Palnadu District Latest News
-
కచ్చితమైన ఆధారాలతో శిక్షలు
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట: క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణలో కచ్చితత్వం పాటిస్తే ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చేయవచ్చని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు ‘ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్’ అంశంపై నిర్వహించిన వర్క్షాపులో జిల్లా ఎస్పీ మాట్లాడారు. నిపుణులు అందించిన మెలకువలను క్షేత్రస్థాయిలో ఉపయోగించి కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ఫోరెన్సిక్ నిపుణులు డి.కాంచన, ఎల్.స్వాతి, కె.సురేంద్రబాబు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరక్టర్లు బి.రామకృష్ణారావులు దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే అనేక మెలకువలను పోలీస్ అధికారులకు వివరించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులకు ఎస్పీ శాలువా కప్పి మెమొంటోలతో సత్కరించారు. -
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
తెనాలి: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలపై సాక్షి మీడియా తెనాలి ప్రతినిధులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వహాబ్ రోడ్డులోని అజీమ్ఖాన్ వీధిలోని సాక్షి రీజనల్ సెంటర్ కార్యాలయం నుంచి సాయంత్రం ప్రదర్శనగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ దగ్గర్లోని వెటర్నరీ కాలనీలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుకు నగర సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకా ష్లు సిబ్బందితో పాటు అక్రమంగా ప్రవేశించినట్టు తెలిపారు. సెర్చ్ వారంట్, ఎలాంటి నోటీసు లేకుండా వచ్చి భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. గౌరవప్రదమైన పత్రికా ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటంతోపాటు సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఇది సాక్షి ఎడిటర్పై మాత్రమే జరిగిన దాడి కాదనీ, భవిష్యత్లో మొత్తం మీడియాపై ఇవే దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్షి తెనాలి రీజనల్ సెంటర్ ఇన్చార్జి బి.ఎల్.నారాయణ, సాక్షి మీడియా విలేకరులు కేజే నవీన్, ఆలపాటి సుధీర్, తాడిబోయిన రామకృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి తోట శ్రీనివాసరావు, వేమూరు ఆర్సీ ఇన్చార్జి బుల్లయ్య, సర్కులేషన్ ఇన్చార్జి దాసు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావంగా స్థానిక పత్రిక సంపాదకుడు అడపా సంపత్రాయుడు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
గుంటూరు మెడికల్: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంపై విజయవాడ నగర సెంట్రల్ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ప్రవేశించి సెర్చ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు షేక్ నాగూల్మీరా మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవే దాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభం అయిన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిషన్ ఇన్చార్జి ఎం.తిరుమలరెడ్డి, యూనియన్ జిల్లా సెక్రటరీ కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు సత్య నారాయణశర్మ, అధ్యక్షుడు వి.కిరణ్కుమార్, సబ్ ఎడిటర్లు దివి రఘు, పి.శ్రీనివాసరావు, ఎన్.వెంకట్, బి.సురేష్బాబు, జర్నలిస్టులు మొండితోక శ్రీనివాసరావు, షరీఫ్, వీరయ్య, సురేంద్ర, పి.ప్రశాంత్, డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, రామ్గోపాలరెడ్డి పాల్గొన్నారు. దాడులు హేయమైన చర్య ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్. ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసిన తీరును ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూల్మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు సోదాలు చేయాలని భావించి ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలని సూచించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలో చొరబడిన తీరును ఖండించారు. ఇలాంటి ధోరణి భావ్యం కాదని తెలిపారు. -
ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
బాపట్ల టౌన్: నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పత్రికా సంస్థల ఎడిటర్ ఇళ్లపై ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్యని బాపట్ల వర్కింగ్ జర్నలిస్ట్ల యూనియన్ సహాయ కార్యదర్శి కాగిత ప్రశాంత్రాజు తెలిపారు. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి అపార్టుమెంట్లోకి పోలీసులు వెళ్లి తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించిన తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం బాపట్లలోని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సీతారత్నానికి వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్రాజు మాట్లాడుతూ కనీసం సెర్చ్ వారెంట్ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని తెలిపారు. పత్రికా ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్. ధనంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి, అక్ర మాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికా రంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాపట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు వేజెండ్ల శ్రీనివాసరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, రాఘవేంద్రరావు, పరిశా వెంకట్, సృజన్పాల్, శీలం సాగర్, మార్పు ఆనంద్, అడే రవిజేత, జె. రవిరాజేష్ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
ఎనిమిది గొర్రెలు సైతం మృత్యువాత చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం కుక్కవారిపాలెం గ్రామం పంట పొలాల్లో పిడుగుపాటుకు గొర్రెలతో పాటు వాటిని కాసేందుకు వెళ్లిన రైతు మృత్యువాత పడిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పెదనందిపాడు మండలం ఉప్పలపాడు శివారు జరుగులవారిపాలెం గ్రామానికి చెందిన ఒంటిపులి అంకమ్మ(84) తన జీవనాధారమైన గొర్రెలను ఉదయాన్నే తీసుకొని కుక్కవారిపాలెం సమీపంలోని పంట పొలాలకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. వర్షం తట్టుకోలేక అంకమ్మ తన గొర్రెలను సమీపంలోని జమ్మిచెట్టు కిందకు నడిపించాడు. అయితే క్షణాల్లోనే ఆ చెట్టుపై పిడుగు పడడంతో అంకమ్మ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ఉన్న 8 గొర్రెలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మృతుడికి భార్య సామ్రాజ్యం, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సైనిక స్కూల్గా శ్రీరామా రూరల్ హైస్కూల్
తెనాలి: తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం చిలుమూరులో గల శ్రీరామా రూరల్ హైస్కూలు ఇప్పుడు సైనిక్ స్కూలుగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ నుంచి అనుమతులు లభించాయి. హైస్కూలు ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామా రూరల్ అకాడమీ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణుప్రసాద్ వివరాలను వెల్లడించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి సైనిక్ స్కూల్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 33 సైనిక్ స్కూల్స్ పనిచేస్తుండగా, మన రాష్ట్రంలో కోరుకొండ, కలిగిరిలో నడుస్తున్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో 42 సైనిక్ స్కూల్స్కు, ఇప్పుడు మరో 33 సైనిక్ స్కూల్స్కు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ అనుమతినివ్వగా, అందులో గుంటూరు జిల్లా నుంచి 76 ఏళ్లుగా నడుస్తున్న శ్రీరామా రూరల్ హైస్కూలు ఒకటి కావటం గర్వకారణమన్నారు. కృష్ణానది ఒడ్డున దారీతెన్నూ లేని గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో గురుకులంగా ఏర్పాటైన తమ పాఠశాల ఏటికేడాది ప్రగతి బాటన పయనిస్తూ ఈ స్థాయికి చేరిందన్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 1987లో కంప్యూటర్ లాబ్, 2020 నుంచి సీబీఎస్ఈ, అటల్ టింకరింగ్ ల్యాబ్తో రోబోట్రిక్స్, డ్రోన్స్, త్రీడీ ప్రింటింగ్, స్కాచ్ కోడింగ్లో విద్యార్థులకు శిక్షణనిస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధలోనూ తరగతులు ఉంటాయన్నారు. మరోవైపు విద్యార్థులు పరిపూర్ణ వికాసానికి ఎన్సీసీ, క్రీడలకు తగిన ప్రాధాన్యతనిస్తూ జాతీయస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. శ్రీరామా రూరల్ హైస్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ మాట్లాడుతూ ఉత్తమ విద్యతోపాటు దేశానికి అవసరమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దే దిశగా తమ సైనిక్స్కూల్ పనిచేస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ అనుమతి వెల్లడించిన శ్రీరామా అకాడమీ అధ్యక్షుడు తులసీ విష్ణుప్రసాద్ -
పల్నాడు
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025పోలీసుల చొరబాటు హేయం ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసుల చొరబాటు హేయమైన చర్య. అకారణంగా ఇంట్లోకి పోలీసులు చొరబడటం సబబు కాదు. గౌరవ ప్రదమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లేటప్పుడు సెర్చ్ వారెంటు తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.– చిలుకా చంద్రశేఖర్, ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సత్తెనపల్లిఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? మీడియా ఎడిటర్ ఇంటిపై దాడి దేశంలోనే ఇది ప్రప్రథమం. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే హక్కు ఎవరికీ లేదా? ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? పది నెలల్లోనే రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్బుక్ అమలు చేస్తానంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది సాక్షి ఎడిటర్ ఇంటిపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రజాస్వాయ్యంపై జరిగిన దాడి. – బి.వి.రాఘవరెడ్డి, ఏపీ నెట్వర్క్ ఇన్చార్జి, సాక్షి దినపత్రిక సాక్షికి పోరాటాలు కొత్త కాదు సాక్షికి పోరాటాలు కొత్త కాదు. ఎడిటర్ ఇంటిపై దాడిచేయడం తగదు. నచ్చని విషయాలు రాస్తే అణచివేయాలని చూస్తారా? రెండు నెలల క్రితం పుట్టిన సంస్థకు రూ.కోట్ల విలువైన భూముల ఇచ్చేసి, ఆ విషయాన్ని రాయొద్దంటే ఎలా? తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి. ఇంటికి పోలీసులను పంపడం తగదు. ఎంత అణచివేయాలని చూస్తే. సాక్షి అంతగా పైకి లేస్తుంది. – పి.శ్రీనివాస్, అసోసియేట్ ఎడిటర్, సాక్షి దినపత్రిక 9న్యూస్రీల్ -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
బల్లికురవ: వేగంగా వస్తున్న కారు.. బైక్ను ఢీకొట్టడంతో ఇరువురు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం నార్కెట్పల్లి–మేదరమెట్ల నామ్ రహదారిపై మండలంలోని వి. కొప్పరపాడు శివాలయం సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన అయ్యప్ప, వీరగంగయ్య పని నిమిత్తం బల్లికురవ మండలంలోని సూరేపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయాలపాలైన ఇరువురికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తలించారు. స్థానికులు కారును అదుపులోకి తీసుకున్నారు. -
బంగారు తాపడం పనులకు రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు గుంటూరుకు చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన బి. కోట్యనాయక్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి బంగారు తాపడం పనులకు రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సైట్లో టెన్త్ షార్ట్ మెమోలు గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు సంబంధించిన షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు డౌన్లోడ్ చేసుకుని, వాటిపై సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మెమోల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు దొర్లితే అడ్మిషన్ రికార్డు ప్రకారం పరిశీలించి, అడ్మిషన్ రిజిస్టర్ కాపీ, మార్కుల మెమోను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ధ్రువీకరించుకుని, ఈనెల 25లోపు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. తీరంలో ఇద్దరు యువతులు గల్లంతు కాపాడిన పోలీసులు బాపట్లటౌన్: స్నానాలు చేస్తూ ఇద్దరు యువతులు సముద్రంలో మునిగిపోయిన ఘటన గురువారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన దుర్గేశ్దేవి, నీషాలు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ బైపాస్, హనుమాన్ టెంపుల్ సమీపంలోని బుల్లెట్ స్పిన్నింగ్ మిల్లులో నివాసముంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యలంక బీచ్కి వచ్చారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఆలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువురిని కాపాడారు. ఇద్దరు ప్రాణాలు కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్ఐ నాగశివారెడ్డి, ఏఎస్ఐ అమరేశ్వరరావు, హెడ్కానిస్టేబుల్ గంగాధర్రావు, హోంగార్డు నారాయణలను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. దివ్యాంగులకు డీఎస్సీ క్రాష్ కోర్సులో ఉచిత శిక్షణ నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని దివ్యాంగ అభ్యర్థులకు విజయవాడలో డీఎస్సీ క్రాష్ కోర్స్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఎంపీఎఫ్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40శాతం వికలాంగత్వం ఉన్నవారు అర్హులని తెలిపారు. టెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుం దన్నారు. ఈదురుగాలులు, భారీ వర్షం మంచాల(చేబ్రోలు): చేబ్రోలు మండల పరిధిలోని గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. మండల పరిధిలోని మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. మధ్యాహ్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
కల్యాణోత్సవాలకు వేళాయె
గురజాల: పల్నాడు యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కోరిన కోర్కేలు తీర్చే కలియుగ దైవంగా పల్నాటి వాసుల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన యాదాద్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ‘అంకురార్పణ’తో ప్రారంభం పల్నాడు యాదాద్రి శ్రీ భూ సమేత నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై నరసింహ యాగం, ధ్వజారోహణం, తీర్థ ప్రసాద ఘోష్టి, రెండవ రోజు శనివారం కనులపండువగా కల్యాణోత్సవం, అన్న సంతర్పణ, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, మూడవ రోజు ఆదివారం నరసింహ యాగం, పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వాదశ ప్రదక్షిణాలు, తీర్థ ప్రసాద ఘోష్టి, కాగడ సేవలతో విద్యుత్ దీపాలంకరణతో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. పలు అభివృద్ధి పనులు దేవాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేసిన వాహనశాల, ఆఫీసు రూం, ప్రతి శనివారం అన్నదానం నిర్వహించేందుకు అన్నదాన హాల్తో పాటు పలు భవనాల ప్రారంభో త్సవానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవాలకు దేవాలయాన్ని దేవదాయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. నేటి నుంచి పల్నాటి యాదాద్రి ఉత్సవాలు మూడురోజుల పాటు ఉత్సవాలకు సర్వం సిద్ధం -
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
ఇంకొల్లు (చినగంజాం): మండలంలోని పావులూరు గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గాదె వీరారెడ్డి మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం పోటాపోటీగా జరిగాయి. పావులూరు రెడ్డి యూత్ నిర్ణీత 10 ఓవర్లలో 83 పరుగులు చేయగా బీసీ యూత్ ఐదు ఓవర్లలో 84 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. రెండో మ్యాచ్ పావులూరు వెంకటేష్ ఫ్రెండ్స్, దగ్గుబాడు ఫ్రెండ్స్ యూత్ జట్ల మధ్య నిర్వహించగా పావులూరు వెంకటేష్ ఫ్రెండ్స్ జట్టు విజయం సాధించింది. బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, కార్యదర్శి పులఖండం రామకృష్ణా రెడ్డి, తలకాయల కోటి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు డాక్టర్ పట్టాభి
కొరిటెపాడు(గుంటూరు): స్వాతంత్ర సమరయోధునిగా, గాంధీజీ అనుంగు శిష్యుడిగా, స్వాతంత్య్రానికి పూర్వమే ఆంధ్రాబ్యాంక్తో పాటు అనేక ఆర్థిక, బీమా సంస్థలను స్థాపించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య బ్యాంకు ఉద్యోగులతో పాటు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని యూనియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ సయ్యద్ జవహర్ పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు, నరసరావుపేట రీజియన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజీ యూనియన్ బ్యాంక్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన పట్టాభి కాంస్య విగ్రహాన్ని గురువారం రీజియన్ హెడ్ జవహర్తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ విశ్రాంత అధికారులు, యూనియన్ నాయకులు ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ భోగరాజు అమర్ రహే.. లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జవహర్ మాట్లాడారు. డాక్టర్ భోగరాజు స్ఫూర్తితో రిటైరీస్, మహిళలు, విద్యార్థుల కోసం కొత్త పథకకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ ఎ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కె. హరిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ రిటైరీస్ సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి వి. వారణాసి మాట్లాడుతూ పారిశ్రామిక, రాజకీయ ఉద్దండులు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, రాజగోపాల్ నాయుడు వంటి వారు పారిశ్రామికవేత్తలగా ఎదిగేందుకు సీతారామయ్య సహకరించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 11,500 మంది విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు కుటుంబాల కంటే సమాజ, దేశ సేవకు తొలి ప్రాధాన్యతనిస్తారని వివరించారు. ఈ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.శ్రీనివాస్, విజయ బ్యాంక్ బ్యాంక్ మాజీ చైర్మన్ బి.ఎస్. రామారావు, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ అధ్యక్షులు బీబీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీఆర్ఈఏ వైస్ ప్రెసిడెంట్ ఎన్.గణేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై.కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ వై.హనుమంతరావు, నిరంజన్ కుమార్, సుబ్బారావు, శివాజీ, ప్రసన్నత బాబు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ ఎస్. జవహర్ -
అసిస్టెంట్ ఏఎంఓ పోస్ట్కు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ) పోస్ట్కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు ఈనెల 7వ తేది నుంచి 26వ తేదీ సాయంత్రం 5గంటలలోపు అధికారుల ద్వారా ధ్రువీకరించిన తమ దరఖాస్తులను డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఇతర వివరాలకు జీసీడీఓ డి.రేవతి (9440642122), ఏఎల్ఎస్సీ కోఆర్డినేటర్ కె.శ్రీనివాసరావు (8074499649)లకు సంప్రదించాలని తెలిపారు. ఐఎల్ఏ అధ్యక్షుడిగా బాబురావు సత్తెనపల్లి: ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన న్యాయవాది చావా బాబురావు, నియమితులయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అసోసియేషన్ సత్తెనపల్లి యూనిట్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంత కుమార్ ఆయనను నియమించారు. అలాగే కార్యదర్శిగా పాటిబండ్ల రవిని నియమించారు. ఈ సందర్భంగా బాబురావు, రవిలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ వంతుగా పాటుపడుతూ వాటి పరిష్కారం దిశగా పని చేస్తామన్నారు. నూతనంగా నియమితులైన వారికి రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఊర్ల విష్ణుకుమార్, ఎ.బ్రహ్మేశ్వరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు దాసరి జ్ఞాన్రాజ్పాల్, జిల్లా కార్యదర్శి బొక్కా సంగీతరావు, ఉటికూరి పాపారావు, తలతోటి ఆనంద శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్, సూరె వీరయ్య, మామిడి ప్రకాష్, తదితరులు అభినందనలు తెలిపారు. కుమారుడి దాడితో తండ్రి మృతి! చిలకలూరిపేటటౌన్: అనుమానస్పద రీతిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందిన తాపీ మేసీ్త్ర చంబేటి రామకృష్ణ భార్య బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని ఓ ఆస్పత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి ఆస్పత్రికి ఎందుకు రాలేదంటూ తండ్రి చంబేటి శ్రీనివాసరావు(43) రామకృష్ణను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, మద్యం మత్తులో ఆవేశంగా తండ్రి కాళ్లపై కర్రతో రామకృష్ణ దాడి చేశాడు. అసలే ఐదేళ్లుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుడు శ్రీనివాసరావు తల్లి లక్ష్మి తన కుమారుడు.. మనవడి దాడి కారణంగానే మృతి చెందాడా, లేక మరేదైనా కారణమా కనుగొనాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అర్ధాకలి బతుకులు
అందని సరుకులు● అస్తవ్యస్తంగా పౌర సరఫరా వ్యవస్థ ● బియ్యం, పంచదారతో సరి ● మిగిలిన సరుకుల ఊసే ఎత్తని ప్రభుత్వం ● కానుకలకు మంగళం ● ఆకలితో అలమటిస్తున్న పేదలు కూటమి ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది. ఇప్పటికే పేదలకు ఇవ్వాల్సిన పలు పథకాలను ఆపేసిన సర్కారు చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల్లో కోత విధించి, వారి నోటికాడ కూడు లాగేసేలా వ్యవహరిస్తోంది. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతూ.. ఏం కొనీ,తినలేని దుస్థితిలో ఉన్న పేదలను ఆదరించాల్సిన ప్రభుత్వం రేషన్ సరుకులకు మంగళం పాడేసి, మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. గతంలో ధరలెంత పెరిగినా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు ఉన్నాయిలే అనే ధీమా ప్రజల్లో కనిపించేది.. నేడు అరకొర సరుకులిస్తూ ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. పస్తులతో చస్తున్నా పట్టని సర్కారు నరసరావుపేట టౌన్/క్రోసూరు: రాష్ట్రంలో పది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చింది దరిమిలా రాజధాని అంటూ హడావుడి మినహా పేద ప్రజల వైపు కన్నెత్తి చూసిందే లేదు.. వారి బాగోగులకు సంబంధించి చేసిందేమీ లేదు. పైపెచ్చు వీటిని ప్రశ్నించేవారిపై అక్రమ కేసుల కత్తిపెట్టి నోరు మూయిస్తోంది. పేద వర్గాల ప్రజలకు ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేయనేలేదు. రేషన్ బియ్యం బండి వస్తే గతంలో పెద్ద సంచి తీసుకుని నిండుగా సరుకులతో ఇంటికి చేరుకునేవారు. ఇప్పుడు కేవలం బియ్యం, పంచదారతో సరిపెట్టడంతో అటు సంచీ.. ఇటు కడుపూ రెండూ నిండడం లేదు. దీని గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదు. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సక్రమంగా సరుకులు పంపిణీ చేయకపోవడంతో పేదలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. పేదలు కనిపించడం లేదా ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల వ్యవస్థను పూర్తిగా విస్మరించింది. పది నెలలుగా కొత్త రేషన్ కార్డుల ఊసే ఎత్తలేదు. తాజాగా ఒక రోజు ముందు నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించింది. ఈ పది నెలల్లో నూతన రేషన్ కార్డులు లేక, కార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయడానికి వీలుగాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు ప్రభుత్వం రేషన్ పంపిణీని గాలికొదిలేసింది. రేషన్ దుకాణాల ద్వారా రాగులు అందిస్తామని చెప్పి.. కేవలం మాటలకే పరిమితం చేసింది. దీంతో పేద వర్గాల ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కానుకలు మాయం 2014లో అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక అందించారు. ఇవి నాసిరకంగా ఉన్నాయంటూ అప్పట్లో ప్రజలు మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇవే కానుకలు ఇస్తానని ఎన్నికల ముందు ప్రకటించారు. అధికారం చేపట్టాక వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానుకలు సరే.. కనీసం సరుకులన్నా పూర్తిగా ఇవ్వండయ్యా అని ప్రజలు వేడుకుంటున్నారు. ● రేషన్ సరుకులలో కందిపప్పు, రాగులు, జొన్నలు, వంట నూనె తదితర నిత్యావసరాలు పంపిణీ చేయకపోవడంపై జిల్లా పౌరసరఫరాల అధికారి నారదమునిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని సరుకులు ఇచ్చేవారు. ఇంటి వద్దకే ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు వచ్చేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రేషన్ సరఫరాను ప్రజలకు అత్యంత సులువుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా నాణ్యమైన సన్నరకం బియ్యం, పంచదార, గోధుమలు, నూనె, కందిపప్పు, చింతపండు తక్కువ ధరకే అందించారు. దీంతో పేద వర్గాల ప్రజలకు మూడు పూటలా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. దీంతోపాటు రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందిన సరుకులు నాణ్యమైన బియ్యం కందిపప్పు పంచదార నూనె గోధుమలు చింతపండు కూటమి ప్రభుత్వంలో.. బియ్యం పంచదార (కొన్ని ప్రాంతాల్లోనే..) -
తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్
తొండపి(ముప్పాళ్ళ): మండలంలోని తొండపి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ, ఫ్యాక్షన్ నేపధ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గృహాలను తనిఖీ చేయటం జరిగిందన్నారు. ప్రతి ఇంటిని, దుకాణాలను సోదాలు చేశారు. పలు ఇళ్లలో మారణాయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లుగా తమ దృిష్టి వచ్చిందని, అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, స్టేషన్ ఎస్హెచ్ఓ సుబ్బారావు, ముప్పాళ్ల ఎస్ఐ వి.సోమేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ ఎం.వి.చరణ్ తెలిపారు. బుధవారం స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాష్నగర్కు చెందిన వెల్లలచెరువు వెంకట శివరామకృష్ణ బల్లికురవ మండలం, గుంటుపల్లి గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవదర్శనానికి వెళ్లాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇంటివద్ద లభ్యమైన సీసీ పుటేజ్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, బందారం గ్రామానికి చెందిన దుద్దేలింగంగా గుర్తించామన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా అతనితో పాటు మరో ముగ్గురు చోరీ సొత్తును పంచుకుని విక్రయించేందుకు వెళుతూ రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడ్డారన్నారు. నలుగురి వద్ద నుంచి చోరీకు గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదు అవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు విచారణలో తేలింద న్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది వీరాంజనేయులు, మురళికృష్ణలను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కేసులు అతనికి సహకరించిన మరో ముగ్గురు అరెస్టు బంగారు ఆభరణాలు స్వాధీనం -
అది ఆత్మహత్య కాదు..!
