట్స్లో అగ్నిమాపకాలు – వాటి నివారణపై కార్మికులకు సోమవారం అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎఫ్ఓ మాట్లాడుతూ.. పనిచేసే చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, పని చేసే ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఎప్పుడు పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, భవనాలు, లిఫ్ట్లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మెట్ల మార్గాలను ఉపయోగించాలని సూచించారు. పరిశ్రమల్లో పచ్చదనం పెంపుదల కోసం చెట్లను ఎక్కువగా పెంచుతారని, వేసవిలో చెట్లు కొంతమేర ఎండిపోవటం వలన అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని వివరించారు. పరిశ్రమల్లో విద్యుత్ ఉపకరణాల పనితీరును తరచుగా పర్యవేక్షించాలని, చమురు లీకేజీలు గుర్తించి అగ్నిప్రమాదాలు జరగకుండ ముందస్తుగానే నివారించాలని చెప్పారు. అనంతరం కార్మికులు, విద్యార్థులకు వ్యాచరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, అధికారులు నరేందర్రెడ్డి, నవీన్రెడ్డి, నాగేశ్వరరావు, వీరప్రకాష్, నాగభూషణం, నరసింహులు, భరత్భూషణ్, రామకృష్ణ, మనోజ్కుమార్ పాల్గొన్నారు. -
ముందే మూసినా.. కిక్కురుమనరు!
చిలకలూరిపేట: మద్యం సిండికేట్లు మరోమారు వైన్షాపుల వేళలు కుదించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఆరు వైన్షాపులు, పురపాలక సంఘంలో విలీన గ్రామం గణపవరంతో కలిపి 11 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఆరు వైన్షాపులు, 10 బార్ షాపుల వారు సిండికేట్గా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇంకేముంది వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. బార్షాపుల్లో కన్నా వైన్షాపుల్లో మద్యం రేట్లు తక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. వైన్ షాపుల కన్నా బార్షాపుల్లో క్వార్టర్కు రూ. 50 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. వైన్ షాపులు మూసివేయాల్సిన సమయం రాత్రి 10 గంటలు కాగా, బార్ షాపులు రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ల వారు, వైన్ షాపుల యజమానులు గత మార్చిలోనే సిండికేట్గా ఏర్పడి వైన్షాపుల సమయం రాత్రి 10 నుంచి 9గంటలకు అనధికారికంగా తగ్గించారు. ఈ విషయమై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో కొద్దిరోజులు వెనకడుగు వేసిన మద్యం సిండికేట్లు మళ్లీ చెలరేగుతున్నారు. పట్టించుకోని అధికారులు గత మూడు రోజుల నుంచి తిరిగి రాత్రి 9గంటలకే వైన్ షాపులు మూసివేస్తున్నా, నిబంధనలు అమలు పరచాల్సిన ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైన్షాపుల్లో మద్యం సేవించేందుకు అనుమతులు లేకున్నా దర్జాగా అనధికార పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్నారు. దుకాణదారులంతా అధికారపార్టీకే చెందిన వారు కావడంతో వారికి అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. రాత్రిళ్లు వైన్షాపుల సమయం అధికారికంగా తగ్గించటంతో గతిలేని పరిస్థితుల్లో బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లి అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని మందుబాబులు వాపోతున్నారు. వారు ఆడిందే ఆట... రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆటగా మద్యం వ్యవహారం నడుస్తోంది. చిలకలూరిపేట పట్టణ పరిధిలో మూడు బార్ అండ్ రెస్టారెంట్లను సత్తెనపల్లికి చెందిన ఓ మద్యం వ్యాపారి నిర్వహించేవాడు. గత ఏడాది జూలైలో ఈ మూడు షాపులపై కొందరు అధికార పార్టీ నాయకులు తమకు 50శాతం వాటా ఇవ్వాలని దౌర్జన్యానికి దిగడంతో దిక్కులేని పరిస్థితుల్లో మద్యం వ్యాపారి మూడు దుకాణాలను మూసివేసి, నష్టానికి షాపులను విక్రయించుకొని వెళ్లి పోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఎవరివో లాభాల కోసం నిబంధనలకు విరుద్దంగా వైన్షాపులు సమయం కన్నా ముందు మూసివేయడం సరికాదని మందుబాబులు విమర్శిస్తున్నారు. చిలకలూరిపేటలో వైన్షాపులను గంట ముందే మూసివేస్తున్న వైనం పట్టించుకోని అధికారులు -
గ్రంథాలయాల అభివృద్ధికి ఉద్యమించాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధిని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు శ్రీనాథ సాహితీ పరిషత్, ఆంధ్ర చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడురోడ్డులోని కార్యాలయంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు ప్రజలు తాము చెల్లించే పన్నులో 8 శాతం గ్రంథాలయాల పన్నుగా ఉంటుందన్నారు. ఆ నిధులతో గ్రంథాలయాల ఏర్పాటు, అభివృద్ధిని ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గ్రంథాలయాల పరిరక్షణకు ఈనెల 27వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పల్నాడు జిల్లాలో గ్రంథాలయాల అభ్యున్నతికి స్వర్ణ చినరామిరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ఈసందర్భంగా గ్రంథాలయ పునర్వికాస వేదిక పల్నాడు జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్గా చినరామిరెడ్డి, కో–కన్వీనర్గా షేక్ బాజీ, సభ్యులుగా బత్తుల మురళి, ఈవూరి వెంకటరెడ్డి, డి.వెంకటేష్, ఎస్.వి.చలమారెడ్డి తదితరులను నియమిస్తూ నిర్ణయించారు. అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్చంద్ర జ్యోతిశ్రీ, జిల్లా కార్యదర్శి కోసూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేట: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిసానంటూ ఓ వ్యక్తి తన వద్ద నుంచి రూ.6లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ నరసరావుపేట పట్టణం కొండలరావుపేటకు చెందిన మల్లికార్జునరావు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీలు తదితర సమస్యలకు సంబంధించి 94 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయ పీజీఆర్ఎస్కు 94 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ సంతోష్ -
సత్తెన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి సత్తెనపల్లి: సత్తెన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి పిలుపునిచ్చారు. పట్టణంలోని తాలూకా సెంటర్లో సోమవారం సత్తెన్న విగ్రహ మూడవ వార్షికోత్సవం జరిగింది. పట్టణ, నియోజకవర్గ వడియ రాజుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సత్తెన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవళ్ళ మురళి మాట్లాడుతూ సత్తెన్న ఆశయ సాధన కోసం వడ్డెరలంతా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ముఖ్యంగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. కొండ కోరీలు అనేవి వడ్డెరుల హక్కు అని, ప్రస్తుతం వాటిని కొన్ని రాజకీయ పార్టీలు కొల్ల గొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ కోరీలలో 30 శాతం లీజులు లేకుండా కేటాయించాలని, కాంట్రాక్ట్ పనులలో ఈఎండీ లేకుండా 30 శాతం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెర సంఘ నాయకులు బత్తుల సాంబశివరావు, కొమెర శివశంకరరావు, కందులూరి నాగేశ్వరరావు, దేవళ్ల నాగయ్య, తిరుపతి సురేష్, వేముల వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సత్తెన్న ఆశయ సాధనే లక్ష్యం.. సత్తెనపల్లి: సత్తెన్న ఆశయ సాధనే లక్ష్యంగా పని చేద్దామని ఏపీ వడియరాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, హైకోర్టు న్యాయవాది వేముల బేబీ రాణి పిలుపు నిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్లో సత్తెనపల్లి గడ్డ ఎత్తిన సత్తెన్న విగ్రహావిష్కరణ మూడో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సత్తెన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డెర సంఘ నాయకులు ఒంటిపుల్లి నాగేశ్వరరావు, వేముల శ్రీదేవి, పల్లపు లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. -
అకాల వర్షం .. పొగాకు రైతుకు తీవ్ర నష్టం
కన్నీటి పర్యంతమవుతున్న రైతులు పెదకూరపాడు: ఆరుకాలం శ్రమించి సాగుచేసి పండించిన పంట చేతికి అందేలోపు జారిపోయింది. అపార నష్టం మిగిల్చింది. రైతుల కంట కన్నీరు మిగిల్చింది. పెదకూరపాడు నియోజకవర్గంలో 300 ఎకరాల్లో సాగు చేసిన పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెదకూరపాడు మండలంలో ఈ ఏడాది పొగాకును గణనీయంగా సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షంతో సుమారు 30 ఎకరాల్లో పంట, దిగుబడులు తడిచిపోవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. తగలబెడుతున్న వైనం.. పెదకూరపాడుకు చెందిన షేక్ యాసిన్ అనే రైతు ఆరు ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ఓ పొగాకు కంపెనీవారు టన్ను రూ.1.08లక్షలకు బేరం ఆడి వెళ్లారు. పంట కంపెనీకి తరలించేందుకు వారం రోజుల ముందు పంటపొలంలోనే పొగాకును ఆరబెట్టారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షంతో పొగాకు తడిసి, ముద్దయి.. అనంతరం మెత్తబడింది. రెండు రోజుల్లోనే నల్లగా రంగుమారి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంటను చూసి రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దిగుబడి అయిన నలుగు టన్నులతో పాటు పంట పొలంలో ఉన్న నాలుగు టన్నుల పంట కూడా తడిచి చీకి పోవడంతో కంపెనీ వారు కొనుగోలు చేయడం లేదని, మొత్తం రూ.10 లక్షల వరకు నష్టం రావండతో పొగాకును కాల్చివేశసినట్లు యాసిన్ తెలిపారు. -
డీఎస్సీ నియామకాలపై అభ్యర్థుల పెదవి విరుపు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డీఎస్సీ–2025 షెడ్యూల్ అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు జూన్ ఆరో తేదీన పరీక్షల ప్రారంభానికి మధ్యలో 45 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అంత తక్కువ కాలంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యమేనా ? అని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందనిసంతోషించాలో, సన్నద్ధమయ్యేందుకు కనీసం గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడాలో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులుడీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా చూపారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీషు 69, మాధ్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలాజికల్ సైన్స్ 86, సోషల్ 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166తో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 521 ఉన్నాయి.మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణడీఎస్సీ–2025కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు గడువు ఇచ్చారు. మే 20 నుంచి మాక్టెస్ట్లు జరగనున్నాయి. మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డోన్లోడింగ్, జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరు వరకు ఆయా కేటగిరీల వారీగా పరీక్షలు జరగున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాధమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి, మెరిట్ ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో పొందుపర్చారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలా..భర్తీ చేయనున్న పోస్టులు : 1,143ఎస్జీటీ పోస్టులు: 52145 రోజులు సరిపోవుఏడేళ్ల అనంతరం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్టు నిపుణులూ అదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ కోసం 30వేల మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.90 రోజుల వ్యవధి అవసరండీఎస్సీ దరఖాస్తు గడువు, పరీక్షలకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది. విస్తృత సిలబస్ను పూర్తి చేసేందుకు 45 రోజులు సరిపోవు. విద్యాశాఖ హడావుడిగా షెడ్యూల్ ఖరారు చేసింది. కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలి. 2018 తరువాత చేపడుతున్న డీఎస్సీ కావడంతో వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో 46ఏళ్లకు వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 47ఏళ్లకు పెంచాలి.– కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
వీధి వ్యాపారులపై ఆశీలు భారం
తెనాలి: పట్టణంలో చిరు వ్యాపారులపై మున్సిపాలిటీ ఆశీలు భారం మోపింది. రోజుకు రూ.10 వసూలు చేస్తున్న ఆశీలు మొత్తాన్ని ఇప్పుడు ఏకంగా రూ.30లకు పెంచింది. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వ్యాపారులకు మున్సిపాలిటీ నిర్దయతో భారమైంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఎదుగూ బొదుగూ లేని ఆదాయంతో జీవిస్తున్న తమపై అదనపు భారాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం.. వీధులనిండా తోపుడుబండ్లు, ఫుట్ఫాత్లన్నీ ఆక్రమణలే! అన్న వ్యాఖ్యలు తరచూ వింటుంటాం. స్ట్రీట్ వెండర్లు, హాకర్లుగా పిలిచే ఈ చిరువ్యాపారులు ట్రాఫిక్కు అవరోధమని భావించటం పరిపాటి. ప్రభుత్వ అధికారులు, పోలీసుల అదిరింపులు, బెదిరింపులు, పౌరుల ఛీత్కారాల మధ్య బతుకుదెరువు కోసం అలసట లేని జీవనపోరాటం వారిది. జీవించడానికి వేరే ఏమార్గం లేక, కొద్దిపాటి పెట్టుబడితో రోడ్డుపక్కనే ఉపాధిని ఏర్పాటుచేసుకునే చిరువ్యాపారులు పట్టణ పంపిణీ వ్యవస్థలో ముఖ్యభూమిక వహిస్తున్నారు. పట్టణ ప్రజాజీవనంలో వీరి పాత్రను విభజించలేం. పెద్ద షాపులకు వెళ్లి హెచ్చుధరలు పెట్టలేని ప్రజలకు నిత్యావరాలైన కూరగాయలు, పండ్లు, పూలు, గాజులు.. ఇలా ఒకటేమిటి? సమస్త ఉత్పత్తులను అందుబాటులో ఉండే ధరల్లో అందిస్తున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికారులు, ప్రజలకు వీరంటే చిన్న చూపే. స్థానికంగా ఉండే పోలీస్, మున్సిపల్ సిబ్బంది కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి తమ సరుకులను నష్టపోతుంటారు. ఏ రాజకీయ నాయకుడో సభ పెట్టారంటే ఆరోజు వ్యాపారం లేనట్టే. మరికొన్ని సందర్భాల్లో పోలీసు కేసులను ఎదుర్కొవటం, జరిమానా చెల్లించటం అనివార్యం. వాస్తవంలో వారి హృదయాలను తట్టిచూసే ఓపికా, తీరికా మాత్రం ఎవరికీ లేవు. తెనాలిలో 1700 మంది వీధి వ్యాపారులు పట్టణంలోని స్ట్రీట్వెండర్లు, హాకర్లు గతేడాది అధికారికంగా 1650 వరకు ఉన్నారు. ఈ సంవత్సరం వారి సంఖ్య 1700 పైగానే ఉంటుందని అంచనా. వీరిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, మొక్కజొన్న కండెలు, కొబ్బరి బోండాలు దుస్తులు, చిన్నచిన్న వస్తువులు విక్రయించేవారే అధికం. ప్రధానంగా మార్కెట్ ఏరియా, మెయిన్రోడ్డు, గాంధీచౌక్, శివాజీచౌక్, చెంచుపేట, నెహ్రూరోడ్డులో అధికంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో రోడ్డు వెంట ఉండే అమ్మకాలు చేస్తుండే చిరువ్యాపారులు కనిపిస్తుంటారు. ఎక్కువగా సైకిళ్లపై వ్యాపారాలు చేస్తుంటారు. ఇరువైపులా వ్యాపార దుకాణాలు ఉండే మెయిన్రోడ్డు ‘తోపుడుబండ్ల వ్యాపారుల హబ్’ అంటారు. ఉదయం పూట రోడ్డుకు రెండుపక్కలా పదులసంఖ్యలో మహిళలు రోడ్డుపైనే గంపలు లేదా నేలపైనే కూరగాయలు, పూలు, పండ్లు పార్ట్టైమ్ అమ్మకాలు చేస్తుంటారు. స్థానికులతోపాటు సమీపగ్రామాల్నుంచి వీరంతా పట్టణానికి వచ్చి ఉపాధిని పొందుతుంటారు. యువకులు, సీ్త్రలు, వృద్ధులు సైతం స్ట్రీట్ వెండర్లుగా జీవనం గడుపుతున్న దృశ్యాలు ఎటుచూసినా కనిపిస్తాయి. ఎండలో ఎండుతూ వర్షాలకు తడుస్తూనే వ్యాపారాలు చేస్తుంటారు. వర్షాలు బాగా కురిసే రోజుల్లో ఏరోజైనా కాసేపు తెరిపివ్వకపోతే ఆ రోజుకు నాలుగు రూపాయలు కళ్లచూసే అవకాశాన్ని కోల్పోతారు. ఏకంగా రూ.10 నుంచి రూ.30కు పెంపుదల రోజూ రూ.30 చెల్లించలేం అంటున్న చిన్నవ్యాపారులు పట్టణంలో స్ట్రీట్వెండర్లు, హాకర్లు రెండు వేలకు పైమాటే! ఆశీలుపై ఆవేదన ఇలా అవస్థలు పడుతూ వ్యాపారాలు చేస్తూ పొట్టపోసుకునే చిరువ్యాపారులు కూడా చాలామందికి ఆదాయ వనరులయ్యారు. తమ దుకాణం లేదా ఇంటి ముందు రోడ్డుపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల నుండి రోజుకింతని యజమానులు వసూలు చేసుకుంటూ ఉంటారు. అదేమని అడిగితే ఆ మాత్రం చోటు కూడా ఇవ్వరని, వారు అడిగిన మొత్తం ఇచ్చేస్తుంటారు. ఇలాంటి వారినుంచి రోజుకు రూ.100 వరకు తేరగా వసూలుచేసే యజమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పట్టణ మున్సిపాలిటీ ఒక్కో చిరువ్యాపారి నుంచి రోజుకు రూ.30 చొప్పున వసూలు చేస్తోంది. ఇంతకుముందు రూ.10 చొప్పున వసూలు చేసే ఆశీలు ఇప్పుడే ఏకంగా రూ.30 వరకు పెంపుదల చేశారు. మార్కెట్ షాపులను వేలంపాట నిర్వహించిన తర్వాత వేలం పాడుకున్న వ్యాపారి, చిన్నచిన్న వ్యాపారుల నుండి కూడా రోజుకు రూ.30 వసూలుచేస్తున్నారు. ఇది తమకు భారంగా పరిణమించిందని వారంతా ఆవేదన పడుతున్నారు. ఆశీలు భారం తగ్గించాలని కోరుతున్నారు. -
