
హ్యూమన్ రైట్స్, ఏసీబీ ఫోర్స్ లీగల్ కమిటీ ఎంపిక
మాచర్ల: రాష్ట్రంలో అవినీతి నిరోధక మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థకు మాచర్ల పట్టణానికి చెందిన ఇరువురు న్యాయవాదులను రాష్ట్ర, జిల్లా లీగల్ ఇన్చార్జిలుగా నియమిస్తూ బుధవారం ఫౌండర్ దేవానంద్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది భవనం వెంకట నరసింహారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్గా ఆర్జీఎన్, ఏసీబీ తరఫున ఎంపిక చేసి ఉత్తర్వులు అందించారు. మరో న్యాయవాది చల్లా వెంకటేశ్వరరావును పల్నాడు జిల్లా సంస్థ ఇన్ఛార్జిగా, జిల్లా లీగల్ అడ్వైజర్గా నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మానవ హక్కుల పరిరక్షణకు సంస్థ తరఫున కృషి చేస్తామన్నారు. వీరిని పలువురు అభినందించారు.

హ్యూమన్ రైట్స్, ఏసీబీ ఫోర్స్ లీగల్ కమిటీ ఎంపిక