యడ్లపాడు: మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనపై బుధవారం యడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో దాసరిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి కొర్నెపాటి తేజ్(19) కొండగట్టుపై నుంచి క్వారీనీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడిది ఆత్మహత్య కాదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తేజ్ తండ్రి కొర్నెపాటి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మే 5వ తేదీ రాత్రి తేజ్ తన స్నేహితుడు కోటిరెడ్డితో కలిసి చౌడవరం శివారులోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న మిత్రుడి గదికి చదువుకోడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం తేజ్ స్నేహితులు తేజ్ తండ్రి మహేష్ వద్దకు వచ్చి తేజ్, కీర్తనలు ప్రేమలో ఉన్నారని, పెద్దల నిరాకరణతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరూ చౌడవరం బాలకుటీర్ పాఠశాల వెనుక ఉన్న క్వారీ నీటి గుంటలో దూకారని చెప్పిన స్నేహితులు, కీర్తనను అప్పటికప్పుడు కాపాడినట్లు మహేష్కు చెప్పారు. అయితే తేజ్ కనిపించకపోవడంతో తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కుంట వద్ద తేజ్ చెప్పులు గుర్తించి, స్థానికుల సహాయంతో గుంటలో నీటిని తోడించగా తేజ్ మృతదేహం వెలికి తీశారు. ఈ సంఘటనపై తేజ్ తండ్రి, తన కుమారుడి మృతిపై కీర్తనతో పాటు స్నేహితులు కోటిరెడ్డి, చందులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించారు. నా కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపండి క్వారీకుంటలో పడి మృతి చెందిన తేజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు -
నేటి నుంచి శ్రీరంగనాథ కల్యాణోత్సవాలు
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న, కొండవీడు ప్రాంతంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీభూసమేత రంగనాయకస్వామి ఆలయం కనుమరుగైన చరిత్రకు ప్రత్యక్ష ప్రతిరూపం. కేవలం ఇది ఓ కట్టడమే కాదు, గతకాలపు సంస్కృతిని, నమ్మకాలను, భక్తిశ్రద్ధలను ఆవాహనం చేసుకున్న పవిత్ర కోవెల. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు దేవస్థానంలో కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ‘వలస’లే ‘సొలస’గా మారి.. పూర్వం రంగపట్నం ఏర్పడ్డ ప్రదేశానికి పడమర దిశగా అంతా కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో నాదెండ్లకు చెందిన కొందరు తమ పశువులతో వచ్చారు. వీరిలో వలసయ్య అనే నాయకుడు కొండవాడు నీటిని ఒడిసి పట్టేందుకు రామన్న పేరుతో ఓ చెరువును తవ్వించి, ఈ ప్రాంతానికి జీవనాడిని అందించాడు. కొన్నాళ్లకు అది ఓ గ్రామంగా మారింది. నాడు ఏర్పడిన ఆ గ్రామమే నేటి సొలస. ‘వలసయ్య’ నామమే కాలక్రమేణ సొలసగా రూపాంతరం చెందినదని కొందరు..‘వలస’ ప్రాంతం కాబట్టి వాడుక భాషలో ‘సొలస’గా మారిందని మరికొందరి వాదన ఇక్కడ వినిపిస్తుంది. అనువంశిక బాధ్యతలు ఈ దేవాలయానికి ప్రస్తుతం 150 ఎకరాల భూమి ఉంది. యడ్లపాడు, వేమవరం, తూబాడు వంటి ప్రాంతాల్లో స్వామివారి ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం దేవదాయశాఖ పర్యవేక్షణలో ఉంది. ఆలయ తొలి అర్చకులు ఉన్నవ గ్రామస్తుడు పర్చూరి వెంకట రమణాచార్యులు కాగా, అనువంశిక బాధ్యతలు గైకొన్న ప్రస్తుత ఆలయ అర్చకుడు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఐదోతరంవాడిగా, అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు ఆరో తరానికి చెందిన ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో ఒక్క రోజే నిజరూప దర్శనంగర్భగుడి రెండు వైపులా జయవిజయులు నిలిచి ఆలయానికి ఆభరణంగా ఉంటారు. గర్భగుడిలో శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న రంగనాథునికి శ్రీదేవి, భూదేవులు పాదసేవ చేస్తూ కనిపిస్తారు. ఈ క్షేత్ర విశేషాల్లో ముఖ్యంగా ఆంజనేయస్వామి రెండు రూపాలు చూడవచ్చు. ఒకటి స్థానక భంగిమలో నల్లరాతి విగ్రహం, మరొకటి గోడపై వర్ణరంజిత రూపం. ఇక్కడ గణపతి విగ్రహం గుండ్ర ని భూ ఆకృతిలో ఉండటం విశిష్టత. ప్రతీ సంవత్సరం వైశాఖ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో కీలకంగా, నాలుగు రోజుల ముందు స్వామివారి అలంకారాలు తొలగించి ఒక్కరోజు భక్తులకు నిజరూప దర్శనం కలిగించడం ఈ ఆలయ వైశిష్ట్యం. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
నరసరావుపేట: విప్లవ వీరుడు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతిఒక్కరూ గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్వారి దోపిడీని ఎదుర్కోవడానికి మన్యం ప్రజలకు, పేదవారికి అండగా నిలిచిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎస్బీ సీఐ బండారు సురేష్బాబు, ఆర్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో... కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ ఏకా మురళి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏఓ, అధికారులు పాల్గొన్నారు. నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
పల్నాడు
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పూజలు దాచేపల్లి: వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతిహోమం, శాంతిహోమం నిర్వహించి, లక్ష మల్లెల పూజలు జరిపించారు. కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు తెనాలిఅర్బన్: చెంచుపేట ఆర్పీఎం క్లబ్ రోడ్డులో చేపట్టిన ఆక్రమణల తొలగింపు బుధవారం కొనసాగింది. మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలను అధికారులు పూర్తిగా తొలగించారు. నేడు దేవాలయం ప్రతిష్టా వేడుకలు శావల్యాపురం: కృష్ణాపురంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బుధవారం విగ్రహాల జలాభిషే కం జరిగిందని, గురువారం ప్రతిష్టా వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.9 -
ముడిఖనిజం అక్రమ రవాణాపై ఫిర్యాదు
బొల్లాపల్లి: బండ్లమోటు మైనింగ్ నుంచి లెడ్, డోలమైట్ ముడి ఖనిజాలు అక్రమంగా తరలించి సమీపంలోని మాలపాడు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ వినుకొండ రేంజ్ అధికారి సి.మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు తనిఖీ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బండ్లమోటుకు చెందిన హిందుస్తాన్ లెడ్ జింక్ మైనింగ్ నుంచి ముడిఖనిజాలు ద్విచక్రవాహనంపై తరలించి సమీపంలోని మాలపాడు గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. 2002 అక్టోబరులో బండ్లమోటు మైనింగ్ మూతపడింది. అప్పట్లో వేల టన్నుల లెడ్, డోలమైట్, ముడిఖనిజాల నిల్వలు బయట వదిలేశారు. ఇటీవల కాలంలో కొందరు ద్విచక్రవాహనాలపై అక్రమ మార్గంలో వీటిని తరలించి సమీపంలోని పొలంలో నిల్వ ఉంచారని స్థానికులు కొందరు మొబైల్ కెమెరాలో ఆ దృశ్యాలు తీసి జిల్లా ఫారెస్ట్ అధికారి, వినుకొండ రేంజ్ అధికారికి వాటిని పంపారు. ఈ మేరకు వినుకొండ రేంజ్ అధికారి గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంపై వినుకొండ రేంజ్ అధికారిని వివరణ అడగ్గా స్థానికులు ఫొటోలు తీసి పంపారని, వారి ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించామన్నారు. తనిఖీలో ఆ ప్రదేశంలో ఎటువంటి ముడి ఖనిజ నిల్వలు వెలుగు చూడలేదని రేంజ్ అధికారి తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టామని ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రేంజ్ అధికారి తెలిపారు. అయితే ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని, తూతూ మంత్రంగా, నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
నరసరావుపేట: ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి అసాంఘికశక్తుల కార్యకలాపాల నిరోధానికి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో నగరం, పట్టణ శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించటం, మద్యం సేవించి వాహనాలు నడపటం లాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన రహదారులపై విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేస్తాం ఇరుకుపాలెం(ముప్పాళ్ళ): రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను కొనుగోలు చేస్తామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నారదముని చెప్పారు. మండలంలోని ఇరుకుపాలెంలో రైతుల వద్ద గల ధాన్యం నిల్వలను బుధవారం పరిశీలించారు. సత్తెనపల్లిలో జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని పలువురు రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావటంతో ఆయన ఆదేశాల మేరకు ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి రేపటిలోగా ధాన్యం సేకరిస్తామని చెప్పారు. అనంతరం తేమశాతాన్ని పరిశీలించారు. తహసీల్దార్ ఎం.భవానీశంకర్, ఎఓ ఎం.అరుణ ఉన్నారు. -
అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం
యడ్లపాడు: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.నరేందర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ కార్మిక వారోత్సవాలను పురస్కరించుకొని, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎన్ఎస్ఎల్ నూలుమిల్లులో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో కార్మికులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాల హక్కులు, బాల కార్మికుల నిషేధ చట్టం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందజేశారు. న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని కార్మికులను ప్రోత్సహించారు. చిలకలూరిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీహెచ్ఎస్ ప్రసాద్, న్యాయవాదులు పి.వెంకటేశ్వరరావు, బి.రాజేష్, పారాలీగల్ వలంటీర్ జాషువా, ఏఎస్ఐ వెంగయ్య, నూలుమిల్లు జీఎం నరసింహం తదితరులు పాల్గొన్నారు. కొండమోడు–పేరేచర్ల రహదారికి భూమి పూజ రాజుపాలెం: మండలంలోని రెడ్డిగూడెం వద్ద కొండమోడు – పేరేచర్ల వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు మండలంలోని రెడ్డిగూడెం వద్ద ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కొండమోడు నుంచి పేరేచర్ల వరకు సూమారు 50 కి.మీ నేషనల్ హైవే రహదారి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దీని కోసం రూ.881 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెండేళ్లలో రహదారి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అనుపాలెం, రాజుపాలెం, తదితర గ్రామాల వద్ద ప్రమాదాలు జరురగకుండా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేస్తారని తెలిపారు. సత్తెనపల్లి పట్టణం, మేడికొండూరు గ్రామాలకు బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ హైవేస్ ఈఈ సంజీవరాయుడు, టీడీపీ మండల కన్వీనర్ పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా చర్లపల్లి–బెరహంపూర్కు ప్రత్యేక రైలును ప్రయాణికుల సౌకర్యార్థం కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–బెరహంపూర్ రైలు (07027) ప్రతి శుక్రవారం వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈనెల 9,16,23,20 తేదీలు, జూన్ 6,13,20,27వ తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. బెరహంపూర్–చర్లపల్లి రైలు (07028) ఈ నెల 10,17,24,31 తేదీలు, జూన్ 7,14,21,28 తేదీల్లో నడుస్తుందని తెలియజేశారు. ప్రయాణికులు గమనించాలని ఆయన సూచించారు. -
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి
● పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ● సత్తెనపల్లిలో నియోజకవర్గ సమీక్ష సమావేశం సత్తెనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కాకతీయ కల్యాణ మండపంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంతో పాటు గ్రామాల్లో విరిగిన, పాడుబడిన విద్యుత్ స్తంభాలను, లోలెవెల్ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే సవరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాలు, పనిముట్లు, సబ్సిడీపై వచ్చే అన్నిరకాల పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ అధికారులు చూసుకోవాలన్నారు. ‘ఉపాధి’ లక్ష్యం నెరవేరేలా పనిచేయాలి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పంచాయతీరాజ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. దేవదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలన్నారు. పేదలకు మంజూరైన పక్కా గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లక్కరాజు గార్లపాడు రోడ్డులో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం, సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని నందిగామ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి, డీపీఎం అమలకుమారి నేతృత్వంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల గ్రూపునకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు, రైతులకు సీఎండీఎస్ కిట్లు పంపిణీ చేశారు. జేసీ గనోరే సూరజ్ఽ ధనుంజయ్, ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
● ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ● చైర్మన్ కొనకళ్ల, ఎమ్మెల్యేతో కలిసి ఆర్టీసీ డిస్పెన్సరీ ప్రారంభం నరసరావుపేట: సంస్థ రేటింగ్ పడిపోకుండా ఉద్యోగులు పనిచేయాలని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఆర్టీసీ గ్యారేజ్ స్థలంలో సుమారు రూ.84లక్షల వ్యయంతో నిర్మించిన డిస్పెన్సరీని బుధవారం ప్రారంభించారు. డిస్పెన్సరీ శిలాఫలకాన్ని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆవిష్కరించగా డిస్పెన్సరీని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఎండీ తిరుమలరావు రిబ్బన్కట్చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో తిరుమలరావు మాట్లాడుతూ ఆక్యుపెన్సీ పెంచాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి పెద్దపీట వేసి కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, హృద్రోగ పరీక్షలు చేపట్టామన్నారు. మచిలీపట్నంలో ఇప్పటికే నూతన డిస్పెన్సరీని ప్రారంభించామన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు లంచాలు అడుగుతున్నారనే వార్తల నేపధ్యంలో అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ తనకు ట్రేడ్ యూనియన్లతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇప్పుడు అన్నీ వ్యవస్థలు భ్రష్టుపట్టి పోగా ఒక్క ఆర్టీసీనే నిజాయతీగా పనిచేస్తుందన్నారు. నేడు వైద్యపరీక్షలు, చికిత్స అత్యంత ఖరీదుగా మారింరాయని, ప్రాథమిక వైద్యం కోసం ఇటువంటి డిస్పెన్సరీలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రూ.30కోట్ల వ్యయంతో నూతన డిపో నిర్మాణం చేస్తామన్నారు. డిస్పెన్సరీకి కావాల్సిన ఏసీ సౌకర్యాన్ని తాను కల్పిస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్రెడ్డి, జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రంగిశెట్టి రామకృష్ణ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక యూనియన్ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి
సత్తెనపల్లి: దేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసి, తెల్లవారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సేవలను కొనియాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ, సత్తెనపల్లి ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి, తదితరులు ఉన్నారు. రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బృందం తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో ఇటీవల నిర్మించిన పలు సీసీ రోడ్ల నాణ్యతను బుధవారం గుంటూరు నుంచి వచ్చిన క్వాలిటీ కంట్రోల్ సభ్యులు పరిశీలించారు. యడ్లలింగయ్య కాలనీలో–6, అమరావతి ప్లాట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర, పూలే కాలనీ, చెంచుపేట రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ దగ్గర, గంగానమ్మపేట శివాలయం వద్ద నిర్మించిన పలు రోడ్లను పరీశీలించి, వాటికి నాణ్యత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ ఆకుల శ్రీనివాసరావు, ఏఈలు సూరిబాబు, సునీల్, జానీ బాషా పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మదిర షానూన్ సత్తా మంగళగిరి: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఈనెల 6న జరిగిన ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్ తరఫున పాల్గొన్న పవర్ లిఫ్టర్ మదిర షానూన్ 47 కేజీల విభాగంలో సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. తెనాలికి చెందిన షానూన్ అక్కడే ఉన్న క్విక్ ఫిట్నెస్ ఎరినాలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి వద్ద శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. పతకాలు సాధించిన షానూన్ను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలియజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం మంగళగిరి టౌన్: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం భగవత్ ప్రార్థన, ఆచార్య స్తోత్ర పాఠం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విగ్వరణం, రక్షా బంధనం, మృత్సంగృహణం, అంకురార్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో భాగంగా బుధవారం స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం రామలక్ష్మణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి
వెల్దుర్తి: బోదిలవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు అత్తులూరి హనుమంతరావుపై అదే గ్రామానికి చెందిన పాపయ్య, రాజేష్ లు దాడి చేసి గాయపరిచారు. హనుమంతరా వు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంలో బస్టాండ్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంతో గాయాలపాలయ్యా డు. బంధువులు హనుమంతరావును మాచర్ల వైద్యశాలకు తరలించారు. అనంతరం నర్సరావుపేట తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షేత్ర సహాయకుల తొలగింపు నరసరావుపేట: వివిధ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తొమ్మిదిమంది క్షేత్ర సహాయకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరక్టర్ సిద్దలింగమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పత్రికలకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వర్క్సైట్లో ఒక వర్క్ ఐడీకి సంబంధించిన ఒకటే ఫొటోను వివిధ వర్క్ ఐడీలకు పంపినట్లుగా రుజువైందన్నారు. మాదుగుల పంచాయతీలోని ఎల్.అలేఖ, బెల్లంకొండ: కె.వెంకటేష్, కొప్పునూరు: కె.మరియదాసు, ఇర్లపాడు: బి.వీరాంజనేయులు, శావల్యాపురం: సీహెచ్.బాలకృష్ణ, వెల్లటూరు: ఏ.ప్రియాంక, రేమిడిచర్ల: టి.మనెయ్య, పిట్టంబండ: వై.మమత, దొండపాడు పంచాయతీలోని ఎం.అనూషలను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ నోటీసు జారీ చేశారు. -
భారీ గాలులు.. వడగండ్ల వాన
యడ్లపాడు: మండలం పరిధిలో బుధవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు గంట సేపు వీచిన భారీ గాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఈదురు గాలులకు భారీ చెట్లు, కొమ్మలు విరిగి పడ్డాయి. బోయపాలెం నుంచి చెంఘీజ్ఖాన్పేట మార్గంలో రహదారిపై భారీ చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోయపాలెం నుంచి చెంఘీజ్ఖాన్పేట, సొలస కోళ్ల ఫారాల వద్ద స్తంభాలపై, తీగలపై చెట్ల కొమ్మలు, ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. మామిడి, బొప్పాయి తోటల్లో కాయలు రాలిపోయాయి. ముగనచెట్లు విరిగిపోయాయి. చెంఘీజ్ఖాన్పేట గ్రామంలోని వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం వెనుక ఉన్న రెండు పూరిళ్లపై చెట్ల కొమ్మలు పడి కప్పులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచి పోయి పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ అధికారులు బృందాలుగా ఏర్పడి రోడ్లపై, విద్యుత్ తీగలపై పడిన చెట్లను, కొమ్మల్ని తొలగించే చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మైదవోలు, చెంఘీజ్ఖాన్పేట మార్గం గుండా కొండవీడు సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా అందించే 11కేవీ విద్యుత్ స్తంభాలు నాలుగు నేలకొరిగాయి. దీంతో వంకాయలపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, చెంఘీజ్ఖాన్పేట, బున్నినగర్, సొలస, కోట, కొత్తపాలెం, కొండవీడు, సంతపేట గ్రామాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ స్తంభాలు నేలకూలి పలు గ్రామాల్లో అంధకారం -
పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు పంపిణీ
సత్తెనపల్లి: పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులందరికీ పుస్తకాల పంపిణీ జరగాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ అన్నారు. సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని స్టాక్ పాయింట్లో ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పుస్తకాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి మండలానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం 50 వేల పుస్తకాలకు గాను 30 వేల పుస్తకాలు రాగా మరో 20 వేల పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. పుస్తకాలను పరిశీలించిన డీఈఓ, ఎంఈఓ–2 ఎ.రాఘవేంద్ర రావుకు పలు సూచనలు చేశారు. ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భూషణం అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్థానిక ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాల పీడీ గుడిపూడి భూషణం ఎంపియ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన చిత్తూరులో ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా తమ పాఠశాలనుంచి రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న దృష్ట్యా తనను సభ్యులంతా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. తన శక్తివంచన లేకుండా రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషిచేస్తానన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కరుణకుమార్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది గుడిపూడి భూషణంను అభినందించారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు నూజెండ్ల: పిచ్చికుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని కమ్మవారిపాలెం యానాది కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. కాలనీకి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు, మల్లవరపు అంకమ్మ, చలంచర్ల అప్పారావులను కుక్క కరిచింది. 108 వాహనంలో వారిని నూజెండ్ల పీహెచ్సీకి తరలించారు. వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వినుకొండ వైద్యశాలకు తరలించారు. -
మెకానిక్ కిడ్నాప్ కలకలం
● చండ్రాజుపాలెంలో పాడుబడిన ఇంటిలో నిర్బంధించిన దుండగులు ● తప్పించుకొని పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆటోనగర్లో గ్యారేజ్ నడుపుతున్న మెకానిక్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రఘురాం నగర్కు చెందిన షేక్ మస్తాన్వలి గుంటూరు రోడ్లోని ఆటోనగర్లో ఆటో గ్యారేజ్ నడుపుతున్నాడు. ఆయనకు కొంతకాలంగా పట్టణంలోని వడవల్లిలో నివసించే బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామానికి చెందిన తోకా ప్రకాష్ పరిచయమయ్యాడు. పాత వాహనాలు కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తూ విక్రయించటం చేస్తుంటాడు. ఈ క్రమంలో మస్తాన్వలికి చెందిన ఓ ఇంటిని ప్రకాష్ కొనుగోలు చేశాడు. దీనిపై నగదుకు సంబంధించి ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు పోలీస్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో మస్తాన్వలి పట్టణ పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదం అని, కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మస్తాన్వలి ఈ నెల 5న కోర్టును ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ప్రకాష్ తన దగ్గర సరైన కాగితాలు లేకపోవడంతో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తాను ఆటో గ్యారేజీ మూసివేసి ఇంటికి వెళుతుండగా మరో నలుగురితో కలిసి కారులో వచ్చి తనను అడ్డగించారని, తనను కారులో ఎక్కించుకొని అటూ ఇటూ తిప్పుతూ తనపై దాడి చేశారని మస్తాన్వలి తెలిపాడు. కొంతసేపటి తర్వాత తనను చండ్రాజుపాలెం గ్రామానికి తీసుకెళ్లి ఊరు చివరన పాడుబడిన ఇంట్లో చేతులు, కాళ్లు కట్టేసి నిర్బంధించారన్నాడు. కొద్దిసేపటికి తప్పించుకున్న తాను పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చానని, హుటాహుటిన పోలీసులు తనను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారన్నారు. ఇంటి వివాదం నేపథ్యంలో ఇరువురు మధ్య నెలకొన్న మనస్పర్థలు వారి మధ్య కిడ్నాప్, దాడికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుడు మస్తానవలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ
బల్లికురవ: గ్రానైట్ లారీ డ్రైవర్ మద్యం మత్తుతో రోడ్డు మార్జిన్లోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సుమారు కిలోమీటరు దూరం ఆ స్తంభాన్ని లాక్కెళ్లాడు. ఈ ఘటన మంగళవారం అద్దంకి– బల్లికురవ ఆర్అండ్బీ రోడ్డులోని వల్లాపల్లి అంబడిపూడి గ్రామాల మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం .. అద్దంకి వైపు నుంచి బల్లికురవ, ఈర్లకొండ క్వారీల నుంచి గ్రానైట్ రాళ్లను ఎగుమతి చేసే టైలర్ లారీ ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. బొల్లాపల్లి సబ్స్టేషన్ నుంచి పెద అంబడిపూడి, చిన అంబడిపూడి , గుంటుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే మొయిన్ లైన్లో స్తంభం రెండు ముక్కలైంది. లారీ మీద పడి కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లింది. ఆ సమయంలో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఏఈ పి. శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందితో కలిసి రెండు గంటపాటు శ్రమించి కొత్త స్తంభం ఏర్పాటుతో సరఫరాను పునరుద్ధరించారు. డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఈ వివరించారు. -
కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పొన్నూరు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మంగళవారం పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. నూతనంగా నిర్మాణం చేపట్టాల్సిన కోర్టు భవనాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఆయనకు కోర్టు న్యాయమూర్తి ఏకా పవన్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొందుగుల జయరాజు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తూమాటి రమేష్, ఏజీపీ ఎన్.శ్రీనివాస్, న్యాయవాదులు, గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ బడ్జెట్ను ఆమోదించిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత మార్చి 31 నాటికే ఆమోదం పొందాల్సిన బడ్జెట్ను ఆమోదించలేకపోవడంతో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్ ఆమోదం కోసం జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కె.శ్రీనివాస్ నెహ్రూనగర్: గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా కె.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సర్వీసెస్ నుంచి డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేశారు. గతంలో ఈడీగా పనిచేసిన పి.ప్రేమకుమారి ఉద్యోగ విరమణ చేయడంతో ఇన్చార్జి ఈడీగా దుర్గాబాయి బాధ్యతలు నిర్వహించారు. నూతన ఈడీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. జిల్లాలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్ల బదిలీలు నగరంపాలెం: జిల్లాలోని పోలీస్స్టేషన్ల్లో ఐదేళ్లు పూర్తయిన కానిస్టేబుళ్లు నుంచి ఏఎస్ఐలకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పర్యవేక్షించారు. 12 మంది ఏఎస్ఐలు, 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 27 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు అందుబాటులో ఉండాలని చెప్పారు.జిల్లా ఏఎస్పీ జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సీసీ ఆదిశేషు, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు. రైల్వే అధికారులకు ఆహ్వానం లేదు లక్ష్మీపురం: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోవడంతో బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర సహాయక మంత్రి పెమసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఆర్ఎం బుధవారం ఉదయం రేపల్లె రైల్వేస్టేషన్ తనిఖీలకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అండగా మేమంతా ఉన్నాం
కారంచేడు: అనారోగ్యంతో కొంత కాలంగా చికిత్స పొందుతున్న కారంచేడు జెడ్పీటీసీ సభ్యురాలు యార్లగడ్డ రజనీ శ్రీనివాసరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కలిసి పరామర్శించారు. మంగళవారం మండల కేంద్రమైన కారంచేడు గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యురాలి గృహానికి వచ్చిన బత్తుల ఆమెను చూసి చలించిపోయారు. ఎంతో యాక్టివ్గా ఉండేవారన్నారు. అనారోగ్యాలను బట్టి కృంగి పోకూడదని, ధైర్యంగా ఉండాలని, మేమంతా మీకు అండగా ఉంటామని ఆమె ఽధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. చికిత్స జరుగుతున్న తీరును కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండి అనారోగ్యాన్ని జయించి మరలా మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. స్టేట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పి. ఏడుకొండలు, యర్రం లక్ష్మారెడ్డి, గోగినేని బుల్లెబ్బాయి, యార్లగడ్డ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.జెడ్పీటీసీ రజనీని పరామర్శించిన బత్తుల బ్రహ్మానంద రెడ్డి -
ట్రావెల్స్ వాహనం బోల్తా
పలువురికి గాయాలు మార్టూరు: జాతీయ రహదారిపై మంగళవారం టూరిస్ట్ వాహనం బోల్తా పడిన సంఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని విజయవాడ వైపు వెళుతున్న సుమారు 15 మంది ప్రయాణికులతో కూడిన ట్రావెల్స్ వాహనం మంగళవారం ఉదయం చిలకలూరిపేట వైపు వెళుతోంది. రాజుపాలెం కూడలి దాటిన తర్వాత ట్రావెల్స్ వాహనం ముందు వెళ్తున్న మరో వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి రహదారికి పడమర వైపు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ వాహనం మధ్యలో ఉన్న డివైడర్ను దాటుకుంటూ రహదారికి తూర్పు వైపు గల పొలాల్లోకి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి క్యాబిన్లో ఇరుక్కుపోగా స్వల్పంగా గాయపడిన మిగిలిన ప్రయాణికులు వాహనం క్యాబిన్ డోర్ను బలవంతంగా ఓపెన్ చేసి బాధితుడిని తమతో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించుకొనివెళ్లారు. లోడ్ కిందపడి కార్మికుడు మృతి చెరుకుపల్లి: ప్రమాదవశాత్తు తాటి మొద్దుల లోడ్ కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని ఆరుంబాక ఎస్సీ కాలనీకి చెందిన వేము ఆదినారాయణ (40) చెరుకుపల్లిలోని ఒక కోత మిషన్లో పనిచేస్తున్నాడు. మంగళవారం తాటి మొద్దుల లోడు దింపుతుండగా కింద పడ్డాడు. అతనిపై తాటి మొద్దులు పడ్డాయి. తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. యువకుడి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం కొల్లూరు: వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సహజీవనం చేస్తున్న యువకుడు వేధింపులకు పాల్పడటంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను భర్త వదిలి వెళ్లిపోయాడు. తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ కొన్నేళ్లగా ఆమె పుట్టింటి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన పరిశ గోపికృష్ణ పరిచమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత సహజీవనం చేస్తున్నారు. ఆమె నుంచి అవసరాల నిమిత్తం అతడు రూ. 1.75 లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడగడంతో మాట దాట వేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మళ్లీ డబ్బు అవసరం ఉందని అడిగాడు. ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. దీంతో బాధితురాలు ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు పేస్టును కూల్డ్రింక్లో కలిపి తాగింది. మధ్యాహ్నం కుటుంబసభ్యులు వచ్చాక గమనించి 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అర్జున్రావు తెలిపారు. -
‘ఎన్ఎస్పీ’ వాసులపై పోలీసుల దౌర్జనం
నరసరావుపేట: తమకు శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసి పునారావాసం కల్పించేంతవరకు కాలనీని వదిలి వెళ్లబోమని కాలనీ స్థానిక ఎన్ఎస్పీ వాసులు, ప్రజాసంఘాల నాయకులు అధికారులకు తేల్చిచెప్పారు. తమపై పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ మంగళవారం కాలనీవాసులు పిల్లా పాపలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి సీపీఐ, సీపీఎం, రైతుసంఘం, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. కాలనీ వాసుల నాయకుడు, మాలమహానాడు జిల్లా కార్యదర్శి బోరుగడ్డ అంబేడ్కర్ విలేకరులతో మాట్లాడారు. తమ కాలనీలోని 35 ఎకరాల భూమిలో ఉద్యోగుల కార్యాలయాలు, ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం చేశారని, 60 ఏళ్లుగా సుమారు 300 కుటుంబాలు నివాసం ఉండేవారన్నారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్లో ప్రస్తుతం 62 విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన కుటుంబాలు మాత్రమే నివసిస్తూ కాలం వెళ్ల దీస్తున్నారన్నారు. నరసరావుపేటను పల్నాడు జిల్లా కేంద్రంగా ప్రకటించగానే అధికారులు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పాలన కొనసాగిస్తున్నారన్నారు. అప్పటి నుంచి కాలనీవాసులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా మార్చి వేశారని పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ కోసం స్థలం కేటాయించి కాలనీ ప్రాంగణంలో విశాలమైన రోడ్లు నిర్మాణం చేసిన అధికారులు కాలనీ చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటుచేసి ఆ రోడ్లపై కాలనీవాసులు నడవకుండా ఆంక్షలు విధించారన్నారు. నోటీసులు ఇవ్వకుండానే.. కాలనీ వాసులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లి పోవాలని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని బోరుగడ్డ తెలిపారు. సోమవారం రాత్రి టూ టౌన్ సీఐ సిబ్బందితో కాలనీలో విద్యుత్ నిలిపి వేయించారని, కాలనీ యువకుల బైకులను బలవంతంగా స్టేషన్కు తరలించారన్నారు. తెల్లవారేలోపు క్వార్టర్స్ ఖాళీచేసి వెళ్లిపోవాలని, లేదంటే పొక్లెయిన్లతో కూల్చి వేస్తామని హెచ్చరించి వెళ్లారన్నారు. దీనిపై తాము స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని, విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీవాసులు కలెక్టరేట్ కాంపౌండ్ దాటకుండా ఆంక్షలు విధించారన్నారు. కాలనీవాసులకు ప్రభుత్వమే నివాస స్థలాలు మంజూరు చేసి వారికి పక్కా ఇళ్లు నిర్మించిన తర్వాతనే వారిని ఖాళీ చేయాలని, అప్పటి వరకు వారు నివశిస్తున్న క్వార్టర్స్లోనే ఉండనివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కేఎన్ కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, రైతుసంఘ జిల్లా నాయకుడు ఏవూరి గోపాలరావు, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, బహుజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోదా రమేష్కుమార్, కేఎన్పీఎస్ నాయకుడు జక్కా బ్రహ్మయ్య, పెద్దసంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. వెంటనే క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ హుకుం నిరసనగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రోడ్డుపై ఆందోళన చేపట్టిన కాలనీవాసులు పునరావాసం చూపేవరకు ఖాళీచేసే ప్రసక్తి లేదంటున్న కాలనీవాసులు -
నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలని వినతి
పర్చూరు(చినగంజాం): ప్రభుత్వమే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలని పర్చూరు నియోజక వర్గ పరిధిలోని పలువురు రైతులు అధికారులను కోరారు. పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం ఉప్పుటూరు గ్రామంలో పలు విషయాలను ఉన్నతాధికారులకు వివరించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు, రైతు నాయకులు మాట్లాడారు. వ్యాపారులు కొనుగోలు చేయటానికి ముందుకు రావటం లేదని, విదేశాల్లో ఉన్న ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో పొగాకు ఎగుమతులకు ఆదరణ లేనందున ఈ పరిస్థితి నెలకొందని రైతులు వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవ సాయ సహకారం) బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారులతో బుధవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా వారిని ఒప్పిస్తామని తెలియజేశారు. -
కొనసాగిన కార్మికుల సమ్మె
నరసరావుపేట: తమకు పూర్తిజీతాలు చెల్లించాలని కోరుతూ కొంతమంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు మంగళవారం 48వ రోజుకు చేరాయి. యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి అమరారపు సాల్మన్ మాట్లాడుతూ శాంతియుత నిరసన ద్వారా తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. నేడు పేరేచర్ల–కొండమోడు రహదారి విస్తరణకు శంకుస్థాపన సత్తెనపల్లి: తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల–సత్తెనపల్లి నియోజక వర్గం రాజుపాలెం మండలం కొండమోడు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు బుధవారం సాయంత్రం 4.00 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి హాజరుకానున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఏర్పాటుచేసిన నేషనల్ హైవే (ఎన్హెచ్ –167 ఏజీ)కి సంబంధించిన నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతోపాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల), భాష్యం ప్రవీణ్(పెదకూరపాడు), తెనాలి శ్రావణ్ కుమార్(తాటికొండ) పాల్గొననున్నారు. తొండపిలో ఘర్షణ ముప్పాళ్ల: ఇరువురి మధ్య వివాదం ముదిరి జరిగిన ఘర్షణలో ఒకరికి తలకు గాయమైన సంఘటన మండలంలోని తొండపి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన దుగ్గినేని రామారావు, చల్లా శ్రీనివాసరావుల మధ్య వివాదం జరిగింది. వివాదం ముదిరి రామారావు గడ్డపారతో శ్రీనివాసరావు తలపై కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. గాయపడిన శ్రీనివాసరావుకు సత్తెనపల్లిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు తెలిపారు. శక్తి యాప్ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ తుషార్ డూడీ బాపట్లటౌన్: శక్తియాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ఆవశ్యకత, వినియోగం దానిలో నిక్షిప్తం చేయబడిన పలు అంశాల గురించి మంగళవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ జిల్లాలోని శక్తి బృందాలు జిల్లాలోని కోచింగ్ సెంటర్స్, ఫ్యాక్టరీలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర కార్యాలయాలు, జన సమూహం ఉండే ఇతర ప్రదేశాలతోపాటు జిల్లాలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళలకు అవవగాహన కల్పించారు. మహిళలకు శక్తి యాప్ను ఏ విధంగా వారి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, వినియోగించే విధానం, యాప్లో పొందుపరచబడి ఉన్న విస్తృతమైన సమాచారం గురించి వివరించినారు. వాటితోపాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిషేధ చట్టం, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, వివిధ హెల్ప్ లైన్ నెంబర్లు వాటిని వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలి బల్లికురవ: విద్యుత్షాక్తో చనిపోయిన వ్యవసాయ కూలీ సురభి నాగేశ్వరరావు (46) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కోరారు. సోమవారం విద్యుత్ షాకుతో చనిపోయిన నాగేశ్వరరావు భౌతిక కాయానికి సోమవారం అర్ధరాత్రి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెక్కాడితే కాని డొక్కాడని ఈ కుటుంబానికి విధి విద్యుత్ రూరంలో తీరని అన్యాయం చేసిందని సురేష్ అన్నారు. -
నాలుగు లైన్ల రహదారితో ఎంతో మేలు
బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ గుంటూరు వెస్ట్: అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు నూతనంగా నిర్మించనున్న నాలుగు లైనుల (గ్రీన్ ఫీల్డ్) రోడ్డు నిర్మాణంతో ఎందరికో మేలు జరుగుతోందని బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో స్టేక్ హోల్డర్స్తో నిర్వహించిన సమావేశంలో ఎంపీతోపాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రింగ్రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు 47.848 కిలోమీటర్లు నాలుగు లైనుల రోడ్డు నిర్మాణం వల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. ఆరు మాసాల్లో నిర్మాణ పనులకు అనుమతులు పొందిన తరువాత మరో 18 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళిలు మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏవైనా అంశాలు ఉంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రంలోపు అందించాలని పేర్కొన్నారు. అధికారులు అందించిన వివరాలు క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ వారికి పంపుతామని వివరించారు. -
పేదల బియ్యం పక్కదారి
చీరాల: పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అర్హులకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారులు అక్కడక్కడా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా ఈ దందాను నిలువరించలేకపోతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. జిల్లాతోపాటు పక్కనే ఉన్న పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి కూడా అక్రమ వ్యాపారం చేసే వారు క్యూ కడుతున్నారు. దందా నిర్వహించే వారికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తెరవెనుక అభయ హస్తం అందిస్తున్నట్లు సమాచారం. నెలలో పది రోజులే వ్యాపారం... ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రతి నెల ఒకటోతేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. కొంత మంది డీలర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎక్కువ మంది డబ్బులకు విక్రయిస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ రూ.10 చొప్పున, డీలర్ల నుంచి రూ.15కు తీసుకుంటున్నారు. తర్వాత మిల్లులకు తరలించి పాలిష్ పట్టాక దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కు అవుతున్నారు. విలేకర్లు ‘విజిలెన్స్’ అవతారం.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి, సీజ్ చేస్తుంటారు. తాజాగా విలేకర్లు ఈ విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఇటీవల పర్చూరు నుంచి చీరాలకు లారీలో రేషన్ బియ్యాన్ని రాత్రి వేళ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఐదుగురు విలేకర్లు కారులో వెంబడించారు. లారీని ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు చెబుతామని దండుకున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్రమార్కులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లు కొంత ముట్టజెప్పారు. ఈ వ్యవహారం పత్రికలకు ఎక్కింది. గతంలో స్వర్ణలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు మీడియాలో రాగా డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరుకు చెందిన విలేకరులపై కేసు నమోదు చేశారు. కొందరు విలేకర్లు హైవేలపై కూడా ట్రాన్స్పోర్టు లారీలను ఆపి డబ్బులు దండుకుంటున్నారు. జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న దందా పలుచోట్ల అడ్డగోలుగా ఇసుక తరలింపు అవే అక్రమార్కులకు సిరులు... రేషన్ బియ్యం తరలింపుతోపాటు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. ఈ రెండూ అక్రమార్కులకు రెండు కళ్లు. సిరులు కురిపించే అక్రమ వ్యాపారాలు చేయడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులకు చెందిన రెండు వర్గాలు ఇసుక రవాణా చేసేందుకు పోటీ పడ్డాయి. గతంలో ఇసుక తవ్వడానికి వినియోగించిన జేసీబీని దహనం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. జిల్లాలో చీరాల, రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని ఇసుకను లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి తీర ప్రాంతాలు కుంచించుకుపోతున్నాయి. వందల అడుగుల లోతున జేసీబీలతో ఇసుకను తవ్వుతూ పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి కేసులతో సరిపెడుతున్నారు. -
జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్
పిడుగురాళ్లరూరల్: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని గురజాల ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 11 కత్తులు, నాలుగు గడ్డపారలు, గొడ్డళ్లు, కొడవళ్లతోపాటు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని, ముందస్తు చర్యలలో భాగంగానే ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ సోదాలు నిర్వహించామని తెలిపారు. ఇరుపార్టీల వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, దాచేపల్లి సీఐ భాస్కర్రావు, గురజాల, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్పరిధిలోని ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు. కొడవళ్లు, గడ్డపారలు, 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి
చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): రైతులందరూ తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరణ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి చెప్పారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో మట్టి నమూనాల సేకరణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన భూమిలోని పోషక లోపాలను తెలుసుకొని వాటిని నివారించి సాగు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. చాలా మంది సాగు సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దిగుబడులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, ఎవరికి తోచినట్లు సాగు చేయడం, ఇష్టానుసారంగా మందులు, ఎరువులు వినియోగించడం తదితర కారణాలతో వ్యవసాయంలో అనుకున్నంతగా ఆదాయాన్ని పొందలేక పోతున్నారన్నారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని, దాని వలన సాగు ఖర్చు పెరుగుతుందన్నారు. అంతే కాకుండా భూసారం తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతాయన్నారు. రైతులు భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మట్టి పరీక్షలు చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీపై సూక్ష్మపోషకాలు అందించనుందన్నారు. మట్టి నమూనాలకు ఇదే సరైన సమయమని, రైతులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టిపరీక్షలు తప్పక చేయించుకోవాలని సూచించారు. గ్రామంలో నిర్మిస్తున్న నీటికుంటల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎమ్.అరుణ, వీఏఏ శైలజ, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి -
జీవనంపై తీవ్ర ప్రభావం
ఉపాధి హామీ పని అడిగిన అందరికీ పని కల్పించాలి. పనిదినాల సంఖ్య తగ్గింపు వల్ల జిల్లా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ఎవరి సొంతం కాదు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న పథకం. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో పనులు జరిపించాలి. ప్రతి కుటుంబానికి వంద రోజు లు పని దినాలు కల్పించాలి, వారం వారం వేతనాలు అందివ్వాల్సిందే. రాజకీయ కోణంలో పని కల్పించకపోతే ఐక్యంగా కలిసి పోరా డుతాం. కామన్ వర్క్ ఐడీలు కాకుండా ఏ పనికి ఆ పనికి సంబంధించిన ఐడీలు ఇవ్వాలి. దీనివల్ల పని చేసిన వారు, చేయని వారు సమానమై వేతనం తగ్గిపోయే ప్రమాదం ఉంది. – గంజిమాల రవిబాబు, వ్యవసాయ కార్మి సంఘం పల్నాడు జిల్లా నాయకుడు -
ఇక డిజిటల్గానే పీఏసీఎస్ కార్యకలాపాలు
నరసరావుపేట: జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లను ఈపీఏసీఎస్లుగా మార్చడం జరిగిందని, దీనివల్ల ప్రతి రోజూ అన్ని కార్యకలాపాలు డిజిటల్గా చేయడం జరుగుతుందని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. సహకార సంఘాల కంప్యూటీకరణ చేసిన తర్వాత నిర్వహించాల్సిన ఆడిట్పై ఏపీ కో ఆపరేటీవ్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రకాష్నగర్లోని కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలో సహకార శాఖ ఆడిటర్లు, చార్టెట్ అకౌంటెంట్లు, సీఇవోలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పీఎసీఎస్ల ఖాతాలు, లావాదేవీల పరిశీలన, భద్రతా ప్రమాణాలు ఆన్లెన్ విధానంలో నిర్వహించబడతాయని తద్వారా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. కేంద్రీకృత నిఘా, నియంత్రణ ఉంటుందని, రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి పీఏసీఎస్ల పనితీరుపై నేరుగా పర్యవేక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లా సహకార ఆడిట్ అధికారి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘ లావాదేవీలు, ఖాతాలు, రికార్డులు స్పష్టంగా ఉండి అవినీతికి అవకాశాలు తగ్గుతాయని, మానవ దోషాలేమీ లేకుండా కంప్యూటరైజ్డ్ విధానంలో త్వరగా ఆడిట్ పూర్తి చేయవచ్చని అన్నారు. గత ఆడిట్లతో పోలికలు వేయడం సులభమని, మానవ వనరులు, పేపర్ వాడకం తగ్గి పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని చెప్పారు. ఇకపై సంఘాలు సభ్యులకు మెరుగైన సేవలు అందించగలవని, తక్కువ సమయంలో ఖాతాలు చూసే రుణ వివరాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ పీఏసీఎస్, ఈ–ఆడిట్ వ్యవస్థలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని అన్నారు. ఈ ఆడిట్ ఎలా చేయాలో సిబ్బందికి, చార్టర్డ్ అకౌంటెంట్స్కు శిక్షణ ఇచ్చి వారి సందేహాలను తీర్చారు. సహకార శాఖ ఆడిటర్లు, సీఏలు, సీఇఓలు పాల్గొన్నారు. శిక్షణలో జిల్లా సహకార అధికారి -
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతకు సన్మానం
వినుకొండ: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక జాషువా కళాప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ముందుగా పెనుగొండను పట్టణ పురవీధుల్లో ఊరేగించి శివయ్య, గంగినేని, జాషువా విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కళాప్రాంగణంలో లక్ష్మీనారాయణ దంపతులను ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీహెచ్ఎల్ఎన్ మూర్తి, సీనియర్ న్యాయవాది పీజే లూకా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
కక్ష సాధింపే కూటమి ధ్యేయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచి అధికారులను అడ్డంపెట్టుకొని ప్రత్యర్థులపై కక్షసాధింపే ధ్యేయంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తన స్వగ్రామమైన బుచ్చిబాపనపాలెంలో కక్షసాధింపు చర్యల్లో భాగంగా గ్రామస్తులకు తాగునీరు ఆపేసి, పారిశుద్ధ్య పనులను నిలిపివేసిన సెక్రటరీ ఏకపక్ష వ్యవహార శైలిని ఖండిస్తూ గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ పరిధిలో పంచాయతీ సెక్రటరీగా ఉన్న వ్యక్తి అప్పటికే అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించి ఇతర గ్రామాల నుంచి తన సొంత మనుషులను నియమించుకున్నాడన్నారు. వారు పారిశుద్ధ్యం జోలికి పోవడం లేదన్నారు. వీధిలైట్లు పనిచేయక రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నామంటూ గ్రామస్తులు చెప్పినా బాగుచేయడం లేదన్నారు. దీనికి కారణం బుచ్చిబాపనపాలెం తన సొంత గ్రామం కావడమేనన్నారు. గత ఎన్నికల్లో గ్రామస్తులు అందరూ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న కక్షతోనే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు ఈ సెక్రటరీ గతంలో యలమంద, సాతులూరు లాంటి గ్రామాల్లో పనిచేశాడని, ఇతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటువంటి వ్యక్తిని కావాలని తమ గ్రామానికి వేసి ఇబ్బందిపాలు చేస్తున్నారన్నారు. గ్రామానికి నీరందించేందుకు ఆరెకరాల చెరువుతో పాటు ట్యాంకు, పైపులైను ఉందన్నారు. బటన్ నొక్కితే తాగునీరు సరఫరా అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు నెలల నుంచి సరఫరా చేయడందన్నారు. దీనిపై సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు అందరూ సెక్రటరీని కలిస్తే తాను పెట్టమన్నచోట సంతకాలు పెట్టాలనే షరతు విధించాడన్నారు. తన సొంత బిల్లులతో పంచాయతీ సొమ్ము డ్రా చేస్తున్నాడన్నారు. గ్రామస్తుల తరఫున కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కలవటం జరిగిందన్నారు. సమగ్ర విచారణ చేయమని డీపీఓను ఆదేశించారన్నారు. వేరే గ్రామానికి చెందిన వ్యక్తులు తమ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలోనే కార్మికులు ఉన్నారన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కోరగా, ఆయన అంగీకరించారన్నారు. ఎంపీటీసీ తిరుపతయ్య గ్రామంలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మాజీ కన్వీనర్ పచ్చవ రవీంద్ర, గిరిజన కార్పొరేషన్ మాజీ డైరక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, షేక్ కరిముల్లా, గంటెనపాటి గాబ్రియేలు పాల్గొన్నారు. బుచ్చిబాపనపాలెంలో తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు నిలుపుదలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం పీజీఆర్ఏస్లో కలెక్టర్కు ఫిర్యాదు -
ఘనంగా బగళాముఖి జయంతి పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారి జయంతి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జయంతి పూజలలో భాగంగా అమ్మవారి ఆలయంలో 108 కళాశాలలో మహిళలు సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి నిజరూప బగళాముఖి అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన స్వర్ణవర్ణపు సింహం విగ్రహాలను అమ్మవారి విగ్రహం ముందు ఇరువైపులా ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీక్షీరభావన్నారాయణస్వామి బాపట్ల : శ్రీక్షీరభావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగింపు జరిగింది. నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు పురవీధుల్లో ఊరేగింపు చేయటంతో భక్తులు టెంకాయలుకొట్టి పూజలు చేశారు. జీజీహెచ్ సిబ్బందికి మెమోలు అడిషనల్ డీఎంఈ ఆకస్మిక తనిఖీలు గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహచ్లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ఆషా సజనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్ధోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో తనిఖీలు చేసి, ఆపరేషన్ థియేటర్లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తుండటంతో అతనిని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు. చైల్డ్ హోమ్కు పసికందు పొన్నూరు: మండలంలోని పచ్చల తాడిపర్రు గ్రామంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన పసికందుకు నిడుబ్రోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో సోమవారం మగ శిశువును వైద్యశాల డాక్టర్ ఫిరోజ్ ఖాన్ గుంటూరు చైల్డ్ హోమ్ నిర్వాహకులకు సీడీపీఓ వెంకట రమణ ఆధ్వర్యంలో అందజేశారు. తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం గ్రామానికే చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్ను అందించారని అధికారులు తెలిపారు. దాత లను ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘27వ మైలురాయి’
తెనాలి: రూరల్ మండలం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీల్లో యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంది. ఇదే నాటికలో వైదేహి పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటి సురభి ప్రభావతి ఉత్తమ నటిగా, రాజన్న పాత్రధారి పవన్కుమార్ ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా, నాటిక రచయిత పీటీ మాధవ్ ఉత్తమ రచయిత బహుమతులను అందుకున్నారు. మూడురోజులపాటు జరిగిన నాటికల పోటీ ల్లో విజేతలకు చివరి రోజైన ఆదివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారు ప్రదర్శించి ‘అ సత్యం’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు దక్కటం విశేషం. రఘుపతి పాత్రధారి వై.అనిల్కుమార్ ఉత్తమ ప్రతినాయకుడు, నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్కు, సంగీతాన్ని అందించిన పి.లీలామోహన్కు ఉత్తమ సంగీతం, ఉత్తమ లైటింగ్కు థామస్ బహుమతులను అందుకున్నారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికలో నటించిన గోవాడ వెంకట్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ‘మతమా మానవత్వమా’నాటికలో నటించిన కె.రాజేశ్వరికి ఉత్తమ క్యారెక్టర్ నటి బహుమతిరాగా, ‘మహాప్రస్థానం’లో సింహాద్రి పాత్రధారి బొర్రా నరేన్కు ఉత్తమ సహాయనటుడు బహుమతి లభించింది. జి.సురేంద్రబాబుకు ఉత్తమ హాస్యనటుడు, ‘బ్రహ్మస్వరూపం’లో నటించిన ఎం.రత్నకుమారికి బెస్ట్ డైలాగ్ ఆర్టిస్ట్ బహుమతులు వచ్చాయి. -
ప్చ్.. లాభం లేదు!
జిల్లాలో జనసేన నేతల అంతర్మథనంఅధికారం వస్తే అందరూ సమానమన్నారు.. కానీ ఆ అందరికంటే వెనక్కి నెట్టారు. పల్లకి మోస్తే పదవులు ఇస్తామన్నారు. పదవులన్నీ వాళ్లే తీసుకొని పాలెగాళ్లను చేశారు. అందరి జెండాలు భుజాన వేసుకుంటే వెన్ను తట్టి నిలుస్తామన్నారు. చివరకు మీరే గుదిబండ అయ్యారంటూ భుజం పట్టి పక్కకి నెట్టారు. అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో కూర్చున్నామో అర్థంగాక, ఎక్కడా గౌరవం దక్కక పల్నాడు జిల్లా జనసేన నేతలు గుండె మంటతో రగిలిపోతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. సాక్షి, నరసరావుపేట: అధికార కూటమిలో ఉన్నామన్న మాట తప్ప తమకు పావలా ఉపయోగం లేదన్న నిరాశలో పల్నాడు జిల్లా జనసేన నేతలున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా జిల్లాలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి దక్కలేదన్న నిరాశ, నిస్పృహలో ఉన్నారు. పోనీ పదవులు లేకపోయినా పెత్తనమన్నా దక్కిందా అంటే అది కూడా లేదని వారు వాపోతున్నారట. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే జిల్లాలో అధికార పెత్తనం మొత్తం చెలాయిస్తున్నారు. ప్రజాధనాన్ని దోపిడిలోనూ వారిదే పై చేయి. కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమైన మాకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న భావన జనసేన నేతలు, కార్యకర్తలలో ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా ఉపయోగం లేదన్న భావన వారిలో ఉంది. అధిష్టానం కేవలం గోదావరి జిల్లాల నేతలకు పదవులు, పెత్తనం సాధించే పనిలో ఉందని, మాకు గురించి ఆలోచించే తీరిక కూడా లేదంటున్నారు. హామీలు.. నీటిపై రాతలు! సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన జిల్లా నేతలతో పనిచేయించుకోవడానికి జనసేన, టీడీపీ ముఖ్యనేతలు హామిలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించిన బొర్రా వెంకట అప్పారావు ఎన్నికల ముందు నుంచే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తులో భాగంగా జిల్లాలో ఒక్క సీటు అయినా జనసేనకు కేటాయిస్తారని అది సత్తెనపల్లే ఉంటుందని ఆయన వర్గం బాగా ప్రచారం చేసింది. తీరా చూస్తే కూటమి తరఫున ఎమ్మెల్యే సీటు కన్నా లక్ష్మీనారాయణకు కేటాయించారు. దీంతో బొర్రా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వెంటనే రంగంలోకి దిగిన జనసేన, టీడీపీ ముఖ్యనేతలు అప్పారావును బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకొనేలా చేశారు. అధికారంలోకి రాగానే మంచి నామినేటెడ్ పదవి అప్పగించి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఏడాదైనా అతిగతీ లేదని ఆయన వర్గం తీవ్ర నిరాశలో ఉంది. ● అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి సయ్యద్ జిలానీ జనసేన జెండాతో 2019 ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టి పార్టీ ఉనికి కోసం పోరాడాడు. తన సొంత గ్రామం పమిడిపాడులో ఆ పార్టీ తరఫున అభ్యర్థిని నెలబెట్టి సర్పంచ్గా గెలిపించుకున్నాడు. 2024 ఎన్నికల వరకు కూడా నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను అన్ని తానై నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ నీదేనంటూ చివరి వరకు అధిష్టానం చెబుతూ వచ్చి, తీరా టీడీపీ అభ్యర్థికే కూటమి తరఫున బీఫాం ఇచ్చారు. ఆసమయంలో జిలానీ అలగడంతో అధికారంలోకి వచ్చాక మైనార్టీ కోటాలో పదవితోపాటు మంచి గుర్తింపు ఉంటుందని అధిష్టానం హామీఇచ్చింది. తీరా చూస్తే ఏడాదిగా పదవి రాకపోగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏమాత్రం గుర్తింపు దక్కడం లేదు. ● వినుకొండ జనసేన నేత నిస్సంక శ్రీనివాసరావుది దాదాపుగా ఇదే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనను పట్టించుకోలేదన్న ఆవేదన ఆయనలో ఉందట. జనసేనకు గట్టి పట్టున్న సామాజిక వర్గం అధికంగా ఉండే పెదకూరపాడు, గురజాల, చిలకలూరిపేటలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి జనసేన నేతలకు ప్రభుత్వ కార్యాలయాలలో ఏమాత్రం గౌరవం దక్కడం లేదన్న భావన వారిలో ఉంది. నామినేటెడ్ పదవుల్లో జిల్లా జనసేన నేతలకు ఒక్కటీ దక్కని వైనం పదవులన్నీ గోదావరి జిల్లా నేతలకే ఇస్తే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన అధిష్టానం తమ గురించి పట్టించుకోవడం లేదని అసంతృప్తి నామినేషన్ ఉపసంహరిస్తే నామినేటెడ్ పదవి ఇస్తామని ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నేత బొర్రా అప్పారావుకు హామీ నరసరావుపేట ఎమ్మెల్యే సీటు దక్కనందుకు జిలానికీ పదవి ఆఫర్ ఏడాది కావొస్తున్నా దక్కని పదవులు రెవెన్యూ, పోలీసు కార్యాలయాల్లోనూ మాట నెగ్గడం లేదని గగ్గోలు బెల్టుషాపులు, రేషన్, ఇసుక దందాల్లో వాటాలు కావాలంటూ డిమాండ్ ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో జనసేన నేతలకు ప్రాధా న్యం ఇవ్వకపోగా, కనీసం ఏదైనా కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ నేతలు ఆవేదన చెందుతున్నారు. భూసమస్యల నిమిత్తం రెవెన్యూ కార్యాలయా లకు వెళితే టీడీపీ మండల స్థాయి నేతల సిఫార్సు కావాలని అధికారులు చెబుతుండటం జనసేన నేతలకు మింగుడుపడటం లేదు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా, బెల్టుషాపులు, లిక్కర్ టెండర్లు, మైనింగ్ వంటి ఆదాయం వచ్చే ప్రతి విషయంలో టీడీపీ నాయ కులు ముందు వరుసలో ఉంటూ జేబులు నింపుకొంటున్నా రు. తమకు మాత్రం రిక్తహస్తమే దక్కుతోందని ఆవేదనలో ఉన్నారు. తమ దుస్థితిపై పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నామని వారు చెప్పుకొస్తున్నారు. తమ అధినేత వపన్ కల్యాణ్ స్వప్రయోజనాలు తప్ప క్యాడర్ గురించి, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 291 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్తో పాటు జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ పి.అరుణ్బాబు పీజీఆర్ఎస్లో 291 అర్జీలు స్వీకరణ -
వేసవి శిక్షణ కేంద్రాల కోలాహలం
సత్తెనపల్లి: వేసవి వచ్చిందంటే పిల్లలతో మైదానాలు నిండిపోతాయి. వివిధ రకాల క్రీడలను కోచ్లు ఉచితంగా నేర్పిస్తుండడంతో పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ వేసవి శిబిరాల్లో చేరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు మైదానాల్లో శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం, సాయంత్రాలు వేసవి శిబిరాలకు పంపి వారిలో క్రీడానైపుణ్యాలు పెంచుతున్నారు. కోచ్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పిల్లలకు ఆటల్లో మెలకువలు నేర్పుతున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 17 క్రీడాంశాల్లో 50 శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోచ్లు కోరుతున్నారు. జిల్లాలో 17 క్రీడాంశాల్లో 50 శిక్షణ శిబిరాలు విద్యార్థులు క్రీడాకారులుగా రాణించాలి జిల్లాలోని విద్యార్థులు మంచి క్రీడాకారులుగా రాణించటానికి వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రీడల్లో మెలకువలను తెలుసుకొని ఆ మేరకు సాధన చేస్తే తప్పకుండా విజేతలుగా నిలుస్తారు. నెల రోజులు పాటు జరిగే వేసవి శిక్షణ శిబిరాలను ఎక్కువమంది వినియోగించుకునేలా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలి. –పి.నరసింహారెడ్డి, డీఎస్డీఓ, పల్నాడు -
జీఓ నెంబర్ 30 అమలు చేయాలి
గత 20ఏళ్లుకు పైబడి నివాసం ఉంటున్న బాపనయ్యనగర్ వాసుల గృహాలకు పట్టాలు ఇవ్వాలి. సెంటు స్థలం లేని పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలు అధికంగా అక్కడ ఉన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు సైతం కడుతున్నారు. ప్రభుత్వం జీఓ నెంబర్ 30 తీసుకువచ్చి 150 కుటుంబాల ఆక్రమితదారులకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, బాపనయ్యనగర్ వాసులు -
కిశోరి వికాసం
బాలికల భవితకు నరసరావుపేట: బాలికలు, యువతుల ఉజ్వల భవిష్యత్కు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. కౌమార బాలికల సాధికారిత లక్ష్యంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిశోరి వికాసం వాల్పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. యుక్తవయస్సు బాలికలకు ఈనెల 2వ తేదీ నుంచి జూన్ 10 వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ను రూపొందించడం జరిగిందన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ నియంత్రణలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేయాలన్నారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలను ఈ–సాధన పోర్టల్లో అప్లోడ్ చేయాలని, ఈ వేసవి కార్యక్రమం మొత్తం విజ్ఞానవంతంగా, ఆనందోత్సాహంగా ఉండాలని, దీనిలో కిశోర బాలికలు పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 513.90 అడుగుల వద్ద ఉంది. ఇది 138.3868 టీఎంసీలకు సమానం. పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు -
సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు సత్తెనపల్లి: విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అసంబద్ద విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ కేంద్రంలో ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ 117 రద్దు చేసి ఉన్నత పాఠశాలలనుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా నేడు అదనంగా 1,2 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలోకి కలపడం మోసం చేయడమేనన్నారు. ప్రపంచ బ్యాంకు ఒత్తిడులకు తలొగ్గి ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను విధ్వంసం చేసే పనులు కొనసాగిస్తుందన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 1 నుంచి 5 తరగతులు ప్రాథమిక పాఠశాలలోను, 6 నుంచి 10 లేక 12 తరగతులు ఉన్నత పాఠశాలల్లో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని, విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ ఉపాధ్యాయులను అదనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసంబద్ధ నిర్ణయాలు కొనసాగిస్తే ఈ నెల 9న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే 14వ తేదీన విజయవాడలో పెద్దఎత్తున మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, కరువు భత్యం 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం తహసీల్దార్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. ఏపీటీఎఫ్ నిరసన ప్రదర్శనకు సంఘీభావంగా ఏపీ ఎన్జీఓ సత్తెనపల్లి యూనిట్ సెక్రటరీ అంబేడ్కర్, ట్రెజరీ అసోసియేషన్ నాయకులు ఇబ్రహీం పాల్గొన్నారు. కార్యాక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాసరావు, తాలూకా పరిధిలోని వివిధ మండలాల ఏపీటీఎఫ్ నాయకులు ధర్మారావు, హఫీజ్, ఐతమ్రాజు, అత్తరున్నీస, తులసి, భావనాఋషి, చంద్రం, పియం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈపీఓఎస్లో ఎరువుల విక్రయాల నమోదు తప్పనిసరి
నగరంపాలెం: డీలర్లు విక్రయించిన ఎరువులను ఎప్పటికప్పుడు రైతుల ఆధార్ ద్వారా ఈపీఓఎస్ (అమ్మకం యంత్రాలు)లో నమోదు చేయాలని కమిషనర్ కార్యాలయ సంయుక్త వ్యవసా య సంచాలకులు వీడీవీ కృపాదాస్ ఆదేశించారు. పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ , కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్లో సోమవారం జిల్లాలోని రిటైల్ ఎరువుల డీలర్లకు అమ్మకం యంత్రాలు ఉచితంగా పంపిణీ చేశాయి. కృపాదాస్ మాట్లాడుతూ ఈపీఓఎస్లో నమోదు కాకపోతే కేంద్రం నిర్వహించే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఏపీలో అధిక ఎరువుల నిల్వలు ఉన్నట్లు చూపుతాయని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి ఎరువులు సకాలంలో పంపిణీకావని చెప్పారు. రిటైల్ డీలర్లు విధిగా ఈపీఓఎస్లో ఎరువుల విక్రయాలు చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు రూ.27 వేలు ఖరీదు చేసే 276 అమ్మకం యంత్రాలను రిటైల్ డీలర్లకు ఉచితంగా అందించాయని తెలిపారు. త్వరలో మరో 400 పంపిణీ చేయనున్నారని ఆయన వెల్లడించారు. 2015లో అందించిన యంత్రాల కంటే ఆధునాతనమైనవని, రైతుసేవలో వాటిని వినియోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏలు తోటకూర శ్రీనివాసరావు, జయదేవ్రాజన్ (ఎరువులు), ఏపీ రాష్ట్ర ఎరువుల డీలర్ల సంఘం అధ్యక్షుడు వి.నాగిరెడ్డి, పీపీఎల్ ప్రతినిధులు పీవీ సుభాష్, షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
నిందితులకు కొమ్ము కాయటం ఘోరం