నేడు టౌన్హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నరసరావుపేట: నరసరావుపేట పట్టణంలోని టౌన్హాలు వేదికగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నరసరావుపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఘనంగా చెన్నుని పుష్పయాగం మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. పట్టాలు తప్పిన సర్వీసు రైలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు యువకుడి దుర్మరణం వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. టీడీపీ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కుమ్మరి బజారులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక రణాహుస్సేన్ బజారుకు చెందిన షేక్ గౌస్బాషా (చంటి)(22) శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతనిని స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం కొంతసేపటికి అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు సండ్రపాటి సైదా, డాక్టర్లు కేఎల్రావు, కాసుల పార్వతి తదితరులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు చంటి స్థానిక నిమ్స్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు ఉన్నారు. -
సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి
కేంద్రంలో బీజేపీ పొత్తుతో, రాష్ట్రంలో ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వక్ఫ్ సవరణ చట్టం వల్ల మైనార్టీలో అతిపెద్దదైన ముస్లిం వర్గాలకు మతపరమైన రాజ్యాంగ హక్కు హరిస్తుందని..దానిని రద్దు చేయాలని కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదో సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ముస్లింల ఓట్లతో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సీఎం చంద్రబాబు పార్లమెంట్, లోక్సభలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి, సదరు బిల్లు రద్దుకు సుప్రీంకోర్టులో పిల్ వేసే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. – మాజీ మంత్రి విడదల రజిని -
శాంతిభద్రతల కోసమే విస్తృత తనిఖీలు
నరసరావుపేట: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా వివిధ హోటళ్లు, లాడ్జిలలో శనివారం అర్ధరాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలతో పాటు హోటళ్లు, లాడ్జీల లాగ్బుక్లను పరిశీలించారు. గుర్తింపు పత్రాల నమోదు, విధానం తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని లాడ్జి యాజమానులకు స్పష్టమైన సూచనలు చేశారు. పరారీలో ఉన్న నిందితులు, అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయని ఎస్పీ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలను మరింత కఠినంగా కొనసాగించనున్నామని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జేఈఈ మెయిన్స్లో 110వ ర్యాంకు
మాచర్ల రూరల్: మాచర్ల మండలం హసనాబాద్ తండాకు చెందిన కేతావత్ దిగేశ్వర్ నాయక్ ఆల్ ఇండియా లెవల్లో జేఈఈ మెయిన్స్లో 110వ ర్యాంకు సాధించినట్లు తండ్రి కేతావత్ రూప్లానాయక్ ఆదివారం తెలిపారు. విజయవాడలోని పోరంకిలో నారాయణ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న దిగేశ్వర్ నాయక్ ఆల్ ఇండియా స్థాయిలో 110 వ ర్యాంకు సాధించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలరించిన లఘు నాటికల ప్రదర్శన నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం గుంటూరు హ్యూమర్ క్లబ్ 12వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేడుకలకు సంస్థ ఉపాధ్యక్షులు మధువని అధ్యక్షత వహించారు. అనంతరం ఓర్నీ, పోవోయి అనుకోని అతిథి లఘు నాటికలు ప్రదర్శించారు. ఇవి సభికులను అలరించాయి. దర్శకులు గుడివాడ లహరి, సీహెచ్.అమృతవర్షిణి, క్లబ్ వ్యవస్థాప కార్యదర్శి షేక్ లాల్వజీర్, కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతిలు ప్రసంగించారు. నటీనటులు మధువని, నాగజ్యోతి, ప్రత్తిపాటి మంగయ్య, డాక్టర్ ఎన్వీకృష్ణప్రసాద్, గుడివాడ లహరి, ఎ.రాజశేఖర్, పెండ్యాల రమేష్బాబు, ప్రదీప్కుమార్, ఎం.క్రిష్ణకిషోర్ తమ పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల్తో ముంచెత్తారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయిెపెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
పెదకాకాని: వెనిగండ్లలోని మైత్రి కల్యాణ మండపంలో లైటింగ్, డెకరేషన్కు వేలంపాటలు నిర్వహించకుండా కొందరు పంచాయతీ ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే పాటలు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆదాయం పెంచాలని అధికారులను కోరారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కొందరు గ్రామ పెద్దలు సుమారు రూ.కోటి నిధులు సేకరించి కల్యాణ మండపాన్ని నిర్మించారు. గ్రామస్తులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిని స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మండపాన్ని ఓసీలకు రూ.18,500కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.12,500కు ఇస్తున్నారు. ప్రతి వేడుకకూ మరుగుదొడ్ల శుభ్రత పేరుతో మరో రూ.500 వసూలు చేస్తున్నారు. మైక్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పేరుతో మరింత దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్ళు పంచాయతీ సిబ్బంది కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది మైత్రి కల్యాణ మండపంలో 175 వేడుకలు జరిగాయి. మైక్ అండ్ లైటింగ్, పూల అంకరణను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనిలో పంచాయతీ ఉద్యోగులకు వాటాలు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కల్యాణ మండపంలో లైటింగ్, పూల అలంకరణకు వేలంపాటలు నిర్వహించకపోవడంతో పంచాయతీ ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వేలంపాటలు నిర్వహించాలని మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు కోరుతున్నారు. మైక్, లైటింగ్, డెకరేషన్ పేరిట వసూళ్లు వేలంపాటలు నిర్వహించకుండా పంచాయతీ ఉద్యోగుల దొంగాట పారిశుద్ధ్యం పేరుతో ప్రత్యేక రుసుం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు -
ఏఎంసీ చైర్పర్సన్ ప్రమాణస్వీకారోత్సవం
సత్తెనపల్లి: నియోజకవర్గంలో పలు అభివద్ధి పనుల ప్రారంభోత్సవం, విగ్రహల ఆవిష్కరణకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం సత్తెనపల్లి చేరుకున్నారు. తొలుత సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో నూతన సచివాలయ భవనం, ఆర్బీకే బిల్డింగ్, నూతన సీసీ రోడ్, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, సాలీడ్ వేస్ట్ మేనేజెమెంట్ షెడ్లను ప్రారంభించారు. అనంతరం సత్తెనపల్లి చేరుకొని పట్టణంలోని 21వ వార్డులో స్వర్గీయ నందమూరి తారకరామారావు, గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిలోని తాలూకా సెంటర్లో డివైడర్పై నూతనంగా నిర్మించిన స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కోమటినేని శోభారాణి, పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో రాష్ట్ర చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, డాక్టర్ కోడెల శివరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు
వినుకొండ: జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మండలంలోని మదమంచిపాడులోని మక్కెన చినరామయ్య ఆడిటోరియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగు పళ్ల సైజు విభాగంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎద్దులు 5160.2 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించాయి. నూజెండ్ల మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి ఎడ్లు 5061.7 అడుగులు లాగి 2వ బహుమతి, పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన మోపర్తి నవీన్కుమార్చౌదరి ఎడ్లు 4809.2 అడుగులు లాగి 3వ స్థానంలో నిలిచాయి. 4వ బహుమతి మందలపు భాష్విక్ రెడ్డి, జ్ఞానత్ రెడ్డి (ఇస్సాపాలెం) ఎడ్లు, 5వ బహుమతి చిలుకూరి నాగేశ్వరరావు (బాపట్ల మండలం జె.పంగులూరు ), 6వ బహుమతి మేస్త్రి ఖాదర్మస్తాన్ ఎడ్లు ( యద్దనపూడి, బాపట్ల), 7వ బహుమతి యద్దనపల్లి మనోజ్కుమార్చౌదరి ఎడ్లు (రావిపాడు, నరసరావుపేట), 8వ బహుమతి బత్తుల శ్రీనివాసరావు ఎడ్లు (నవలూరు, మంగళగిరి), 9వ బహుమతి పసుమర్తి దివ్య శ్రీ ఎడ్లు ( భీమవరం, సత్తెనపల్లి) సాధించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు మక్కెన వెంకట్రావు, సుబ్బారెడ్డి, చిరంజీవి, కోటిరెడ్డి, అబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
నరసరావుపేట: శ్యావల్యాపురం మండలం గంటావారిపాలెంలో తమకు ఓట్లు వేయలేదనే కారణంతో టీడీపీ నాయకులు ఓ ఎరుకల కుటుంబంపై చేసిన దాడిని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) నాయకులు ఖండించారు. ఆదివారం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు ఈఘటనపై మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎరుకల కుటుంబం చికెన్ స్టాల్, చిల్లరకొట్టు ఏర్పాటు చేసుకొని జీవిస్తోందని, వారు గత సార్వత్రిక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తమకు ఓట్లు వేయకుండా వైఎస్సార్సీపీకి వేశారనే కారణంతో షాపులు కూల్చివేసి నిర్వాహకుడు నాగేశ్వరరావును తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. సుజాత అనే మహిళ జాకెట్లో ఉన్న సెల్ని బలవంతంగా లాక్కొని ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వేల్పూరు, గంటావారిపాలెం గ్రామాలకు చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం మేరకు కేసు నమోదుచేసి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. షాపును కూల్చిన పొక్లెయినర్ను సీజ్ చేయాలని, సుమారు రూ.18 లక్షల ఆస్తిని నష్టపరచడమే కాక వారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఎస్టీ కుటుంబానికి రక్షణ కల్పించాలని పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.డిమాండ్ చేసిన దేశభక్త ప్రజాతంత్ర నాయకులు గంటావారిపాలెం ఎస్టీలపై టీడీపీ దాడులకు ఖండన తమకు ఓటు వేయలేదనే కారణంతో దాడిచేశారని ఆరోపణ -
సాగర్మాత దేవాలయంలో ఈస్టర్ వేడుకలు
విజయపురిసౌత్: స్థానిక సాగర్మాత దేవాలయంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుంచే ఆలయంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. అర్థరాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో భక్తులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత క్రీస్తు నేడు లేచెను అని నినాదాలు చేశారు. అనంతరం భక్తులు ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దివ్యబలిపూజా కార్యక్రమంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ భక్తులనుద్ధేశించి ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చెడుమార్గాన్ని వీడి మంచి మార్గంలో నడవాలన్నారు. ఆశాంతిని వీడి శాంతి మార్గంలో, ద్వేషాన్ని వీడి తోటివారితో ప్రేమతో మెలగాలని సూచించారు. 2వేల సంవత్సరాల క్రితం శిలువ వేయబడి చనిపోయిన ఏసుక్రీస్తు మూడో రోజు ఆదివారం పునరుత్ధానుడైనట్లు ఉద్భోధించారు. ఈ పునరుత్థానుడైన క్రీస్తును స్మరించుకోవటమే ఈస్టర్ పండుగ ముఖ్య ఉద్ధేశమన్నారు. ఏసు చూపిన మార్గంలో నడవాలని వారు పేర్కొన్నారు. వేడుకలలో ఆలయ పెద్దలు డి ఇన్నారెడ్డి, ఎం మరియదాసు, జెక్కిరెడ్డి చిన్నపరెడ్డి, శౌర్రాజు, శౌరిబాబు, కట్టా రాజు, చందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష
జెట్టిపాలెం(రెంటచింతల):జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల(ఏపీ మోడల్ స్కూల్)లో 6వ తరగతిలో ప్రవేశానికి 2025–2026 విద్యాసంవత్సరానికి మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.పాపయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. మార్చి నెల 31లోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు కనీసం పొందాల్సి ఉంటుందని వివరించారు. కోడెదూడ వితరణ అచ్చంపేట: విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగ్ సహకారంతో మండలంలోని తాళ్లచెరువులోని ఆవుల సంఘ గోశాల వారిచే వ్యవసాయ అవసరాల నిమిత్తం గ్రామానికి చెందిన పెంటారెడ్డి చిన్నపరెడ్డి అనే రైతుకు నాలుగు సంవత్సరాల కోడెదూడెను ఆదివారం ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు తుమ్మా మర్రెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న గోశాలలో కోడెదూడలను వ్యవసాయ అవసరాల నిమిత్తం వాడుకునే వారికి ఉచితంగా ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా విశ్వహిందూ పరిషత్ గోరక్షా ప్రముఖ్ బాగవతుల రవికుమార్, సీనియర్ కార్యకర్త వీరభద్రయ్య, క్రోసూరు ప్రముఖ్ సిద్దు కామేశ్వరాచారి, అచ్చంపేట ప్రముఖ్ జలసూత్రపు తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి మహిళకు గిన్నిస్ రికార్డు సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన మహిళ పాపిశెట్టి అనూష గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకుంది. విజయవాడకు చెందిన హలేల్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ అగస్టీన్ పాస్టర్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 7న 1,046 మంది విద్యార్థులు కలిసి గంట సమయంలో స్వరాలు వాయించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానాన్ని కేటాయించారు. ఇటీవల హైదరాబాదులోని లైఫ్ చర్చిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 18 దేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. అనూషకు రికార్డు ధ్రువీకరణ పత్రం, మెడల్ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హలేల్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ ఆగస్ట్టీన్, పాస్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనూష మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, భర్త సహకారంతో ఇది సాధించానని ఆనందంతో చెప్పింది. గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్తో వారాహి ఇన్ఫ్రా టౌన్షిప్స్ వారి గోల్డెన్ ప్రైమ్ సిటి బ్రోచర్ను ఆదివారం సంస్థ చైర్మన్ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ దేవమిత్ర రాజా, అరుణ్ప్రశాంత్, సాయి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించారు. గతంలో కేఎస్ఆర్ డవలపర్స్ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్ఫ్రాజ్యూయల్ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
రాజ్యాంగ విరుద్ధపు చట్టాలు చెల్లవు
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రతిదీ పోరాటామే... వక్ఫ్లో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు లేదు. ముస్లింలు వారి ధార్మిక, సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజలు, పెద్దలు, రాజులు దానంగా ఇచ్చిన భూములపై మతోన్మాద పార్టీ పెత్తనం ఏంటీ? గతంలో ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలు చేశారు. – ఎం రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్టికల్ 13లో రాజ్యాంగం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే, కించపరిచే చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులలో ప్రధానమైంది సమానపు హక్కలు 14–18 వరకు, 28–29 మత స్వాతంత్య్ర హక్కు వీటికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురావడం ఈ దేశ ముస్లింను ద్రోహం చేయడమే. – అబ్దుల్ జబ్బార్, ముస్లిం జేఏసీ నాయకులు -
ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు...
ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లులు చెల్లవు ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యకిరేకమైన ఈ చట్టాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలి. ముస్లింలు చేసే ఈ ధర్మ పోరాటానికి క్రైస్తవ సంఘాల తరుఫున మద్దతునిస్తాం. – నందమూరి క్రిష్టోఫర్, అధ్యక్షులు, పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు జిల్లా మత విభజనకు, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముస్లింలే కాదు ప్రజలందరూ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుత పోరాటాలు ఉధృత ఉద్యమాలు కాకమునుపే చట్టాన్ని రద్దు చేయాలి. – కొల్లా రాజమోహన్రావు, నల్లమడ రైతుసంఘం నాయకులు -
కర్మకాండలు చేయడానికి వెళ్తూ మృత్యుఒడికి..
నాదెండ్ల: కర్మకాండలు చేయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జంగం దేవర దుర్మరణం పాలైన విషాద ఘటన జాతీయ రహదారిపై గణపవరం ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన మామిడి వీరలింగం (70) జంగం దేవరగా కర్మకాండలు నిర్వహిస్తుంటాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులుగా కాగా, చిన్నకుమారుడు శివలింగం కుల వృత్తిలోనే కొనసాగుతున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో తిమ్మాపురంలో ఓ మృతునికి కర్మకాండలు నిర్వహించేందుకు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వీరలింగం బయలుదేరాడు. ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లు వద్దకు రాగానే సర్వీసు రోడ్డు నుంచి హైవే ఎక్కుతుండగా, చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపునకు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం ఇరవై అడుగుల దూరంలో పడగా, వీరలింగం అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. సమాచారం తెలుసుకున్న నాదెండ్ల ఎస్సై పుల్లారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరలింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో జంగం దేవర మృతి -
లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పే అంతిమం
● న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ విజయ్కుమార్రెడ్డి ● జాతీయ లోక్ అదాలత్పై పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు (అవార్డ్) అంతిమ తీర్పు అని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయకుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ఆవరణలో గల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో ఏప్రియల్ 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్పై శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న అన్ని కోర్టుల్లో ఉన్న రాజీ పడదగిన కేసులలో ఎక్కువగా రాజీ అయ్యేలా చూడాలన్నారు. ముందుగా ఆయా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులు? రాజీ పడదగిన కేసులు? ఎన్ని ఉన్నాయి అనే దానిపై, అన్ని అంశాలపై ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వ హించారు. సమీక్షలో సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ సుబ్బారావు, మిగిలిన పోలీస్స్టేషన్లలో ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న అన్ని మండలాల తహసీల్దార్ లతో సివిల్ వివాదాలు, తదితర అంశాలపై మాట్లాడారు. సత్తెనపల్లి ఏజీపీ షేక్ బాలి సైదా, సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి ఏవో సరోజిని, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ రెండు సమీక్షలలో ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఏ.తౌషీద్ హుస్సేన్, ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మహ్మద్ గౌస్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఉన్నారు. -
● ఎస్పీ కంచి శ్రీనివాసరావు ● స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్రలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరికీ ఆరోగ్యం నరసరావుపేట: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రతి మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్‘ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి తమ కార్యాలయాల్లో పరిశుభ్రత నిర్వహించారు. సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. పోలీసుస్టేషన్ లోపల, ఆవరణలోనూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఫైళ్లను క్రమపద్ధతిలో ఉంచారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, వెల్ఫేర్ ఆర్.ఐ గోపీనాథ్, ఏ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు. పేలుడు పదార్థాలు స్వాధీనం బల్లికురవ: పేలుడు పదార్థాలు నిలువచేసే మ్యాగ్జెయిన్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వేమవరం జంక్షన్ నుంచి గంగపాలెం వెళ్లే రోడ్డుతో పాటు, నాగరాజుపల్లె సమీపంలోప్రసన్నాంజనేయ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన 2300 మ్యాగ్జెయిన్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సంతమాగులూరు సీఐ వెంకట్రావు తెలిపారు. దాడుల్లో బల్లికురవ ఎస్సై వై. నాగరాజు, ఆర్ఐ పోతురాజు పాల్గొన్నారు. -
విద్యతోపాటు మహిళల అభివృద్ధిలో భాగస్వామి
పిడుగురాళ్ల: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యతోపాటు మహిళల అభివృద్ధికి కూడా భాగస్వామి అవుతుందని సీఎస్ఆర్ డైరెక్టర్ బి.బబిత అన్నారు. పట్టణ శివారులోని కొండమోడులో ఏర్పాటు చేసిన ఉచిత జూట్ ఉత్పత్తుల తయారీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణను వదిలేయకుండా మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ నెల రోజుల శిక్షణ తరగతులు 15 రకాల ఉత్పత్తులను శిక్షణ ద్వారా తయారు చేయటం నేర్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మండూరు వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గా, పీఎస్ఆర్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్లు కె.నరసింహారావు, బాడిస మస్తాన్ పాల్గొన్నారు. భార్యపై బ్లేడుతో దాడిచేసిన భర్త అరెస్ట్ క్రోసూరు: క్రోసూరు బోయకాలనీలో శుక్రవారం భార్యపై అనుమానంతో బ్లేడుతో దాడి చేసిన భర్త చర్ల శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు స్టేషన్ రైటర్ దాసు తెలిపారు. -
● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ● కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ
26 నుంచి స్లాట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు అమరావతి: ఈనెల 26వ తేదీ నుంచి అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామాలలో పొలాలు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి స్లాట్ విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని అమరావతి సబ్ రిజిస్ట్రార్ పి.వెంకటరెడ్డి తెలిపారు. శనివారం అయన రిజిస్ట్రేషన్ స్లాట్ల విధానం గురించి వివరిస్తూ అమరావతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రోజుకు 39 స్లాట్లను కేటాయించారని తెలిపారు. ఈ స్లాట్ల బుకింగ్ చేసుకోవటానికి ఆన్లైన్లో ఐజీఆర్ఎస్ స్లాట్లో బుకింగ్ చేసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. అలాగే స్లాట్ బుకింగ్ చేసుకోని వారికి సాయంత్రం 5గంటల తర్వాత రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామన్నారు. ఈ స్లాట్ బుకింగ్ వల్ల కాలం వృథా కాకుండా క్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ప్రజలంతా ఈ రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న కంటైనర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్కు తీవ్రగాయాలు యడ్లపాడు: హైవే సెంట్రల్ డివైడర్పై మొక్కలకు నీరు పొస్తున్న వాటర్ ట్యాంకర్ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు చెందిన కంటైనర్ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న క్రమంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో హైవేపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుండి ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్మికుల పోరాటాన్ని పట్టించుకోకపోవటం దారుణం నరసరావుపేట: ఆప్కాస్లో ఉన్న తమకు పనిచేసిన రోజులు అన్నింటికి జీతం చెల్లించాలని కోరుతూ 30 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకోసం కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 31వ రోజుకు చేరాయి. శిబిరాన్ని కృష్ణ సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలియచేసి మాట్లాడారు. ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో అర్ధంకావట్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు తమకు నెలజీతం ఇప్పించమని కోరుతున్న కార్మికులవైపు చూడకపోవటం వారి నైజం తెలియచేస్తుందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి తమ సంఘం పూర్తిగా మద్దతు తెలియచేస్తుందన్నారు. వెంటనే అధికారులు కలుగుచేసుకొని వారికి పూర్తిజీతంతో పాటు విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు మార్కాపురం టౌన్: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు 2వ రోజైన శనివారం ఉత్సాహంగా సాగాయి. పోటీలకు గుంటూరు, నంద్యాల, బాపట్ల, తెలంగాణలోని సూర్యాపేట, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం పోటీల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జీఎల్ఆర్ గ్రూప్స్, గరికపాటి లక్ష్మయ్యచౌదరిలకు చెందిన ఎడ్ల జత 4351.06 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బీ కేశవరెడ్డికి చెందిన ఎడ్ల జత 4325.09 అడుగుల దూరంలాగి రెండో స్థానాన్ని, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన ఆర్కె బుల్స్, శిరీషా చౌదరికి చెందిన ఎడ్ల జత 4291.10 అడుగులు లాగి మూడో బహుమతిని, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన జే సహస్రయాదవ్, జేవీఎల్ యాదవ్కు చెందిన ఎడ్ల జత 3881.10 అడుగులు లాగి 4వ స్థానాన్ని సాధించాయి. జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రేమయ్య ఎంపిక ఇంకొల్లు(చినగంజాం) జాతీయ స్థాయిలో నిర్వహించే టీ 20 క్రికెట్ పోటీలకు మండలంలోని నాగండ్ల గ్రామానికి చెందిన బూరగ ప్రేమయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రేమయ్యకు ఆల్ ఇండియా క్రికెట్ డవలప్మెంట్ ట్రస్టు నుంచి ఉత్తర్వులు అందాయి. జాతీయ జట్టులో భారతదేశం తరపున క్రికెట్ జట్టులో ప్రేమయ్య బ్యాట్స్మన్ ఎంపిక కాగా మే నెల 26 నుంచి 31 వరకు నేపాల్లో నిర్వహించే పోటీలలో పాల్గొనున్నట్లు ప్రేమయ్య తెలిపారు. ప్రేమయ్య ప్రస్తుతం నరసరావు పేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నందు డిగ్రీ చదువుతున్నాడు. చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి చీరాల: టూవీలర్ను లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మృతిచెందాడు. ఈనెల 16న పాపాయిపాలెంకు చెందిన రమేష్ బైపాస్ రోడ్డులో వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒంగోలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతడు శనివారం మృతిచెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థి ప్రతిభ
వినుకొండ: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో వినుకొండ విద్యార్థి కాలువ లీల వెంకటసాత్విక్ 99.92 పర్సంటైల్ సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 1276 ర్యాంక్ సాధించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ 985 మార్కులు సాధించారు. సాత్విక్ తండ్రి వెంకటనారాయణ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. తల్లి కృష్ణకుమారి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. సాత్విక్ మాట్లాడుతూ జేఈఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించి ఇండియాలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ కాలేజీల్లో సీటు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సాత్విక్కు తల్లిదండ్రులు, స్నేహితులు, అధ్యాపకులు, బంధువులు అభినందనలు తెలిపారు. -
విచారణ ఎదుర్కోవాల్సిందే
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఆ సీఐ ఎప్పుడూ వివాదాల్లోనే మునిగి తేలుతుంటాడు. గతంలో ఒక స్టేషన్లో పని చేసినప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను చావబాది అనేక ఆరోపణలు ఎదుర్కొని హైకోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసే వరకు వివాదం వెళ్లింది. అక్కడి నుంచి అదే నియోజకవర్గంలోని మరో స్టేషన్కు బదిలీ అయినా తీరుమారలేదు. అక్కడా ఇంతే... ఏకంగా ఆయన వేధింపులపై కోర్టులో స్టేట్ మెంట్ రికార్డ్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నా రూటే సపరేట్ అంటూ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటమే లక్ష్యం అంటూ ఆ సీఐ పనిచేస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించటం ఆయన నైజం. పైకి ఖాకీ యూనిఫాం వేసుకున్న లోపల మాత్రం పసుపు చొక్కా ధరించిన పచ్చ కార్యకర్తలాగా పని చేస్తుంటారు. తీసుకునేది ప్రభుత్వ జీతమే కానీ ఆయన పని చేసేది మాత్రం అధికారపార్టీ నేతల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలను స్టేషన్కి కూడా రావొద్దని బహిరంగానే చెప్పి తన స్వామిభక్తిని చాటుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్స్టేషన్ సీఐ భాస్కరరావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిత్యం వివాదాలతో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. సొంత స్టేషన్కు బేడీలు వేసిన ఘనుడు దాచేపల్లి వచ్చినా భాస్కర్ తీరులో ఆవగింజంత మార్పు కూడా లేదు. మీడియానూ స్టేషన్ కు రానివ్వడం లేదంటే భాస్కర్ ఎంత బరితెగించారో అర్థమవుతోంది. ఎవరైనా స్టేషన్కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. దీంతోపాటుగా భాస్కర్పై ఆర్థిక వ్యవహారాల విషయాల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో వరుస కథనాలు వస్తున్నా ఆయనపై చర్యలు మాత్రం శూన్యం. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కృష్ణవేణి బంధువులతోపాటు ఆమె న్యాయవాదులు కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్లోకి ఎవరూ రాకూడదని సీఐ భాస్కర్ ఆదేశించారు. దీంతో సిబ్బంది పోలీస్ స్టేషన్ గేట్లు వేసి తాళం బదులు బేడీలు వేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్కు బేడీలు వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బేడీల భాస్కర్గా సీఐ గుర్తింపు పొందారు. ఇంత జరిగినా పోలీస్ ఉన్నతాధికారులు స్టేషన్కు బేడీలు వేయడమేంటని కూడా ప్రశ్నించలేదు. స్టేషన్లో ఉన్న కృష్ణవేణిని కలవడానికి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు చేయించుకుంటే కానీ సీఐ భాస్కర్ ఒప్పుకోలేదంటే ఆయన వ్యవహారం ఎలా ఉందో అర్థమవుతోంది. అరెస్ట్ చేసిన కృష్ణవేణిని గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కృష్ణవేణి సీఐపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్టు ఆమె న్యాయవాదులు చెబుతున్నారు. మానసికంగా తీవ్రంగా హింసించారని కృష్ణవేణి చెప్పినట్టు తెలుస్తోంది. మేం చెప్పినట్లు వినకపోతే రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, ఆ కేసుల్లో రాష్ట్రం మొత్తం తిప్పుతామని బెదిరించినట్లు న్యాయమూర్తికి కృష్ణవేణి వాంగ్మూలం ఇచ్చినట్టు న్యాయవాదులు చెబుతున్నారు. అంతే కాదు తాను చెప్పింది చెయ్యకపోతే కృష్ణవేణి భర్త రాజ్ కుమార్పై గంజాయి కేసు పెడతామని కూడా సీఐ బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట బాధితురాలు కన్నీరుమున్నీరైనట్టు సమాచారం. దీంతో కృష్ణవేణి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేసినట్టు ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు. సీఐ భాస్కర్పై చార్జి మెమో జారీ చేసి, దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టులోనూ కేసులువివాదాల సీఐ రెడ్బుక్ అమలుకు అడ్డదారులు దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కరరావు దౌర్జన్యాలు అనంతం వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులే టార్గెట్ గా అక్రమ కేసులు, వేధింపులు ప్రైవేటు కేసులు వేసిన బాధితులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి విషయంలోనూ అదే తీరు ఆమెను పరామర్శించేందుకు ఎవరూ రాకుండా పోలీసు స్టేషన్ గేట్కు బేడీలు గురజాల మేజిస్ట్రేట్ ముందు సీఐకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన కృష్ణవేణి పచ్చ పార్టీ నేతల మద్దతుతో అవినీతిలో రెచ్చిపోతున్న ఖాకీ దాచేపల్లి సీఐ భాస్కరరావు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. సొంత స్టేషన్కే బేడీలు వేసిన సీఐని నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. రెడ్బుక్ అమలు చేయటమే సీఐ భాస్కరరావు చేస్తున్న ఉద్యోగం. వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐ భాస్కరరావుపై విచారణ తప్పక జరుగుతుంది. అన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. – కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే ఇదిలా ఉండగా పచ్చనేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ.. వైఎస్సార్సీపీ నేతలను గ్రామాల్లో ఉండకుండా చేస్తున్న సీఐ భాస్కరరావు వ్యవహరశైలి పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా ఉంది. సీఐ భాస్కరరావు చేతిలో దెబ్బలు తిన్న.. బెదిరింపులకు గురైన వైఎస్సార్సీపీ నేతలు ఆయనపై హైకోర్టులో కేసులు వేశారు. గురజాల, దాచేపల్లికి చెందిన నేతలు ఆయనపై మూడు కేసులు హైకోర్టులో వేశారు. సీఐ భాస్కరరావు బారినుంచి తమను కాపాడాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. ఆయన అవినీతిపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే మీడియాలోనూ ఆయన అవినీతిపై వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయంటే ఆయన వ్యవహారశైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయినా సదరు సీఐపై చర్యలకు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను ప్రభుత్వానికి అందజేయండి
సేకరించే స్టాల్ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే నరసరావుపేట: పర్యావరణానికి ముప్పుగా పరిమణించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. ఈ మేరకు పట్టణంలోని స్టేషన్రోడ్డు గాంధీపార్కు వద్ద ఈ–చెక్ అనే థీమ్తో స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ–వ్యర్థాల సేకరణ స్టాల్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి ఇళ్లు, హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుంచి పర్యావరణానికి హాని కలిగించేందుకు ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు, సీడీ ప్లేయర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను సేకరించారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను సందర్శించి అందులోని ఉత్పత్తులను పరిశీలించారు. కలెక్టరేట్లో ఈ–థీమ్పై సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను పరిశీలించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఈ వ్యర్ధాలపై ప్రభుత్వం పోరాడుతుందన్నారు. సేకరించిన వీటిలోని పనికివచ్చే వాటిని మహిళా సంఘాలకు ఇచ్చిన శిక్షణతో వేరుచేసి మిగతా వేస్ట్ను శాసీ్త్రయంగా నిర్మూలించటం జరుగుతుందన్నారు. దీని వలన చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు. రిపేరుచేసే షాపుల్లో పనికిరాని వాటిని వ్యాపారులు తెచ్చి ఇవ్వచ్చన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో స్వచ్చాంధ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. దీనిలో జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో ఏకా మురళి, ఆర్డీవో కె.మధులత, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, ఆర్అండ్బీ ఈఈ రాజానాయక్ అధికారులు పాల్గొన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్ అధిక బరువుపై అవగాహన తెనాలి: పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తెనాలిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమావేశాలను జరిపారు. పిల్లల్లో అధిక బరువుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు. కుంకుమ పూజలు బాపట్ల: బాపట్ల అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయం వద్ద శనివారం అంత్యంత వైభవంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. యునెస్కో గుర్తింపుపై హర్షం కూచిపూడి: యునెస్కో నాట్య శాస్త్రాన్ని గుర్తించిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో కూచిపూడి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. 3న్యూస్రీల్ -
పొగాకు రైతులను ఆదుకోవాలి