నరసరావుపేట: శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో కుంభా యోగయ్య షాపులను కూల్చిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి షాపులు కూల్చివేతకు ఉపయోగించిన పొక్లెయిన్ను సీజ్ చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం పల్నాడు జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారుల టీడీపీ అనుకూల చర్యలను నిరసిస్తూ దళిత, గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. కృష్ణ మాట్లాడుతూ గ్రామ శివారు ఎరుకలవాడలో గత నెల 19న ఎరుకల కులస్తులైన కుంభా యోగయ్య చికెన్, కిరాణా షాపులను ఆ గ్రామ టీడీపీ నాయకులు వెంకట్రావు, మురళి, మధుసూదనరావు, రామకృష్ణ, వెంకట హరినరసింహారావులు పొక్లెయిన్తో కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. షాపుల కూల్చివేతను అడ్డుకున్న పులి నాగేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న సమయంలో ఆ దాడి దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీస్తున్న కుంభా సుజాతను కులం పేరుతో మధుసూధనరావు దూషించడమే కాకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఇంతటి దారుణమైన సంఘటన జరిగినా స్థానిక ఎస్ఐ, తహసీల్దార్ మొదలు జిల్లా కలెక్టర్, ఎస్పీ వరకు గ్రామాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వకపోవటం దారుణమన్నారు. అధికారులు అధికార టీడీపీ కూటమి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య శక్తులనుంచి బాధితులకు రక్షణ కల్పించడంతోపాటు రూ.18 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటనపై నిజాయితీ కలిగిన డీఎస్పీతో కేసు విచారణ చేయించి దోషులకు శిక్షలు పడేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా ప్రగతిశీల కార్మిక సమాఖ్య కమిటీ సభ్యుడు కంబాల ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ నాయకుడు ప్రసన్న కుమార్, బీసీ సంఘ నాయకుడు బాదుగున్నల శ్రీనివాసరావు, ఓర్సు శ్రీనివాసరావు, జక్కా బ్రహ్మయ్య, కేఎన్పీఎస్ నాయకుడు చలంచర్ల అంజి పాల్గొన్నారు. గంటావారిపాలెం ఘటనలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి బాధితులకు రూ.18లక్షలు నష్టపరిహారం చెల్లించాలి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన దళిత, గిరిజన ఐక్యవేదిక నాయకులు -
సీహెచ్ఓల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో గత ఎనిమిది రోజులుగా నిరసన తెలియజేస్తున్న సీహెచ్ఓల దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించి వారికి వైఎస్సార్ సీపీ తరఫున సంఘీభావం తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు అనుపమ ద్వారా డిమాండ్ల తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ తరపున విలేజ్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న సీహెచ్ఓలు తమ న్యాయమైన కోరికల సాధన కొరకు సమ్మె చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం తరఫున కనీస స్పందన కూడా లేదని, వీరి న్యాయబద్ధమైన కోరికలు తీర్చమని అడుగుతుంటే, ఈ ప్రభుత్వంలో వినే నాథుడే లేడని అన్నారు. రెండు రోజుల క్రితం వీరి బాధలు చెప్పుకోవడానికి ఆరోగ్యశాఖ మంత్రిని కలిస్తే మీకు ఏం చేయమని, మీకు దిక్కున చోట చెప్పుకోండని సమాధానం చెప్పటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వీరందరూ బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తిచేసి సెలక్షన్ ప్యానల్ కమిటీ ద్వారా రిక్రూట్ అయ్యారని, వీరిని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన అందరిని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకుడు షేక్ కరీముల్లా, సామాజిక విశ్లేషకులు ఈదర గోపీచంద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ విజేత వైజాగ్
చీరాల రూరల్: యువకులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచి సన్మార్గంలో నడవాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కావూరి పవన్కుమార్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంతో శ్రమకోర్చి జాతీయస్థాయి పోటీలను తలపించే విధంగా యూ ట్యూబ్లో లైవ్ ఏర్పాటు చేశారు. పోటీలో అన్ని విభాగాల్లో రాణించి విశాఖపట్టణం శ్రీధర్ ఫుట్బాల్ జట్టు క్రీడాకారులు విజేతగా నిలిచారు. రూ.50 వేల నగదు బహుమతితో పాటు భారీ కప్ను ఎమ్మెల్యే చేతులు మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. ద్వితీయ స్థానంలో హుబ్లీ జట్టు నిలిచి రూ.30 వేల నగదు బహుమతి అందుకున్నారు. తృతీయ స్థానంలో విజయవాడ జట్టు నిలిచి రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు. ఉత్కంఠగా ఫైనల్ ఫోరు ఫైనల్లో విశాఖపట్టణం, హుబ్లీ జట్టు తలపడ్డాయి. మొదటి ఫస్ట్ హాఫ్లో విశాఖ జట్టు రెండు గోల్స్ చేసింది. అనంతరం సెకండాఫ్లో హుబ్లీ జట్టు పుంజుకొని రెండు గోల్స్ సాధించింది. దీంతో నిర్ణీత సమయానికి ఇరుజట్లు క్రీడాకారులు పోటాపోటీగా చిరుతపులుల్లా తలపడి ఆటను సమంగా ముగించాయి. అనంతరం అంపైర్లు ఇరుజట్లకు పెనాల్టీ షూట్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇరు జట్లు సమంగా నిలిచాయి. అనంతరం మరోసారి అవకాశం ఇవ్వగా వైజాగ్ జట్టు అధిక గోల్స్ సాధించి విజేతగా నిలిచింది. పోటీలలో బెస్ట్గోల్ కీపర్తోపాటు అనేక అంశాలలో సత్తాచాటిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పోటీల నిర్వహకులు నూతలపాటి విజయకుమార్ (దాసు) నూతలపాటి నరేష్, బొనిగల ప్రేమయ్య, నాలుగు జిల్లాల కోఆర్డినేటర్ దేవదాసు, పంబా నాగయ్య, మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, క్రీడాకారులు, అంపైర్లు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ద్వితీయ స్థానంలో హుబ్లీ జట్టు విజేతలకు నగదు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే కొండయ్య -
హిందూ ధర్మం గురించి తెలియజేయాలి
అమర్తలూరు(వేమూరు): సాహిత్య ప్రాజెక్టు హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలియజేయాలని దాస సాహిత్య ప్రాజెక్టు అధ్యక్షులు శ్రీమాన్ గడ్డిపాటి శ్రీనివాసరావు అన్నారు. అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు హిందూ ధర్మ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన గరువుపాలెంలో హనుమాన్ శోభాయాత్ర, సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీన ప్రతి గ్రామంలో దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించాలని తెలిపారు. హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని ధర్మ రక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, పొన్నపల్లి సత్యనారాయణ, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, తమ్మన సాంబశివరావు, రామిశెట్టి నరసింహారావు, దాస సాహిత్య భజన మండల సభ్యులు పాల్గొన్నారు. బేసిక్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి రేపల్లె: బేసిక్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విధానాన్ని అన్ని పాఠశాలలో ఒకే విధంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏపీటీఎఫ్ దశల వారి ఉద్యమాలకు ప్రణాళిక రచించిందని అన్నారు. సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, 12వ పీఆర్సీని ప్రకటించి పెండింగ్లో ఉన్న ఐఆర్, డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు రాజారత్నం, వై.ఆంజనేయ ప్రసాద్, తేలప్రోలు శ్రీనివాసరావు, వై. చెన్నకేశవులు, సీహెచ్.శ్రీనివాస్, ఎం.రాంబాబు. పి.లక్ష్మీనారాయణ, కుర్రా కిరణ్, డి మల్లికార్జునరావు, సత్యనారాయణ, యాకోబు తదితరులు పాల్గొన్నారు. -
భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతసేవ, స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన జరిపారు. స్వామివారు పెండ్లికుమారుని అలంకరణలో దర్శనమిచ్చారు. సాయంత్రం నాదస్వర కచేరీ, వేద పఠనం, అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహం, రుత్విగ్వరణం, అంకురారోపణం, హోమం, బలిహరణం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పర్యవేక్షించారు. భగీరథ మహర్షికి ఘననివాళిగుంటూరు వెస్ట్: భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని భగీరథ మహర్షి కీర్తిని వివరించారు. నాయీ బ్రాహ్మణ సంక్షేమ, డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్, బీసీ సంక్షేమ శాఖాధికారి కె.మయూరి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయస్థాయి షూటింగ్లో ముఖేష్కు రెండు స్వర్ణాలు గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి రెండు బంగారు పతకాలు సాధించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతున్న 23వ కుమార్ సరేంద్ర సింగ్ మెమోరియల్ నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్లో ఆదివారం జరిగిన పోటీలో 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. ఇదే పోటీల్లో గత శుక్రవారం కూడా 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్లోనూ ముఖేష్ బంగారు పతకం సాధించాడు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తడిసి ముద్దయ్యారు.. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. ఘాట్రోడ్డు మూసివేత.. ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. -
నీట్గా పరీక్ష
● పల్నాడు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ● 764 మందికిగాను 745 మంది హాజరు ● జేఎన్టీయూ–ఎన్ కేంద్రంలో 600 మందికిగాను 591 మంది హాజరు ● కేంద్రీయ విద్యాలయం (ఇర్లపాడు) లో 164 మందికి గాను 154మంది హాజరు ● దాహార్తితో అల్లాడిన తల్లిదండ్రులు నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సులు, దంత వైద్య విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన నీట్–2025 ప్రవేశ పరీక్ష పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపే జేఎన్టీయూ–ఎన్ కళాశాల, నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ పరిధిలోని కేంద్రియ విద్యాలయంలో నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ–ఎన్ కళాశాలలో నమోదైన 600 మంది విద్యార్థులకుగాను 591మంది హాజరుకాగా, కేంద్రియ విద్యాలయంలో 164 మందికి గాను 154 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించగా విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాలలోకి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అనుమతించారు. కేంద్రం వద్ద హాజరైన విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష హాలుకు అనుమతించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, బూట్లు, ఫోన్లు అనుమతించలేదు. జేఎన్టీయూ–ఎన్ పరీక్ష కేంద్రం నరసరావుపేట–వినుకొండ ప్రధాన రహదారికి దాదాపు రెండు కిలోమీటర్లు దూరం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం సైతం దూరంగా ఉండటంతో మండుటెండలో విద్యార్థులు విలవిలలాడారు. 600 మంది విద్యార్థులు హాజరవుతున్న కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చిన్న టెంట్ విమర్శలకు తావిచ్చింది. జేఎన్టీయూ–ఎన్ కళాశాల బహిరంగ ప్రదేశంలో ఉండటంతో ఒకవైపు వేసవి ఎండ తీవ్రత, మరోవైపు వడగాలులతో ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మంచినీటి వసతి కల్పించక పోవటం పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగు మంచినీటి కుండలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవటంతో తల్లిదండ్రులు దాహార్తితో ఇబ్బంది పడ్డారు. ప్రైవేటు కళాశాల యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేయటంతో కొంత వరకు సేదదీరారు. తాగునీటి కోసం కనీసం 5 కిలోమీటర్లు వెళ్లాల్సి రావటంతో ఇబ్బందులు పడ్డారు. నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగియటం పట్ల సిటీ కోఆర్డినేటర్ నీరజ్కుమార్ శ్రీవాత్సవ ఆనందం వ్యక్తం చేసారు. పరీక్ష నిర్వహణలో సహకరించిన రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ ఇతర శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
వేకువజామున మృత్యుఘోష
● జాతీయ రహదారిపై మూడు ప్రమాదాలు ● నిమిషాల వ్యవధిలో ఐదుగురు దుర్మరణం ● మరో నలుగురికి తీవ్ర గాయాలు ● మృతులు నెల్లూరు, గుంటూరు జిల్లావాసులు ● డ్రైవర్ నిద్రమత్తుకు బలైన బాబాయి– అబ్బాయి ● మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ తల్లీకొడుకుల మృతి ● సురక్షితంగా బయటపడిన రెండేళ్ల చిన్నారి ఒంగోలు టౌన్: జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాలతో నగరం ఉలిక్కిపడింది. వెంట వెంటనే మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించడం... ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నలుగురికి గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలు ఫ్లై ఓవర్ దాటిన తరువాత కొద్ది దూరంలో టైరు పంక్చర్ కావడంతో ఒక లారీ ఆగింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్, కారు, ఒక మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దానికి 500 మీటర్ల దూరంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ... పెదకాకానికి చెందిన కొప్పురావూరు గ్రామానికి తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు గుంటూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అమరావతి రోడ్డులో కుటుంబంతో ఉంటుస్తున్నారు. ఆయన తన సమీప బంధువైన బూచి వినయ్ కుటుంబంతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి గుంటూరులో అర్ధరాత్రి రెండు గంటల తరువాత తిరుపతికి బయలుదేరారు. తెల్లవారుజామున 4.50 గంటలకు జాతీయ రహదారిపై ఒంగోలు చేరుకున్నారు. బైపాస్ నుంచి ఫ్లై ఓవర్ దిగిన తరువాత కొద్ది దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండడంతో కారు ఆపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్ వారిని ఢీ కొట్టింది. ముందున్న లారీ, వెనక ఉన్న కంటైనర్ల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తిరుమలశెట్టి పావని (35), ఆమె కుమారుడు చంద్ర కౌశిక్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. పావని భర్త తిరుమలశెట్టి వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం షాక్లో ఉన్న ఆయనకు నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. భర్త ఒంగోలులో...భార్య గుంటూరులో.. ఈ ప్రమాదంలో బూచి వినయ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉంది. తలకు తీవ్రంగా గాయాలైన నవీన్ కోమాలోకి వెళ్లిపోయారు. ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్ భార్య బూచి లావణ్యకు వెన్నెముకకు గాయం కావడంతోపాటు కాలు విరిగింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్ స్మిత్ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మానాన్నలు కనిపించకపోవడంతో ఆ చిన్నారి రోదిస్తుండడం స్థానికులను కలిచివేసింది. గమ్యం చేరకుండానే.. నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (20) వరసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. కోడిగుడ్లు తీసుకొని తెలంగాణలోని భువనగిరి నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే గమ్యం చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఒంగోలు–నెల్లూరు జాతీయ రహదారి మీద కొప్పోలు ఫ్లై ఓవర్ దాటగానే కొద్ది దూరం ప్రయాణించారో లేదో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. కళ్లు తెరచి చూసే లోపలే పెద్ద శబ్దం వచ్చింది. కోడిగుడ్లన్నీ ఎగిరి రోడ్డు మీద పడ్డాయి. లారీ ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. లారీ డ్రైవర్ రవణయ్య అలియాస్ షేక్ రహీం (60) సహా బాబాయ్, అబ్బాయ్ దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరి తల ఛిద్రమైంది. నిద్రమత్తే ప్రాణాలు తీసిందా...? రాత్రంతా ప్రయాణం చేయడంతో తెల్లవారుజామున నిద్ర ముంచుకొని రావడంతోనే కోడిగుడ్ల లోడు లారీ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారును ఢీ కొన్న భారీ కంటైనర్ పరిస్థితి కూడా ఇదే. నాగాలాండ్ నుంచి రోజుల తరబడి ప్రయాణం చేయడం వలన డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగి ఉన్నా వేగంగా దూసుకొచ్చి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. వేకువజామున ఒంగోలులో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ దారుణ ఘటనల్లో ఐదుగురు విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలం చూపరులకు ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంది. చెల్లాచెదురైన లారీ, నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలతో భయకంపితంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు, బాబాయ్– అబ్బాయిలు విగతజీవులయ్యారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ ప్రమాదాల సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీగా వాహనాలు నిలిచిపోయివడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పర్యవేక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అతివేగం, నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మిగతా వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
తలోదారి.. అభివృద్ధి గోదారి
నరసరావుపేటలో కూటమి తీరు సాక్షి, నరసరావుపేట: రెండు దశాబ్దాల తరువాత పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చదలవాడ అరవింద్బాబు గెలుపు వెనుక టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తల సమష్టి కృషి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన్న నడిపిస్తామని హామీలిచ్చారు. ఏయే ప్రాజెక్టులు చేపట్టబోయేది ఇంటింటికి తిరిగి చెప్పారు. పేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించారు. తీరా ఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి చేయకపోగా గత వైఎస్సార్ సీపీలో పట్టాలెక్కిన పనులను సైతం నిలిపివేశారు. మరి గెలిచిన కూటమి పార్టీల నాయకులు ఏం చేస్తున్నారన్న నరసరావుపేటలో ఎవర్ని అడిగినా కుమ్ములాటల్లో బిజీగా ఉన్నారని ఠక్కున చెబుతారు. మూడు ముక్కలాట... తెలుగుదేశం పార్టీలో సాధారణ ఎన్నికలకు ముందే గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం గ్రూపుల వారిగా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. ఎన్నికలు పూర్తయినా పేట టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కోడెల శివరాం వర్గాలు విడిపోయాయి. అరవిందబాబుకు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా ఎంపీ లావు చివరకు ప్రయత్నం చేశాడని, ఆయనతో కలసి పనిచేసేది లేదని అరవిందబాబు వర్గీయులు తేల్చిచెబుతున్నారు. మరోవైపు టీడీపీలో గట్టి పట్టున్న ఓ సామాజిక వర్గాన్ని అరవిందబాబు పట్టించుకోవడంలేదన్న ఆవేదనతో వారు ఎంపీ లావు వెంట నడుస్తున్నారు. చదలవాడను ఎమ్మెల్యేగా అంగీకరించడానికి సైతం వారిలో కొందరికి మనసొప్పడంలేదన్న వాదన వినిపిస్తోంది. ● ఇది ఇలా ఉండగా నరసరావుపేట గడ్డ కోడెల అడ్డా అంటూ కోడెల శివరాం వర్గీయులు గత కొంత కాలంగా స్పీడ్ పెంచారు. కోడెల నియోజకవర్గానికి చేసిన మంచి పనులను సోషల్మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో కోడెల విగ్రహాన్ని ప్రారంభించి పట్టునిలుపుకొనే ప్రయత్నం చేశారు. రానున్న ఎన్నికల్లో కోడెల శివరామ్ కే ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కోడెల అనుచరుల హవా కొనసాగిస్తున్నారు. ప్రకాష్నగర్ అద్దెభవనంలో కొనసాగుతున్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అక్కడి నుంచి మార్చాలని కోడెల శివరాం పట్టుబడుతుండగా, ఎమ్యెల్యే అరవిందబాబు అడ్డుకుంటున్నాడు. ఈవ్యవహారంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా పోరు నడుస్తోంది. ● మరోవైపు ఎన్నికల ముందు టికెట్ ఆశించి భంగపడ్డ నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వరరావులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం వారికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టకపోవడం, అరవిందబాబు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదన్న కారణంతో వారు స్తబ్ధుగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, కోడెల శివరాం వర్గాలుగా విడిపోయిన టీడీపీ క్యాడర్ స్తబ్దుగా కడియాల, నల్లపాటి వర్గీయులు ఎంపీ వెంట నడుస్తున్న జనసేన నేత జిలాని జిలానీకి వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గ నేతలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చదలవాడ కూటమి నేతల తీరుతో జిల్లా కేంద్రంలో కుంటుపడిన అభివృద్ధి ఏడాది కావొస్తున్నా చెప్పుకోదగ్గ ఒక్క పనీ చేయని వైనం చిత్రాలయ ఆర్యూబీ, మల్లమ్మ సెంటర్ ఫ్లై ఓవర్ ఊసే శూన్యం అభివృద్ధిపై ప్రభావంరెండుగా విడిపోయిన జనసేన క్యాడర్ నరసరావుపేట ఎమ్మెల్యే సీటు తమదేనని భావించిన జనసేన పార్టీ ఎన్నికల తరువాత రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సయ్యద్ జిలానీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గంగా ముద్రపడి, ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అరవిందబాబుతో అంటీముట్టనట్టు ఉంటున్నాడు. దీంతో జనసేనలో క్రియాశీలకంగా ఉండే ఓ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడన్న ప్రచారం నడుస్తోంది. ఇలా జనసేన నేతలు రెండుగా విడిపోయి ఒకరిమీద ఒకరు అధినేతకు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నామినేటెడ్ పదవీ ఒక్కటీ దక్కలేదన్న ఆవేదన సగటు జనసేన కార్యకర్తలలో ఉంది. మరోవైపు తాము ప్రభుత్వంలో భాగస్వామ్యులైనా తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్న బాధ బీజేపీ నేతల్లో ఉంది.కూటమి నేతల అంతర్గత విభేదాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పల్నాడుకే పెద్దాసుపత్రిగా పేరొందిన ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సరైన వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. సరిపడా మందులు అందుబాటులో ఉండటం లేదు. పట్టణ ప్రజలను వేదిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం మల్లమ్మ సెంటర్లో ఫ్లై ఓవర్, చిత్రాలయ టాకీస్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జేఎన్టీయూ భవనాల పూర్తి, ఆటోనగర్ ఏర్పాటు, కోటప్పకొండ అభివృద్ధి వంటి పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం మారిన తరువాత వాటిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేదు. ప్రజాసమస్యలను పూర్తిగా గాలికొదిలేసి న కూటమి నేతలు ఆధిపత్య పోరు నడుపుతున్నా రు. ఇప్పటికై నా కూటమి నేతలు అంతర్గత విబేధాలు పక్కనపెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. -
ఘనంగా నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల
పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి దాచేపల్లి: మండలంలోని ముత్యాలంపాడులో శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం కనులపండువలా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా కుంకుమబండ్లు కట్టి గ్రామంలో ఊరేగించారు. మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక పూజలు.. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి నీలంపాటి అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కాసు వెంట జెడ్పీటీసీ మూలగొండ్ల కృష్ణకుమారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గొట్టిముక్కల పెదహనిమిరెడ్డి, ఎంపీపీ కందుల జాను, సర్పంచ్ నెమలికొండ వెంకటచారి, ఎంపీటీసీ పొస వెంకటనాగయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోట కృష్ణతో పాటుగా గ్రామ నాయకులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లోనే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వరసగా చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కారణంగా వేదికలో మార్పు జరిగిందన్నారు. ఐదో తేదీ సోమవారం మాత్రం యథావిధిగా కలెక్టరేట్ వేదికగా పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. -
రణక్షేత్రంలో వీరాచారుల సందడి
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో ఆదివారం వీరాచారులు సందడి చేశారు. వదిలి పెట్టిన వీరాచారాన్ని మళ్లీ పునఃప్రతిష్ట చేసుకునే క్రతువులు రణక్షేత్రంలో జరిగాయి. వీరాచారులతో పాటు వారి బంధువులు వందలాదిగా తరలివచ్చి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరుల గుడి నాగులేరు ఒడ్డున వీరుల ఆయుధాలకు పూజ కట్టుకుని అక్కడ నుంచి చెన్నకేశవస్వామి, అంకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీరాచారులు భారీగా తరలిరావడంతో రణక్షేత్రంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. వీరుల గుడి ఆవరణ భక్తులతో నిండిపోయింది. వీరాచారుల ఊరేగింపులో బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం పాల్గొనడం విశేషం. పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వీరుల గుడి పూజారులు వివిధ రకాల క్రతువులు నిర్వహించారు. కారెంపూడికి చెందిన కిల్లా స్వాములు కుమారులు, మనువళ్లు వదలిపెట్టిన వీరాచారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో విశ్రాంత డీటీ యడ్ల రామకృష్ణారావు, చెన్నకేశవస్వామి ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కిల్లా చినకోటేశ్వరరావు, కిల్లా వంశస్తులు పాల్గొన్నారు. -
ముగిసిన ప్రతిష్టా మహోత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మంహంకాళీ అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణ నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం గం 5:30 నిమిషాలకు నిత్య పూజావిధులు, యంత్రపూజలు, పీఠన్యాస, గర్తన్యాస, రత్నవ్యాసాదులు, 7:49 నిమిషాలకు యంత్రబింబ, ధ్వజస్తంభ ప్రతిష్ట, తదితర కార్యక్రమాలు జరిగాయి. ప్రతిష్టానంతరం అన్నసంతర్పణ జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి నారా లోకేష్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రధాన దాతలు దొంతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వాసంతి, శ్రీప్రద్ విశ్వత్ రెడ్డి, ముఖ మండపం, విమాన గోపురం, రాజ గోపురం, నూతన ధ్వజస్తంభం పరివాహక దేవతలను బహూకరించారు. వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ దేవభక్తుని రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి మొత్తం రూ.4 కోట్లు అయ్యిందని, దానిలో ఎండోమెంట్ వారు రూ.కోటి, దాతలు రూ.3కోట్లు సహాయం చేశారని తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్ కుమార్ ఏర్పాట్లు పరిశీలించారు. తహసీల్దార్ ఐ.సునీత, ఎంపీడీఓ ఎ.శ్రీనివాసరావు, ఏపీఎం సురేష్ కుమార్ అలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ వెంకట రవికుమార్, పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు. -
పల్టీ కొట్టిన టిప్పర్.. తప్పిన పెను ప్రమాదం
కారంచేడు: టిప్పర్ లారీ కొమ్మమూరు కాలువ అంచుకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పింది. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారి 167/ఏ కి గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆదివారం బోల్తా కొట్టింది. కారంచేడు నుంచి కుంకలమర్రు వైపు వెళ్లే రహదారి కొమ్మమూరు కాలువ కట్టమీదగా ఉంటుంది. ఈ కట్టమీద ప్రయాణించే సమయంలో ఎదురుగా మరో వాహనం రావడంతో రోడ్డు మార్జిన్ దిగిన టిప్పర్ లారీ అప్పటికే వర్ష కురిసి ఉండటంతో మార్జిన్ నానిపోయి మెత్తగా తయారైంది. దీంతో టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్హెచ్ఏఐకి చెందిన పొక్లెయిన్ ద్వారా వాహనాన్ని తీయించారు. -
పాత గురజాలమ్మ గుడిని పునరుద్ధరించాలి
గురజాల: పల్నాడు జిల్లా గురజాల పట్టణం శివారులో పులిపాడు వెళ్లే దారిలో గల వెయ్యేళ్ల నాటి శిథిల పాత గురజాలమ్మ గుడిని పునరుద్ధరించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానికులైన కందిమల్ల శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం గురజాలమ్మ ఆలయ శిథిలాలను పరిశీలించారు. ఆలయం పునాది వరకు మాత్రమే మిగిలి ఉందని, మహా మండపం ముందు మెట్లకు అందమైన ఏనుగు శిల్పాలు, అర్ధమండపం ముందు ప్రాణాలర్పించుకుంటున్న పల్నాటి వీరుడు, గర్భాలయంలో ఆనవాళ్లు కోల్పోతున్న గురజాలమ్మ విగ్రహం ఆలయ చరిత్రకు అద్దం పడుతున్నాయని చెప్పారు. స్థానికులు శిథిలాలను పదిల పరిచి కాపాడుకోవాలని శివనాగిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో కందిమల్ల శ్రీనివాసరావు, మద్దినేని వెంకటేశ్వర్లు, ఆత్మకూరి వెంకట పుల్లారావు, శిల్పి సురటి వెంకటేష్ తదతరులు పాల్గొన్నారు. -
శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో కార్డన్ సెర్చ్
వెల్దుర్తి: మండలంలోని శిరిగిరిపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం గురజాల ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలనీలో టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన ఒకే సామాజిక వర్గం వారు రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగినట్లు గుర్తుచేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గురజాల డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో ఉదయం 5గంటల నుంచే కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేశామన్నారు. ఇళ్లల్లోని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గడ్డపారలు, గొడ్డళ్ళు, నీళ్లల్లో కారం కలిపి నింపిన బాటిళ్లు, గోతాల్లో నిల్వ ఉంచిన రాళ్లను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. ధ్రువీకరణ పత్రాలు లేని కత్తులు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లు, కర్రలు, బరిశెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలన్నారు. చిన్న విషయాలకు కూడా ఘర్షణలకు దిగి కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయకుండా పనులు చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఐదుగురు సీఐలు, 11 మంది ఎస్ఐలు, వంద మందికిపైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పలు మారణాఽయుధాలు స్వాధీనం -
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి జగన్నాథం అన్నారు. గుంటూరు కొత్తపేటలోని కౌలురైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గుర్తింపు కార్డులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మే 6వ తేదీన గుంటూరు మల్లయ్య లింగం భవన్లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కౌలు రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం -
ఆగని రేషన్ బియ్యం దందా
రేషన్ బియ్యంతో ఉన్న లారీని గ్రామస్తులు పట్టుకున్నా అక్రమ రవాణా కట్టడి కాని ఉదంతమిది. మండలంలో పేటసన్నెగండ్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్ బియ్యం లారీని గ్రామ యువకులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అధికారులకు సమాచారం అందించడానికి యత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వాహనం సహా డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారెంపూడి: రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్ఛగా బియ్యం తరలిస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పేటసన్నెగండ్ల గ్రామంలో చాలా సేపు లారీని అక్కడి నుంచి పోకుండా అడ్డుకున్నారు. డ్రైవర్ లారీని వారిపై నుంచి పోనిచ్చే యత్నం చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు లారీ అద్దాలు పగులగొట్టి రేషన్ బియ్యానికి నిప్పు పెట్టారు. రేషన్ బస్తాలు కింద పడేశారు. అయినా ఫలితం లేదు. కిందపడేసిన రేషన్ బియ్యాన్ని లారీలో వేసుకుని డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు ఎంత రిస్క్ తీసుకున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేని అచేతన స్థితిలో అంతా ఉండిపోయారు. ఆగని ఈ అక్రమం వ్యవస్థలు పతనం అవుతున్న తీరుకు అద్దం పడుతోంది. నాయకుల అండతోనే... ఈ బియ్యం మండలానికి చెందినవి కావని, ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని గ్రామాలవారీగా నాయకులు పంచుకున్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యమే. గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించి ప్రధాన వ్యాపారులు ఆ బియ్యాన్ని సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం ఇవ్వకుండానే... కార్డుదారులకు బియ్యానికి బదులు కిలోకు రూ.10 వంతున ఇచ్చి బియ్యాన్ని సేకరిస్తున్నారని తెలుస్తోంది. కార్డుదారులు బియ్యం కోసం ఎదురు చూస్తుంటే వారి ఇళ్లకు రేషన్ బండ్లు వెళ్లకపోవడంతో ఎటూ బియ్యం ఇవ్వరేమోననే భయంతో, రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు అవుతుందనే భయంతో డీలర్ల వద్దకు వెళ్లి వేలిముద్ర వేసి వారిచ్చిన డబ్బు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పేట సన్నెగండ్ల రేషన్ బియ్యం ఉందంతం వెలుగుచూసింది. బియ్యం పంపిణీ ప్రారంభమైన రెండో రోజే ఇలా లారీ బియ్యం తరలిపోతుండడం చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు తహసీల్దార్ నివేదిక ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ కలెక్టర్కు నివేదించారు. పేటసన్నెగండ్ల గ్రామంలో గత శుక్రవారం రాత్రి ఏపీ39యూఎన్7527 నంబరు లారీలో రేషన్ బియ్యంతో గ్రామంలోకి వస్తుండగా కొంతమంది యువకులు అడ్డుకున్నారని తెలిపారు. లారీ డ్రైవర్ వాహనాన్ని వారి మీదుగా తీసుకెళ్లడానికి యత్నించగా గమనించిన గ్రామస్తులు లారీపై దాడి చేయగా లారీ అద్దాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. బియ్యానికి నిప్పు పెట్టి రెండు బస్తాలు కిందపడేయం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ ఆ బస్తాలను లారీలో వేసుకుని అక్కడి నుంచి లారీతో పరారయ్యాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్కు వీఆర్వో ఫిర్యాదు చేశారని తెలిపారు. బియ్యం తరలిస్తున్న లారీని అడ్డుకున్న గ్రామస్తులు యంత్రాంగం నిర్లక్ష్యంతో యథేచ్ఛగా అక్రమ రవాణా -
ప్రజల ఆస్తులకు రక్షణగా ఎల్హెచ్ఎంఎస్