కాకుమాను: ఈ ఏడాది పొగాకు సాగు చేస్తున్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెదనందిపాడులో రైతులు పండించిన పొగాకును కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధర సగానికి సగం తగ్గిందని ఆవేదన చెందారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించిందని కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల నుంచి పంటను రూ.18వేలకు కొనాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు గంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటశివరావు, దొప్పలపూడి రమేష్ బాబు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపరిశీలన
తాడికొండ: వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మే 2న హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, జేసీ భార్గవ్తేజ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. చెలరేగిన మృగాడు క్రోసూరు: స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. డాక్టరేట్ పొందిన ఆటో డ్రైవర్ శంకర్రావుకు అభినందనలు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఆటో డ్రైవర్గా పనిచేస్తూనే కాలికట్ యూనివర్సిటీ ననుంచిఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన గండికోట శంకర్రావును ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య సత్కరించారు. శుక్రవారం స్థానిక పాతగుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధక్షతన అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ .లక్ష్మయ్య మాట్లాడుతూ గండికోట శంకరరావు ఆటో డ్రైవర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు పాల్గొన్నారు. 21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజల సౌలభ్యం కోసం చీరాల నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉద యం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. చీరాల నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పాక్ జలసంధిని ఈదిన గణేష్ విజయవాడస్పోర్ట్స్: తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్ పారా స్విమ్మర్ బి.గణేష్ సాహసోపేతంగా ఈదాడు. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు తలైమన్నార్లో ఈతను ప్రారంభించి సాయంత్రం 4.20కి ధనుష్కోటికి చేరుకున్నారు. 28 కిలోమీటర్లు పొడవున్న సముద్రాన్ని 10.30 గంటల్లో ఈదాడు. తెలుగు రాష్ట్రాల్లోని పారా స్విమ్మర్లలో పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి పారా స్విమ్మర్గా ఖ్యాతిగడించారు. స్విమ్మర్ గణేష్ ప్రస్తుతం ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ కోచ్గా పని చేస్తున్నాడు. -
కప్పం కడితే రైట్ రైట్
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి సర్కార్ దోపిడీ శృతిమించి రాగానపడింది. గ్రానైట్ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున దండుకునేందుకు పచ్చనేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను సంగతి దేవుడెరుగు ముందు తమ సంగతి చూడమంటున్నారు. పన్ను ఎగనామం పెట్టినా ఫర్వాలేదు తమకు మాత్రం నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీచేశారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటినిచ్చేది లేదని బెదిరింపులకు దిగారు. పచ్చనేతల నెల మామూళ్లు ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే అధిక మొత్తంలో ఉండడంతో బయ్యర్లు బెదిరిపోతున్నారు. కప్పం చెల్లించి వితౌట్(టాక్స్ లేకుండా)లో గ్రానైట్ పంపే దానికంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించి దర్జాగా తీసుకెళ్లడమే మేలని వ్యాపారులు భావిస్తున్నారు. చినబాబు కప్పం రూ.50 కోట్లు బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల నుంచి నెలకు రూ.50 కోట్లు ఇవ్వాలని చినబాబు జిల్లా గ్రానైట్ మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హుటాహుటిన గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, బయ్యర్లతో సమావేశం పెట్టి వ్యవహారం చక్కబెట్టాలని రెండు జిల్లాల మైనింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో ఇటీవల గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీ యజమానులతో అధికారులు తొలుత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా మంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకరిద్దరికై తే కప్పం చెల్లించగలంకానీ పదుల సంఖ్యలో ఉన్న పచ్చనేతలందరికీ నెల మామూళ్లు ఇవ్వడం కుదరదని క్వారీ, పరిశ్రమల యజమానులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మీరడిగినంత మొత్తం కట్టలేమని, ఇలాగైతే వ్యాపారమే మానుకుంటామని మరికొందరు వ్యాపారులు ఏకంగా మంత్రికే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇలాగైతే బయ్యర్లు పలకలు తీసుకెళ్లేందుకు ఇష్టపడరని అదే జరిగితే వ్యాపారాలు మూత పడతాయని మరికొందరు వ్యాపారులు మంత్రికి వివరించినట్లు సమాచారం. అన్నీ విన్న మంత్రి పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని వ్యాపారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ప్రకాశం జిల్లా పరిధిలోని చీమకుర్తి ప్రాంతాల్లోని క్వారీలు, ఫ్యాక్టరీలపై దాడులకు దిగారు. పచ్చనేతల తీరుతో విసిగి పోయిన క్వారీ, పరిశ్రమల యజమానులు వితౌట్లో మైనింగ్ చేయడం దాదాపుగా మానుకున్నారు. కొందరు మంత్రి అనుచరులకు ముడుపులు చెల్లించి రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం. పచ్చనేతలకు కప్పం చెల్లించి వ్యాపారం చేయడం కంటే మానుకోవడమే మేలని కొందరు బయ్యర్లు వ్యాపారానికి తాత్కాలికంగా స్వస్తిపలికారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భూగర్భ గనులశాఖలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. గ్రానైట్లో వసూళ్ల దందా చినబాబు నెల మామూళ్లు రూ.50 కోట్లు అద్దంకి, పర్చూరు పచ్చనేతలకుచెరో రూ.8 వేలు రూ.10 వేలు డిమాండ్ చేస్తున్న గురజాల పచ్చనేత తనకు రూ.8 వేలు కావాలంటున్న నరసరావుపేట నాయకుడు కప్పం కట్టకపోతే సేల్టాక్స్, లోకల్ పోలీసులను ఉసిగొల్పుతున్న వైనం ఫ్యాక్టరీ యజమానులతో మంత్రి గొట్టిపాటి సమావేశం వసూళ్ల విషయం మీరే చూసుకోవాలని ఆదేశం తలలు పట్టుకుంటున్న పరిశ్రమల యజమానులు, బయ్యర్లు పచ్చ దోపిడీపై సర్వత్రా ఆగ్రహం శృతిమించిన పచ్చనేతల మామూళ్ల దందా చినబాబు కప్పం వ్యవహారం పక్కనబెడితే స్థానిక పచ్చనేతలంతా గ్రానైట్పై పడ్డారు. గ్రానైట్ పాలీషింగ్ పలకలు వితౌట్(టాక్స్ లేకుండా)లో తీసుకెళ్లేందుకు లారీకి ఏఎమ్మార్ టోకెన్కు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఏఎమ్మార్ ఇచ్చే టోకెన్ రూ.8 నుంచి రూ.10 వేలకు మించి ఉండదు. ఇది కాకుండా గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న పర్చూరు, అద్దంకి పచ్చనేతలకు వ్యాపారులు నెలకు చెరో రూ.8 వేలు కప్పం కడుతుండగా నరసరావుపేట పచ్చనేత రూ.8 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రానైట్ దందాకు ఆద్యుడైన గురజాల నేత తనకు రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండగా చిలకలూరిపేట నేత మాత్రం తనకు రూ.6 వేలు చాలని చెబుతున్నట్లు సమాచారం. మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 150 కి తగ్గకుండా పాలీ షింగ్ బండలు వితౌట్లో హైదరాబాద్కు తరలిపోతుండగా ఇందులో చిలకలూరిపేట, విజయవాడ మీదుగా హైదరాబాద్కు 30 లారీలు, నరసరావుపేట, గురజాల మీదుగా 120 లారీలు వెళుతున్నట్లు సమాచారం. వీరంతా ప్రతి లారీకి కప్పం చెల్లించాల్సిందేనని బయ్యర్లకు హుకుం జారీ చేశారు. ఏఎమ్మార్ టోకెన్తో పాటు పచ్చనేతలకు ఇస్తున్న కప్పంతో కలుపుకుంటే ఒక్కో లారీకి రూ.58 వేలు ఖర్చు వస్తోంది. వాస్తవంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించినా ఇంత మొత్తంలో ఖర్చురాదు. దీంతో బయ్యర్లు పచ్చనేతలు చెప్పిన మొత్తాన్ని చెల్లించలేమంటూ అడ్డు తిరిగినట్లు సమాచారం. ఒకవేల ఏఎమ్మార్ టోకెన్కు చెల్లించే మొత్తాన్ని రద్దు చేయిస్తే పచ్చనేతలు అడిగిన మేరకు కప్పం చెల్లిస్తామని బయ్యర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. -
మోదీ డౌన్ డౌన్.. బీజేపీ డౌన్ డౌన్
అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు అమరావతి మెయిన్ రోడ్డులో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్.. బీజేపీ డౌన్డౌన్ నినాదాలు చేశారు. మెయిన్ రోడ్డులోని మసీదు నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్, మద్దూరు డౌన్ సెంటర్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం సెంటర్కు చేరుకుంది. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిరసనకారులు తిరిగి మసీదుకు చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా పరిషత్ కో–ఆప్షన్ మెంబర్ షేక్ హష్మీ మాట్లాడుతూ ముస్లింల హక్కులను కాలరాసే వక్ఫ్ చట్టాన్ని కూటమి పార్టీలు తప్పా మిగతావన్నీ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ముస్లింలంతా ఈ చట్టాన్ని ఐకమత్యంగా వ్యతిరేకించి విజయం సాధించాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు జాని, సీపీఎం నాయకులు రవిబాబు, సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ నేత గోపి, ముస్లిం మత పెద్దలు ముఫ్తి మెజహిదుల్ ఇస్లాం, ముఫ్తి రహమతుల్లా, అబ్దుల్ ఖాదిర సాహెబ్, అబ్దుల గఫార్ సాహెబ్, మౌలానా అబ్దుల్ మస్తాన్, ఫారూక్, జిల్లా అవాజ్ కమిటీ కార్యదర్శి భాషా, స్టూడెంట్ ఇస్లామిక్ అర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి కరీం మొహీద్దీన్ అదాం ప్రసంగించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ముస్లింలతో పాటు మహిళలు పాల్గొన్నారు. పెదకూరపాడులో.. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెదకూరపాడులో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసనలు సంఘీభావం తెలిపిన సీపీఎం,ప్రజాసంఘాలు -
వరుస సెలవుల నేపథ్యంలోఇంద్రకీలాద్రికి పెరిగిన రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన యాత్రికులతో ఉదయం 7 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగగా, ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయ దర్శనం రద్దు రద్దీ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.300, రూ.100 టికెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో వీఐపీల పేరిట వచ్చే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి సైతం ముఖ మండప దర్శనం మాత్రమే కల్పించారు. రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తులు ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది క్యూలైన్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించారు. ఆర్జిత సేవలకు డిమాండ్... చైత్ర మాసం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అంతరాలయంలో ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమంతో పాటు సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆయా ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సాయంత్రం పల్లకీ సేవ, దర్బార్ సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఉపాధి హమీ కూలీ మృతి
బల్లికురవ: ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా ఎండ వేడిమితో అనారోగ్యం పాలై పదిరోజులపాటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని కొండాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు (45) పదిరోజుల కిందట గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రెక్కాడితేకాని డొక్క నిండని ఈ కుటుంబంలో యజమాని చనిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాసరావు అకాల మరణంతో కొండాయపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాల వ్యాన్ బోల్తా: వ్యక్తికి గాయాలు
జె.పంగులూరు: సురభి డెయిరీకి చెందిన పాల వ్యాను శుక్రవారం ఉదయం మండలంలోని చందలూరు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల మధ్య అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్లో బోల్తా పడింది. మండలంలోని జాగర్లమూడి వారి పాలెం వద్ద గల సురభి డెయిరీ నుంచి వాహనం పాల పదార్థాలతో చందలూరు మీదుగా చీరాల వెళ్లేందుకు బయలుదేరింది. తూర్పు కొప్పెరపాడు దాటిన తర్వాత ఎదురుగా కారు వచ్చింది. అది వెళ్లేందుకు దారి ఇస్తూ పక్కకు రావడంతో వ్యాన్ అదుపు తప్పి మార్జిన్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో పాల వాహనంలో ఉన్న ఎన్. కళ్యాణ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో అతన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
హాస్య నట మాంత్రికుడు షఫీ ఉజ్మా
చిలకలూరిపేట: నవరసాలలో కష్టమైనది హాస్య రసం. దాన్ని తన సహజ నటనతో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వుల్ని అవలీలగా పూయించగల విలక్షణ నటుడు షేక్ షఫీ ఉజ్మా. కామెడీ నాటకాలంటే ముందుగా గుర్తొచ్చేది షఫీనే. ఆయన రంగస్థల కళాకారుడే కాదు దర్శకుడు కూడా. చిలకలూరిపేట పట్టణానికి చెందిన షఫీ నాటకరంగంలో తన జీవితాన్ని హాస్య భూమికగా మలుచుకున్నాడు. పట్టణానికి చెందిన అబ్దుల్రజాక్, నజీమున్నీసా దంపతుల కుమారుడైన షఫీ తన హాస్య నాటికల ద్వారా తెలుగు నాటక రంగాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దాడు. ప్రతి నాటికలోనూ హాస్యాన్ని ఓ సామాజిక సందేశంగా మార్చిన షఫీ, ప్రేక్షకులను కేవలం నవ్వించడం, అలరించడమేకాదు..ఆహుతుల్ని ఆలోచింపజేస్తుంది అతని నటన. షఫీ నటించిన ప్రతి పాత్ర, ప్రతి సంభాషణలోనూ విశేషమైన స్వాభావికత్వం, చిరునవ్వు పండించే మాంత్రికతత్వం సహజంగా ఉంటుంది. కాబట్టే తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కందుకూరి జిల్లా పురస్కారాన్ని గర్వంగా అందుకున్నాడు. స్వీయ దర్శకత్వంతో పాటు నటించిన నాటికలివే... తొలి నాటిక ఛాన్స్ నుంచి మొదలైన షఫీ కళా పయనం వాయిదాల పెళ్లి, కాకి సందేశం, హ్హాచ్చ్ , వడ్లగింజలో బియ్యపు గింజ, నల్లకోడి తెల్ల గుడ్డు , పోవోయీ అనుకోని అతిథి, అక్క అలుగుడు చెల్లి సణుగుడు , ఆలీతో సరదాగా, హర్షం ఋతువు, ప్రేమ పొత్తిళ్లలోకి, హరిశ్చంద్రుడే అబద్ధమాడితే! , వర్క్ ఫ్రం హోమ్, ఏడనున్నాడో ఎక్కడున్నాడో, వాస్తు బాబోయ్ వాస్తు, తగునా ఇది భామా, భూమి గుండ్రంగా ఉంది, నిజాయితీ, బావా బావా పన్నీరు వంటి హాస్య నాటికలన్నీ షఫీ నటించి, దర్శకత్వం వహించి విశేష ప్రాచుర్యం పొందినవే. నటప్రస్థానానికి అందిన స్నేహహస్తం షఫీ కళా ప్రయాణానికి తోడ్పడిన వారు ఉన్నారు. వారి స్ఫూర్తిదాయక మాటలతో పాటు ప్రముఖ హాస్య నాటక రచయిత అద్దేపల్లి భరత్కుమార్, కొత్త శివ, వంకాయలపాటి ప్రసాద్, ఆళ్ల హరిబాబు, అంబటి బాలస్వామి, వి. నాగేశ్వరరావు, నటీమణి లహరి సంపూర్ణ మద్దతు నిచ్చారు. దీనికి తోడు షఫీ నిబద్ధత, తోటి కళాకారులు సహకారం వెరసి ఆయన కలల సాధనకు ఎంతో దోహదపడ్డాయి. కందుకూరి పురస్కారం అందుకున్న షఫీ నట ప్రస్థానం రంగస్థల హాస్య నాటికల దర్శక, నటుడిగా కీర్తి స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించిన నాటికలకు ప్రశంసల జల్లులు ఆలీతో సరదా నాటిక రాష్ట్రవ్యాప్తంగా 74 చోట్ల ప్రదర్శనలు మే 1న చిలకలూరిపేటలో 75వ ప్రదర్శనకు సన్నాహాలు ఆ కళారూపం ఓ మైలురాయి ఇక ’ఆలితో సరదాగా’ నాటిక షఫీ నట ప్రస్థానానికి మైలురాయిగా నిలిచింది. ఆయన నాటికల్లో అత్యధిక ప్రదర్శనలకు నోచుకున్న నాటిక ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 74 పరిషత్తుల్లో ప్రదర్శనలు, ప్రశంసలకు నోచుకుంది. భిలాయ్, శ్రీకాళహస్తి, ఏలూరు, ద్రాక్షారామం, రావులపాలెం, విజయవాడ వంటి పది ప్రముఖ పరిషత్తుల్లో ఉత్తమ బహుమతుల్ని సాధించింది. ఇదే నాటిక తన జన్మస్థలంలో ఈ ఏడాది మే 18న తిరిగి 75వ ప్రదర్శనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక నాటిక అనేక చోట్ల అనేకమార్లు ప్రదర్శనలకు నోచుకోవడం అంటే ఆషామాషీ కాదు. -
గుంటూరులో అర్ధరాత్రి ఐజీ, ఎస్పీ తనిఖీలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట నాలుగో లైన్లో గురువారం అర్ధరాత్రి గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ సతీష్ కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తదితర పోలీసు అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, బహిరంగ మద్యపానం తదితర కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పించేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డు ముస్లింల హక్కు
నకరికల్లు: ముస్లింల హక్కు అయిన వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేసే బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయ జెండాలు, నల్ల జెండాలతో ముస్లింలు శుక్రవారం నకరికల్లులో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక వై.జంక్షన్లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని గుండ్లపల్లి, నకరికల్లు, కుంకలగుంట తదితర గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని ముస్లింలు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా గుండ్లపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ముస్లిం పెద్దలు, అప్పటి రాజులు దానంగా, ధర్మంగా ఇచ్చిన కోట్ల విలువ కలిగిన ఆస్తులకు 1913లో ఒక చట్టంతో నేటి వరకు రక్షణ కల్పించుకున్నట్లు తెలిపారు. ముస్లింల రక్షణ పేరుతో దుర్మార్గమైన చట్టాన్ని అర్ధరాత్రి కేంద్రం అమల్లోకి తీసుకు వచ్చిందని విమర్శించారు. ముస్లింలకు అన్యాయం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు ముస్లింలకు అనాదిగా వస్తున్న హక్కు అన్నారు. యావత్ ముస్లింలు వ్యతిరేకిస్తున్న దుర్మార్గపు బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లును వెనక్కు తీసుకునే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి ఫకీర్ అహ్మద్, కరాలపాటి వలి, వినుకొండ సుభాని, కరిముల్లా, మస్తాన్వలి, షేక్ సలీల్, బండల జాను, షేక్ బాజి, ఇస్మాయిల్, జానీ బాషా, న్యాయవాది జిలాని, ఖాజావలి, రహమాన్, చాంద్ బాషా, మొహమ్మదా, సైదా, కాలేషా పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఇటీవల తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మైనార్టీ హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. నూతన చట్టంలో వక్ఫ్ నిర్వచనాన్ని మార్చారని తెలిపారు. కొన్ని శతాబ్దాలుగా ఉన్న మసీదులు, ముస్లిం శ్మశాన వాటికలు, దర్గాలు, ముస్లిం మత ప్రదేశాలన్నీ కూడా ఎలాంటి డీడ్స్ లేకపోయినా వక్ఫ్ బోర్డుల పరిధిలో కొనసాగుతూ ఆస్తులుగా ఉన్నాయని వివరించారు. నూతన చట్టం ప్రకారం వాటన్నిటిపై బోర్డుకున్న హక్కు తొలగి పోతుందని, దీని ద్వారా ఆస్తుల స్వాధీనం లేదా పునర్ వర్గీకరణకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో లెక్కలేనన్ని చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకంగా నిలిచే ప్రదేశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన చట్టంలో వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను తొలగించడంతో పాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఇవి తమ హక్కులకు భంగం కలిగించడమేనని, మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయట మేనని ధ్వజమెత్తారు. ముస్లింల ప్రాథమిక హక్కుల కల్పనకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంలో చేసిన 14 సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, మైనార్టీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ, ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి.. వక్ఫ్ పరిరక్షణకు ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలోని జాతీయ రహదారిపై కదం తొక్కిన ముస్లింలు నరసరావుపేట రోడ్లోని చెక్పోస్ట్ సమీపంలో గల మసీదు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరిగి తాలూకా సెంటర్కు చేరుకొని అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె.ఎస్. చక్రవర్తికి వినతి పత్రాన్ని అందించారు. ముస్లింల శాంతి నిరసన ర్యాలీకి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ముస్లింలు, మత పెద్దలు, పార్టీలకు అతీతంగా ముస్లిం నాయకులు పాల్గొన్నారు. బిల్లును నిరసిస్తూ నిరసన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు జాతీయ రహదారిపై కదం తొక్కిన ముస్లింలు సత్తెనపల్లి చెక్పోస్ట్ నుంచి బస్టాండ్ వరకు భారీ శాంతి ర్యాలీ -