నరసరావుపేట టౌన్: ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ఉపయోగపడుతుందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. వరుస చోరీలపై ‘తాళం పడిందా.. ఇల్లు గుల్ల’ అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనిపై స్పందిచిన ఎస్పీ.. జిల్లాలోని పోలీస్ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఎల్హెచ్ఎంఎస్ మొబైల్ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వేసవి సెలవుల్లో ఇతర ప్రదేశాలకు వెళ్లే వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దొంగతనాల నియంత్రణకు ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ సౌకర్యం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రజలు ఇల్లు విడిచి బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించాలన్నారు. వారి ఇళ్లకు పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు. వినియోగించుకోండిలా.. అందరూ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచే తమ పేరు, ఫోను నంబరు, లొకేషన్ వంటి ఇతర వివరాలు పొందుపరిచి రిక్వెస్ట్ పంపాలన్నారు. మొబైల్ నంబరుకు ఒక రిజిస్ట్రేషను నంబరు వస్తుందన్నారు. ఈ నంబరునే యూజర్ ఐడీగా పొందవచ్చునని పేర్కొన్నారు. స్టేషన్ నుంచి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారన్నారు. సీసీ కెమెరాలతో ఈ యాప్ అనుసంధానం కావడం వలన దొంగతనాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేశించిన వెంటనే పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం చేరవేస్తూ అలారం మోగుతుందని చెప్పారు. దొంగతనాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. వరుస చోరీలపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు దొంగతనాల నివారణపై అధికారులకు ఆదేశాలు -
హైవేపై కంటైనర్ బీభత్సం
యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం శివారులో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చైన్నె నుంచి గుంటూరు వైపు వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ అదుపుతప్పి నేరుగా హైవే సెంట్రల్ డివైడర్పై ఎక్కింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఇనుప స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం ముందు భాగంతోపాటు స్తంభానికి బిగించిన సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీ క్రేన్లతో ఇనుప స్తంభాలను తొలగించారు. రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న సమయం కావడం, వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ అలసట, నిద్ర మత్తే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించినట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. వాహనంతోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే దుర్ఘటన -
హెడ్ కానిస్టేబుల్ మృతి
యద్దనపూడి: రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన యద్దనపూడి మండలంలోని గన్నవరం– మార్టూరు దండు దారి మధ్య శనివారం మధ్యాహ్నం జరిగింది. ఎస్సై రత్నకుమారి, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన భట్టు రవికృష్ణ (38) అసోంలోని 30వ బెటాలియన్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 15 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామం పూనూరు వచ్చాడు. శనివారం మధ్నాహ్నం 12 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై మార్టూరు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా ద్విచక్ర వాహనం రోడ్డు కుడి వైపున పడి ఉండటం గమనార్హం. ఏదైనా భారీ వాహనం వేగంగా రావటంతో దానిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా
నరసరావుపేటఈస్ట్: కనీస వేతనం రూ.35వేలు అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు కోరారు. అరండల్పేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ బెంగుళూరు, గోవాలో నిర్వహించిన ఏఐటీయూసీ సదస్సులలో కనీస వేతనం రూ.35వేలుగా తీర్మానించి సాధించే దిశగా ఉద్యమాలకు సిద్ధపడుతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 5వ తేదీన కారల్మార్క్స్ జయంతిని పురస్కరించుకొని జాతీయ కోర్కెల దినంగా ప్రకటించి ఉద్యమానికి కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. కనీస వేతన పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సమీకరించి ఉద్యమించనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్ పాల్గొన్నారు. -
అనధికారికంగా నడిచే పడవల సీజ్
అచ్చంపేట: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిపై నడుపుతున్న పడవను విజిలెన్స్ సీఐ పాలేరు శివాజీ, విజిలెన్స్ ఎమ్మార్వో లక్ష్మీమాధవి శనివారం సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు విలేకరులతో మాట్లాడారు. మండలంలోని గింజుపల్లి నుంచి కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన వేదాద్రికి పడవ నడుపుకునేందుకు ఈనెల 2న గుంటూరు జిల్లా పరిషత్ హాలులో బహిరంగ వేలం నిర్వహించినట్లు తెలిపారు. అచ్చంపేటకు చెందిన రాయిడి శ్రీనివాసరావు రూ.14లక్షలకు హక్కు పొందాడన్నారు. పాట సొమ్ములో రూ.1.32లక్షలు మాత్రమే చెల్లించి ఇంకా చెల్లించాల్సిన సొమ్ము రూ.12.68లక్షలు చెల్లించకుండా అధికారుల కళ్లు కప్పి నదిపై పడవ నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పడవను సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి సొమ్ము చెల్లించిన తర్వాత మాత్రమే పడవ నడుపుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పడవ నడిపితే సహించేది లేదని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో అచ్చంపేట పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బొల్లేపల్లి సత్యంరాజు, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: మండల పరిధిలోని దిడుగు గ్రామ ఇసుక రీచ్ నుండి కృష్ణాజిల్లా ఏటూరు వరకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను రవాణా చేస్తున్న పడవను శనివారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. దిడుగు ఇసుకరీచ్లో పడవను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ నేతృత్వంలో ఎంపీడీవో పార్వతి, ఎస్ఐ రాజశేఖర్, గ్రామపంచాయతీ సిబ్బంది సీజ్ చేశారు. ఎంపీడీవో పార్వతి మాట్లాడుతూ గత నెల 2వ తేదీన జిల్లా పరిషతఖ కార్యాలయం గుంటూరులో రేవులో పడవ నడుపుకొనుటకు వేలం నిర్వహించగా అందులో దిడుగు గ్రామానికి చెందిన మంచినేని హరనాథ్ రూ.50,01,116 వేలంపాటను దక్కించుకున్నారు. రూ.2,32000 చెల్లించి అప్పటి నుండి మిగిలిన సొమ్మును చెల్లించకుండా నోటీసులకు స్పందించకుండా ప్రయాణికులను రవాణా చేస్తున్నాడని గుర్తించామమన్నారు. పడవ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, సరంగు లైసెన్స్ మొదలగు పత్రాలు లేకుండా అక్రమంగా పడవ నడుపుతున్నందుకు సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన పడవను అమరావతి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని షిపార్సు చేశామని తెలిపారు. -
లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్: లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గంగవరం గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీరామమూర్తి(39) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పదిహేళ్ల నుంచి భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్లోనే నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు రావడంతో శ్రీరామమూర్తి భార్య ప్రశాంతి పిల్లలను తీసుకొని వారం కిందట తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. దివీస్ పరిశ్రమలోనే పనిచేస్తూ చౌటుప్పల్ రత్నానగర్కాలనీలో నివాసముంటున్న తన మిత్రుడు అమర్నేని రమేష్ ఇంటికి శుక్రవారం రాత్రి శ్రీరామమూర్తి వెళ్లా డు. అక్కడ భోజనం చేసిన తర్వాత నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగేందుకు లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ రాక ముందే వచ్చిందని భావించిన బలవంతంగా డోర్ తెరిచి లిఫ్ట్లో ఎక్కేందుకు యత్నించి గుంతలో పడిపోయాడు. భారీ శబ్దం రావడంతో రమేష్ బయటకు వచ్చి గమనించగా తీవ్రగాయాలతో శ్రీరామమూర్తి కన్పించాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వైవీతో పీఆర్కే, అంబటి భేటీ
మాచర్ల: రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి మాచర్ల వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) క్యాంపు కార్యాలయంలో పీఆర్కేతో భేటీ అయ్యారు. భేటీలో గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్తను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్కే అతిథులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఆశాలకు యూనిఫాం చీరెలు పంపిణీ కార్యాలయంలో పంపిణీ ప్రారంభించిన డీఎంహెచ్వో డాక్టర్ రవి నరసరావుపేట: జిల్లాలోని ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి యూనిఫాం చీరల పంపిణీ ప్రారంభించారు. శనివారం డీఎంహెచ్వో కార్యాలయంలో కొంతమంది ఆశాలకు చీరెలు అందజేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలుపుటకు తమ వంతు కృషి అందజేయాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమునైజేషన్ అధికారి డాక్టర్ బి గీతాంజలి, డీపీహెచ్ఎన్ఓ సురేఖ, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. ఆర్మీ ఉద్యోగి మృతి అమర్తలూరు(వేమూరు): అమర్తలూరుకు చెందిన ఆర్మీ ఉద్యోగి నార్ల నరేష్(34) ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. నరేష్ పంజాబ్లోని పటాన్ కోటలో పని చేస్తున్నాడు. శశుక్రవారం జరిగిన ప్రమాదంలో అతను మృతి చెందినట్లు అమర్తలూరు ఎస్ఐ జానకి అమర్వర్దన్ శనివారం తెలిపారు. భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరేష్ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం అంత్యక్రియలు గ్రామంలో నిర్వహిస్తారని తెలిపారు. -
మార్టూరు హైవే పై తప్పిన ప్రమాదం
ధ్వంసమైన రెండు కార్లు మార్టూరు: నిత్యం రద్దీగా ఉండే మార్టూరు జాతీయ రహదారిపై స్థానిక పెట్రోలు బంకు ఎదుట శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన మాధవీ లత, శ్రీనివాసరావు దంపతులు తమ కారులో జె. పంగులూరు మండలం రామకూరు గ్రామానికి వెళ్లడం కోసం బొల్లాపల్లి టోల్గేట్ వైపు నుంచి మార్టూరు వస్తున్నారు. ఇదే మార్గంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు ఓ కియా కారు వీరి వెనుకనే వేగంగా వస్తుంది. శ్రీనివాసరావు తన కారును మార్టూరు సర్వీస్ రోడ్డులోపైకి వెళ్లటం కోసం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో మలుపు వైపు తిప్పసాగాడు. ఆ వెనుకనే వేగంగా వస్తున్న కియా కారు డ్రైవరు ఈ పరిణామాన్ని ఊహించక ముందున్న కారును బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలోకి వెళ్లి ఆగిపోయాడు. ప్రమాద ధాటికి కియా కారులోని రెండు బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ సీటులోని వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద తీవ్రతకు శ్రీనివాసరావు దంపతుల కారు హైవే పక్కన డివైడర్ పై ఏర్పాటు చేసి ఉన్న ఐరన్ గ్రిల్ లో ఇరుక్కుని ఎటూ కదలకుండా ఆగిపోయింది. ప్రమాదంలో మాధవీ లత, శ్రీనివాస్రావులకు స్వల్ప గాయాలు కాగా హైవే అంబులెన్స్ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైవే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్కు అవరోధంగా ఉన్న రెండు కార్లను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూశారు. -
‘అర్ధ శత’ పురస్కారాల గ్రహీత బెజగంకు సన్మానం
సత్తెనపల్లి: పౌరాణిక కళారంగంలో ‘అర్ధ శత’ పురస్కారాల గ్రహీత బెజగం రవికుమార్ అని పలువురు కళాకారులు కొనియాడారు. పౌరాణిక కళారంగంలో విభిన్న పౌరాణిక పాత్రలు ధరించి ప్రేక్షకులను రంజింప చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో వివిధ కళా సంస్థలు, కళావేదికల నుంచి మొత్తం 50 పురస్కారాలు అందుకున్న సందర్భంగా పట్టణంలోని కళాకారులందరు వర్ధమాన పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్కి అభినందనలు తెలిపారు. పట్టణంలోని వడ్దవల్లి శ్రీ రాధాకృష్ణ మందిరంలో పట్టణ కళాకారుల సమక్షంలో వర్ధమాన పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్ మిత్రులు, సహ కళాకారులు, శ్రేయోభిలాషులు శనివారం ఆయనను సన్మానించారు. సీనియర్ న్యాయవాది, కళా భీష్ముడు పిన్నమనేని పాములయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోటగిరి పోతులూరయ్య, చంద్రకుమారి, రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి శ్రీధర్ తదితరులు బెజగం రవి కుమార్కి సన్మానపత్రం చదివి వినిపించారు. అనంతరం రవికుమార్ వారందరికి ధన్యవాదాలు తెలిపారు. 10వ తరగతి పరీక్షలో 575 మార్కులు సాధించి ప్రతిభ చూపిన కోటి సాహితీని సత్కరించి పెన్నులు బహుకరించారు. కార్యక్రమంలో కళాకారులు కాటుమల నాగేశ్వరరావు, దావీదు, అంజలి కోటేశ్వరరావు, ఎలిశెట్టి ప్రసాద్, మాతంగి సాంబశివరావు, కోటేశ్వరరావు, గిరీష్రెడ్డి, సత్యనారాయణరాజు, జి.కృష్ణ, కె.ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి
పార్టీ నాయకులతో ప్రకాశం జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి యర్రంవారిపాలెం (కారంచేడు): రాబోయే రోజుల్లో పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేలా చేసి, పార్టీ బలోపేతానికి నాయకులంతా సమన్వయంగా పనిచేయాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం యర్రంవారిపాలెంలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రధానంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉండేలా నాయకులు కృషి చేయాలన్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా కష్టపడి పనిచేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మనందరి లక్ష్యంగా కృషి చేయాలన్నారు. పేదల పక్షాన ప్రభుత్వంతో పోరాడాల్సి ఉందన్నా రు. ప్రజలకు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ అమలు జాడ కనిపించడం లేదన్నా రు. హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయకుండాలనే లక్ష కోట్ల అప్పులు చేశారని అన్నారు. బత్తులను సత్కరించిన నాయకులు పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా నియామకం పొంది మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన బత్తుల బ్రహ్మానందరెడ్డిని పర్చూరు నియోజకవర్గ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్కరించి, అభినందనలు తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ, ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కారంచేడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ సుబ్బారావు, మాజీ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు మండల కన్వీనర్ కఠారి అప్పారావు, బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోట శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు మలినేడి జగన్నాథం, లంకా శివ, పంగులూరి నాగేశ్వరరావు, మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యాద్దనపూడి హరిప్రసాద్, వేణుగోపాలస్వామి దేవస్థాన చైర్మన్ రావువారి ప్రసాద్, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భవనం రాజగోపాలరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అప్పగింత
వెల్దుర్తి: కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి దారి తెలియక తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ పోలీసులు తెలుసుకుని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కొడమంచిలి శ్రీను అలియాస్ శ్రీను వెంకట్, అతని భార్య ధనలక్ష్మిలు ఇద్దరూ చేపలు పట్టే పని కోసం వచ్చి వెల్దుర్తి మండలం జెండాపెంట గ్రామంలో నివాసం ఉంటున్నారు. శ్రీను, ధనలక్ష్మిలు ఏప్రిల్ 19 నుంచి కృష్ణానదిలో చేపలు పడుతున్నారు. రోజూ లాగే శ్రీను శుక్రవారం ఉదయం 7గంటలకు కృష్ణానదిలోకి వెళ్లి దారి తప్పిపోయాడు. నీరు, ఆహారం లేక రాత్రంతా కొత్తపుల్లారెడ్డిగూడెం ప్రాంతంలోని అడవిలో ఉండిపోయాడు. శనివారం ఉదయం 9గంటలకు డయల్ 100కి ఫోన్ చేయగా మాచర్ల రూరల్ సీఐ నసీబ్ బాషా ఆదేశాల మేరకు వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి వెంటనే స్పందించి అతని ఫోన్ లొకేషన్ తెలుసుకొని సిబ్బంది సాయంతో ఆ ప్రాంతానికి వెళ్లి అతనిని సురక్షిత ప్రాంతానికి తీసుకు వచ్చారు. అతనిని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్వగ్రామానికి వెళ్లేందుకు ఖర్చులను ఎస్ఐ సమందర్వలి అందించారు. -
అంగన్ వేడి కేంద్రాలు
ముప్పాళ్ళ: వేసవి సెలవుల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది. చిన్నారులు ఎండల్లో సైతం కేంద్రాలకు రావాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా వేసవి వచ్చిందంటే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయటం పరిపాటి. మే నెలలో అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, మరో 15రోజులు ఆయాలకు సెలవులు మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం సెలవులు ప్రకటించకుండా కక్షపూరితంగా వ్యహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీలపై కక్షతోనే..! ఇప్పటికే రకరకాల యాప్లతో అంగన్వాడీ టీచర్లను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తాజాగా ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి పెట్టుకోవాలని, టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల వరకూ అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం జీతాలు పెంపుతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలపై అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం మాట లెక్కచేయకుండా చలో విజయవాడ పేరుతో వేలాది మందితో భారీ ధర్నాను చేపట్టారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం జీతాలు పెంచకపోవడమే కాకుండా వేసవి సెలవులు ఇవ్వకుండా అంగన్వాడీలపై కక్ష తీర్చుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కిశోర వికాసం పేరుతో... వేసవిలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం కిశోర బాలవికాసం పేరుతో వారానికి రెండురోజులు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం మంచిదే అయినా, వేసవిలో సెలవులు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలు కన్వీనర్లుగా వారి సెంటర్ల పరిధిలోని కిశోర బాలికలను సర్వే చేసి, వారితో సచివాలయ పరిధిల్లోని ఏఎన్ఎంలు, ఎంఎస్కేలతో కలిపి ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రాపౌట్, బాల్య వివాహాలపై నష్టాలు, వారికి పుట్టే బిడ్డల అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఎండలు తీవ్ర ప్రభావం చూపే మే నెల మొత్తం సమావేశాలు నిర్వహించేలా జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సత్తెనపల్లి ప్రాజెక్ట్ పరిధిలో... ఐసీడీఎస్ సత్తెనపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, నకరికల్లు, రాజుపాలెం మండలాల పరిధిలో 300 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సున్నా నుంచి ఏడాది లోపు 1,598 మంది చిన్నారులు, సంవత్సరం నుంచి ఐదేళ్ల లోపు 6,904 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 4,094 మంది పిల్లలున్నారు. వీరితో పాటుగా 11 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల లోపు 5,511మంది, 18 సంవత్సరాలలోపు 4,606 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరితో పాటుగా 1,411 మంది గర్భిణులు, 1,469 మంది బాలింతలు ఉన్నారు. పలుదేవర్లపాడులో కిశోర వికాసం ర్యాలీ చేస్తున్న కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది ఉక్కపోతతో అల్లాడుతున్న పిల్లలు సెలవుల ఊసే ఎత్తని ప్రభుత్వం కిశోర వికాసం పేరుతో సమావేశాలు ఉక్కపోతతో ఇక్కట్లుఉదయం 7గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుండటంతో వారిని సముదాయించలేక ఆయాలు నానా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించకుండా ఇంటివద్దే ఉంచుకుంటున్నారు. ఫలితంగా హాజరుశాతం సగానికి పైగా తగ్గిపోతోంది. వీరితో పాటుగా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం ఎండలోనే తప్పనిసరిగా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. -
7న శంకర్విలాస్ ఆర్ఓబీ పనులకు శంకుస్థాపన
నెహ్రూనగర్: ఈ నెల 7వ తేదీన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన జరుగుతుందని, విస్తరణ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. తొలుత ఆర్ఓబీ నిర్మాణ డిజైన్ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన విస్తరణ పనులు, మార్కింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన చేస్తారన్నారు. శంకుస్థాపన జరిగే ప్రదేశం నిర్ణయం అనంతరం శిలాఫలకం ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఆర్అండ్బీ డీఈఈ చిన్నయ్య, ఏఈఈ సంజీవ కుమార్, ఏసీపీలు, పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మల్లేశ్వరస్వామి సేవలో అదనపు కమిషనర్ పెదకాకాని: రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనరు తెనాలి చంద్రకుమార్ దంపతులు శనివారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో అదనపు కమిషనరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసిన వారు భ్రమరాంబమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కమిషనరు దంపతులకు ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేశారు. తెనాలి చంద్రకుమార్ దంపతులను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలంలోని కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో పునఃప్రతిష్టా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు నిత్యపూజావిధులు, వాస్తుపూజ, బలిపర్యగ్నీకరణ విధులు, ప్రభాతబలి, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, జలాధివాసం, క్షీరాధివాసం, అదివాసహోమాలు జరిగాయి. భక్తులు బిందెలతో నీటిని తెచ్చి స్వయంగా విగ్రహాలకు అభిషేకం చేశారు. దేవస్థాన ఈఓ కె.సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ‘నీట్’ ఏర్పాట్లు పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ పరీక్ష కేంద్రాలను శనివారం డీఆర్ఓ ఎన్ఎస్ ఖాజావలి, డీఈఓ సీవీ రేణుక పరిశీలించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వారు విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చీఫ్ సూపరింటెండెంట్తో చర్చించారు. హెచ్ఎం షేక్ ఎండీ ఖాసిం ఉన్నారు. -
నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) పరీక్ష జరగనున్న సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు అదికారులను ఆదేశించారు. పరీక్షల నేపధ్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పరీక్షలు జరుగుతున్న కాకాని జేఎన్టీయూ–కె, ఇర్లపాలెం పీఎం కేంద్రీయ విద్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నీట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు మూసేయాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయం లోపు, పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలన్నారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లను కేంద్రాల్లోకి అనుమతించ వద్దన్నారు. అవసరమైతే పరీక్ష కేంద్రాల చుట్టుప్రక్కల డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని సూచించారు. -
నేడు రేపల్లె ప్యాసింజర్ రైళ్లు రద్దు
తెనాలిరూరల్: తెనాలి పట్టణంలోని మారీస్పేట మొండిగోడల వద్ద పినపాడు కాల్వపై వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో తెనాలి– రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను ఆదివారం రద్దు చేసినట్టు తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్ టీవీ రమణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు–రేపల్లె (67249), రేపల్లె–గుంటూరు(67250), గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె–గుంటూరు(67224), తెనాలి–రేపల్లె(67231), రేపల్లె–తెనాలి(67232), తెనాలి–రేపల్లె(67233), రేపల్లె–తెనాలి(67234) రైళ్లను రద్దు చేసినట్టు చెప్పారు. విజయవాడ–తెనాలి(67221) రైలును గుంటూరుకు మళ్లిస్తారని, సికింద్రాబాద్ నుంచి రేపల్లె(17645) వెళ్లే ప్యాసింజర్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుందని తెలిపారు. -
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
నరసరావుపేట టౌన్: జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో దొంగతనం కేసులు నమోదువుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం నరసరావుపేటలో గడచిన వారంలో మూడు దొంగతనాలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దోచుకెళ్తున్నారు. ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలూ మాయమవుతున్నాయి. గత వారం రోజుల కిందట రామిరెడ్డిపేటకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు ఎం.సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. రెండవ రోజు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగు సమాచారాన్ని అందజేశారు. ఇంటికి వచ్చి పరిశీలించగా బీరువాలో ఉండాల్సిన నగదు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల కిందట ప్రకాష్నగర్ టౌన్హాల్ వెనుక అద్దె భవనంలో నిర్వహిస్తున్న జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయ తాళాలను దుండగులు పగలగొట్టారు. అక్కడ విలువైన వస్తువులు లేకపోవటంతో పక్కనే ఉన్న ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. జిల్లా ఉద్యాన అధికారి చందలూరి వెంకట రమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రిళ్లు గస్తీ ఏదీ ? జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వరుసగా జరుగుతున్న చోరీలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు రావటంతో పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉక్కపోతకు ఆరుబయట నిద్రించేవారు ఉంటారు. ఇదే అవకాశంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పోలీస్ అధికారులు స్పందించి రాత్రిళ్లు గస్తీ పెంచి చోరీల నియంత్రణలకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్సవాల్గా మారిన దొంగతనాలు.. ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల్ని లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు చోరీ సంఘటనలు రెండు జరిగాయి. సుమారు రూ.40 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. మరో వైపు గృహాలను దోచుకోవటం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దొంగతనాలను ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో వరుస చోరీలు తాళం వేసిన గృహాలే లక్ష్యంగా దొంగతనాలు వీఆర్వో ఇంట్లో 10 సవర్ల బంగారం, నగదు మాయం వారం రోజుల్లో మూడు ఇళ్లు దోచిన దొంగలు ఎల్హెచ్ ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చేలోపు .. ఎల్హెచ్ ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి నరసరావుపేట పట్టణానికి చెందిన శ్రీనివాసరావు వేసవి సెలవులకు కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది. బీరువాలోని బంగారంతో పాటు నగదు మాయమైంది. నరసరావుపేట రూరల్ మండలం ములకలూరు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మ పిల్లలతో పుణ్యక్షేత్రానికి వెళ్లింది. తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెకు ఫోన్ చేశారు. వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను ప్రతి ఒక్కరూ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఉంటే సమాచారాన్ని సిస్టమ్లో పొందుపరచాలి. టెక్నాలజీ సహాయంతో ఆయా గృహాలకు సాంకేతిక నిఘా ఏర్పాటు చేస్తాం. రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచండి. వారు ఇచ్చిన సమాచారంతో ఆ గృహాలను సిబ్బంది పర్యవేక్షిస్తారు. – కె.నాగేశ్వరరావు, నరసరావుపేట డీఎస్పీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామ వీఆర్వో వెల్లల చెరువు వెంకట శివరామకృష్ణ ప్రకాష్నగర్లో ఉంటున్నాడు. శుక్రవారం ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవ దర్శనానికి మోపిదేవి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు తెలియజేశారు. శనివారం వచ్చి పరిశీలించగా బీరువాలో ఉండాల్సిన సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ విజయ్చరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్టీం అక్కడకు చేరుకొని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్పై అక్రమ కేసు
పిడుగురాళ్ల: సోషల్ మీడియా యాక్టివిస్టు షేక్ మాబును అక్రమ కేసులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడనే నెపంతోనే కూటమి నాయకులు పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 సెప్టెంబర్ 11న సోషల్ మీడియా యాక్టివిస్టు వెన్నా రాజశేఖర్రెడ్డి, మాబుని అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులు గురి చేశారు. ఈ సమయంలో మాబు తల్లిదండ్రులు హైకోర్టులో హెబిఎస్ కార్పస్ వేశారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కొంత కాలంగా వెన్నా రాజశేఖర్రెడ్డిని, మాబుని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పిడుగురాళ్ల పోలీసులు ఈ క్రమంలోనే తిరిగి బైకు దొంగతనం చేశారన్న నెపంతో మాబుని బ్రాహ్మణపల్లిలోని సిమెంట్ షాపు వద్ద నుంచి కొట్టుకుంటూ పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకొని వచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును మాబు తమ్ముడు జానీ ప్రశ్నించారు. దాంతో బైకు దొంగతనం కేసు సంబంధించి విచారణకు తీసుకొని వచ్చామని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే కారణంతోనే ఈ అక్రమ కేసులు బనాయించి తన అన్న మాబును పోలీస్స్టేషన్కు తరలించారని జానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును సాక్షి వివరణ కొరగా మాబుతోపాటు అతని అన్న బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు. -
పోగొట్టుకున్న నగదు అప్పగింత
పర్చూరు(చినగజాం): స్థానిక అమ్మ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేందుకు వచ్చి క్యాష్ బ్యాగును మరచిపోయి వెళ్లిపోయిన వ్యక్తికి అదే దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి ఆ నగదు తిరిగి అప్పగించాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పొన్నూరు గ్రామానికి చెందిన డొక్కు సీతారామరాజు మొక్కజొన్న ట్రేడింగ్కు సంబంధించిన రూ 1.80 లక్షల నగదు ఉన్న బ్యాగు దుకాణంలో మరచి పోయి వెళ్లిపోయాడు. అమ్మ టిఫిన్ సెంటర్లో వర్కర్గా పనిచేస్తున్న ఆలపాటి ప్రసాద్ సీతారామరాజు బ్యాగును గుర్తించి స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐ మాల్యాద్రికి అప్పగించాడు. సీతారామరాజుకు విషయం తెలియజేసి , స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐ సమక్షంలో అతని క్యాష్ బ్యాగును అప్పగించారు. టిఫిన్ సెంటర్ వర్కర్ ప్రసాద్ నిజాయితీని పలువురు అభినందించారు. -
విజయకీలాద్రిపై తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలా ద్రి దివ్య క్షేత్రంపై శుక్రవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళ శాసనాలతో 1008వ భగవద్రామానుజాచార్య స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు అభిషేకం, సేవాకాలం, అర్చన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవ, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ వినుకొండ: శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యావికాస్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్టు కోచ్ కోమటిగుంట శ్రీహరి తెలిపారు. ఈ క్యాంప్ను శుక్రవారం డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్యాదవ్, పీఈటీ రాధాకృష్ణమూర్తి, వినుకొండ జోన్ ప్రెసిడెంట్ గణప వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8008285430 నంబరులో సంప్రదించాలన్నారు. యతీశ్వరుల చిత్ర పటాలతో ప్రదర్శన కొల్లూరు: శంకర జయంతిని పురస్కరించుకుని ఆది శంకరాచార్యులు, రామచంద్రేంద్ర సరస్వ తి యతీశ్వరులు చిత్రపటాలతో కొల్లూరులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. వేద పరీక్షలు, పండిత సన్మాన సభలు శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు కొల్లూరులోని శ్రీ పార్వతీ సంస్కృత పాఠశాలలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. కార్యక్రమాల నిర్వహణకు అధ్యక్ష, కార్య ద ర్శులుగా గబ్బిట శివరామకృష్ణప్రసాద్, తాడేప ల్లి వెంకటసింహాద్రిశాస్త్రి వ్యవహరిస్తారన్నారు. 7 నుంచి కళాపరిషత్ నాటిక పోటీలు పొన్నూరు: పొన్నూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ శత జయంతిని పురస్కరించుకుని 24వ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు కళాపరిషత్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 వరకు నిడుబ్రోలు జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని డాక్టర్ నన్నపనేని జ్ఞానేంద్రనాఽథ్ కళావేదికపై పోటీలు జరుగుతాయన్నారు. ఎస్.ఆంజనేయులునాయుడు, ఎన్. రఘునాఽథ్, ఆకుల సాంబశివరావు, ఎం.విజయ్కుమార్ రెడ్డి, డాక్టర్.దేసిబాబు, మురళీకృష్ణ, జి.తాతారావు, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి అమరావతి: అమరేశ్వరుని దేవస్థానంలో శుక్రవారం ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. శంకరాచార్య విగ్రహనికి ఆలయ అర్చకుడు శంకరమంచి రాజశేఖర శర్మ పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేషాలంకారం, ప్రత్యేక పూజలు చేసి బ్రాహ్మణులకు విసన కర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. -
తల్లీబిడ్డ వాహనాల డ్రైవర్లు నిరసన
నరసరావుపేట: తల్లీబిడ్డ ఎక్స్్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారంనిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాంబశివరావు మాట్లాడుతూ ఏడేళ్ల నుంచి నెలకు జీతం రూ.8800 మాత్రమే ఇస్తున్నారని, పీఎఫ్ వాటా కూడా డ్రైవర్ల వేతనాల నుంచి మినహాయిస్తున్నారని తెలిపారు. తమను కూడా ఆప్కాస్లో చేర్చి కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు డ్రైవర్లు కోరారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్ సిలార్ రసూల్ మాట్లాడుతూ బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక యాప్ ద్వారా ఫొటో అప్లోడ్ చేసే క్రమంలో అది సక్రమంగా పనిచేయక డ్రైవర్లు పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. వారాంతపు, పండుగ సెలవులు, ఇంక్రిమెంట్లు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల్ని చట్టప్రకారం అమలు చేయాలని కోరారు. సిబ్బందిని ఏజెన్సీ ద్వారా నియమించినా ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్నట్లు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓ లీలాకుమారికి వినతిపత్రం అందజేశారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసి, సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత -
ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తే ఎలా?
సత్తెనపల్లి: ప్రజా సమస్యలు పరిష్కరించకుండా .. వాటిని కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తే సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆవ్వారు ప్రసాదరావు ప్రశ్నించారు. అమరావతి రాజధానికి మోదీ వస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి ప్రసాదరావును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఆ రోజు అందుబాటులో లేరు. శుక్రవారం పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందలేదు. ఇద్దరు కానిస్టేబుల్లను ఇంటి వద్ద ఉంచి ప్రసాదరావును గృహ నిర్బంధం చేశారు. దీన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ సభ పూర్తయ్యే వరకు నిర్బంధం తప్పదని పోలీసులు తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి 7:30 గంటలకు పోలీసులు వెళ్లిపోవడంతో ఆయన బయటికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ మేము ఏమైనా దొంగలమా.. దోపిడీలు, మర్డర్లు చేశామా..మరి ఎందుకు గృహ నిర్బంధం చేశార’’ని ప్రశ్నించారు. ఇప్పటికై నా పాలకులు వాస్తవాలను గమనించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. గృహ నిర్బంధాలు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీపీఎం నాయకుల హౌస్ అరెస్టులు హేయం సత్తెనపల్లి: మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునః నిర్మాణం ప్రారంభం కోసం వస్తున్న నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని సీపీఎం నాయకులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని పుతుంబాక భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదని, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుకు కూడా ఆహ్వానం పంపారని తెలిపారు. కానీ సభకు వెళ్లవద్దంటూ నాయకులను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గురువారం రాత్రి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు అవ్వారు ప్రసాదరావు ఇంటిని పోలీసులు సోదా చేయడాన్ని ఆయన ఖండించారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సత్తెనపల్లి రూరల్ సీపీఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, ముప్పాళ్ల మండల కార్యదర్శి గుంటుపల్లి బాలకృష్ణ ఇళ్ల వద్ద, సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్లు చేయడాన్ని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుగా కాకుండా గ్రాంట్గా రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు జడ రాజకుమార్, ఎం. హరిపోతు రాజులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు హౌస్ అరెస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధం -
‘నీట్’కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరుఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికై ఆదివారం జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్–2025)కు విస్తృత రీతిలో ఏర్పాట్లు చేస్తు న్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 4,250 మంది విద్యార్థులకు 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉద యం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు ● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కు పుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజుల సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. ● చేతికి స్మార్ట్వాచీతోపాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు. ● సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా కేంద్రాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. ● విద్యార్థులు జీన్స్ ఫ్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. ● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తులను తమ వెంట తీసుకురాకూడదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి ● విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంది. దీంతో పాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్ గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్వజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. ● ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను కేంద్రాల్లోనే ఇస్తారు. గుంటూరు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు దరఖాస్తు చేసిన విద్యార్థులు 4,250 మంది ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతి మధ్యాహ్నం 1.30 గంటల తరువాత నో ఎంట్రీ -
పల్నాడు
శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025కన్ను పడితే 9ప్రసన్నాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం చిలకలూరిపేట: రజక కాలనీలోని ఈశాన్య ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.అప్రమత్తంగా ఉండాలి నగదు, బంగారు ఆభరణాలతో ప్రయాణాలు కొనసాగించే మహిళలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో నరసరావుపేట బస్టాండ్లో ప్రయాణికురాలి వద్ద బంగారు ఆభరణాలు చోరి జరిగిన కేసులో చీరాలకు చెందిన మహిళల ముఠాను అరెస్ట్ చేశాం. ప్రయాణించేటప్పుడు అజ్ఞాత వ్యక్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలి. – కె. నాగేశ్వరరావు, డీఎస్పీ, నరసరావుపేట మహిళల ముఠా పనిగా గుర్తింపు.. బంగారం అపహరణ కేసులో పోలీసులు అనుమానిస్తున్న మహిళ (సీసీ పుటేజ్)న్యూస్రీల్ -
పోలీసులకు శిక్షపడే వరకు పోరాటం
పిడుగురాళ్ల: సోషల్ మీడియా యాక్టివిస్టులను కొట్టిన పోలీసులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ..వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్న బ్రాహ్మణపల్లి సర్పంచ్ కుమారుడైన మాబుపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని ఖండించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడనే కారణంతోనే ఆరు, ఏడు నెలల కిందట మాబుపై, సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనర్ రాజశేఖర్రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టి కొట్టారని ఆరోపించారు. దానిమీద అప్పుడే హెబియస్కార్పస్ వేశామని, హైకోర్టులో పోలీసుల మీద కేసులు కూడా వేసినట్లు తెలిపారు. అప్పుడు హైకోర్టు కూడా లోయర్ కోర్టులో సమస్యలు, జరిగిన దురాగతాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయాలని 10 రోజుల కిందట తీర్పు వచ్చిందని వివరించారు. వీరు జడ్జి ముందు ఏమైనా చెబుతారోమెనని అక్రమంగా బెదిరించటానికి మరొక దొంగ కేసును అన్నదమ్ములు ఇద్దరి మీద పెట్టారని కాసు వివరించారు. ఇద్దరూ జగన్మోహన్రెడ్డి సైనికులు కావడంతో పోలీసులు ఎన్ని అక్రమ కేసులుపెట్టినా, కొట్టినా ఆదరకుండా, బెదరకుండా ఉన్నారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా న్యాయ పోరాటం చేస్తామని ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు.పోలీస్టేషన్ ముట్టడి కోసం నాయకులు, కార్యకర్తలతో సిద్ధమయ్యామని, అయితే పోలీసులు మాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని చెప్పారు. దీంతో కోర్టులోనే న్యాయపరంగా తెల్చుకుంటామని కాసు స్పష్టం చేశారు. ఏది ఏమైనా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్పై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు, కేవీ, చల్లా పిచ్చిరెడ్డి, చింతా సుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లి సర్పంచ్ బడేసా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల వచ్చిన సుబ్బారెడ్డి పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం రాత్రి వచ్చారు. అనంతరం పార్టీ నేత అల్లు పిచ్చిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆహ్వానం మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. వీరిని కాసు మహేష్రెడ్డి దుశ్శాలువాలతో సన్మానించారు. కొంతసేపు ఈ ప్రాంత రాజకీయాల గురించి సంభాషించారు. బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు మాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా చురుకుగా పని చేస్తుండటంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాసు మహేష్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా నాటికల పోటీలు ప్రారంభం
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం రాత్రి వైభవంగా ఆరంభమయ్యాయి. గ్రామంలోని చిన్న రథశాల వద్ద ప్రత్యేక వేదిక గద్దె శివరావు కళాప్రాంగణంలో ఏర్పాటైన నాటికల పోటీలను కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు వైఎస్కేఎన్ స్వామి, ఉపాధ్యక్షుడు సుద్దపల్లి మురళీధర్, ప్రముఖ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ జ్యోతిప్రజ్వలనతో ఆరంభించారు. సభకు పొన్నూరు కళాపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ఆంధ్రాప్యారిస్ తెనాలి కళల కాణాచిగా వర్ధిల్లితే, ఎందరో కళాకారులకు జన్మనిచ్చిన పుణ్యభూమి కొలకలూరు అని చెప్పారు. వల్లూరు వెంకట్రామయ్య, మోదుకూరి జాన్సన్, డీఎస్ దీక్షిత్ వంటి నాటకరంగ ప్రముఖులు, ఎందరో సాహితీవేత్తలు కొలకలూరు నుంచి ఉద్భవించారని సోదాహరణంగా చెప్పారు. ఏటా నాటికల పోటీలను నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడిన నాటకరంగ ప్రముఖుల పేరుతో అవార్డులను ప్రదానం చేస్తున్న శ్రీసాయి ఆర్ట్స్ సంస్థ నిర్వాహకులు అభినందనీయులని చెప్పారు. ఇదే వేదికపై తాడేపల్లికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక సంస్థ నిర్వాహకుడు గంగోత్రి సాయికి నటుడు, దర్శకుడు కరణం సురేష్ జ్ఞాపకార్థం ప్రదానం చేసి సవ్యసాచి అవార్డును బహూకరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తుమ్మల సాంబశివరావు స్మారకంగా మరో సంగీత దర్శకుడు పి.లీలామోహనరావును సత్కరించారు. వరగాని పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ కళాపరిషత్, అనంతవరం అధ్యక్షుడు గుదె పాండురంగారావు, కొండవీటి కళాపరిషత్, లింగారావుపాలెం అధ్యక్షుడు కట్టా శ్రీహరి, ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ అధ్యక్షుడు కూచి రామాంజనేయులు, కళాంజలి, చీరాల కార్యదర్శి తిరుమలశెట్టి సాంబశివరావు మాట్లాడారు. నిర్వాహక సంస్థల అధినేతలు, రంగస్థల, సినీ నటులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు. -
పంతం నెగ్గించుకున్న కోడెల వర్గీయులు
నరసరావుపేట: ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించాలనే పంతాన్ని ఆయన వర్గీయులు నెగ్గించుకున్నారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల తనయుడు శివరాం పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో కోడెల రాష్ట్రానికి, నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు. గతంలో ఎమ్మెల్యే అభ్యంతరంతో వివాదం ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే గతేడాది ఒక అర్ధరాత్రి దిమ్మెను నిర్మించి కోడెల విగ్రహాన్ని నిలబెట్టారు. స్థానిక ఎమ్మెల్యే చేసిన అభ్యంతరాల మేరకు విగ్రహావిష్కరణ ఆగిపోయింది. సుమారు రెండు నెలలపాటు విగ్రహావిష్కరణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రూనాయక్ ఆదేశాలతో సిబ్బంది దిమ్మె పైనుంచి విగ్రహాన్ని తొలగించి సురక్షితంగా హాస్పిటల్ ఆవరణలో ఉంచారు. దీనిపై కోడెల వర్గీయులు ఆందోళన చేసి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. స్థానిక ఎమ్మెల్యే చేసిన సూచనల మేరకే విగ్రహాన్ని తొలగించానని సూపరింటెండెంట్ చెప్పారు. అనంతరం ఆయన తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. చివరకు కోడెల శివరామ్ పట్టుబట్టడంతో విగ్రహావిష్కరణకు నాయకులు పూనుకున్నట్లు తెలియవచ్చింది. అనుమతులు ఎవరు ఇచ్చారనే దానిపై స్పష్టతలేదు. సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది.. 2014–19లో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబార్డు అందజేసిన నిధులతో ఆస్పత్రి ఒక భవనాన్ని అసంపూర్తిగా నిర్మించి ఎన్నికలు దగ్గర పడటంతో కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించి సుమారు రూ.3.5కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో ర్యాంపు నిర్మాణం, తాగునీటి వసతి, హాస్పిటల్ చుట్టూ ప్రహరీ, సెప్టిక్ ట్యాంకు, హాస్పిటల్ కావాల్సిన మౌలిక సదుపాయాలన్ని ఏర్పాటుచేసి మళ్లీ పున ప్రారంభించారు. డాక్టర్ గోపిరెడ్డి దాతల సహకారంతో సుమారు రూ.1.5 లక్షల నిధులు సమకూర్చి హాస్పిటల్ను పటిష్టపర్చారు. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారి రెండు దశల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు, ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 5వేల మందికి వైద్యసేవలు ఈ వైద్యశాల ద్వారా అందాయి. ఎంతోమంది జీవితాలను నిలబెట్టారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే హాస్పిటల్ పేరును అనధికారికంగా కోడెల పేరు తగిలించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. ప్రభుత్వ హాస్పిటల్లో కోడెల విగ్రహం ఆవిష్కరణ పాల్గొన్న మంత్రి రవి, చీప్విప్ జీవీ, ఎంపీ లావు, ఎమ్మెల్యేలు అనుమతులపై స్పష్టత కరవు -
ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
చీరాల రూరల్: క్రీడలతో మానసిక వికాసం కలగడమే కాకుండా ధృడ సంకల్పం సిద్ధిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల ఎన్ఆర్అండ్పిఎం హైస్కూలు క్రీడా మైదానంలో శుక్రవారం రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ పుట్బాల్ (9 ప్లస్ 3) పోటీలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 16 క్రీడా జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు నూతలపాటి విజయకుమార్ (దాసు) తెలిపారు. చీరాలతోపాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, హైదరాబాదు, విశాఖపట్టణం వంటి నగరాల జట్లు వచ్చాయని తెలిపారు. పోటీల మొదటి రోజు మూడు జట్ల క్రీడాకారులు తలపడ్డారు. మొదటగా చీరాల ఎడ్విన్ మెమోరియల్ జట్టు కాకినాడ జట్లు క్రీడాకారులు తలపడగా 3–1 స్కోరు తేడాతో చీరాల ఎడ్విన్ మెమోరియల్ జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్లో విశాఖపట్టణం శ్రీధర్ ఫుట్బాల్ జట్టు వర్సెస్ యునైటెడ్ లియోస్ జట్టు క్రీడాకారులు తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో 3–1 స్కోర్ తేడాతో విశాఖపట్టణం శ్రీధర్ ఫుల్బాల్ క్లబ్ జట్టు గెలుపొందింది. రూ. 50,000, రూ. 30,000, రూ. 20,000 వరుస బహుమతులుగా అందజేయనున్నారు. కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ అబ్రహం బ్లెస్సీ, ఎస్ఎంఎల్జే కాలేజీ ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు, మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, ఆర్గనైజర్ నూతలపాటి విజయకుమార్ (దాసు), అంపైర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ సభకు 11 బస్సులు
కారంచేడు: అమరావతి పునఃప్రారంభోత్స కార్యక్రమానికి ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం 11 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సుల ద్వారా 480 మందిని సభకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం ఈ బస్సులను మండల ప్రత్యేక అధికారి, బాపట్ల జిల్లా సహకార శాఖ అధికారి సీహెచ్ శ్యాంసన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బస్సుకు ఇన్చార్జ్లను నియమించారు. బస్సుల్లో ఏఎన్ఎంలు, ఆశలు, మహిళా పోలీసులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ జి.నాగరాజు, ఎంపీడీఓ కె.నేతాజీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి హౌస్ అరెస్ట్
లక్ష్మీపురం: ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునఃప్రారంభానికి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు షేక్ మస్తాన్ వలిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ స్పందించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అమరావతికి వచ్చిన సమయంలో ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, పాచి పోయిన లడ్డు, చెంబులో నీరు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సారి వచ్చి అందరిని యోగా చేయాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్లు సరి కాదని తెలిపారు. -
జూనియర్స్ విభాగం విజేత హైదరాబాద్ ఎడ్లజత
దాచేపల్లి: స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు బుధవారం రాత్రి హోరాహోరీగా జరిగాయి. జూనియర్స్ విభాగంలో జరిగిన ఈ పోటీలను గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించారు. పోటీలో హైదరాబాద్కి చెందిన డి.రోహన్భాబు ఎడ్ల జత 3,158 అడుగుల దూరం బండ లాగి విజేతగా నిలిచింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరిష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 2,772 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన బుర్రిముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 2,565 అడుగుల దూరం బండలాగి మూడో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత 2,398 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరిషచౌదరి, శివకృష్ణ చౌదరి, గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకి చెందిన దొడ్డంపూడి గణేష్ సంయుక్త ఎడ్ల జత 2,250 అడుగుల దూరం బండలాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగాయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్లజత 2వేల అడుగుల దూరం బండ లాగి ఆరో స్థానం, గుంటూరు పట్టణానికి చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 1,774 అడుగులు దూరం బండలాగి ఏడవ స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు నగదు, షీల్డ్స్ బహుకరించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించగా కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, కానుకొల్లు ప్రశాంత్, మునగా నిమ్మయ్య తదితరులు పర్యవేక్షించారు. -
ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు ): వేసవి చిన్నారులకు ఎంతో ఇష్టం కారణం పాటశాలలకు సెలవులు. కొన్ని రోజులపాటు పుస్తకాలు, క్లాస్రూమ్స్ ఉండవు. ఆటలు, పాటలే ఆటవిడుపుగా సెలవులను గడిపేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం పట్టణంలో పలు ప్రాంతాల్లో మే 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు వేసవి క్రీడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తుంది. 30 రోజులపాటు సాగే శిక్షణా శిబిరంలో నిపుణులైన శిక్షకులు, సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రికెట్, జిమ్నాస్టిక్స్, చెస్, బాస్కెట్బాల్, టెన్నిస్, కరాటే, జూడో, షటిల్ బాక్సింగ్ ఇలా 23 క్రీడా విభాగాల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డబుల్ ఒలింపియన్ సత్తెగీత, ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న ఎందరో క్రీడాకారులు వేసవి శిక్షణా శిబిరాల ద్వారానే వెలుగులోకి వచ్చారు. బీఆర్ స్టేడియంలో... స్థానిక బీఆర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, కరాటే, జూడో లాంటి క్రీడల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. వీటిలో టెన్నిస్కు రూ.500, బ్యాడ్మింటన్కు రూ.500, స్కేటింగ్కు రూ.300 వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని క్రీడలను ఉచితంగానే శిక్షణనిస్తారు. సమయం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో.. అథ్లెటిక్స్ లాంగ్ టెన్నిస్, షటిల్, స్కేటింగ్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, యోగా, చెస్లో శిక్షణ ఉంటుంది. స్విమ్మింగ్కు రూ.2200, అథ్లెటిక్స్కు రూ.1200, బ్యాడ్మింటన్, స్కేటింగ్లకు రూ.1600 చొప్పున ఒక్క నెలకు వసూలు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో శిక్షణనిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రారంభమైన వేసవి క్రీడా సంబరం మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనలు కిటకిటలాడుతున్న క్రీడా మైదానాలు ఆరోగ్యం కోసం క్రీడలు తప్పనిసరంటున్న నిపుణులు తక్కువ ఖర్చుతోనే నేర్చుకునే సౌలభ్యం క్రీడలు జీవితంలో తప్పనిసరి ప్రస్తుత ఆధునిక సమాజంలో చిన్నారులను మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంచడానికి క్రీడలు తప్పనిసరి. క్రీడా సాధనతో చిన్నారుల కండరాలు, నరాలు గట్టిపడతాయి. చక్కని హోర్మోన్స్ విడుదలకు దోహదపడతాయి. క్రీడా సాధన చేసే పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉంటుంది. షుగర్, బీపీ, ఒత్తిడి దరిచేరవు. శారీరక శ్రమ లేకపోవడంతోనే బాల్యంలోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తితోపాటు చక్కని ఆరోగ్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దాదాపు 2500 మంది చిన్నారులను 50 బ్యాచ్లుగా విడగొట్టి వారికి కావాల్సిన వాటిలో శిక్షణనిస్తున్నాం. కొన్ని క్రీడలకు నామమాత్రపు రుసుము వసూలు చేయగా మరికొన్ని ఉచితంగా అందిస్తున్నాం. శిక్షణా శిబిరాల్లో ప్రతిభ కనబరచే వారిని ఎంపిక చేసి ప్రొఫెషనల్ స్థాయికి వచ్చే విధంగా తర్ఫీదునిస్తాం. చిన్నారుల ఆరోగ్య స్థితిగతుల బట్టి వారికి ఇష్టమైన క్రీడలోనే చేర్చాలి. పిల్లల శిక్షణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. శాప్ కూడా ప్రతి క్రీడ నిర్వహణకు రూ.7000 చొప్పున కేటాయించింది. ఎంతమంది పిల్లలు వచ్చినా శిక్షణనిస్తాం. – నరసింహారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి -
నరసరావుపేట రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
నరసరావుపేటటౌన్: కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నరసరావుపేట ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రైల్వేస్టేషన్, పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీచేశారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో పటిష్టవంతమైన భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ వి.శ్రీనివాసరావు నాయ క్ తెలిపారు. తనిఖీల్లో నరసరావుపేట జీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం వినుకొండ: స్థానిక వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) నందు 2025–26 విద్యాసంవత్సరానికి తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వై. శివరామకృష్ణ తెలిపారు. 5వ తరగతిలో ఎస్టీ–30, ఎస్సీ–5, బీసీ–2, ఓసీ–1, పీహెచ్సీ–1, గిరిజన ప్రాంతీయ ఉద్యోగులు –1, బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్టీ విద్యార్థులకు మాత్రమే), 6వ తరగతిలో 21, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 9 కలవు. పూర్తి చేసిన దరఖాస్తులను మే నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పాఠశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. ఏపీ మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు క్రోసూరు: క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్నందు ఆరవ తరగతి ప్రవేశపరీక్ష (2025–26) ఫలితాలను ప్రకటించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మేరీసుజన్ గురువారం తెలిపారు. రోస్టర్, మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించి సీటు వచ్చిన విద్యార్థులకు ఫోను ద్వారా తెలియజేయనున్నట్టు చెప్పారు. ఫలితాలను పాఠశాలలోని నోటీసు బోర్డులో కూడా చూడవచ్చని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో పళ్లు రైళ్లు రద్దు లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–తిరుపతి(07257) ఈనెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, తిరుపతి–చర్లపల్లి(07258) రైలు ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే గుంటూరు– రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250) గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె–గుంటూ రు(67224), రేపల్లె–తెనాలి(67230), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233) రేపల్లె–గుంటూరు (67234)విజయవాడ–తెనాలి(67221) రైళ్లను ఈనెల 4వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 514.210 అడుగుల వద్ద ఉంది.ఇది 138.7364 టీఎంసీలకు సమానం. -
జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే
పిడుగురాళ్ల: జానపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, నిర్మాణం చేపట్టే వరకు పోరాటాలు ఆగవని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ. 52 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. గత ఎన్నికల ముందు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభించలేదని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అధికార పార్టీకి అల్టిమెంట్ చేశామని, అయినా అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్ర వీడలేదని విమర్శించారు. అందుకే జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం గత వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరు చేసిన బ్రిడ్జిని ఎందుకు నిర్మించరూ, పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినా, ఎందుకు నిర్మించటం లేదని కోర్టులో ఫిల్ దాఖలు చేయటం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తాం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు వంటివి చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యులు విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, రాష్ట్ర మాజీ ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వీరభద్రుని రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కత్తెరపు వాసుదేవరెడ్డి, కాండ్రగుంట శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులకు కథలు చదవటం, కథలు వినడం, మ్యాథ్స్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్, దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు రోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పప్పెట్ మేకింగ్, పేపర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా గ్రంథాలయాల్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు పంపాలని సూచించారు. గ్రంథ పాలకులు కె.చిన్నపరెడ్డి, ఎన్.నాగిరెడ్డి, శాంతి భాయి, వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు గుంటూరు నర్సింగ్ కాలేజ్లో ఉచిత శిక్షణ గుటూరు మెడికల్: నర్సింగ్ సిబ్బంది గతంలో జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో, ఎక్కడ శిక్షణ తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ 11 నుంచి శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో జర్మన్ భాషలో ఏ1, ఏ2, బీ1, బీ2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే ఏ1, ఏ2, బీ1 పరీక్షలు పూర్తికాగా.. వారికి చైన్నెలో బీ2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్న్ లో మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపికై నట్లు లెక్క. అలా ఎంపికై నా వారికి విమాన టికెట్లు, వీసా, ధ్రువపత్రాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరికి నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు జీతం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్నవారు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులుగా ఉద్యోగాల కోసం వెళ్లేందుకు ఇది సువర్ణ అవకాశం అంటున్నారు. కల్లంలోని మిర్చి చోరీ సుమారుగా 15 క్వింటాళ్ల మిర్చి మాయం మేడికొండూరు: రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట దిగుబడులను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లిన ఘటన మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. వెలనాటి శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో సుమారు 40 క్వింటాళ్ల మిరప పంటను కోసి కల్లాల్లో ఆరబోశాడు. ఎండిన మిర్చిని టిక్కీలలో నింపేందుకు ఒక రాశిగా చేశాడు. బుధవారం రాత్రి మిర్చి రాశిలోని సుమారు 15 క్వింటాళ్ల కాయలు దొంగలు టిక్కీలలో నింపుకొని వెళ్లినట్లు రైతు శ్రీనివాసరావు తెలిపారు. మిర్చి దొంగతనంపై మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు. గతంలో ఇదే తరహాలో మండలంలోని డోకిపర్రు గ్రామంలో కల్లాల్లో ఉన్న మిర్చి దొంగతనం జరిగిందని రైతు తెలిపాడు. ఇప్పటికై నా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మిర్చి దొంగలను నియంత్రించాలని మండల రైతులు కోరుతున్నారు. -
యానిమేషన్ షాక్ !
తన వద్ద ఉన్నది రూ.2.72 కోట్లేనట..! నరసరావుపేటటౌన్: యానిమేషన్ బాధితులకు నిర్వహకుడు కిరణ్ షాక్ ఇచ్చాడు. అధిక వడ్డీ ఆశచూపి పెట్టుబడిదారుల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసిన యూపిక్స్ అధినేత కిరణ్ నెలరోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విధితమే. రూ.కోట్లు చెల్లించిన బాధితుల్లో ఒకరు నరసరావుపేటకు చెందిన వ్యాపారి గుండా నాగేశ్వరరావు మనోవేదన చెంది వారం క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. మరికొందరు బాధితులు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయో లేవోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో యానిమేషన్ నిర్వహకుడు తాను దివాళా తీసినట్టు నోటీసులు పంపించాడు. సుమారు 102 మంది పెట్టుబడిదారులకు రూ.156 కోట్లకు ఐపీ దాఖలు చేస్తూ తన న్యాయవాది ద్వారా బాఽధితులకు గురువారం నోటీసులు అందించాడు. దీంతో బాధితులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పేట వాసులే అధికం... యానిమేషన్ స్కాం బాఽధితులను పరిశీలిస్తే నరసరావుపేటకు చెందిన వారే అధికంగా ఉన్నారు. రూ.156 కోట్లలో 70 శాతం సొమ్ము నరసరావుపేట వాసులదే. నమ్మకంగా వ్యాపారం చేస్తూ అధిక వడ్డీ ఆశచూపడంతో స్తోమతకు మించి పెట్టుబడులు పెట్టారు. కొంతమంది ఉన్న ఆస్తులను సైతం విక్రయించగా, మరికొంతమంది వడ్డీలకు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టారు. ఉన్న ఆస్తులు విక్రయించినా అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడిదారులు తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లిస్తూ కాలయాపన చేస్తున్నారు. కిరణ్ ఐపీతో ఇక డబ్బులు రావని తెలుసుకున్న అప్పులిచ్చిన వారు బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు. ఐపీలో చూపిందే కొంతే... యానిమేషన్ స్కాం మొత్తం రూ.1,000 కోట్ల పై చిలుకు ఉంటుందని బాధితులు చెప్పుకొస్తున్నారు. ఒక్క నరసరావుపేటలోనే 200 మందికి పైగా బాధితులుండగా వారి నుంచి సుమారు రూ.400 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది బాధితులు డిపాజిట్లు చేశారు. విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి మధ్యవర్తుల ద్వారా రూ.కోట్లలో పెట్టుబడులను కిరణ్ స్వీకరించారు. ఐతే అకౌంట్లలో జమ అయిన మొత్తానికి మాత్రమే ఐపీలో చూపించాడు. లెక్కల్లో చూపని డబ్బు(బ్లాక్ మనీ) ఐపీ నోటీసులో చూపించలేదని కొంతమంది బాధితులు చెప్పుకొస్తున్నారు. ఏడు నెలలుగా చెల్లింపులు మొత్తం పూర్తిగా నిలిపివేశాడు. అయినప్పటికీ అమెరికాలో నూతన ప్రాజెక్టు వచ్చిందని సన్మానాలు చేయించుకొని పెట్టుబడిదారులను ఆకర్షించాడు. అధిక వడ్డీ ఆశచూపించి నాలుగైదు నెలల వ్యవధిలో రూ.కోట్లు వసూలు చేశాడు. చివరకు బోర్డు తిప్పేశాడు. ఐపీ దాఖలు చేసిన యూపిక్స్ యానిమేషన్ అధినేత రూ.156 కోట్లకు దివాలా తీసినట్టు 102 మందికి నోటీసులు బాధితుల్లో అధిక శాతం నరసరావుపేట వాసులే రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు పైగా స్కాం బాధితులు పెట్టిన బ్లాక్మనీని ఐపీలో చూపని కిరణ్ పెట్టుబడి పెడితే ఏడాదిలో రూపాయికి రూపాయి ఇస్తానని నమ్మించిన కిరణ్ ఏడు నెలలుగా డిపాజిట్దారులకు డబ్బు చెల్లించకపోవడంతో ఒత్తిడి తెచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన కిరణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇందులో అందరికీ త్వరలోనే డబ్బులు చెల్లిస్తానని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హామీ ఇచ్చాడు. దీంతో పాటు కొందరి ఫోన్లకు స్పందించి మాయమాటలు చెప్పాడు. త్వరలోనే పెద్ద మొత్తంలో నగదు వస్తుందని అనుకున్నదానికంటే కూడా ఎక్కువ మొత్తంలో తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలతో బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లేందుకు సైతం వెనుకాడారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆవంక చూపి తమ డబ్బులు ఇవ్వడేమోనని మిన్నుకుండిపోయారు. ఈ సమయంలో కిరణ్ షాక్ ఇచ్చేవిధంగా ఐపీ నోటీసులు పంపాడు. అనుకున్నంత అయ్యింది.. ఎన్నో ఆశలతో, మరెన్నో ఊహలతో పెట్టుబడులు పెట్టిన వందల మంది గుండెలు ముక్కలయ్యాయి. యానిమేషన్ మాయ చేసి రంగుల ప్రపంచం చూపించిన కిరణ్ తాను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేనంటూ ఐపీ పెట్టేశాడు. రూపాయి రూపాయి కూడబెట్టి, ఆశల అప్పులు మూటకట్టుకొని ఈ యానిమేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వందల మంది ఏం చేయాలో దిక్కుతోచక ఒంటరిగా మిగిలారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగదంటూ తమకు దిక్కెవరంటూ బాధితుల గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. రూ.156 కోట్లకు ఐపీ దాఖలు చేసిన కిరణ్ తన వద్ద సుమారు రూ.2.72 కోట్ల విలువైన వస్తువులే ఉన్నట్టు ఐపీలో చూపించాడు. ఈ వ్యవహారం చూస్తుంటే ముందుగానే ఐపీ పెట్టేందుకు ప్రణాళిక రచించినట్టు అర్థమవుతోంది. యూపిక్స్ యానిమేషన్ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లు, ఫ్యాన్లు, టీవీలు, సీలు, ఇతర ఫర్నీచర్ ఆస్తిగా చూపించాడు. ఇందులో 70 కంప్యూటర్ల విలువ రూ.2.5 కోట్లుగా చూపించడం కొసమెరుపు. -
బాల్యం నుంచే క్రీడాస్ఫూర్తి అలవరుచుకోవాలి
నరసరావుపేట ఈస్ట్: జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించి ఉన్నతంగా ఎదిగేందుకు క్రీడా స్ఫూర్తి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో గురువారం పల్నాడుజిల్లా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ, ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమిని విజయానికి మెట్టుగా చేసుకొని విజయం సాధించాలని తెలిపారు. చిన్నతనం నుంచే క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవటం ద్వారా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని వివరించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు కొద్దిసేపు చిన్నారులతో కలసి బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 18 క్రీడాంశాలలో 50 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శిక్షణ అనంతరం శిబిరంలో పాల్గొన్న బాల బాలికలకు క్రీడా ధ్రువీకరణ పత్రాలు అందిస్తామన్నారు. ఆయా క్రీడాంశాల కోచ్లు, పీఈటీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ -
అభివృద్ధి ప్రదాత కాసు వెంగళరెడ్డి
నరసరావుపేట: సర్దార్ కాసు వెంగళరెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి గుండెకాయలాగా పనిచేశారని మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. వెంగళరెడ్డి 45వ వర్ధంతి సందర్భంగా గురువారం పల్నాడురోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాలకు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ వెంగళరెడ్డి అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారన్నారు. రాజ్యసభ సభ్యులుగా, శాసనసమండలి సభ్యునిగాను, డీసీసీబీ, జిల్లా పరిషత్ చైర్మన్గా సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవవకాశాలు కల్పించారన్నారు. మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్రెడ్డి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. నాగార్జునసాగర్ నిర్మాణంలో బ్రహ్మానందరెడ్డి కీలకపాత్ర పోషించి క్రస్టుగేట్లు ఏర్పాటు చేయించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలమందికి తాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయించారన్నారు. తొలుత క్యాంపు కార్యాలయంలో కాసు మహేష్రెడ్డి వెంగళరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి మాట్లాడారు. సీనియర్ నాయకుడు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్రెడ్డి -
తొలగని వసతి గ్రహణం
జేఎన్టీయూఎన్లో నిలిచిన వసతి గృహ నిర్మాణాలునరసరావుపేట రూరల్: జేఎన్టీయూఎన్ కళాశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలోనూ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వసతి గృహాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. గత పదినెలలుగా పనులకు జరగకపోవడంతో వసతి గృహాల నిర్మాణాల పూర్తికావడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిలిచిన వసతి గృహాల పనులు విద్యార్థీ, విద్యార్థినుల వసతి గృహాలను దాదాపు రూ.32కోట్లతో నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు అంతస్తులతో నిర్మిస్తున్న భవనాల పనులు గత ఏడాది మే నెలకు పూర్తిచేశారు. విద్యార్థుల వసతి గృహం రెండవ బ్లాక్లో మూడవ అంతస్తు, సెప్టిక్ ట్యాంక్ పనులు మిగిలిపోయాయి. విద్యార్థినుల వసతి గృహాంలోని రెండు బ్లాక్లో శానిటరీ ఫిట్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు అవసరమైన అంచనాలను ఇంజినీరింగ్ విభాగం తయారు చేసి వర్సిటి అనుమతి కోసం పంపింది. అయితే ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించలేదు. విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కళాశాలలో సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్లలో విద్యాబోధన జరుగుతుంది. ఒక్కో బ్రాంచ్కు 60 సీట్లు కేటాయించారు. ప్రతి ఏడాది 300 మంది విద్యార్థులు కళాశాలలో చేరుతున్నారు. ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలలో 1200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. దీంతో పాటు రెండు బ్రాంచ్లలో ఎంఎస్ను పూర్తిచేసేందుకు 120మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాలలో వసతి గృహాలు లేకపోవడంతో వీరు పట్టణంలోని ప్రైవేటు హాస్టళ్లపై ఆధారపడుతున్నారు. ఇది వారిపై ఆర్థికభారంగా మారింది. దీంతో పాటు కళాశాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. ఆటోల మీద ఎక్కువగా విద్యార్థులు ఆధారపడుతున్నారు. ఆటోల్లో వెళుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఆర్టీసీ సౌకర్యం ఉన్నా మెయిన్రోడ్డు వరకే ఉంటుంది. అక్కడి నుంచి 1.5 కిలోమీటరు విద్యార్థులు నడిచివెళ్లాల్సి వస్తుంది. అదే నిర్లక్ష్యం 2016లో జేఎన్టీయూఎన్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించింది. కళాశాలకు కాకాని వద్ద కేటాయించిన భూముల చుట్టూ ప్రహరీని కూడా ఐదేళ్లలో పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవనాల నిర్మాణాలను వేగవంతం చేశారు. కరోనా సమయంలోనూ భవన నిర్మాణాలను చేపట్టారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు పూర్తికావడంతో విద్యార్థులకు తరగతులు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. ఇదే విధంగా వసతిగృహాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణలు పూర్తిచేయాలని భావించారు. ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా ఇప్పటికి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.32కోట్లతో భవనాల నిర్మాణం ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.10కోట్లు అవసరం ప్రభుత్వ అనుమతి కోసం పది నెలలుగా ఎదురుచూపు ఈ విద్యాసంవత్సరంలో అందుబాటులోకి రావడం అనుమానమే ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నిర్మాణాలు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వంనిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలి జేఎన్టీయూఎన్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతి గృహాల నిర్మాణాలు పూర్తిచేయాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణం పూర్తచేసింది. మైనర్ వర్క్లు పూర్తిచేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి తెస్తాం కళాశాల వసతి గృహాలకు సంబంధించిన మేజర్ పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి పంపించాం. ప్రభుత్వం మారడం, నూతనంగా వీసీ రావడం వలన కొంత ఆలస్యం జరిగింది. నూతన వీసీ సెప్టెంబర్కు భవనాల నిర్మాణాల పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారు. – ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూఎన్ కళాశాల -
ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
తాడికొండ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతికి విచ్చేస్తున్న సందర్భంగా వెలగపూడి, సచివాలయం ప్రాంతానికి దగ్గరలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పునఃప్రారంభం సభ’ ప్రాంగణాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం పరిశీలించారు. సభావేదిక, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అతిథులు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు, సభాప్రాంగణంలో కూర్చునే వారందరికీ చేసిన ఏర్పాట్లు, సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను ఆయా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రితో పాటు మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లి రవీంద్ర, పలు శాఖల అధికారులు ఉన్నారు. అమరావతి పునఃనిర్మాణం చారిత్రక ఘట్టం.. తెనాలి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో అమరావతి పునఃనిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కానుందని రాష్ట్ర రవాణ, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో జనసమీకరణలో భాగంగా గురువారం మంత్రి రామ్ప్రసాద్రెడ్డి తెనాలి వచ్చారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలగా గుర్తుచేశారు. -
నేడు ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులు హాజరు కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రాధాన్యత క్రమంతో పాటు శారీరక వైకల్య కేటగిరీలో పాయింట్లు పొందుటకు అర్హత కలిగి, ఇటీవల జీజీహెచ్ మెడికల్ బోర్డులో నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో న్యాయం జరగలేదని భావించే ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో హాజరు కావాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిజమైన అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు పాత, కొత్త మెడికల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఇతర వివరాలకు 99497 47464, 89192 50950, 77022 98003, 99487 49115 నంబర్లలో సంప్రదించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు తెలిపారు. వాటర్ సప్లయ్ సబ్డివిజన్ డీఈగా మనోహర్ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విజయపురిసౌత్ కాలనీ వాటర్ సప్లయ్ సీవరేజ్ సబ్ డివిజన్ డీఈగా జి.మనోహర్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఏఈఈగా పనిచేశారు. పదోన్నతిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలనీకి డీఈగా వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ బాబు ను డీఈ మురళీధర్, ఏఈఈ హిమబిందు తదితరులు అభినందించారు. వారాహి దివ్య అలంకరణలో బగళాముఖి అమ్మవారు చందోలు(కర్లపాలెం): బగళాముఖి అమ్మవారి కొలుపులలో రెండో రోజు కిరాత రూప వారాహి దివ్య అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా జరుగుతున్న కొలుపులలో గురువారం చెరుకుపల్లి మండలం కుంచలవారిపాలెం గ్రామానికి చెందిన గ్రామపెద్దలు చెంచురెడ్డి, రవిచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి వచ్చి బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు, 16మంది సభ్యులు భక్తిశ్రద్ధలతో బగళాముఖి అమ్మవారి పావనం, ఘటములను శిరస్సున ధరించి మంగళవాయిద్యాలతో తమ గ్రామంలోనికి తీసుకువెళ్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అమ్మవారి పావనం, ఘటములకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి హారతులిచ్చారు. దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన జి.నాగకుమారి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. లక్ష విరాళాన్ని అన్నదానానికి అందజేశారు. చైన్నెకి చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కార్తికేయుని సన్నిధిలో ప్రత్యేక పూజలు మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ వెల్ఫేర్ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేశారు. -
వైఎస్సార్ సీపీ హయాంలో శరవేగంగా పనులు..