ఇరకాటం... పితలాటకం
నరసరావుపేట: గత రెండు నెలల నుంచి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నూతన ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు బ్రేక్ పడింది. అంతకు ముందు తీసుకొన్న వారే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అతి ముఖ్యమైన ప్లాన్ మంజూరులో స్వీయ సర్టిఫికేషన్ స్కీం(ఎన్సీఎస్)ను ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. మున్సిపల్ లైసెన్స్డ్ ఇంజనీర్లుగా పిలవబడే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లపై నూతన మార్గదర్శకాలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం రెండు నెలల కిందట జీవో నంబర్– 20 తెచ్చింది. ఆ నిబంధనల మేరకు ఎల్టీపీలు అప్లోడు చేయకపోవడంతో ప్లాన్లు అధికారుల ముందుకురాలేదు. గతంలో మున్సిపల్ అధికారులే ప్లాన్ అప్రూవల్ చేసేవారు. ఇందులో అధికారులు లంచాలు గుంజటం, ఇవ్వని వారి ప్లాన్లకు ఏదో ఒక కారణం చూపి ఆపేస్తూ జాప్యానికి కారణమవుతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. ఎల్టీపీల చేతిలో అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ అధికారం మున్సిపల్ అధికారుల నుంచి తప్పించి ఎల్టీపీల చేతిలో పెట్టింది. ప్లాన్ గీసిన వారికే మున్సిపల్ నిబంధనల ప్రకారం అప్రూవల్ చేసే అధికారం ఇచ్చింది. దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగినా యజమాని, ఎల్టీపీలనే బాధ్యులుగా నిర్ణయించింది. తీసుకున్న ప్లాన్ ప్రకారం నిర్మిస్తామని యజమాని, ఎల్టీపీలు స్వీయ సర్టిఫికెట్ అందజేయాలనే నిబంధనలు పెట్టింది. భవన నిర్మాణదారులు తీసుకున్న ప్లాన్కు వ్యతిరేకంగా నిర్మాణం చేస్తే , దాన్ని నిలిపివేసే అధికారం ఎల్టీపీలకే కట్టబెట్టడంతో పాటు జరిమానా విధించే అధికారం కూడా వారికే ఇవ్వడం గమనార్హం. ఎల్టీపీలు పొరపాట్లు చేస్తే వారి లైసెన్స్ను ఐదేళ్లపాటు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన గత్యంతరం దాపురించింది. పురపాలక పరిధిలో లైసెన్స్ తీసుకున్న సుమారు 30మంది ఎల్టీపీలు ఎస్సీఎస్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ప్లాన్ మంజూరైన తర్వాత యజమాని తమ నియంత్రణలో ఉండరని, వారిని నియంత్రించే శక్తి, నిర్మిస్తున్న భవనాన్ని ఆపే సిబ్బంది తమకు ఉండరని ఎల్టీపీలు వాదిస్తున్నారు. దీంతో వారంతా కిమ్మనకుండా కూర్చున్నారు. నూతన నియమాల మేరకు ఎల్టీపీల లైసెన్స్ల మంజూరుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారెవరూ సహకరించకపోవడంతో ప్లాన్లు ఆన్లైన్లో ప్రభుత్వానికి చేరడంలేదు. ఈ కారణంగా ఇంటి నిర్మాణాలు ఆగిపోవటంతో యజమానులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో నంబర్– 20తో కుదేలైననూతన గృహ నిర్మాణ రంగం జీవోపై రుసరుసలాడుతున్న యజమానులు, ఎల్టీపీలు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు సహకరించని ఎల్టీపీలు ఒక ప్లాన్ మాత్రమే వచ్చింది జీవో 20 వచ్చిన తర్వాత పురపాలక పరిధిలో ఒక ప్లాన్ మాత్రమే వచ్చింది. ఎల్టీపీలు నూతన మార్గదర్శకాల మేరకు లైసెన్స్ అప్రూవల్ చేసుకోవాలని పిలిచాం. వారి నుంచి స్పందన కూడా లేదు. –కె.సాంబయ్య, టీపీవో -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎండ తీవ్రత దృష్ట్యా మే నెల అంతా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని, మినీ అంగన్వాడీ టీచర్లందరికీ మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒ.లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.సారమ్మ కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక అమరావతి రోడ్డులోని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సమస్యలను విన్నవించారు. వృత్తిపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వాణిశ్రీ, అరుణ, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నోటీసు కూడా కమిషనర్కు అందించినట్టు వివరించారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. -
షూటింగ్ బాల్ జిల్లా జట్లు ఎంపిక
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగాయి. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు తోక సోమనాథ్ ప్రారంభించారు. ఎంపికకు బాలుర విభాగంలో 35, బాలికల విభాగంలో 30 మంది హాజరయ్యారు. ● బాలుర జట్టుకు ఎం.మణికంఠ, వి.వర్షిత్, ఎస్.భార్గవ్, జి.నాగ హనుమ, జి.వెంకటేష్, ఎస్. సుధీర్, జి.రంగా, బి గోపి, జి.సురేష్, ఎ.సూర్య, కె.శశి, శనగల భార్గవ్, స్టాండ్ బైలుగా కె. జోసఫ్, పి.ఆనంద్లు ఎంపికయ్యారు. ● బాలికల జట్టుకు పి.నందిని, ఎస్.సుస్మిత, ఎం.వీరలక్ష్మి, కె.ఉష, సీహెచ్ సంజన, ఎస్.సింధూర, పి. సులోచన రాణి, సి.చంద్రిక, కె.యశస్విని, ఎల్.మహాలక్ష్మి, కె.వేదవతి, ఎం. కీర్తన, స్టాండ్ బైలుగా ఎ.హేమ శివమణి, కె.వసంత కుమారి ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు ఈ నెల 25, 26వ తేదీలలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, కార్యదర్శి కోనంకి కిరణ్ కుమార్ తెలిపారు. -
గుక్కెడు నీటి కోసం తప్పని కష్టాలు
దొడ్లేరు(క్రోసూరు): గ్రామంలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులున్నా, చెరువులో నీళ్లు పుష్కలంగా వారికి గుక్కెడు నీరు మాత్రం రావడం లేదు. జలజీవన్ మిషన్ ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. మండుటెండల్లో నీరు దొరక్క బజారులో బోరు పంపు వేయించేందుకు ప్రయత్నించగా పోలీసులను పిలిపించి అడ్డుకోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని దొడ్లేరు గ్రామంలోని దండుబజారు వాసుల దుస్థితి ఇది. ఇప్పటి వరకు వీధిలో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకునేవారు. బావి యజమాని ప్రస్తుతం వారిని రానీయటం లేదు. దీంతో వీధిలో బోరు పంపు వేసేందుకు గురువారం ఉపక్రమించారు. 20 అడుగులు తవ్వాక ఇంటి యజమాని ఒకరు తమ స్థలంలో బోరు వేస్తున్నారని ఫిర్యాదు చేయటంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. బోరు పంపు వేయనీయలేదు. దీంతో అక్కడి మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని పోలీసులు నచ్చజెప్పారు.దొడ్లేరు గ్రామంలోని దండుబజారు వాసుల ఆందోళన ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల తీరుపై ఆవేదన -
కందిరీగల దాడిలో 15 మందికి గాయాలు
బాపట్ల :బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గాయత్రీ అపార్టుమెంటు సమీపంలో కందిరీగలు దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కందిరీగలు ఒక్కసారిగా పైకిలేచి ఆ ప్రాంతంలో వెళ్లే వారిపై దాడి చేశాయి. దాడిలో 15 మందికి గాయాలు కాగా వీరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో అవకాశం బాపట్ల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన పలువురికి అవకాశం కల్పిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి, జాయింట్ కార్యదర్శులుగా మాచవరపు రవికుమార్, షేక్ ఫర్వీజ్, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ విభాగం కార్యదర్శిగా ఇమానియేల్ రీభాలను ఎంపిక చేశారు. వీరు ఎంపికై న పలువురు అభినందనలు తెలిపారు. తప్పిన ప్రమాదం చీరాల: జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. గురువారం చిన్నగంజాం నుంచి చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి కుటుంబంతో కలసి ఆటోలో వెళుతుండగా చీరాలలోని జాతీయ రహదారిలో టీడీపీ కార్యాలయం వద్ద నీరు తాగేందుకు ఆటో నిలిపారు. అదే మార్గంలో వేరుశనగ లోడుతో వస్తున్న మినీ లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో అటో వేగంగా పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి బాపట్ల టౌన్: ఇటీవల బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాపడిన రిటైర్డు రైల్వే ఉద్యోగి తులబందుల లక్ష్మీ నారాయణ(65) గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. లక్ష్మీనారాయణ, నల్లమోతు మాధవి గుంటూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నల్లమోతు మాధవి బుధవారం మృతి చెందగా లక్ష్మీనారాయణ గురువారం మృతి చెందారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీరిరువురు జీవితాలు విషాదం కావటంతో వారి బంధువుల్లో విషాదం నెలకొంది. -
రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి
పెదకూరపాడు: ఆ కుటుంబానికి ఆ యువకుడే ఆధారం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం తనపై వేసుకుని చెల్లికి వివాహం చేశాడు. చదువు కూడా మానుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. అలాంటి ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో కుమారుడి మృతదేహం చూసి తల్లి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా.. అంటూ రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు... పెదకూరపాడుకు చెందిన నర్రా హేమంత్ (29) ఈ నెల 12వ తేదీన సత్తెనపల్లి మండలం గుడిపూడి, సందిగామ గ్రామాల్లో జరిగిన అచ్చమాంబ తిరునాళ్లకు రాత్రి సమయంలో వెళ్లాడు. పెదకూరపాడు నుంచి నందిగామకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హేమంత్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చిన్నతనంలోనే తండ్రి మరణం.... హేమంత్ చిన్నతనంలో తండ్రి కోటేశ్వరరావు మరణించారు. దీంతో కుటుంబ భారం తల్లి రాజేశ్వరిపై పడింది. తనతోపాటు తన చెల్లి బాధ్యతలు స్వీకరించిన హేమంత్ ఇంటర్ వరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం ప్రారంభించాడు. ఈ క్రమంలో చెల్లి వివాహం చేసి, సొంత పొలంతోపాటు కౌలుకు కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో హేమంత్ మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. చేతికొచ్చిన కుమారుడు మృతితో తల్లి రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. హేమంత్ మృతితో పెదకూరపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం పెదకూరపాడులో విషాదఛాయలు -
పోలీస్ స్టేషన్కు బేడీలా...!
పిడుగురాళ్ల: దాచేపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్కు బేడీలు వేయడమేంటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా మహిళా యాక్టివిస్ట్ను అరెస్టు చేసి అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచటం సరైన నిర్ణయమా అని ప్రశ్నించారు. పార్టీ లీగల్ టీం, నాయకులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా బయట బేడీలు వేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలిని లీగల్ టీం కూడా కలవకుండా అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి -
పాత్రలకు జీవం.. నటనంటే ప్రాణం
యడ్లపాడు: యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఆదిశేషమ్మ దంపతులకు చెన్నకేశవ ప్రసాద్ జన్మించారు. ఆరేళ్ల ప్రాయంలోనే నటనలో అరంగేట్రం చేసిన ప్రసాద్కు ప్రాథమిక గురువుగా చెన్నుపాటి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఐ.రాజ్కుమార్ అభినయ నైపుణ్యాలు నేర్పించారు. అనంతరం డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు ప్రోత్సాహంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ‘ఆన్సర్’లో ప్రసాద్ నటనకు ఏపీ ప్రభుత్వం బంగారు నంది అవార్డు బహూకరించింది. ఆకాశవాణిలోనూ.. 27 సంవత్సరాలపాటు ఆకాశవాణిలో కళాకారుడిగా ప్రసాద్ సేవలందించారు. ఆయన గళం, సంభాషణ పలికే తీరు, భావం అన్నీ సమపాళ్లలో మిళితమై వినిపించేవి. చిన్నపాటి రేడియో నాటకాలు, ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఆయన స్వరం వినిపించగానే శ్రోతకు ప్రసాద్ గుర్తొచ్చేవారు. ఇలా రంగస్థలం వేదికపైనే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్లోనూ నటించి ప్రతిభ చాటారు. ప్రసాద్ 1976లో గుంటూరు రీజినల్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగంలో చేరారు. తరువాత ఇంటర్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు. 2016లో పదవీ విరమణ చేశారు. అయినా నటనకు మాత్రం దూరం కాలేదు. నాటకరంగ ప్రముఖులైన నాయుడు గోపి, షేక్ షఫీ, మల్లాది శివ, కందిమళ్ల రాఘవ, సింగరకొండ చౌదరి, అమృతలహరి, పురుషోత్తం, మధిర సుబ్బరాజు తదితర ప్రముఖుల దర్శకత్వంలో వేర్వేరు పాత్రల్లో ప్రసాద్ నటించారు. తనదైన భాష, అభినయంతో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. వరించిన పురస్కారాలు ఉత్తమ నటుడు, విలన్, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెయ్యికిపైగా పురస్కారాలను ప్రసాద్ సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. క తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయిలో కందుకూరి పురస్కారాన్ని స్వీకరించారు. పల్నాడు జిల్లా స్థాయి కందుకూరి పురస్కారాన్ని ప్రసాద్ బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నుంచి తెలుగు నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ సమక్షంలో అందుకున్నారు. నాటకం సమాజాన్ని ప్రతిబింబించే అద్దం. అందులో తన రూపాన్ని నింపుకొంటూ సామాజిక బాధ్యతనే కథాంశంగా మార్చుకున్న కళాకారుడు వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్. నాటకమంటే వల్లమాలిన ప్రేమ. తన జీవితాన్ని కళారంగానికే అంకితం చేశారు. తాజాగా కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్న ఆయనపై ప్రత్యేక కథనం ఇది. రంగస్థల వేదికపై పరిపూర్ణ నటుడు ప్రసాద్ సాంఘిక నాటకాల్లో పలు పాత్రలతో గుర్తింపు ఉన్నవ వాసిని వరించిన కందుకూరి పురస్కారం -
స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బృందావన్గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతీ సమితి, భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ టీవీ, కళాంజలి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు మొదలయ్యాయి. ఆలయ పాలక మండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి పుట్ట గుంట ప్రభాకరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఏపీ నాటక అకాడమీ నిర్వాహకులు గుమ్మడి గోపాలకృష్ణ, హంస అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ, ఉగాది పురస్కారగ్రహీత నల్లక శ్రీనివాసరావు, టీవీ. నటుడు, నిర్మాత డాక్టర్ వలేటి అప్పారావు ప్రసంగించారు. ఈనెల 19 వరకు స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు జరుగుతాయని కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం శ్రీదుర్గాభవాని నాట్యమండలి (తెనాలి) ఆధ్వర్యంలో ఆరాధ్యుల ఆదినారాయణరావు నిర్వహణలో శ్రీకృష్ణ తులాబారం, పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. నటీనటులు మెప్పించారు. డోలక్పై సాంబిరెడ్డి చక్కటి సహకారాన్ని అందించారు. -
చట్టబద్ధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
అమరావతి: పల్నాడు జిల్లాలోని అమరావతి – బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు ఇటీవల రెండు నెలలుగా ధరణికోట, అమరావతి పరిధిలోని గ్రామాలలో చేపట్టారు. పలువురు గ్రామస్తులు అభ్యంతరం తెలిపినా ఆర్ అండ్ బీ అధికారులు ఇష్టారాజ్యంగా నోటీసులు, నష్ట పరిహారాన్ని ఇవ్వకుండానే భవనాలను, ఇళ్లను కూలుస్తున్నారు. కట్టా రాధికాదేవి సహా మరికొందరు అధికారుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించాలని కోరుతూ పిటిషనర్లు తరఫున న్యాయవాది కోడె రమేష్ బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి... ఆర్ అండ్ బీ శాఖ చట్టబద్ధంగా సర్వే నిర్వహించి, సంబంధికులకు నోటీసులు జారీ చేయాలన్నారు. చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది బాలాజీని హైకోర్టు ఆదేశించింది. దీినిపై పలువురు ఇళ్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్ అండ్ బీ అధికారులకు హైకోర్టు ఆదేశం -
రైతుల దుస్థితిని కళ్లకు కట్టిన ‘అన్నదాత’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత కళాంజలి, హైదరాబాద్ వారి అన్నదాత నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో రైతుల పరిస్థితిని కళ్లకు కట్టిందీ నాటిక. అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న వర్తమాన స్థితిని ఎత్తిచూపింది. రైతాంగం మనుగడ ప్రశ్నార్థకం కావటం వ్యవసాయాధారిత దేశంలో ఓ గొప్ప విషాదంగా వర్ణించిందీ నాటిక. వల్లూరు శివప్రసాద్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించారు. వివిధ పాత్రల్లో శోభారాణి, సురభి ప్రియాంక, భుజంగరావు, పున్నయ్యచౌదరి, రాధాకృష్ణ, తిరుమల, శివరాం, ప్రశాంత్ నటించారు. వినోదాన్ని పంచిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’.. అనంతరం సహృదయ, ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటికను ప్రదర్శించారు. నలభీముడిలా వంటల చేయగల దిట్ట అయిన సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్లో అటు వృత్తిపని, ఇంట్లోకి తరచూ వచ్చే చుట్టాలకు వంటలు చేస్తూ సతమతమైన వ్యవహారాన్ని ఆద్యంతం హాస్య సన్నివేశాలకు వినోదాత్మకంగా సాగిందీ నాటిక. చివరకు ఉద్యోగానికి రిజైన్ చూసి ‘సౌమ్యలక్ష్మీ హోమ్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్ను ప్రారంభిస్తాడు. కేకే భాగ్యశ్రీ మూలకథను అద్దేపల్లి భరత్కుమార్ నాటకీకరించగా, డి.మహేంద్ర దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో కొత్త శివరాంప్రసాద్, ఆళ్ల హరిబాబు, షేక్ షఫీ ఉజ్మా, వి.నాగేశ్వరరావు, లహరి నటించారు. తొలుత యనమదల రీతిక శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆహుతుల అభినందనలు అందుకుంది. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరుగుతున్న ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకటకోటేశ్వరరావు పర్యవేక్షించారు. గోవుల మృతిపై విచారణ చేపట్టాలి చినకాకాని(మంగళగిరి): తిరుపతిలో గోవుల మృత్యువాతపై ప్రభుత్వం విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ మంటలు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చినకాకానిలో జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ తరగతులకు హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతిలో లడ్డూ కల్తీ అయిందని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న మోదీ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ప్రధాని అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ మోదీ పాలనలో మహిళలపై దాడులు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. -
కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి
సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురురేపల్లె రూరల్: పెనుమూడి వద్ద కృష్ణా నదిలో మునిగి ఇరువురు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భట్టిపోలు మండలం వేమవరం గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు ఆటోలో రేపల్లె మండలం పెనుమూడి వద్ద కృష్ణా నదికి చేరుకున్నారు. మతమార్పిడి కోసం ముగ్గురు రాగా వారి వెంట కుటుంబ సభ్యులు తరలివచ్చారు. వారిలో సరదాగా ఈత వేసేందుకు ఐదుగురు నదిలో దిగి నీట మునగగా గమనించిన స్థానికులు ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ఇద్దరిని నదిలో గాలించి కొంతసేపటికి ఒడ్డుకు తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఇరువురు యువకులను అంబులెన్న్స్లో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మార్గంలో ఒక యువకుడు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. గుంటూరులో ఇంటర్ పూర్తి చేసిన తలకాయల గౌతం (18), పొన్నూరులో పాలిటెక్నిక్ పూర్తి చేసిన పెనుమాల దేవదాసు (19)లు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. -