కాకానిలోని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో శరవేగంగా సాగిన పనులు గత పదినెలలుగా ముందుకు సాగడం లేదు. కళాశాలలో దాదాపు రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టింది. అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, యువతీ, యువకులకు వసతి గృహాల నిర్మాణాలు ప్రారంభించింది. ఈ రెండు నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. -
సేద్యం విభాగంలో హోరాహోరీ పోరు
బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఎడ్లజతకు ప్రథమస్థానం దాచేపల్లి: స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్లబలప్రదర్శన పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. సేద్యం విభాగంలో జరిగిన ఎడ్లబలప్రదర్శన పోటీలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లజత 5,122 అడుగుల దూరం బండలాగి విజేతగా నిలిచాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్లజత 4,757 అడుగుల దూరం బండలాగి రెండవస్థానం, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందంకి చెందిన సంపటం వీరబ్రహ్మాం నాయుడు ఎడ్లజత 4,750 అడుగుల దూరంబండలాగి మూడవస్థానం, సూర్యపేట జిల్లా కోదాడ మండలం కోదాడకి చెందిన షేక్ హుస్సేన్, హుజూర్నగర్కి చెందిన జక్కుల సహస్రయాదవ్ సంయుక్త ఎడ్లజత 4,644 అడుగుల దూరం బండలాగి నాల్గవస్థానం, కృష్ణ జిల్లా తోటవల్లూరు మండలం చినపులిపాకకి చెందిన ఆర్వీఎస్ బుల్స్, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంకి చెందిన యామిని మోహన్శ్రీ సంయుక్త ఎడ్లజత 4,250 అడుగుల దూరంబండలాగి ఐదవస్థానం, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మర్రివేములకి చెందిన సిద్ధి మల్లేశ్వరి ఎడ్లజత 3,914 అడుగుల దూరంబండలాగి ఆరవస్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు నగదు, షీల్డ్స్ని దాతలు బహూకరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ పోటీలను పర్యవేక్షించారు. -
విద్యారంగంలో అసంబద్ధ విధానాలపై ఆందోళన
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు నిరసనగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి ఆందోళన, పోరాటాలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవలింగారావు, మొహమ్మద్ ఖాలీద్ పేర్కొన్నారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 117 జీవోను రద్దు చేసి, పాఠశాల విద్యను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా పూర్వస్థితికి మార్చుతామని చెప్పిన ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు కొనసాగించడమే కాకుండా కొన్నిచోట్ల ఒకటి నుంచి టెన్త్ వరకు తరగతులు నిర్వహిస్తామని చెప్పడం ఉపాధ్యాయ, విద్యార్థిలోకాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను తీసుకురావడం ద్వారా విద్యారంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలకు ఈనెల 5న తేదీ పాత తాలుకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, మే 9న జిల్లా కేంద్రంలో ధర్నా, మే14 న విజయవాడలో రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం 12 డిమాండ్స్ పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.ఎస్.ఎన్. మూర్తి, జి.దాస్, జిల్లా కౌన్సిలర్లు పి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వర్లు, గురుమూర్తి, జహంగీర్, షూకూర్, మాలకొండయ్య పాల్గొన్నారు. -
బ్రాహ్మణ బాలురు దరఖాస్తు చేసుకోండి
అమరావతి: విజయవాడ పరిసర ప్రాంత కళాశాలల్లో ఇంటర్ నుంచి ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థులు హాస్టల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ బాలుర విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు జంధ్యాల శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ గవర్నరుపేట, పెద్దిబొట్లవారివీధి, ఏలూరురోడ్డులోని శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ బాలుర విద్యార్థి వసతి గృహంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. గుంటూరు, తెనాలి, గుడివాడ ప్రాంతాల పరిధిలోని కళాశాలల్లో చదువుచున్న విద్యార్థినులకు ఉపకార వేతనాలు ఇస్తామని తెలిపారు. స్కాలర్ షిప్నకు దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు వసతి గృహ కార్యాలయంలోగానీ, 8309012282, 9848044152 నెంబర్లలో గానీ సంప్రదించాలని తెలిపారు. మ్యూజియంలను అభివృద్ధి చేయాలి విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అమరావతి, చంద్రగిరిలలోని మ్యూజియంలను అభివృద్ధి చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు బుధవారం భారత ప్రభుత్వ కేంద్ర పురావస్తుశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆనంద్ మద్కర్ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పర్యాటకులు తరుచూ ఈ మ్యూజియంలను సందర్శిస్తున్నారని కానీ వారు ఇక్కడ గైడ్స్ సదుపాయం లేక ఈ ప్రాంతాల చరిత్రను తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఈ మ్యూజియంలలో డిస్ప్లే బోర్డ్స్, లైటింగ్ గ్యాలరీలను అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆనంద్ మద్కర్ మ్యూజియాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలో తగు అభివృద్ధి చర్యలు చేపడతామని చెప్పినట్లు వీరాంజనేయులు తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.20 అడుగుల వద్ద ఉంది. ఇది 138.9118 టీఎంసీలకు సమానం. -
పస్తులతో చస్తున్నా.. పట్టించుకోరా..!
వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నరసరావుపేట: రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. సంఘం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద సామూహిక రాయబారం, ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సుదీర్ఘకాలంగా 20వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వేతనాలు పెరుగుతాయని, పదోన్నతులు అమలు చేస్తారని ఆశించి భంగపడ్డామన్నారు. వీఆర్ఏలకు నిబంధనలకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్, అటెండర్ డ్యూటీలు వేస్తున్నారన్నారు. రీసర్వే పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని టీఏ, డీఏ అమలు చేయడం లేదన్నారు. అదనపు పని భారానికి ఆర్థిక సమస్యలు కూడా తోడుకావటంతో వీఆర్ఏల కుటుంబాలు పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ వీఆర్ఏలకు గత ఎనిమిదేళ్ల నుంచి వేతనాలు పెరగలేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బందగీ సాహెబ్ మాట్లాడుతూ వాచ్మెన్లు, అటెండర్లు ఎక్కడైతే అవసరమో అక్కడ సీనియారిటీ ఉన్న వీఆర్ఏలను శాశ్వత ప్రాతిపదికన నియమించాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏఓ శివలీలకు వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరాజు, సత్తెనపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, సిలార్ మసూద్, అధిక సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండ్ లేబర్ న్యాయమూర్తి బి.రాములు, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ (పోక్సో కోర్టు) న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగంల పరిచయ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో అన్ని కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా కోర్టులోని వాహనాల పార్కింగ్ వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులోని అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చి, కోర్టులో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులో మహిళా న్యాయవాదులకు బార్ అసోసియేషన్లో కావలసిన ఏర్పాట్లను సాధ్యమైనంత మేర సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పురాణం కల్యాణ లేడీ రిప్రజెంటివ్ బార్ అసోసియేషన్కు 30 కుర్చీలు అందజేశారు. క్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి 50 కుర్చీలకు కావలసిన నగదు చెక్కును ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళ శెట్టి శివ సూర్యనారాయణకు అందజేశారు. బార్అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి శివసూర్యనారాయణ మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ రిలేషన్కు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి న్యాయవాదులు తరఫున హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
శావల్యాపురం: హత్య కేసులో నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా...మండలంలోని శానంపూడి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అమృతపూడి నాగేశ్వరరావు (36) గతేడాది అక్టోబరు 7వ తేదీన కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మృతుడి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు, వినుకొండ మండలం ఎనుగుపాలెం గ్రామానికి చెందిన దావులూరి వీరబ్రహ్మం కలసి మండలంలోని కారుమంచి గ్రామం అద్దంకి బ్రాంచ్ కెనాల్ కట్టపై అక్టోబరు 7వ తేదీన రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతుడు నాగేశ్వరరావును, వీరబ్రహ్మం కాల్వలోకి తోసి పరారయ్యాడు. మార్టూరు సమీపంలో వలపర్ల కొమ్మినేనివారిపాలెం టి.జంక్షన్ వద్ద మృతదేహం లభ్యమైంది. అప్పట్లో మార్టూరు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం కేసును శావల్యాపురం పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దావులూరి వీరబ్రహ్మంను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. రైల్వే గ్యాంగ్మెన్ ఆత్మహత్య సత్తెనపల్లి: రైల్వే గ్యాంగ్మన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని రైల్వే క్వార్టర్స్లో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే గ్యాంగ్మన్గా పనిచేస్తున్న షేక్ మస్తాన్వలి (59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో మెడ, చేతికి బ్లేడ్తో కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడికి భార్య కరీమూన్, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కరీమూను ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో జీవిత ఖైదు నరసరావుపేటటౌన్: వ్యక్తిని దారుణంగా హతమార్చటంతోపాటు రూ.380 నగదును దోపిడీ చేసినట్లు నేరం రుజువవడంతో నిందితుడు పట్టణానికి చెందిన తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పందికి జీవిత ఖైదు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ స్థానిక 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2023వ సంవత్సరం మే నెల 9వ తేదీ రాత్రి పట్టణంలోని గాంధీ పార్క్ ఎదుట గల బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న 55 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడు ఇటుకరాయితో మోది దారుణంగా హతమార్చాడు. అతని వద్ద నుంచి కొంత నగదు తస్కరించాడు. సంఘటన జరిగిన మరుసటి రోజు 18వ వార్డు వీఆర్వో చల్లా చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అంకమ్మరావును అరెస్టు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం అప్పటి సీఐ ఎ.అశోక్కుమార్ కోర్టులో అభి యోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో హత్య కేసులో జీవిత ఖైదు, రూ.10000 జరిమానా, దోపిడీ కేసులో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించారు. శిక్షను ఏకకాలంలో అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ఏపీపీ దేశిరెడ్డి మల్లారెడ్డి నిర్వహించారు. నిందితుడు అంకమ్మరావు పలు హత్య, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. -
తెలుగువారందరూ వావిలాలను స్మరించుకోవాలి
సత్తెనపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్యను తెలుగువారందరూ స్మరించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్థంతిని పురస్కరించుకొని వావిలాల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతి వనంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ దేశం కోసం వావిలాల చేసిన పోరాటాలు, ఉద్యమాలు, స్మరించుకోవాలన్నారు. చాలా నిరాడంబరంగా జీవించి ఆంధ్ర గాంధీగా పేరు పొందిన వావిలాల అందరికీ ఆదర్శమని కొనియాడారు. నిత్యం ప్రజలను చైతన్యం చేసి ప్రజాభివృద్ధికై పాటుపడిన వావిలాల మన సత్తెనపల్లి వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య నాలుగు పర్యాయాలు సత్తెనపల్లి శాసనసభ్యుడిగా గెలిచి నిస్వార్ధంగా సేవలందించాడన్నారు. రచయితగా, జర్నలిస్టుగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి, గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు భాషాభివృద్ధికి అవిరళ కృషి చేసిన మహనీయుడన్నారు. నేటి శాసనసభ్యులు వావిలాలను స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా పని చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల మనవడు మన్నవ సోడేకర్ నేతృత్వంలో జరిగిన వర్థంతిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజ నారాయణ, సీనియర్ నాయకుడు పక్కాల సూరిబాబు, నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరావు నాయక్, నాయకులు అచ్యుత శివప్రసాద్, గంగారపు అనూష తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి వావిలాల 122వ వర్థంతి -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
దాచేపల్లి: రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు మంగళవారం రసవత్తరంగా జరిగాయి. ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాజీపురానికి చెందిన వేగనాటి ఓసూరరెడ్డి ఎడ్లజత 5వేల అడుగుల దూరం బండలాగి మొదటిస్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా పంగలూరు మండలం పంగలూరుకి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 4,952 అడుగుల దూరం బండలాగి రెండో స్థానం, ప్రకాశం జిల్లా అర్ధవీడుకి చెందిన సూర చైత్రరెడ్డి పూజితరెడ్డి ఎడ్ల జత 4,856 అడుగుల దూరం బండ లాగి మూడో స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన కావ్యనంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 4,750 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 4,358 అడుగుడుల దూరంబండలాగి ఐదవస్థానం, పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురంకి చెందిన చుండు అప్పయ్యచౌదరి ఎడ్ల జత 4వేల అడుగుల దూరం బండలాగి ఆరో స్థానం, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన పీవీఆర్ బుల్స్, పెడవల్లి బ్రదర్స్ 3,108 అడుగుల దూరం బండలాగి ఏడో స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు బహుమతులు, నగదు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, యలమల నరేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ తదితరులు పర్యవేక్షించారు. -
లిఫ్ట్ నుంచి జారిపడి కార్మికురాలు మృతి
మాచర్ల రూరల్: కందిపప్పు మిల్లులో పనిచేస్తూ లిఫ్ట్ నుంచి జారిపడి మహిళ గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 13వ తేదిన మండలంలోని రాయవరం జంక్షన్ సమీపంలోని తపస్వి లక్ష్మీ బాలాజి డాల్ మిల్లులో పనిచేసే కూరాకుల కాశమ్మ (44) రోజూ లాగానే మిల్లులో పనిచేసేందుకు వెళ్లింది. లిఫ్ట్లో నుంచి కిందికి వచ్చే సమయంలో బెల్టు తెగి కిందపడిపోయింది. ఈ సమయములో నడుముకు, కాలుకు తీవ్ర గాయమైంది. గాయపడిన ఆమెను మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపి మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ మహిళ కాశమ్మ నడుముకు, కాలుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న కాశమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందింది. కాశమ్మ భర్త నరసింహారావు కరోనా సమయంలో మృతి చెందాడు. మృతురాలు కాశమ్మకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడున్నారు. కాశమ్మ మృతదేహాన్ని మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు రూరల్ ఎస్ఐ రవిబాబు తెలిపారు. పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చీరాల: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చీరాలలో చోటుచేసుకుంది. ఒన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఇంకొల్లుకు చెందిన శివాజి (35) మంగళవారం చీరాలలోని ఓ లాడ్జి సమీపంలో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి అనుమతులు
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రంలో స్థానిక రవాణా శాఖ ఆర్టీవో కార్యాలయం పక్కనే ఏర్పాటుచేసిన ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో జిల్లా రవాణా శాఖ అధికారి సంజయకుమార్ అనుమతులు మంజూరు చేశారని ఆ శిక్షణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ కనకదుర్గ పద్మజ వెల్లడించారు. అనుమతి పత్రాన్ని మంగళవారం జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవ్కుమార్, ఎంవీఐ శివనాగేశ్వరరావు, వంశీల చేతుల మీదుగా తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ వెనుకబడిన పల్నాడు జిల్లా ప్రాంతంలో యువతకు స్వయం ఉపాధి కోసం కారు, హైడ్రాలిక్తో కూడిన ట్రక్ డ్రైవింగ్ (ట్రాన్స్పోర్టు వాహనం) శిక్షణ, లైసెన్స్, ఉపాధి ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చదువులేని యువతకు ఉపాధి కొరకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తామని, అదేవిధంగా రోడ్డుసేఫ్టీ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని తెలిపారు. స్వీకరించిన రోడ్డు సేఫ్టీ ప్రతినిధులు -
పెన్షనర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పెన్షనర్ల బిల్డింగ్లో అధ్యక్షులు మానం సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం పల్నాడు జిల్లా శాఖ పెన్షనర్ల సంఘ ఏప్రిల్ నెల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గౌరవాధ్యక్షులు లంకా రంగనాయకులు, కార్యదర్శి సీసీ ఆదెయ్య, కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు, అసోసియేషట్ ప్రెసిడెంట్ కంచుపర్తి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి పచ్చల నాగభూషణం, ఉపాధ్యక్షులు చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, పూనాటి సుబ్బారావు పాల్గొన్నారు. కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు 2024–25 ఏడాదికి పైనాన్స్ స్టేట్మెంట్ను ప్రవేశపెట్టారు. హెల్త్, గుర్తింపు కార్డుల గురించి చర్చించారు. -
వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులుగా గౌతంరెడ్డి
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా విజయవాడకు చెందిన పూనూరి గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 7న కౌన్సిల్ సమావేశం నెహ్రూనగర్: నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మే 7వ తేదీన జరగనుంది. ఈనెల 25వ తేదీన జరగాల్సిన కౌన్సిల్ సమావేశం మేయర్ ఎన్నిక కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదా పడిన సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్ కాపీలను సభ్యులకు మంగళవారం అందజేశారు. దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని వీరవట్నం సమీపంలో గల దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవ తిరునాళ్ల మంగళవారం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలవారు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి పొంగళ్లు నిర్వహించి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. స్వామికి ఇష్టమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నేడు దుర్గమ్మ సన్నిధిలో శ్రీమహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఉదయం 9 గంటలకు యాగం నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. యాగాన్ని దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వీర్ల అంకమ్మతల్లికి బోనాలు దాచేపల్లి: వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా మంగళవారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహిళలు దేవాలయానికి బోనాలతో వచ్చారు. నెత్తిపై బోనాలు పెట్టుకుని మేళతాళాలతో గ్రామ పురవీధుల్లో నుంచి దేవాలయానికి చేరుకుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రత్యేకంగా పూజలు చేసిన తరువాత అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యుడు యలమల నరేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. గాయత్రీదేవి శక్తి స్థూపం ఆవిష్కరణ కర్లపాలెం: గాయత్రీదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దమ్మనవారిపాలెం గ్రామంలో పి.వెంకట ప్రసూనాంబ, సునందనరావు దంపతుల ఆధ్వర్యంలో గాయత్రీదేవి స్థూపం ఆవిష్కరించారు. ముందుగా స్థూపం వద్ద శాంతిహోమాలు నిర్వహించారు. అనంతరం గాయత్రీ మహామంత్రం జపించి గాయత్రీదేవికి పూజలు చేశారు. ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు మొదలగు పంచభూతాల సమూహమే గాయత్రీదేవి అని చెప్పారు. విశ్వశాంతి కోసం గాయత్రీదేవిని పూజించాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, మాజీ ఎంపీపీ తాతా లీలావరప్రసాద్, మాజీ సర్పంచ్ అలపర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటై 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న వజ్రోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. గుంటూరు శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వర్సిటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వజ్రోత్సవ ఫైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఎన్జీరంగా విగ్రహావిష్కరణ చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్సిటీ రైతుల కోసం మరిన్ని వంగడాలను తయారు చేయాలని సూచించారు. ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి సాంకేతిక సదస్సును ప్రారంభించి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రొఫెసర్ విజయ్పాల్శర్మ, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాస్ నూతన వంగడాలు, పరిశోధనలపై చర్చించారు. సాంకేతిక నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ ఉపకులపతి డాక్టర్ పి.రాఘవరెడ్డి మాట్లాడుతూ 1964 నుంచి నేటి వరకూ విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధి, కృషిని అభినందించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవి సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి. శివన్నారాయణ అతిథులను శాలువాలతో సత్కరించారు. విశ్వవిద్యాలయం 60 ఏళ్ళలో సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఏర్పాటు చేసిన 150 పరిశోధన, వంగడాలు, ఇతర స్టాళ్లు రైతులు, సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.రామాంజనేయులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులు, పి.జె.పి.ఎస్.ఏ.యూ వైస్చాన్సలర్ జానయ్య, పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ జె.వి.రమణ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.గోపాల్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ వీసీ డాక్టర్ దామోదర్ నాయుడు,రైతులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట: పొగాకు రైతులు ఈ ఏడాది తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వైట్, బ్లాక్ రెండు రకాల బర్లీ సాగు చేస్తారు. అయితే రెండు రకాల రైతులు నష్టాల్లో ఉన్నారు. పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. గతేడాది పొగాకు జిల్లావ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో సాగు చేశారు. వారికి ఎకరానికి సుమారు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర దాకా లాభం వచ్చింది. దీంతో ఈ ఏడాది సాగు మూడింతలు పెరిగింది. సుమారు 5 వేల ఎకరాల్లో పంట సాగుచేసిన రైతులకు ప్రస్తుతం కొంతమంది ఆకు తీసిన కూలీల డబ్బు కూడా రాని పరిస్థితి నెలకొని ఉండటంతో చాలా మంది రైతులు కోయకుండా ఆపేస్తున్నారు. పొగాకు కొంటామని చెప్పిన బహుళజాతి సంస్థలు ఈ ఏడాది పొగాకు కొనడానికి ముందుకు రాకపోవడంతో వ్యాపారులు చెప్పిందే వేదమయ్యింది. గతేడాది రూ.12 వేలకు పైగా పలికిన నల్ల బర్లీకి ఈ ఏడాది కనీసం రూ.4 వేలు ఇవ్వమన్నా ఇవ్వకుండా వ్యాపారులు బెట్టుచేస్తున్నారు. తగ్గిన దిగుబడి, ధర... పొగాకు రైతుకు ఈ ఏడాది రెండు రకాలుగా దెబ్బ తగిలింది. ఒక వైపు దిగుబడి తగ్గడంతో పాటు మరోవైపు భారీగా ధర తగ్గడంతో రైతు తీవ్ర నష్టాల్లో ఉన్నాడు. క్వింటా ఆకు గుచ్చేందుకు 10 మంది కూలీలు అవసరం, ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.800 వేతనం చెల్లించాలి. నారు, సాగుకు కలిపి రూ.9 వేలు ఖర్చులు ఉండగా, కూలీలు, ఇతరత్ర పై ఖర్చులకు రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు పెట్టాల్సి వస్తుంది. కౌలు డబ్బులు అదనం. వెరసి ఎకరాకు రూ.లక్షన్నర దాకా పెట్టుబడి అవుతుంది.అచ్చంపేటలో సాగు చేసిన పొగాకు పంట న్యూస్రీల్ గతేడాది క్వింటా రూ.13 వేలు నుంచి రూ.15 వేలు పలకడంతో భారీ లాభాలు ఈ ఏడాది సాధారణ విస్తీర్ణానికి మించి సాగుచేసిన పల్నాడు రైతులు పంట చేతికందేసరికి దారుణంగా పడిపోయిన ధర తీవ్ర నష్టాల్లో పొగాకు రైతులు క్వింటాకు కనీసం రూ.4 వేలు కూడా దక్కని పరిస్థితి కంపెనీలు కొనలేమని చెప్పడంతో తేమశాతం పేరుతో దోచుకుంటున్న వ్యాపారులు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు -
గణనీయంగా పెరిగిన సాగు
గతేడాది ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చింది. రూ.15 నుంచి రూ.18 వేల వరకు ధర పలికి రైతులకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర మిగిలిన రైతులు ఉన్నారు. వారిని చూసే ఈఏడాది పొగాకు అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది ఎకరాకు 14 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది నంబర్ వన్ క్వాలీటీ రూ.10 నుంచి 12వేలు ఇస్తున్నారు. గతేడాది పనికిరాని సూరసైతం (గుల్లాకు) కూడా రూ.4వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మంచి ఆకు కూడా ఆ ధరకు కొనుగోలు చేయక పోవడం దారుణం. ప్రభుత్వం ఇప్పటికై నా పొగాకు రైతుల పరిస్థితిని గమనించి క్వింటాకు రూ.15 వేలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి...
మూడేళ్లుగా పొగాకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 14 ఎకరాలు సాగు చేయగా, వీటిలో 11 ఎకరాలు తెల్లబర్లీ, 3 ఎకరాల్లో నల్లబర్లీ(హెడ్డీ) రకాల్ని సాగు చేశాను. తెల్లబర్లీ వరకు అయితే కొంత నయం. కాని నల్లబర్లీ సాగు చేసిన రైతులకు మాత్రం పెట్టుబడి రాకపోగా, కనీసం కౌలు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. గతేడాది రూ.15వేల నుంచి రూ.18 వేలు ధర పలికింది. ఈ ఏడాది కనీసం రూ.4 వేలు కూడా అమ్మడం గగనమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటా రూ.15 వేలు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకోవాలి. –తంగేడుమల్లి మస్తాన్రావు, పొగాకు రైతు, యడ్లపాడు -
ఆత్మహత్యలే శరణ్యం!
సత్తెనపల్లి: తమకు న్యాయం చేయాలంటూ పురుగు మందు డబ్బాలతో మిర్చి రైతులు రోడ్డెక్కిన సంఘటన సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి రావిపూడి తిరుమలరావు లక్కరాజు గార్లపాడు గ్రామంతో పాటు చుట్టుపక్కల రైతులను నుంచి పెద్దఎత్తున మిర్చిని కొనుగోలు చేశాడు. అయితే నగదు చెల్లించకుండా కొద్ది రోజుల క్రితం పరారయ్యాడు. చివరకు లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన రైతులు ఆ వ్యాపారిని పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ నెల 8న గ్రామానికి చెందిన 13 మంది రైతులు తమ వద్ద 381 క్వింటాళ్లు మిర్చిని కొనుగోలు చేశాడని, వాటి నిమిత్తం రూ.41.30 లక్షలు ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. ఇంకా చాలామంది రైతులు నుంచి మిర్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. వ్యాపారిపై కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ నెల 26న బెయిలుపై విడుదలయ్యాడు. కానీ ఇంతవరకు రైతులకు న్యాయం జరగకపోవడంతో తమకు ఆత్మహత్యేలు శరణ్యం అంటూ పురుగుమందు డబ్బాలతో సత్తెనపల్లిలోని గుంటూరు – మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం బైఠాయించారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన తమ పరిస్థితి అసలే దయనీయంగా మారిందని, మిర్చిని కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా వ్యాపారి ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలు ఓపెన్ చేసి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ప్రతిన బూనడంతో పోలీసులు బలవంతంగా రైతుల వద్ద నుంచి పురుగుమందు డబ్బాలు లాక్కున్నారు. సత్తెనపల్లి టౌన్ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ అమీనుద్దీన్, పోలీసులు పురుగుమందు డబ్బాలు లాక్కొని రైతులకు సర్ది చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కిన మిర్చి రైతులు సత్తెనపల్లిలో గుంటూరు – మాచర్ల రహదారిపై టెన్షన్.. టెన్షన్ పోలీసుల జోక్యతో ఆందోళన విరమణ -
సగం పంట అమ్ముకోలేకపోయాను...