21న పేటలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని టౌన్హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు గురువారం పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా నరసరావుపేటను ఎంపిక చేశామన్నారు. సాధారణంగా కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించాలని సూచించారు. ఏప్రిల్ మొదటి వారంలో చిలకలూరిపేట పట్టణంలో తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించామని గుర్తుచేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి స్పందన వచ్చిందన్నారు. 300 వరకు వినతులు అందాయని చెప్పారు. సమీక్షకు హాజరైన కలెక్టర్, ఎస్పీ గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీసీకి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఉచిత ఇసుక సరఫరా, సౌరవిద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ, వేసవి నేపథ్యంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపేందుకు ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఎంఎస్ఎంఈ సర్వే, నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. మండలాల్లో ‘ఈ–వేస్ట్’ సేకరణ కేంద్రాలు నరసరావుపేట: జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను ఈ నెల 19వ తేదీ నిర్వహించబోయే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో కలెక్టర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–చెక్ అనే అంశాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 13 శాఖలు భాగస్వాములు కావాలని, నిర్వర్తించాల్సిన విధులు, చేపట్టాల్సిన అంశాలను వివరించారు. గ్రామ, వార్డు స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను సైతం యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వాటి ఆధారంగానే జిల్లాకు ర్యాంకింగ్ వస్తుందని తెలిపారు. చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఆసుపత్రులు, మార్కెట్లు, పట్టణ కేంద్రాలను పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఎన్జీఓలు, యువత, సామాన్య ప్రజలను సైతం పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని అన్నారు. పట్టణాలు, మండలాల్లో ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని చెప్పారు. దీనికోసం సభ్యులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్పై దృష్టి పెట్టాలని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్పై దృష్టి పెట్టి తగిన ప్రాచుర్యం కల్పించాలని కోరారు. పీజీఆర్ఎస్ వినతులను అర్జీదారుడు సంతృప్తిపడేలా పరిష్కరించాలని చెప్పారు. అప్పుడే వారి నుంచి ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని స్పష్టం చేశారు. పింఛన్ సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని కోరారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కిశెట్టి బుచ్చమ్మ, రాగాల భువనేశ్వరిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పోలీసుల ద్వారానే అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటికి ఎవరూ భయపడరని, ఎదురు తిరిగే రోజు వస్తుందన్నారు. మహిళలని చూడకుండా దాడి చేసి కాలు విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడుందని కూటమి పాలకులను నిలదీశారు. చిన్న గొడవలు జరిగినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి దెబ్బలు తగలకపోయినా 307 కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు రక్షణగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఒంట్లో ఓపిక లేక.. శరీరంలో రోగం తగ్గక ‘అయ్యా .. మీరే దిక్కంటూ’ నరసరావుపేట ఏరియా ఆస్పత్రి తలుపును ఎవరైనా తడితే అక్కడ దౌర్భాగ్య పరిస్థితులు మరింత వెక్కిరిస్తున్నాయి. మంచంపై సొమ్మసిల్లితే విరిగిన ఫ్యాన్ల రెక్కలు ఉసూరుమంటున్నాయి. ముక్కు మూసుకుని మరీ మరుగుదొడ్ల వైపు వెళితే నీళ్లు లేని కుళాయిలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ కడుపు నొప్పంటూ రోగి విలవిల్లాడుతుంటే ఆలకించే సిబ్బంది లేరు. పది నెలల కూటమి పాలనలో కనీస వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రి అంటే కూటమి సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఉంది. నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు సేవల కోసం వచ్చే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వైద్యశాలకు రోజు పల్నాడు జిల్లాతోపాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 1,000 – 1,200 మంది ఓపీ నమోదు చేసుకుంటున్నారు. కూలీనాలీ చేసుకుని బతికే పేదోళ్లు ఇక్కడికి వచ్చాక వసతుల లేమితో నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న రోగం పోతుందో లేదో తెలియదుగానీ... కొత్త రోగం మాత్రం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో వైపు సిబ్బంది కొరతతో రోగులకు కనీసం సమాధానం చెప్పే వారు కరవయ్యారు. వేధిస్తున్న స్టాఫ్ నర్సుల కొరత ఈ వైద్యశాలకు 40 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు. వీరితో ఎలా సేవలు అందించాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతపై ఆరు నెలల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్కు లేఖ రాశారు. సరిపడా సిబ్బందిని కేటాయించాల్సిందిగా కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఉన్న సిబ్బందికీ పని ఒత్తిడి కారణంగా విధుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ ప్రభావం రోగులపై తీవ్రంగా పడుతోంది. కనీస వసతులూ కరవే... వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరుగుదొడ్లు వద్ద దుర్వాసన వస్తోంది. గతంలో వంద పడకలుగా ఉన్న ఆస్పత్రిని 200 పడకలకు పెంచారు. శానిటేషన్ సిబ్బందిని మాత్రం పెంచలేదు. దీంతో ప్రభుత్వాస్పత్రి పరిసరాల్లోకి అడుగు పెట్టాలంటే ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రోగంతో ఆస్పత్రిలో అడుగుపెడితే రోగితోపాటు సహాయకులకు కూడా కొత్త వ్యాధులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. చొరవ చూపని అధికారులు వైద్యశాలలో సీటీ స్కాన్ పరికరం అందుబాటులో లేదు. రోడ్డు ప్రమాదాల కేసులు ఇక్కడకు అధికంగా వస్తుంటాయి. అధిక శాతం తల భాగంలో తీవ్ర రక్త గాయాలైనవే ఉంటాయి. వైద్య సేవ అందించాలంటే సీటీ స్కాన్ అవసరం. అది అందుబాటులో లేకపోవడంతో కేసులను గుంటూరుకు పంపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దాత సీటీ స్కాన్ యంత్రం అందజేస్తామని ముందుకొచ్చారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐసీయూ ఉన్నా నిరుపయోగమే .. సిబ్బంది లేని కారణంగా ఐసీయూ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేసి పది పడకలను సిద్ధం చేశారు. వెంటిలేటర్లు కూడా ఉన్నాయి. టెక్నీషియన్లు లేక ప్రయోజనం లేకుండాపోయింది. టెక్నీషియన్లు కావాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నియమించలేదు. పాయిజన్ కేసులను గుంటూరుకు పంపించాల్సి వస్తోంది. 9న్యూస్రీల్ ప్రభుత్వాస్పత్రిలో అందని వైద్య సేవలు తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేని మరుగుదొడ్లు సిబ్బంది కొరతతో అరకొర వైద్యం సీటీ స్కాన్ మిషన్ లేక సిఫార్సులతో సరి పది నెలల పాలనలో అంతా అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న రోగులు, సహాయకులు రోగులపై ఆర్థికభారం సైలెన్ సీసా తీసే వారూ లేరు విరేచనాలతో బాధపడుతూ ఏరియా వైద్యశాలలో చేరాను. నీరసంగా ఉండటంతో సైలెన్ ఎక్కించారు. బాటిల్ పూర్తయినప్పటికీ తొలగించేందుకు సిబ్బంది రాలేదు. వారికోసం వెతికినా అందుబాటులో లేరు. చివరకు స్వయంగా నీడిల్ను తీసుకోవాల్సి వచ్చింది. పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – ఎలిషా, వెల్లలచెరువు, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా సిబ్బంది కొరతపై నివేదిక వైద్యశాలలో సిబ్బంది కొరతను ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే భర్తీకి చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య సిబ్బంది కాంట్రాక్ట్ పూర్తయిన కారణంగా కొత్త వారిని ఇంకా నియమించలేదు. కొత్త కాంట్రాక్ట్లో సిబ్బంది పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. – డాక్టర్ సురేష్ కుమార్, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాలకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. హెచ్డీఎస్ నిధులతో ఆసుపత్రికి అవసరమైన మౌలిక సౌకర్యాలు, అత్యవసరమైన మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినియోగిస్తారు. తొమ్మిది నెలలుగా రోగులకు వైద్య సేవలు, సరిపడా మందులు లేకపోయినా కమిటీ లేకపోవడంతో పట్టించుకోలేదు. సేవల కోసం వచ్చిన రోగులు బయట మందులు కొనుక్కోవడం, పరీక్షల కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థిక భారాన్ని మోశారు. -
గురుశిష్యుల అనుబంధం వెలకట్టలేనిది
ఏఎన్యూ(గుంటూరు): గురుశిష్యుల అనుబంధం వెల కట్టలేనిదని హైదరాబాద్లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత అన్నారు. వర్సిటీలో గురువారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విలువలతో సమాజంలో బాధ్యతాయుతంగా ఆదర్శవంత జీవనాన్ని సాగించాలన్నారు. ప్రతిభతోపాటు స్థిరత్వం ముఖ్యమని సూచించారు. వ్యక్తి తలచుకుంటే ఒక వ్యవస్థగా మారి, ఒక గొప్ప శక్తి కాగలడని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధికారి చిటికెల చిన్నారావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె.గంగాధర రావు మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, కృత్రిమ మేధ ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు. వార్షికోత్సవానికి ఏఎన్యూ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. తర్వాత బాలలతను సత్కరించారు. అనంతరం రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, వీసీ ఆచార్య కె. గంగాధరరావుతోపాటు పలువురిని సన్మానించారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన వర్సిటీ ప్రొఫెసర్లు ఎం.త్రిమూర్తిరావు, వై.అశోక్ కుమార్, ఎన్.వి.కృష్ణారావు, పూర్ణచంద్ర రావులను వర్సిటీ వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్, ఓఎస్డీ తదితరులు సత్కరించారు. కార్యక్రమానికి ఎం. త్రిమూర్తిరావు, సీహెచ్ లింగరాజు, డాక్టర్ రవి శంకర్ రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పూర్వ ఐఐఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ విభాగాధిపతి డాక్టర్ జి. కొండలరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ వీరయ్య, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల రాణి పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగ కళాకార స్వర నేత్ర బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద గాయకులు దామోదర గణపతి రావు బృందం పలు గీతాలను ఆలపించింది. చలనచిత్ర గాయకురాలు సాయి శిల్ప సినీ గీతాలతో అలరించారు. వర్సిటీలోని డ్యాన్స్ విభాగం విద్యార్థులు శాసీ్త్రయ, పాశ్చాత్య నృత్యాలతో ఆకట్టుకున్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, బృందాలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. -
పెట్రోలు ట్యాంకర్ బోల్తా
చేబ్రోలు: సడన్గా బ్రేక్ వేయడంతో పెట్రోలు ట్యాంకర్ లారీ బోల్తా పడిన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి నుంచి చీరాలకు పెట్రోలుతో వెళ్తున్న హెచ్పీ కంపెనీ లారీ చేబ్రోలు మండలం నారాకోడూరు జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దగ్గరకు వచ్చేవరకు స్పీడ్ బ్రేకర్ కనిపించక, డ్రైవర్ సడన్ బేక్ర్ వేయడంతో ఘటన జరిగింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన పెట్రోలు ట్యాంకర్ డ్రైవర్ కె.వీరాస్వామికి గాయాలవటంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా ప్రాంతానికి ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్థన్, పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణ, తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బెంబేలెత్తిన స్థానికులు, వాహనదారులు సుమారు ఎనిమిదివేల లీటర్లు పెట్రోలు ఉన్న ట్యాంకర్ లారీ బోల్తా పడటంతో పాటు కొంత లీకేజీ అవుతుండటంతో స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది పెట్రోలు ట్యాంకర్ లారీ చుట్టూ నురగ (ఫోమ్)ను స్ప్రే చేసి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. పొన్నూరు, గుంటూరు రోడ్డులో వాహన రాకపోకలను పోలీసులు నిలుపదల చేశారు. ట్రాఫిక్ను ఇతర ప్రాంతాల ద్వారా మళ్లించారు. ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు నారాకోడూరు జడ్పీ హైస్కూల్ ఎదురు జీబీసీ రహదారిపై పెట్రోలు ట్యాంకర్ బోల్తా పడటంతో పొన్నూరు, గుంటూరు రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను నారాకోడూరు వద్ద, పొన్నూరు వైపు నుంచి వచ్చే వాహనాలను చేబ్రోలు వద్ద ట్రాఫిక్ మళ్లించారు. దీంతో సింగిల్ రోడ్డు కావటంతో వాహనాలు ఎదురు ఎదురుగా వచ్చి పలు చోట్ల వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. త్రుటిలో తప్పిన ప్రమాదం.. డ్రైవర్కు గాయాలు చేబ్రోలు మండలం నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ వద్ద ఘటన -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి
మాచర్ల రూరల్: కేంద ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేసి, దేశంలోని ముస్లింలకు రక్షణ కల్పించాలంటూ ముస్లిం సమైక్య వేదిక, ముస్లిం జేఏసీ నేతృత్వంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకే దేశం.. ఒకే చట్టం అంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన మోదీ, ఎన్నికల్లో గెలిచిన అనంతరం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బంది పెట్టే ప్రక్రియను మానుకోవాలని డిమాండ్ చేశారు.వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లింల ఆస్తులపై భద్రత లేకుండా చేసే ప్రక్రియగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి పార్టీ పునరాలోచన చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కూటమి నాయకులు సవరణ బిల్లు రద్దుకు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు అబ్దుల్ రజాక్, ముక్తి సాహెబ్, అమీరా నజీర్, షేక్ జలీల్, కరిముల్లా, సుభాని, షేక్ జాని, ఖాజావలి, మస్తాన్, షేక్ సులేమాన్, కరిముల్లా, యాసిన్, ఇమాం, హుస్సేన్ పాల్గొన్నారు. -
రోగికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. కలెక్టరేట్ సమీపంలోని 200 పడకల ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్లో కొన్ని రోజులు క్రితం గుర్తుతెలియని వ్యక్తిని చికిత్స కోసం చేర్చగా, ఆ వ్యక్తికి చికిత్స అందజేయకుండా ఒక మూలన పడేశారని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిక్కినం చిన్న పేర్కొన్నారు. విషయం తెలుసుకొని తాను హాస్పిటల్కు వెళ్లానని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో 30 మంది నర్సులకుగాను కేవలం పదిమంది ఉండటం వలన రోగులకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. సుమారు 150 మందికిపైగా ఇన్పేషెంట్లు ఉంటే వారందరికీ పది మందితో ఏవిధంగా సేవలు అందజేస్తామని వైద్యులు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అంగీకరించలేదన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు కల్పించాలని, బాధితులను మెరుగైన వైద్యం అందించాలని చిన్న డిమాండ్ చేశారు. రోగి మానసిక పరిస్థితి సరిగా లేదు దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆ రోగి మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. వైద్యానికి సహకరించట్లేదని పేర్కొన్నారు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తాను బుధవారం హాస్పిటల్లో సదరన్ క్యాంపులో ఉన్నానని, అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. తనను ఎవరూ కలవలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన పౌరహక్కుల సంఘ నాయకుడు రోగులకు సరైన వైద్యం అందట్లేదని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరోపణ -
గిట్టుబాటు కోసం పోరుబాట
చిలకలూరిపేట: బర్లీ పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే మద్దతు ధర కల్పించలాని పలు రైతు సంఘాలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. బర్లీ పొగాకు పండించిన రైతులకు గత ఏడాది మాదిరిగా ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... పొగాకు రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. దీంతో ఎగుమతులను ప్రోత్సహించడం కూడా పొగాకు బోర్డు ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. కానీ వర్జీనియా పొగాకును మాత్రమే పట్టించుకుంటోందని మండిపడ్డారు. బర్లీ పొగాకు, నాటు పొగాకు తమ పరిధిలో లేవంటూ బాధ్యతల నుంచి తప్పుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పత్తాలేని ప్రైవేటు సంస్థలు గతేడాది పొగాకుకు ఏర్పడిన డిమాండ్తో ఈ ఏడాది సీజన్ మొదట్లో పలు కంపెనీలు రైతులను ప్రోత్సహించడంతో ఎక్కువమంది బర్లీ పొగాకు సాగు చేశారని వెల్లడించారు. ఎకరాకు రూ.లక్షన్నరకుపైగా ఖర్చు చేసి రైతులు, అదనంగా మరో రూ.40 వేలు కౌలు వెచ్చించి మరికొందరు సాగు చేశారన్నారు. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విత్తనాలు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలు పత్తాలేకుండా పోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. దళారులు మద్దతు ధరను పదేపదే మార్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బర్లీ పొగాకును టుబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పర్చూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు బర్లీ పొగాకు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదన్నారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు, సీఐటీయూ పల్నాడు జిల్లా కన్వీనర్ పేరుబోయిన వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, జన క్రాంతి పార్టీ నాయకులు షేక్ గౌస్, వీసీకే నాయకులు వంజా ముత్తయ్య, నేతలు బి. శ్రీనునాయక్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా జూలకంటి
పిడుగురాళ్ల: దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా పిడుగురాళ్లకు చెందిన పిడుగురాళ్ల రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. బుధవారం రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాలయం రైల్ నిలయం డీజీఎం(జీ), జెడ్ఆర్యూసీసీ కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కళా పురస్కారాలు ప్రదానం తెనాలి: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అయిదోరోజైన బుధవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన సాంఘిక, పౌరాణిక పద్యనాటక కళాకారులు బద్దుల తిరుపతయ్య, దేవిశెట్టి కృష్ణారావు, చెన్నం సుబ్బారావును సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి, కళాపురస్కారాన్ని ప్రదానం చేశారు. తొలుత గుంటూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యగురువు సరిత శిష్యబృందం, ఆరిశెట్టి ఐశ్వర్య శిష్యబృందం, యనమదల రీతిక, శవ్వా గ్రీష్మశ్రీలు కూచిపూడి, జానపద నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు. ఆరో రోజైన గురువారం సాయంత్రం కళాంజలి, హైదరాబాద్ వారి ‘అన్నదాత’, సహృదయం ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోం’ నాటికల ప్రదర్శనలు వుంటాయని తెలియజేశారు. యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నాయి. -
హత్యాచారం కేసును నీరుగార్చిన పోలీసులు
వినుకొండ: మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెంలో చింతలదేవి అనే వివాహిత హత్యాచారం కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలకు బహిరంగ లేఖ రాశారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ... వివాహితపై హత్యాచారం కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా సెక్షను పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. ఇటీవల పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో హత్యగా భావిస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హమన్నారు. జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులకు దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టి నోరు నొక్కడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. న్యాయం కోసం వివాహిత భర్త పోలీసుల వద్దకు వెళ్తే ఆయనపైనే హత్య కేసు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని, అండగా ఉంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ -
అకాల వర్షంతో రైతన్నకు వెతలు
● తడిసిన ధాన్యం, మిర్చి పంటలు.. నేలకూలిన అరటి ● ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి రెంటచింతల: మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, పెనుగాలులకు ధాన్యం, మిర్చి పంటలు తడవడంతోపాటు అరటి పంట నేలకూలడంతో అన్నదాతల ఆశలు ఆవిరి అయ్యాయి. రెంటచింతల, పాలువాయి, మంచికల్లు, మల్లవరం, గోలి, మిట్టగుడిపాడు తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీగా పెనుగాలులు వీచాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి పంటలను తడవకుండా కాపాడుకోవడానికి రైతులు పట్టలు తీసుకుని ఉరుకులుపరుగులు పెట్టారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు తమ కళ్ల ముందే తడవడంతో రైతన్నలకు దిక్కుతోచడం లేదు. తాను సాగు చేస్తున్న 6 ఎకరాల అరటి చెట్లు మొత్తం నేలకూలడంతో సుమారు రూ.5లక్షల వరకు నష్టం వచ్చినట్లు మంచికల్లు గ్రామానికి చెందిన గొంగడి శ్రీనివాసరెడ్డి వాపోయారు. పాలువాయి గ్రామానికి చెందిన ములకా రోసిరెడ్డి, కుంచపు శ్రీనివాసరావు, గుంటా అంజిరెడ్డి, పెద్దిరెడ్డి శేషిరెడ్డి, మేకల వెంకటరెడ్డి, శొంఠిరెడ్డి గురవారెడ్డి, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తదితర రైతులకు చెందిన మిర్చి, ధాన్యం బస్తాలు ఈ అకాల వర్షానికి తడిసిపోయాయి. గాలి, వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందచేయాలని వారు కోరుతున్నారు. -
ఉల్లాస్ రెండో విడత లక్ష్యం 30 వేల మంది
నరసరావుపేట: గతేడాది అందరికీ అక్షరాస్యత (ఉల్లాస్) కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. 2025–26లో 30 వేల మందిని విధాన, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యులను తయారు చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఉల్లాస్ పథకంపై జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి ఫేజ్లో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని వారికీ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు మున్సిపాలిటీల్లో ఉల్లాస్ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించి నమోదు చేయాలన్నారు. సెర్ప్, మెప్మా అధికారులు ప్రతి పది మంది అభ్యాసకులకు ఒక విద్యా వలంటీర్ చొప్పున నియామకాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ రాయడం, చదవడం, ఆర్థిక లావాదేవీలు చేయగలిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా వయోజన విద్య అధికారి జగన్మోహన్రావు, డీఈవో ఎల్.చంద్రకళ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, గ్రామ–వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. తొలి దశలో 10,164 మందికి లబ్ధి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు -
వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటడం అభినందనీయం
పెదకాకాని: వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తేవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న బిట్రా రోచిష్మతి ఈనెల 7వ తేదీ నుంచి 12 వరకు మణిపూర్లో జరిగిన 68వ జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అండర్–17 విభాగంలో పాల్గొన్న రోచిష్మతి ఉత్తమ ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో రోచిష్మతిని డీఈఓ రేణుక సమక్షంలో కలెక్టర్ నాగలక్ష్మి సత్కరించారు. జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడమే కాకుండా రానున్న రోజుల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచిపేరు తేవాలని కలెక్టర్ ప్రోత్సహించారు. అదేవిధంగా పాఠశాల పీఈటీ చండ్ర వినయ్కుమార్ను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ మెల్లెంపూడి రవి, నేషనల్ టీం కోచ్ నాగ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
హత్యకేసులో నిందితుడు అరెస్టు
అమరావతి: మండల పరిధిలోని దిడుగు గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన కానసాని కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుడు గోళ్ల జాలయ్యను అమరావతి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అచ్చియ్య చెప్పిన వివరాల ప్రకారం... కానసాని కోటేశ్వరరావు వద్ద తీసుకున్న అప్పు విషయమై తలెత్తిన వివాదంలో జాలయ్య బండరాయితో మోది ఈ హత్య చేశాడు. జాలయ్యను మండల పరిధిలోని ధరణికోట ఆరుడొంకల బావి సెంటర్లో బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం బుధవారం సాయంత్రం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. బెల్టు షాపు నిర్వాహకుడిపై కేసు మండల పరిధిలోని దిడుగు గ్రామంలో ఈ హత్య బెల్టు షాపులో జరగడం కలకలం రేపింది. బెల్ట్షాపు నిర్వాహకుడు ఎం.నాగేశ్వరరావుపై మంగళవారం కేసు నమోదు చేశారు. బెల్టు షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 45 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
పీఎఫ్ పనులపై వచ్చి ఉపాధ్యాయుడు మృతి
● గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు చల్లా వెంకటరెడ్డి ● జూన్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఇంతలోనే మృత్యువాత గుంటూరు ఎడ్యుకేషన్: బోధన వృత్తిలో సుదీర్ఘ సేవలందించిన ఉపాధ్యాయుడు హఠాన్మరణం చెందారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న చల్లా వెంకటరెడ్డి (62) బుధవారం పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని విజిటర్స్ కుర్చీలో కూర్చుని ఉండగానే, తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న కుమారుడు ప్రసన్నాంజనేయులు రెడ్డితో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తక్షణమే సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక రమేష్ ఆస్పత్రికి వచ్చి వెంకటరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆయన కుమారుడిని పరామర్శించి, అంబులెన్స్లో ఆయన స్వస్థలమైన పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి పంపారు. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొంది, కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఉపాధ్యాయుడు ఈ విధంగా హఠాన్మరణం చెందడంతో తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం నరసరావుపేట డీఈఓ కార్యాలయానికి వెళ్లాల్సిన వెంకటరెడ్డి సరైన సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి ఈ విధంగా మృతి చెందారు. -
పీహెచ్సీలో ప్రసవాలు జరిగేలా చూడాలి
బెల్లంకొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది ప్రోత్సహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవి తెలిపారు. బుధవారం మండలంలోని చండ్రాజుపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కొరకు వచ్చిన బాలింతలు, తల్లులతో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా సరైన సమయంలో టీకాలను వేయించాలని సూచించారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యసాధన, వాటి ప్రగతిపై సమీక్ష చేశారు. ఆన్లైన్ సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పీహెచ్సీలో ప్రసవాల ప్రగతి చాలా తక్కువగా ఉండడాన్ని గమనించారు. వైద్యశాలలో అన్ని రకాల పరికరాలు ఉన్నప్పటికీ, 24 గంటలు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రసవాలు ఎందుకు చేయలేకపోతున్నారని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాలలో ప్రసవాల ప్రగతి పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్యాధికారి డా.నజీర్, సీహెచ్ఓ మణికుమారి, సూపర్వైజర్ బాషా, సిబ్బంది ఉన్నారు. -
నవధాన్యాల సాగుతో నేల తల్లిని బాగు చేద్దాం
నార్నెపాడు(ముప్పాళ్ళ): ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాలు సాగు చేసి నేల తల్లిని బాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి నందకుమార్ చెప్పారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నందకుమార్ మాట్లాడుతూ అంతర పంటలు వేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. భూమిలోని సూక్ష్మజీవుల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తద్వారా భూమి సారవంతం అవుతుందన్నారు. సత్తెనపల్లి డివిజన్ మాస్టర్ ట్రైనర్ కంచర్ల మధుబాబు మాట్లాడుతూ పీఎండీఎస్ (ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) సాగు చేయడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయని తెలిపారు. కొంత కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వీఏఏ ప్రియాంకరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామపెద్దలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్వాతి, పూజ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని సభకు పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: మే 2వ తేదీన అమరావతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా లతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులకు విధులు కేటాయించిందన్నారు. జిల్లా అధికారులకు కూడా వారు నిర్వహించాల్సిన విధులపై సూచనలు జారీ చేశామన్నారు. ప్రధాని పర్యటనను అధికారులు ప్రతిష్టగా భావించి విజయవంతం చేయాలన్నారు. ప్రధాన సభలో పాల్గొనే ముందు ప్రధాని రోడ్షో ఉంటుందని వాటి ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంగణమంతా శానిటేషన్ చక్కగా ఉండాలని చెప్పారు. ప్రాంగణమంతా సుందరీకరణ చేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని ఆయా శాఖలు నియమించుకోవాలన్నారు. సభా ప్రాంతంలో సీటింగ్ ఏర్పాటుతో పాటు మంచినీరు, స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. రూట్మ్యాప్పై అవగాహన ఉండాలి.. కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్పై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని తెలిపారు. వాహనాల పార్కింగ్కు 5 ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనే వాహనాలు పార్క్ చేసే విధంగా చూడాలని తెలిపారు. బ్యారికేడ్లు, మొబైల్ టాయ్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతారని, వారు సురక్షితంగా ఇంటికి చేరే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివరించారు. అడిషన్ ఎస్పీ సుప్రజ, డీఆర్ఓ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.గంగరాజు, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యటన ఏర్పాట్లు పరిశీలన.. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెలగపూడి(తాడికొండ): మే 2వ తేదీన తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపధ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్లు నవీన్, ప్రవీణ్ చంద్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నిషేధిత పత్తి విత్తనాల విక్రయం నేరం
సత్తెనపల్లి: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించటం నేరమని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ఏడీఏ ఆర్. శశిధర్ రెడ్డి అన్నారు. గుంటూరులోని వ్యవసాయ శాఖ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు ఆ కార్యాలయం నుంచి వచ్చిన ఏడీఏ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు విత్తన దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్టీఈ విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. వాటిని విక్రయించటం చట్టరీత్యా నేరమన్నారు. తనిఖీలలో డీలర్ల దగ్గర ఆ విత్తనాలు లభించలేదన్నారు. రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి ఎస్.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల నుంచి విత్తనాలు తీసుకోవాలన్నారు. మధ్యవర్తుల వద్ద కొనుగోలు చేయరాదన్నారు. మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. తనిఖీలలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ మండల వ్యవసాయ అధికారి వీఎస్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. సబ్ జైలులో జిల్లా జడ్జి పరిశీలన రేపల్లె రూరల్: రేపల్లె సబ్ జైల్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్బాబు, సబ్ జైల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పట్నంబజారు: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పలు ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సంగడిగుంట, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రచార వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు–2 ఫైర్ స్టేషన్ అధికారి పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు డీ–5 సెక్షన్, ఆర్టీసీ బస్టాండ్, పాత గుంటూరు, బాలాజీ నగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్లలో విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో 59 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, శ్రీనివాసబాబు మాట్లాడుతూ తక్కువ లోడ్కు సర్వీసు తీసుకొని అదనపు లోడు వాడుతున్న 140 సర్వీస్ల కింద రూ.4.83 లక్షలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఐదుగురికి రూ.2.19 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఇద్దరికి రూ.లక్ష, అసలైన వాడకం కంటే బిల్లు తక్కువగా ఇవ్వబడిన రెండు సర్వీసులు గుర్తించి రూ.50 వేలు మొత్తం రూ.8.52 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహావసరాలకు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని, విద్యుత్ మీటర్లు తిరగకుండా చేస్తే అటువంటి వాటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులకు 9440812263, 9440812360, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు అని వారు వెల్లడించారు. దాడుల్లో డీఈఈలు కె.రవికుమార్, ఎన్.మల్లిఖార్జున ప్రసాద్, పీహెచ్ హుస్సేన్ఖాన్, ఏఈలు కె.కోటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్, ఎం.సతీష్కుమార్, యు.శివశంకర్, షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. రూ.8.52 లక్షలు అపరాధ రుసుము వసూలు -
కత్తవ చెరువులో ఆక్రమణలు తొలగించాలి
నరసరావుపేట: సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన ఉన్న 60 ఎకరాలకుపైగా విస్తీర్ణం కలిగిన కత్తవ చెరువు ఆక్రమణల చెరలో ఉంది. ఈ చెరువును పరిరక్షించాల్సింది ఎవరనే దానిపై మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య వాదన నడుస్తోంది. పట్టణానికి పశ్చిమం వైపు నుంచి ప్రవహించే మురుగునీరు ఈ చెరువుకు చేరి కిందికి వెళుతోంది. దగ్గరలోనే రైల్వే బ్రిడ్జి, రైల్వే లైను ఉన్నాయి. నిరంతరం రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఆక్రమణల విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్లానింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి ఆక్రమణలు తొలగించాలని వారు గతంలో కోరారు. ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావట్లేదు. ఆక్రమణదారుల వైపు ఎంత బలముందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంపై పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులు తాజాగా మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్తోపాటు చిన్న నీటి పారుదల శాఖకు చెందిన డీఈ, ఏఈలకు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై వారు స్పందిస్తూ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. గతంలో ఆర్డీవో సమావేశం నిర్వహించి ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. రైల్వే లైను భద్రతతోపాటు పట్టణంలోని బరంపేట, గుంటూరు రోడ్డు ప్రాంతాలు ముంపు లేకుండా ఉండాలంటే కూడా ఈ చెరువును ఆక్రమణల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా శాఖలకు చెందిన అధికారులను సమన్వయపరిచి ఆక్రమణలు తొలగింపజేయాలన్నారు. రక్షణ కంచె ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్, ఆర్టీఐ కార్యకర్త వసంతరావు పాల్గొన్నారు. ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా శాఖల మధ్య సమన్వయలోపమే శాపం జిల్లా కలెక్టర్ జోక్యానికి నేతల వినతి -
‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు
తెనాలి: కళారంగంలో విశిష్ట కృషిచేసిన నాటకరంగ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు పట్టణానికి చెందిన ప్రముఖ పద్యనాటక కళాకారుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. కందుకూరి వీరేశలింగం జయంతి రోజైన బుధవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసే అవార్డుల ప్రదానోత్సవంలో వెంకటేశ్వరరావును వీరేశలింగం అవార్డు, రూ.లక్ష నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. ఈ సందర్భంగా కళారంగ ప్రముఖుడు వెంకటేశ్వరరావు పరిచయం. తన పద్యగానంతో పౌరాణిక నాటకరంగాన్ని ప్రశాశింపజేసిన ఆణిముత్యాల్లో తెనాలికి చెందిన ‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలతో అర్ధ శతాబ్దంపాటు నాటక ప్రియులను అలరించిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు సుపుత్రుడు వెంకటేశ్వరరావు. డిగ్రీ చదివినా, తండ్రి కళా వారసత్వాన్ని అందుకున్నారు. ఏవీ సుబ్బారావు కళాప్రతిభతో ఒక వెలుగు వెలిగిన శ్రీపూర్ణశ్రీ నాట్య కళాసమితిని చేతబట్టి పద్యనాటకానికి అంకితమయ్యారు. తండ్రి తరహాలోనే శ్రీకృష్ణుడు పాత్రలో రాణించటమే కాకుండా వివిధ పౌరాణిక పాత్రల్లో తనదైన శైలితో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగువారు సహా ఆయన పద్యగానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించారు. ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు పెద్దకుమారుడు వెంకటేశ్వరరావవు. సొంతూరు తెనాలి సమీపంలోని కొల్లూరు మండల గ్రామం అనంతవరం. తండ్రితోపాటు తెనాలిలోనే స్థిరపడ్డారు. తండ్రి స్ఫూర్తితో హైస్కూలులోనే తొలి వేషం గట్టిన ఈ కళాకారుడు. బీకాం చదువయ్యాక 1979లో పద్యనాటకాన్నే తన కెరీర్గా చేసుకున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, భవానీశంకరుడు, వేమారెడ్డి, నక్షత్రకుడు, బాలవర్ధి, చంద్రుడు పాత్రల్లో ప్రతిభను చాటారు. 2023 వరకు 4,371 ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సాధించారు. చింతామణి నాటకంలో ప్రేమ సన్నివేశం, శ్రీకృష్ణ రాయబారంలో పడకసీను, సెంటర్సీను, గయోపాఖ్యానం నాటకంలో యుద్ధసీను, చింతామణి పూర్తినాటకం, భవానీశంకరుడు ఏకపాత్ర ఆడియో రికార్డులుగా విడుదలయ్యాయి. గయోపాఖ్యానంలో యుద్ధసీను వీడియో రికార్డుగా వచ్చింది. పౌరాణిక పద్యనాటక కళాసేవకు గుర్తింపుగా 852పైగా సత్కారాలను, గౌరవాలను స్వీకరించారు. 2007–08 నంది నాటకోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డులు, బిరుదులను అందుకున్నారు. 1995లో ‘తానా’ ఆహ్వానంపై ఉత్తర అమెరికాలో అనేకచోట్ల నాటక ప్రదర్శనలిచ్చారు. గాయనీమణి పి.సుశీల చేతులమీదుగా బంగారు కంకణం, నెల్లూరులో బంగారు కిరీటం, అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా కె.రఘురావుయ్య అవార్డు మరచిపోలేని అనుభూతులుగా వెంకటేశ్వరరావు చెబుతారు. నాటకం ప్రదర్శిస్తుండగా ప్రేక్షకుల నుంచి కానుకల రూపంలో వచ్చిన రూ.4 లక్షలతో ఒక నిధి ఏర్పాటుచేసి నెలకు ఐదుగురు చొప్పున పేదకళాకారులకు రూ.500 వంతున ఆర్ధికసాయం అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్న వీరి కుమారుడు నాగరాజు రంగస్థల నటుడిగా రాణిస్తున్నారు. ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 16న వెంకటేశ్వరరావు, నాటకరంగంలోనే కొనసాగుతున్న ఆయన సోదరులు కోటేశ్వరరావు, ఆదినారాయణ ఏటా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏవీ సుబ్బారావు పేరిట రాష్ట్రస్థాయి అవార్డును ప్రదానం చేయటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గల పలువురు కళాకారులను సత్కరిస్తున్నారు. తండ్రి ఏవీ సుబ్బారావు కళావారసుడు పౌరాణిక పద్యనాటకానికి అంకితమైన కళాకారుడు నాలుగున్నర దశాబ్దాల్లో నాలుగువేలకు పైగా ప్రదర్శనలు వందలాది సత్కారాలు, బిరుదులు, గౌరవాలు కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు ఎంపిక -
అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం సందర్శించకపోవడం బాధాకరం
నరసరావుపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులు అర్పించి ఉంటే చాలా బాగుండేదని గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. కానీ ఆయన ఆ పనిని ఉద్దేశపూర్వకంగానే చేయలేదని తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో... శిల్పాన్ని అంటరానిదిగా, స్వరాజ్ మైదానంలో వెలిసిన ఆ జాతీయస్థాయి కట్టడాన్ని బహిష్కరించారా అన్నట్లుగా ఏడాది గడుస్తున్నా ఆ ప్రాంగణంలోకే రాకుండా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు. ఆ మహా కట్టడాన్ని నిర్మించడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గతంలో చేసిన ఓ వ్యాఖ్య ద్వారా తన కుసంస్కారాన్ని, అగ్రకుల దురభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఈ కులం కంపు భావానికి పూర్తి భిన్నంగా కొండపైన గాంధీ – కొండ కింద అంబేడ్కర్ అనే ఉదాత్తమైన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఇరువురు దేశ నాయకులకు సంబంధించిన ఈ రెండు దర్శనీయ క్షేత్రాలకు ప్రాచుర్యం కల్పించాలని కోరారు. విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గాంధీ కొండపై గతంలో గాంధీ గ్రంథాలయం, ఫొటో ప్రదర్శనశాల, బాలలకు కొండ చుట్టూ తిరిగే రైలు బండి, విజ్ఞానదాయకమైన నక్షత్ర ప్రదర్శనశాల ఉండేవని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించి అంబేద్కర్ మైదానంలో ఇతర హంగులు కల్పించి నిత్యం సందర్శకులతో కళకళలాడేలాగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిని విస్మరించి, మహోన్నత కట్టడాన్ని పీ ఫోర్ పేరుతో ప్రైవేటు వ్యాపార వ్యవస్థకు అప్పజెప్పబూనడం దుర్మార్గమని తెలిపారు. ఆ మహానేతకు అపచారమని పేర్కొన్నారు. నగరపాలక సంస్థే నేరుగాగానీ, ప్రభుత్వ ఆధీనంలో ట్రస్ట్ ఏర్పాటు ద్వారాగానీ నిర్వహించాలని సూచించారు. జాతీయ స్థాయి కలిగిన ఈ దర్శనీయ క్షేత్రాలను బాబు ప్రభుత్వం ఇప్పటికై నా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంబేడ్కర్, గాంధీ అభిమానులు, దళిత సంఘాలు, ప్రజలు ఈ మేరకు కోరుతున్నారన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుపై గాంధీస్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజం -
పునర్విభజనతో దక్షిణాదికి నష్టం ఖాయం
నరసరావుపేట: పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ఆధారంగా పెంచితే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ‘పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన–ఫెడలరిజం’ అనే అంశంపై మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సెమినార్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. 2026లో జరిగే డీలిమిటేషన్తో జనాభా ఆధారంగా జరిగితే 543 సీట్లు 843 కు పెరుగుతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల వెనుకబాటుతనంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. దీని వలన అక్కడ సీట్లు పెరిగే అవకాశం బాగా ఉందన్నారు. యూపీలోని 80 సీట్లు 128 అవుతాయన్నారు. ఉమ్మడి ఏపీలోని 42 సీట్లు కేవలం 48 సీట్లు మాత్రమే అవుతాయన్నారు. దీని వలన రాజకీయంగా దక్షణాది రాష్ట్రాలు నష్టపోతాయని తెలిపారు. దీంతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య సమతుల్యత లోపిస్తుందన్నారు. దీని వల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. అన్ని రాజకీయపార్టీలు దీనిపై చర్చించాలని కోరారు. ఏపీలోని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైఎస్సార్సీపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసమాజం చైతన్యవంతమై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని సూచించారు. పార్లమెంట్ నియోజవర్గాలను సీట్ల ప్రాతిపదికన విభజిస్తేనే న్యాయం జనాభా ప్రాతిపదికన సరికాదన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
చీరాల: అక్రమంగా నాటుసారా విక్రయాలు సాగిస్తున్న చీరాల మండలం ఆదినారాయణపురంకు చెందిన వల్లాగి నాగరాజు అనే వ్యక్తిని మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు, ఒన్టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈపూరుపాలెం పంచాయతీ ఆదినారాయణపురానికి చెందిన వల్లాగి నాగరాజు అక్రమంగా సారా విక్రయాలు చేస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలానే చీరాల వైకుంఠపురం దండుబాట సమీపంలో జాలమ్మ గుడి వద్ద కావాటి నాగరాజు నాటుసారా విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఎనిమిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ చట్టం ప్రకారం నాటుసారా కలిగి ఉండుట, అమ్ముట, రవాణా చేయడం నేరమని సీఐ నాగేశ్వరరావు అన్నారు. నాటుసారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. -
మైనారిటీలకు అండగా జగనన్న
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీలకు అన్ని వేళలా అండగా నిలబడతారని, వక్ఫ్ బిల్లుకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ద్వారా మరో సారి సుస్పష్టమైందని పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. లోక్సభలో వ్యతిరేకించి.. రాజ్యసభలో మద్దతునిచ్చారని పిచ్చిపట్టిన వ్యాఖ్యలు చేస్తున్న కొంత మంది పచ్చ మీడియాకు పిటిషన్ దాఖలతో బుద్ధి వచ్చినట్టు అయిందన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ కల్పిస్తే, జగనన్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్నారు. సీఎంగా ఉన్న సమయంలో సైతం ఎన్ఆర్సీని సైతం వ్యతిరేకించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మైనారిటీల పక్షాన పోరాడుతున్న జగనన్నకు యావత్తూ మైనారిటీలు మొత్తం కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ పార్టీలకు అతీతంగా రాజీనామా చేయగలరా...? గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్అహ్మద్ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేయగలరా అని నూరిఫాతిమా ప్రశ్నించారు. గత వారం క్రితం ప్రభుత్వానికి మద్దతుగా ఒక మాట చెప్పి, గత శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తాను కూడా బిల్లుకు వ్యతిరేకమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ అసలు ఈ బిల్లు ఏవిధంగా మంచిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు అవేమి పట్టవని, కేవలం సీటు కోసం తాపత్రయం పడుతున్నారని, కేవలం మాట చెప్పటం కాదని.. దమ్ముంటే ఆ మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ఆ రోజున మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ముస్తఫా, పూర్తిస్థాయిలో అంశాన్ని జగనన్నకు వివరించి దానిని వ్యతిరేకించేలా చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే నసీర్ చంద్రబాబుకు చెప్పి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి మైనారిటీలతో ఎటువంటి అవసరం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ బిల్లు అంశంపై డిబేట్కు రావాలని, తాను ఒక సాధారణ మైనారిటీ మహిళగా వస్తామని, చర్చకు సిద్ధమో కాదో చెప్పాలన్నారు. కచ్చితంగా వైఎస్సార్ సీపీ స్టాండ్ ఒక్కటేనని, వక్ఫ్ బిల్లు రద్దు చేయటమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసమే పాటుపడుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మైనారిటీ నేతలు పలువురు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్పై మైనారిటీల్లో హర్షం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ రాజకీయాలు, పార్టీలకు అతీతంగా రాజీనామా చేయగలరా? వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా -
కీబోర్డులో నులకపేట విద్యార్థి గిన్నిస్ రికార్డు
తాడేపల్లి రూరల్ : స్థానిక నులకపేటకు చెందిన ఓ విద్యార్ధిని మ్యూజికల్ కీ బోర్డులో రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. మంగళవారం గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ను అందసింది. నులకపేటకు చెందిన చల్లా కరుణాకర్ రెడ్డి, ఉషశ్రీ దంపతుల కుమార్తె చల్ల వ్యూహిత కేంద్రీయ విద్యాలయ గుంటుపల్లి కేవీ2లో 10వ తరగతి చదువుతోంది. ఇన్స్ట్రాగామ్లో ఒక గంటలో అత్యధికంగా 1,046 కీబోర్డు వాయిద్యం వీడియోలు అప్లోడ్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని మిస్టర్ అగస్టీన్ దండింగి వేణుగోపాల్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా డిసెంబర్ 1, 2024న ఈ ఘనతను సాధించింది. -
కానిస్టేబుల్ బెదిరింపులతో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: కానిస్టేబుల్ బెదిరింపులతో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు .. పట్టణంలోని 29వ వార్డుకు చెందిన రౌడీషీటర్ షేక్ ఖాసిం సైదా అలియాస్ అండను పట్టణ పోలీస్స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర బెదిరింపులు గురి చేస్తున్నాడు. దీంతో సోమవారం సత్తెనపల్లి మండలం పాకాలపాడు వద్ద ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఖాసిం సైదా మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో కానిస్టేబుల్ రవీంద్ర తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, రూ.లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపాడు. పట్టణ సీఐకు తనపై అబద్ధాలు చెబుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. ఖాసిం సైదా, రవీంద్రల మధ్య కేసుకు సంబంధించి డబ్బు విషయంపై జరిగిన సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. 6 నెలల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకి చెందిన వెంకటేశ్వర్లుపై నమోదైన కేసులో రాజీ కోసం జరిగిన సంభాషణ ఆడియోను తీసుకొని కానిస్టేబుల్ రవీంద్ర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ రౌడీషీటర్ ఖాసిం సైదా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఆదివారం రౌడీషీటర్లను కౌన్సెలింగ్కు పిలిచిన నేపథ్యంలో ఖాసింసైదాను కూడా పిలవడంతో తన స్నేహితుడైన వెంకటేశ్వర్లు వద్ద ఆరు నెలల క్రితం ఉన్న ఆడియోను తీసుకొని దుష్ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై ఖాసిం సైదా తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆడియోను విడుదల చేశాడని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరువురి మధ్య సంభాషణ ఆడియో వైరల్ -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులుస్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. పల్నాడు జిల్లా పరిధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 50 శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిబిరంలో 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 25 మంది చొప్పున బాలురు, బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా పరిధిలోని క్రీడా అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తాము శిక్షణ ఇవ్వనున్న క్రీడాంశం, ప్రదేశం పేర్కొంటూ పూర్తి వివరాలతో ఈ నెల 17వ తేదీలోగా స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలన్నారు. పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి పల్నాడు జిల్లా పరిధిలోని అర్హులైన క్రీడాకారులు నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో అందించే పద్మ పురస్కారాల పరిశీలనకు దరఖాస్తులు పంపనున్నట్టు తెలిపారు. వివరాలను www. padmaawards.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరులో ఉద్యోగినుల వసతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.27 కోట్లతో నిర్మించిన సఖినివాస్ ప్రస్తుత సర్కారు సాగదీత తీరు వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వసతి దొరక్క ఉద్యోగినులు అవస్థలు పడుతున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 2023 చివరిలోనే పూర్తి సఖి నివాస్(వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్) 2023 చివరిలోనే పూర్తయింది. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సఖి నివాస్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత ఈ నెల 4న రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సఖి నివాస్ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే హాస్టల్ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. 35 మంది దరఖాస్తు సఖి నివాస్లో ఉండేందుకు 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 30 మంది ఫోన్లో టచ్లో ఉన్నారు. ప్రభుత్వం రుసుములు ఖరారు చేయనిదే హాస్టల్ నిర్వహణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగినులు నిరాశ చెందుతున్నారు. సఖి నివాస్కు తాళాలు వేసి ఉన్న దృశ్యం సింగిల్ షేరింగ్ రూమ్ న్యూస్రీల్ గత ప్రభుత్వంలోనే సఖి నివాస్ నిర్మాణం పూర్తి ఉద్యోగినుల వసతి కోసం నిర్మించిన భవనం ఈ నెల 4న ప్రారంభించినా అందుబాటులోకి రాని దుస్థితి ప్రభుత్వం రుసుములు ఖరారు చేయకపోవడమే కారణం సంస్థల నుంచి లేఖ తప్పనిసరి సఖి నివాస్లో వసతి కోరే ఉద్యోగినులు పనిచేసే సంస్థ నుంచి లేఖలు సమర్పించాల్సి ఉంటుంది. వసతి గదుల్లో చేరే ముందు రూ.1500 అడ్వాన్స్ చెల్లించాలి. తిరిగి గది ఖాళీ చేసేటప్పుడు ఆ మొత్తం ఇస్తారు. విద్యార్థినులు కూడా ఇందులో వసతి పొందొచ్చు. అయితే సంబంధిత సంస్థల నుంచి లేఖలు సమర్పించాలి. ఖరారు కాగానే అందుబాటులోకి.. వసతి గదుల రెంట్ ఫిక్స్ సఖినివాస్లో ఏసీ, నాన్ ఏసీ కలిపి మొత్తం 19 గదులు ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను అధికారులకు ప్రభుత్వానికి పంపారు. డబుల్ షేరింగ్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు రూ.3,500), డబుల్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు 2,500), సింగిల్ షేరింగ్ ఏసీ రూమ్ 2(అద్దె నెలకు రూ.4,500), ఫైవ్ షేరింగ్ ఏసీ రూమ్స్ 4(అద్దె నెలకు రూ.2500), ఫైవ్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్స్ 7(అద్దె నెలకు రూ.2,000), డార్మిటరీ నాన్ ఏసీ 8 షేరింగ్ రూమ్స్ 3(అద్దె నెలకు రూ.1,500), డార్మిటరీ ఏసీ 8 షేరింగ్ రూమ్ 1(అద్దె నెలకు రూ.200)గా అధికారులు ప్రతిపాదించారు. వీటిల్లో మొత్తం 92 మంది వరకు ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాని కారణంగా అద్దెలు ఖరారు కాలేదు. ఫలితంగా వసతి గృహం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ గదుల్లో ఆర్వో డ్రింకింగ్ వాటర్, గీసర్, వాషింగ్మెషిన్, టీవీ, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. ఆహారానికి అయ్యే ఖర్చును ఉద్యోగినులు భరించాలి. ఈ సఖినివాస్లో ఉద్యోగినుల కోసం పకడ్బందీ భద్రతా చర్యలు ఉన్నాయి. హాస్టల్ నుంచి బయటకు వెళ్లే టప్పుడు, వచ్చేటప్పుడు పేస్ ఆధారిత బయోమెట్రిక్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీసీ కెమెరాల నిఘాలో హాస్టల్ ఉంటుంది. వసతి గృహం నిర్వహణకు ప్రత్యేకంగా మేనేజర్, వార్డెన్, ఇద్దరు వాచ్మెన్లు, ఇద్దరు శానిటేషన్ సిబ్బంది ఉంటారు. వీరి నియామానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. సఖి నివాస్లో మహిళా ఉద్యోగులు ఉండేందుకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాం. రసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు రాగానే నిర్వహణ ప్రారంభిస్తాం. – బి.రమణ శ్రీ, మహిళా ప్రాంగణం ఇన్చార్జ్జి మేనేజర్ -
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్ 3 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 41వ డివిజన్ స్వర్ణభారతినగర్లో సుమారు 200 ఇళ్లను అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారు. దీంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని, కూలీనాలీ చేసుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూలిస్తే ఏం చేయాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు పూర్తి పునరావసం కల్పించి ఇళ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్ళను పొక్లెయిన్లతో కూల్చి వేస్తున్న క్రమంలో అడ్డుకున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్, కమిషనర్, నగర మేయర్కు వినతిపత్రాలు అందించారు. పిల్లాపాపలతో రోడ్డున పడతామని కాస్త కనికరం చూపి న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారులు తొలగిస్తున్న ఇళ్లు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చాలి సుమారు 200 కుటుంబాలు ఇళ్ళను కోల్పోతున్నారు. వారికి పూర్తి పునరావాసం కల్పించాలి. లేదా ప్రస్తుతం ఎక్కడో ఒక చోట తలదాచుకునేందుకు వసతి కల్పించాలి. ప్రభుత్వమే అద్దె చెల్లించాలి. వారిని ఆదుకోవాలి. ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. న్యాయం చేయాలి. లేకుంటే పోరాటం తప్పదు. –పిల్లి మేరి, స్థానికురాలు, ఆర్ అండ్ బీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం 40 ఏళ్ళుగా ఇక్కడ గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుని కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఇళ్ళను కూల్చేస్తున్నారు. పునరావాసం కల్పించి ఇళ్లు కూల్చుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు పిల్లలతో కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి? పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు. – జిల్లా సత్యవతి, స్థానికురాలు, బాధితురాలు 40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాం ఇళ్లను తొలగించడం అన్యాయం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3లో ఇళ్లు కోల్పోతున్న 200 కుటుంబాల ఆవేదన మాకు దిక్కెవరు? మా అమ్మనాన్నలు బతికుండగా 30 ఏళ్ళ క్రితం కూలీనాలీ చేసి ఇల్లు కట్టారు. అందులో అమ్మనాన్న, మా చెల్లి నేను కూలీ పనులు చేసుకుని జీవిస్తుండేవారం. రెండేళ్ళ క్రితం మా అమ్మనాన్నలు అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం మా చెల్లితో నేను ఇక్కడే ఇంట్లో తలదాచుకుంటూ ఇద్దరం కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు అధికారులు ఇల్లు కూల్చేశారు. మాకు దిక్కెవరు లేరు. అధికారులు పట్టించుకోవటంలేదు. మమ్మల్ని ఆదుకోండి. – పాతకోటి కృష్ణబాబు, బాధితుడు -
చెన్నుని బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం
మాచర్ల రూరల్: శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడు వాహనంపై ఊరేగించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రజల ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఈఓ ఎం. పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొమెర అనంతరాములు, బండ్ల బ్రహ్మం, గాజుల గణేష్, కోమటి వీరు, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, సుంకె వాసు, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ డీడీగా రాజా దేబోరా నెహ్రూనగర్: గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా రాజా దేబోరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ డీడీగా పనిచేస్తున్న డి.మధుసూదన్రావు 3 నెలలకుపైగా సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు ఏఓగా పనిచేస్తున్న మాణిక్యవరరావు ఇన్చార్జిగా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్న రాజ్ దేబోరాకు గుంటూరు జిల్లా డీడీగా (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లో ఎస్ఏల సీనియార్టీ జాబితా గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో రూపొందించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 20వ తేదీలోపు గుంటూరు డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ కొరిటెపాడు(గుంటూరు): వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ ముస్లింల పట్ల అంకితభావం చాటుకుందని గుంటూరు మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు ఎస్.ఎం.జియావుద్దీన్ అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ముస్లింలకు మంచి చేసే సంస్థలను నీరుగార్చేలా కేంద్రంలోని బీజేపీ కూటమి కుయుక్తులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.ఈ విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 515.20 అడుగుల వద్ద ఉంది. ఇది 140.6684టీఎంసీలకు సమానం.