ఎకరం విస్తీర్ణంలో తెల్లబర్లీ రకం పొగాకు సాగు చేశాను. సుమారు రూ.1.50లక్షలు పెట్టుబడికి అయింది. మొత్తం 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటికి 6 క్వింటాళ్ల మేలు రకం క్వింటా రూ.13 వేలు చొప్పున అమ్ముకున్నాను. మిగిలింది సగం పొలంలోను, మరికొంత పాకాలోను తొక్కి పెట్టి ఉంచాను. గత ఏడాది ఇదే పొగాకు క్వింటా రూ. 25వేలు చొప్పున అమ్ముకున్నాను. ఈ ఏడాది అడిగే వారు లేరని కొంత పొలం లోనే దున్ని వేయాల్సి వచ్చింది. – గుత్తికొండ వెంకటాచారి, చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ మండలం -
కష్టపడే తత్వంతో ఉన్నత స్థానాలకు..
నరసరావుపేట: పల్నాడు జిల్లా వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ పిల్లలో కష్టపడే తత్వం గుర్తించడం జరిగిందని, అదివారి మంచి భవిష్యత్తుకు దారి తీస్తుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. మంగళవారం భువనచంద్ర టౌన్హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో 580 మార్కులకు పైబడి సాధించిన 92 మంది విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం 95శాతం నిర్ణయిస్తే, 85 శాతం లభించిందని అన్నారు. కారెంపూడిలో మండలంలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అభినందనీయమని చెప్పారు. అత్యధిక మార్కులు సాధించి, జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్ తరఫున నగదు బహుమతి అందజేశారు. మొదటి రెండు స్థానాలవారికి రూ.25వేలు, తృతీయస్థానం సాధించిన విద్యార్థికి రూ.15వేల నగదును అందచేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో 580 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. అనంతరం మొదటి స్థానం సాధించిన పావని చంద్రిక, ద్వితీయస్థానం సాధించిన షేక్ సమీరాలకు ఎమ్మెల్యే జూలకంటి తన సొంత నిధులు రూ. లక్ష చొప్పున, తృతీయస్థానం సాధించిన ప్రత్తిపాటి అమూల్యకు రూ.50వేల నగదు అందజేశారు. డీఈఓ ఎల్.చంద్రకళ, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
డబ్బులు తీసుకొని అతీగతీ లేదు
నా సోదరుడు ప్రశాంత్ కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. పట్టణానికి చెందిన టి.హనుమంతరావుతో పరిచయం ఏర్పడింది. నా సోదరుడిని ఇంగ్లిషు స్ప్రింగ్స్ స్టడీ ఇన్ ఐర్లాండ్ సంస్థ ద్వారా విదేశాలకు పంపిస్తామని రూ.15లక్షలు దఫాల వారీగా కట్టించుకున్నారు. ఇప్పటికీ రెండేళ్లు గడిచినా విదేశాలకు పంపలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగితే ప్రాణాలు తీస్తామని, ఎవడికి చెప్పుకుంటావో..చెప్పుకో..పో అంటూ బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –నడికుడి పాపారావు, పెద్దచెరువు, నరసరావుపేట -
అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు
లాంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో ఓ వైపు మట్టి దందా, మరో వైపు స్థలాల వరుస ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువును చెరబట్టి రూ.కోట్ల విలువైన మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. కొండ పోరంబోకులో మట్టిని తోలి చదును చేసుకొంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. – లాం నుంచి జొన్నలగడ్డ వెళ్లే ప్రధాన రహదారిలో టీడీపీ నాయకులు కొండను మింగేసి మట్టిని తోలి పూడ్చివేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా జానెడు జాగాలో ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్న పేదల ఇళ్లను 40కి పైగా పొక్లెయిన్లతో కూల్చారు. మరి కొంత మందికి నోటీసులిచ్చి, తమకు సహకరించాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. వీరి దుర్మార్గ వ్యవహారాలకు సహకరిస్తున్న అధికారులు సామాన్యులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణల పర్వానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు. అలరించిన శ్రీ గోదా కల్యాణం నృత్య నాటిక నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్విహిస్తున్న అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీమహా మంజీర నాదం సోమవారం ఆరో రోజుకి చేరింది. ఆలయ ప్రధాన కార్యదర్శి పుట్టగుంట ప్రభాకర్రావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. అనంతరం సీనియర్ మేకప్మేన్ ఆచారి (పసుపులేటి మద్దిలేటి)కి అపురూప రూపశిల్పి బిరుదుతో సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం సత్కరించారు. శ్రీగోదా కల్యాణం నృత్య నాటిక ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య, తాళ్లూరి ధరణి, తాళ్లూరి చక్రవర్తి పాల్గొన్నారు. -
మోసపోయాం.. ఆదుకోండి !
నరసరావుపేట: నా సోదరుడిని విదేశాలకు పంపిస్తామని నమ్మబలికి రూ.15లక్షలు కాజేశారని, రెండేళ్లు గడుస్తున్నా పంపించకుండా మోసం చేశారని పట్టణంలోని పెద్దచెరువు నివాసి నడికుడి పాపారావు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, చోరీలు, మోసం సమస్యలకు సంబంధించి 73 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. విదేశాలకు పంపిస్తామంటూ రూ.15లక్షలు కాజేశారు స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 3లక్షల వసూలు ఆర్థిక నేరాలపై పలు ఫిర్యాదులు అందుకున్న ఎస్పీ పీజీఆర్ఎస్లో 73 ఫిర్యాదులు స్వీకరణ -
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
దాచేపల్లి:రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన గాదె ఆషేర్ సుమణ్విరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, తుర్లపాడుకి చెందిన పోపూరి ఆదినారాయణ సంయుక్త ఎడ్లజత 5,059 అడుగుల దూరం బండ లాగి మొదటిస్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన పెరుమళ్ల సంజయ్కుమార్ ఎడ్ల జత 4,932 అడుగుల దూరం లాగి రెండవ స్థానం, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకి చెందిన మోపర్తి నవీన్కుమార్ చౌదరి ఎడ్లజత 4,500 అడుగుల దూరం లాగి మూడవ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన కావ్యనంది బ్రీడింగ్బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య ఎడ్లజత 4,432 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం విస్పపాలేనికి భాష్వికారెడ్డి, జ్ఞాన్విత్ రెడ్డి ఎడ్లజత 4,312 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన పసుమర్తి దివ్యశ్రీ ఎడ్ల జత 3,850 అడుగుల దూరం లాగి ఆరవ స్థానం, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకి చెందిన ఏలూరి లిఖితచౌదరి ఎడ్లజత 3,750 అడుగుల దూరం లాగి ఏడవ స్థానం, బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యద్దనపూడికి చెందిన మేసీ్త్ర ఖాదర్మస్తాన్ ఎడ్ల జత 3,316 అడుగుల దూరం లాగి ఎనిమిదో స్థానంలో నిలిచాయి.విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు బహుమతులు, నగదు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, యలమల నరేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ పర్యవేక్షించారు. -
మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలి
పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరిన మునుమాక గ్రామస్తులు నరసరావుపేట: మూడు గ్రామాల్లోని వందల ఎకరాలకు సాగునీటి కోసం నిర్మించిన చెక్ డ్యామ్ చుట్టూ వేసిన మట్టి కట్టలను అక్రమంగా తరలించుకుపోతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మునుమాక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబును కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సయ్యద్ కరిముల్లా, అన్వర్బాషా, జిలాని, షాజహాన్, జాన్సైదా, మస్తాన్వలితో పాటు పలువురు గ్రామస్తులు కలెక్టర్ను కలిసి అర్జీ అందజేశారు. కోటప్పకొండకు సమీప గ్రామాలైన కొండకావూరు, అరవపల్లి, మునుమాక గ్రామాల్లోని పొలాలకు అవసరమైన సాగునీటి కోసం మునుమాక వద్ద ఓగేరు వాగుపై చెక్డ్యామ్ నిర్మించారని తెలిపారు. ఈ గ్రామాలకు చెందిన పొలాలు కాలువ చివరి భూములు కావడంతో డ్యామ్ అవసరమైందని చెప్పారు. ఇటీవల కొందరు మట్టి దొంగలు డ్యామ్కు రక్షణగా ఉన్న మట్టికట్టలను తవ్వి తరలించుకుపోతున్నారని కలెక్టర్కు తెలిపారు. దీని వల్ల డ్యామ్కు రక్షణ లేకుండా పోయిందని, వరదల సమయంలో కొట్టుకొనిపోయే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పంట భూములు కోతకు గురయ్యే అవకాశం కూడా ఉందని, వందల ఎకరాలు బీడు భూములుగా మారి రైతులు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. అక్రమ మట్టి తరలింపును అరికట్టి చెక్డ్యామ్ను కాపాడాలని గ్రామస్తులు కోరారు. -
రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం
కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కూరపాటి కృష్ణ శావల్యాపురం: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కూరపాటి కృష్ణ మండిపడ్డారు. మండలంలోని గంటావారిపాలెంలో ఈనెల 19న ఎస్టీ వర్గీయుడైన కుంభా యోగయ్య దుకాణాలను పొక్లయిన్, జేసీబీతో కూల్చివేసి, కులం పేరుతో దూషించిన ఆగ్రవర్ణాలకు చెందిన కొనకంచి వెంకట్రావు, మురళి, మాదినేని మధుసూదనరావు, గోపు రామకృష్ణ, రావి హరి వెంకట నరసింహారావులపై ఎస్సీ,ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట దళిత, గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూరపాటి కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గీయులపై దాడులు జరిగిన వెంటనే గ్రామాన్ని సందర్శించి వారికి మనోఽఽఽధైర్యాన్ని నింపాల్సిన కలెక్టరు, ఎస్పీలు 10 రోజుల గడుస్తున్నా ఇప్పుటి వరకు రాకపోవడం చట్టాలను అపహస్యం చేయటమేనని తెలిపారు. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, బాధితులను భయపెడుతున్న ఎస్ఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తహసీల్దారు యం.అర్జున్నాయక్కు వినతిత్రం అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, ఓర్సు శ్రీనివాసరావు, జక్కా బ్రహ్మయ్య, చలంచర్ల అంజి, ఖాశీం, కుంభాల పోతురాజు, ఏడుకొండలు, సీపీఐ నాయకులు జె.కృష్ణానాయక్, వివిధ సంఘాల నేతలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
అచ్చంపేట: ఎదురుగా వస్తున్న బైక్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని చెరుకుంపాలెం ఆర్ అండ్ బీ రోడ్డు మలుపులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడువాయికి చెందిన వేమవరపు ప్రకాష్ మంగళవారం గ్రామంలో జరిగే చర్చి ప్రారంభోత్సవానికి కస్తలలో ఉంటున్న సోదరి జ్యోత్స్నతో పాటు కూతురు అక్షయ (2)ను తీసుకుని బైక్పై తీసుకుస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో చిన్నారి అక్షయ కిందపడి అపస్మారకస్థితికి వెళ్లింది. వెంటనే సమీపంలోని వెద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉదయాన్నే కుమారై అక్షయతో కలసి కస్తల వెళ్లిన ప్రకాష్ తిరుగు ప్రయాణంలో ఇలా జరగడం దురదృష్టకరం. జ్యోత్స్నకు కుడికాలు, కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనున్న మరో మహిళ మహిమ కూడా మోస్తరు గాయాలవ్వడంతో అంబులెన్స్లో సత్తెనపల్లి తరలించారు. సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, పాఠకులు రోజులో కొంత సమయాన్ని గ్రంథాలయంలో గడిపి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం బృందావన్ గార్డెన్స్లోని మహిళా బాలల గ్రంథాలయలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో భద్రపర్చిన పురాతన గ్రంథాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లిష్ , డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్స్, జీకే తదితర అంశాల్లో శిక్షణ కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏవీకే సుజాత, పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్. దీక్షితులు, జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ మల్లంపాటి సీతారామయ్య, విశ్రాంత గ్రంథ పాలకుడు ఎస్ఎం సుభాని, అధ్యాపకుడు శివారెడ్డి, మహిళా బాలల గ్రంథాలయ అధికారులు బి.శకుంతల, పి.సత్య శిరీష, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎఫ్సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్గా బందా పట్నంబజారు: పదవీ విరమణ తమ బాధ్యతలు ముగిశాయని కాకుండా, సామాజిక సేవతో పది మందికి మేలు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషనన్ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) విశ్రాంత ఉద్యోగుల నడవడికే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఎఫ్సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఛైర్మన్గా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు అమరావతి రోడ్డులోని మల్లేశ్వరి ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర సమావేశంలో ఈమేరకు ఎన్నికలు నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా వైస్ చైర్మన్ ఏఎస్ రామారావు, తాడేపల్లిగూడేనికి చెందిన కె సుధాకరరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. బందా రవీంద్రనాథ్తోపాటు రాష్ట్ర వైస్ చైర్మన్గా రాజమండ్రికి చెందిన కె.నాగేశ్వరరావు, కార్యదర్శిగా భీమవరానికి చెందిన జి. గోపాలరావు, సహాయ కార్యదర్శిగా విజయవాడకు చెందిన ఆర్. సాయిబాబు, కోశాధికారిగా పశ్చిమ గోదావరికి చెందిన డి మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా చైర్మన్గా పి. యలమంద, కోశాధికారిగా ఎస్.ప్రభాకరరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1990 నుంచి యూనియన్ వ్యవహారాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అనేక హోదాలలో పనిచేస్తూ 2022లో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్గా ఎంపికై నట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విశ్రాంత ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు నల్లయ్య, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి ప్రజల నుంచి 168 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. జేసీ గనోరే సూజర్ ధనుంజయ, డీఆర్ఓ మురళి, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పీజీఆర్ఎస్లో 168 అర్జీలు స్వీకరణ -
మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా మదార్ సాహెబ్
మాచర్ల: మాచర్ల పురపాలక సంఘం వైస్ చైర్మన్గా టీడీపీకి చెందిన మదార్ సాహెబ్ ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నిక జరిగింది. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జి.సూరజ్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఎన్నికకు 21 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరంతా మదార్ సాహెబ్ పేరును ప్రతిపాదించగా, ఏకగ్రీవంగా మదార్ను ఎన్నకున్నారు. మున్సిల్ వైస్ చైర్మన్గా మదార్ సాహెబ్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బెదిరింపులు, ప్రలోభాలు.. మాచర్ల పట్టణంలో 31 వార్డులు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 31 వార్డులు కై వసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒకరి తరువాత మరొకరిని పార్టీ మారాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు, ప్రలోభాలాకు గురిచేయడంతోపాటు, గతంలో పెట్టుకున్న బిల్లులు కూడా ఆపుతామని బెదిరించారు. దీంతో మొదట దఫా పది మంది కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. అనంతరం మరో ఆరుగురిని లాక్కున్నారు. 16 మందితో పది నెలల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్గా పోలూరి నరసింహారావును ఎంపిక చేసుకుని, అంతకు ముందు ఉన్న ఇన్చార్జి చైర్మన్, వైస్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబుతో రాజీనామా చేయించారు. అప్పటి నుంచి ఒకరితరువాత మరొకరిని బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తూ సోమవారం నాటికి టీడీపీ కూటమి 21 మంది కౌన్సిలర్లను తమ వైపు మల్చుకుని వైస్చైర్మన్ గెలిపించుకుని సంబరాలు జరుపుకొన్నారు. మదార్సాహెబ్ను పలువురు అభినందించారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, మాచర్ల అర్బన్ సీఐ ప్రభాకరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శ్రీకృష్ణ తలభారం
పల్నాడుమంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అరటిపండ్లతో విశేష పూజలు సత్తెనపల్లి: సత్తెనపల్లి నాగన్నకుంటలోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం అరటిపండ్లతో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. 108 రకాల ప్రసాదాల నివేదన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 514.40 అడుగుల వద్ద ఉంది. ఇది 139.2626 టీఎంసీలకు సమానం. విఘ్నేశ్వరునికి పూజలు పెదకూరపాడు: పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు సోమవారం పూజలు చేశారు. లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. 30న పాలిసెట్ ప్రవేశ పరీక్ష జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు నరసరావుపేట ఈస్ట్/నరసరావుపేట: పల్నాడుజిల్లా పరిధిలోని నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల మూడు పట్టణ కేంద్రాల పరిధిలోని 12 పరీక్షా కేంద్రాలలో ఈనెల 30వ తేదీన పాలీసెట్–2025 పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ బి.వి.రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 11గంటల తరువాత వచ్చిన అభ్యర్థులను కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 10గంటలకే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. పాలిసెట్కు దరఖాస్తు చేసుకొని ఉండి హల్టికెట్లు పొందని విద్యార్థులు తమ దరఖాస్తు నకలుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 10వ తరగతి హాల్టికెట్ (ఎస్ఎస్సీ)తో ఈనెల 29వ తేదీన తమ పరిధిలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల (పల్నాడురోడ్డు, నరసరావుపేట 9398421968 ), చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాల (గణపవరం, చిలకలూరిపేట, ఎన్.హెచ్ 16, 9912342063 ), కిడ్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, (కొత్త కేసీపీ కాలనీ, మాచర్ల, 9440613009 ) కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు. సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. వర్గపోరుకు కేరాఫ్.. గతంలో వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్ రాజకీయాలను పెంచిపోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు. మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు. అందుకే జగన్ పక్కన పెట్టేశారు.. వైఎస్సార్ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు. 7టీడీపీలోనూ అదే పంథా.. కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది. నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్ వర్గాన్ని ఆదరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్కే పేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది. వినుకొండలో తనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు. మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపార్టీలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి. న్యూస్రీల్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ఎంపీ తీరుతో ఎమ్మెల్యేల అసంతృప్తి పైకి హుందాతనం.. లోన మోనార్కిజం ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు వైఎస్ జగన్ అందుకే గెంటేశారంటున్న తెలుగు తమ్ముళ్లు తీరు మారకపోతే పార్టీ కార్యక్రమాలకు పిలవబోమని హెచ్చరికలు -
పల్నాడు యువతులకు గిన్నిస్ రికార్డులో చోటు
పిడుగురాళ్ల రూరల్: పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన యువతులు గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్ మాస్టర్ బి. అగస్టీన్ సారథ్యంలో 2024 డిసెంబర్ 1న 18 దేశాల నుంచి ఒకేసారి 1,090 మంది కళాకారులు కీ బోర్డును ప్లే చేసి ఇన్స్ర్ట్రాగామ్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ప్రపంచ రికార్డును సాధించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. అందులో పాల్గొన్న 1,046 మందికి ఏప్రిల్ 25న విజయవాడ గుణదల మెట్రోపాలిటిన్ మిషన్ చర్చిలో ధ్రువపత్రాలు అవార్డులను పంపిణీ చేశారు. అందులో జూలకల్లు గ్రామానికి చెందిన ఇనుముక్కల కవిత, ఇనుముక్కల కోటేశ్వరికి ఈ రికార్డులో చోటు దక్కడంతో సర్టిఫికెట్, అవార్డును అందుకున్నారు. వీరిద్దరు పాస్టర్ బంకా సురేష్ సహకారంతో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పాల్గొన్నట్లు తెలిపారు. కవిత, కోటేశ్వరిలను గ్రామ ప్రజలు, చర్చి సంఘ పెద్దలు అభినందించి, సన్మానించారు. -
ఉప సభాపతి రఘురామ వ్యాఖ్యలు అనుచితం
సీపీఎం సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ నరసరావుపేట: కార్మిక, కర్షక, పీడిత వర్గ ప్రజల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వాలకు ఉన్నతమైన సూచనలు చేస్తూ నిస్వార్థంగా ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పార్టీ నరసరావుపేట మండల సర్వసభ్య సమావేశం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అధ్యక్షతన నిర్వహించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ ఉపసభాపతి స్థానానికి రఘురామకృష్ణంరాజు అనర్హుడన్నారు. బ్యాంకులు నుంచి రూ.600కోట్లకు పైగా రుణాలు పొంది ఎగ్గొట్టిన ఆర్థిక ఉగ్రవాది అంటూ ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీసుకొచ్చిన నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జమ్ము కశ్మీర్లో ఉగ్ర దాడి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపించారు. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎ.వి.కె దుర్గారావు, డి.శివకుమారి, కె.పి.జి. మెటిల్డాదేవి, షేక్ సిలార్ మసూద్, టి. పెద్దిరాజు, కట్టా కోటేశ్వరరావు, బి. సలీం, సుభాష్ చంద్రబోస్, కె. రామారావు, షేక్ మస్తాన్ వలి, కె.నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు. -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడితే శంకర్నాయక్ మాచర్ల: ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడితే శంకర్నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1962లో ఎస్టీలకు కేటాయించిన రిజిర్వేషన్ను రద్దు చేయించి, మాచర్ల, కదిరి లాంటి నియోజక వర్గాలను జనరల్కు మార్చారని, దీని వల్ల మైదాన ప్రాంతంలో ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే లేకుండా అన్ని వర్గాలు కుట్ర చేశాయనితెలిపారు. ఆదివారం గిరిజన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన రాష్ట్ర నాయకులు మండ్లి పెద్ద మల్లుస్వామి, నూన్సావత్ రంగా నాయక్, సైదా నాయక్, సర్పంచ్ శ్రీను నాయక్లతో కలిసి మాట్లాడారు. 2026లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. ఇందులో గిరిజన జనాభాను జిల్లాల వారీగా యూనిట్గా తీసుకొని తమ హక్కులకు భంగం కలిగించకుండా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనే పోరాటంలో భాగంగా మాచర్లలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా గిరిజనుల సమావేశాన్ని నిర్వహించి, విజయవాడలో లక్షలాది మంది గిరిజనుల హక్కులపై పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గిరిజనులు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఉండగా, ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనిపై కుట్ర చేసి అభివృద్ధి చెందిన వడ్డెర, బోయ కులాలను ఎస్టీల్లో చేర్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజన, యానాది, ఎస్టీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల కోసం పోరాటం చేస్తామని వివరించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని సమావేశం పునాది అని, పోరాటానికి నాంది అని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం విస్తరించేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి
మార్కెట్ సెంటర్లో పలు సంఘాల నాయకులు నిరసన నరసరావుపేట: కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ శనివారం లాల్బహుదూర్ కూరగాయల మార్కెట్ వద్ద మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మృతులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం నశించాలని, దేశ సమైక్యతను కాపాడాలని, పాకిస్థాన్కు బుద్ధి చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మస్తాన్వలి మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం లేదని, అది ఏ రూపంలో ఉన్నా కూకటివేళ్లతో దేశం నుంచి పెకిలించి వేయాలని కేంద్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు, పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసి దేశంలో అలజడి సృష్టించాలని చూస్తోందని తెలిపారు. మన దేశంలో పాకిస్థాన్ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఉగ్రవాదుల చేతులలో అమరులైన కుటుంబలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. కాశ్మీర్ ప్రజల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ తీసుకునే ఎటువంటి చర్యలకై నా తమ వంతు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మాబుసుభాని, జిల్లా అధ్యక్షులు రఫీ, జిల్లా కార్యదర్శి ఖాసీం పీరా, ఇమాంసా, ఖాజా మున్నా, సుభాని సయ్యద్ బాషా, అర్షద్ పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలి మృతి
వెల్దుర్తి: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం సమీపంలో ఆదివారం జరిగింది. మాచర్ల పట్టణానికి చెందిన తెడ్లా లక్ష్మి (65) శనివారం సాయంత్రం 5గంటల సమయంలో భర్త శంకరరావు గుడికి వెళ్లిన సమయంలో ఒంటిపై ఉన్న బంగారపు నానుతాడు, ఉంగరం ఇంట్లో టేబుల్పై పెట్టి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. బాత్రూంలో తాళం చెవి ఉండటంతో తలుపు తెరిచి లోపలకు వెళ్లాడు. టేబుల్పై బంగారపు వస్తువులు ఉండటంతో శంకరరావు ఇరుగు పొరుగు వారిని వాకబు చేశాడు. లక్ష్మి కనిపించకపోవడంతో మాచర్ల టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం కొత్తపుల్లారెడ్డిగూడెం శివారులో బహిర్భూమికి వెళ్లిన వారు ఆంజనేయస్వామి దేవాలయం పక్కన కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉందని గ్రామస్థులకు తెలపగా వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదో రోజుకి చేరిన మహా మంజీర నాదం నృత్యాలు
నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 ఆదివారం ఐదో రోజుకి చేరాయి. శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరగ్గా, నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం బాద్షా షేక్(పశ్చిమ బెంగాల్) మణిపురి నృత్యాన్ని, గోకుల్ శ్రీదాస్ (భువనేశ్వర్) ఒడిశా నృత్యాన్ని, డాక్టర్ శరత్చంద్ర (తిరుపతి) భరతనాట్యం ప్రదర్శించారు. సభికులను నృత్యాలు అలరించాయి. ఆరవేటి ప్రభావతి, డాక్టర్ కె.దేవేంద్ర పిళ్లైలకు ప్రముఖ భరత నాట్య గురువు మరంగంటి కాంచనమాల జీవిత పురస్కారం అందించారు. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ కళాశాల పూర్వ ప్రధానాచార్యురాలు ఎస్.జానకీరాణి పాల్గొనగా, పఠాన్ మోహిముద్దిన్, వెంకటగిరి నాగలక్ష్మి పర్యవేక్షించారు. -
అక్రమ జంతు రవాణాపై విస్తృత తనిఖీలు
పిడుగురాళ్ల: వన్య ప్రాణుల అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి జి. కృష్ణప్రియ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు రేంజ్లు పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నర్సరావుపేటలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. వన్య ప్రాణులు, వృక్ష సంపద పరిరక్షణపై వాహనదారులకు, ప్రజలకు, అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, దుర్గి, మాచర్ల, పాపాయపాలెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, పాపాయపాలెం, నకరికల్లు, అచ్చమ్మపేట ప్రాంతాల్లో నాకాబంది నిర్వహించారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్లు కె. విజయకుమారి, పి. మాధవరావు, డి. వెంకట రమణ, విజయలక్ష్మితో జిల్లాలోని ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి పిడుగురాళ్ల: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులోని సున్నపు బట్టీల సెంటర్లో ఆదివారం ప్రజా సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత వారం రోజు నుంచి 12 వేల మందికి పైగా సాయిధ పోలీసులు, సైనిక బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని కోరారు. హెలికాప్టర్, డ్రోన్లను మోహరించి ఆదివాసీలు, మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు కె. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు, భారత్ బచావో జిల్లా కార్యదర్శి షేక్ సర్దార్, ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహాం లింకన్, జిల్లా కార్యదర్శి ఓర్సు కృష్ణ పాల్గొన్నారు. ఇగ్నో కోర్సులతో ఉద్యోగావకాశాలు పుష్కలం గుంటూరు ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తున్న కోర్సులతో పుష్కలమైన ఉగ్యోగావకాశాలు లభిస్తున్నాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ పి.శరత్చంద్ర పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ప్రాంగణంలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో ఆదివారం 2025 జనవరిలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. శరత్చంద్ర మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న వివిధ రకాల కోర్సుల గురించి వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఇగ్నో అందిస్తున్న మెటీరియల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇగ్నో సైట్లో పొందుపరచి ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని చెప్పారు. ఇగ్నో అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే లక్ష్యం కలిగిన వారు ఇగ్నో ద్వారా వారి ఆశయాన్ని నెరవేర్చుకోవాలని సూచించారు. ఇగ్నో వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్స్ గురించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అధ్యయన కేంద్ర కౌన్సిలర్ డాక్టర్ ఎంఎస్ నారాయణ, సహాయ సమన్వయకర్తలు డాక్టర్ పి.దేవేంద్ర గుప్త, ఎం.మార్కండేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు
దాచేపల్లి: స్థానిక వీర్ల అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం జరిగాయి. జత పళ్ల విభాగంలో 10 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా బయ్యారానికి చెందిన కడియం మణికంఠ ఎడ్ల జత 3,553 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా బసినేపల్లికి చెందిన యండ్లకంట్ల వెంకట చైతన్యకుమార్ ఎడ్ల జత 3,500 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా పాలూరుకి చెందిన కొణుదల హేమలతరెడ్డి ఎడ్లజత 3,324 అడుగుల దూరం బండ లాగి మూడో స్థానంలో నిలిచాయి. మాచయపాలేనికి చెందిన గౌరు కార్తికేయ, అబ్బూరుకి చెందిన నక్క బలరామకృష్ణయ్య సంయుక్త ఎడ్లజత 3,278 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, దాచేపల్లికి చెందిన కల్లూరి కార్తిక్ నాయుడు, భార్తవ్ నాయుడు ఎడ్లజత 3.235 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, మేళ్ల చెరువుకి చెందిన కొప్పుల గోవర్ధన్రెడ్డి, ప్రవలీష్రెడ్డి ఎడ్లజత 3,195 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు, షీల్డ్స్ను దాతలు బహూకరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, మునగా నిమ్మయ్య, అనిశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. -
డీఎస్సీపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న లక్ష్మీపురం: ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించాలని చేసిన ఆందోళన ఫలితంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం కావాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలనే అభ్యర్థుల అభ్యంతరాలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని కోరారు. ఎప్పుడు లేని మార్కుల పర్సంటేజ్ని తీసుకువచ్చారని అన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థుల అభ్యంతరాలపై మాట్లాడకపోవడం చూస్తే మంత్రికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందని చెప్పారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ స్పందించి వారి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ అభ్యర్థుల అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే వారితో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు పి.భార్గవ్, పి.బాషా, ఎం.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. నదిలో దూకి గుర్తు తెలియని వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్: కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ పైనుంచి ఓ వ్యక్తి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రతాప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానది సీతానగరం వైపు ప్రకాశం బ్యారేజ్ 6వ ఖానా వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణానది నీటి స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన గేటుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉంటుంది. మృతుడి శరీరంపై నల్ల జీన్స్ ఫ్యాంట్, నల్లని చొక్కా ధరించి ఉన్నాడు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే 8008443915 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు. -
‘కపిరాజు’ నాటికకు ప్రథమ బహుమతి
మార్టూరు : శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో మార్టూరులో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు శనివారంతో ముగిశాయి. ఇరవై కేటగిరీలకు గాను ఆరింటిలో బహుమతులను కై వసం చేసుకుని న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ విజయవాడ వారి ‘కపిరాజు’ నాటిక అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు కేటగిరిల్లో బహుమతులు పొంది కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ నాటిక ద్వితీయ స్థానం, మూడు కేటగిరిల్లో బహుమతులు సాధించి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. కపిరాజు నాటికకు సంబంధించి ఉత్తమ ప్రదర్శన, దర్శకుడిగా ఎమ్మెస్ చౌదరి బహుమతులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా పవన్ కల్యాణ్, మేకప్ మెన్గా దినేష్, పవన్ కుమార్, దిలీప్ ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ తృతీయ ఉత్తమ ప్రదర్శనతోపాటు ఉత్తమ రచయితగా అగస్త్య, హాస్యనటునిగా సురేంద్రబాబు, సురభి పూజిత ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ‘స్వేచ్ఛ’ నాటికకు గాను ఉత్తమ నటుడిగా గోవాడ వెంకట్, మంజు భార్గవి ప్రత్యేక బహుమతులు పొందారు.