
108 మందికి రెండే మరుగుదొడ్లా?
నరసరావుపేట: 108 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్లో రెండే మరుగుదొడ్లు ఉండటం, అవికూడా దుర్గంధం వెదజల్లటంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పట్టణంలోని మొదటి రైల్వేగేటు సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కన్పించిన అపరిశుభ్రతను చూసి మండిపడ్డారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, సోషల్ వెల్ఫేర్ ప్రస్తుత ఇన్చార్జి పిలిపించి వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ వేణుగోపాలరావు, సీడీపీఓ సూపర్వైజర్ పాల్గొన్నారు.
సేఫ్టీవాల్ నిర్మించాలి
నరసరావుపేట రూరల్: రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15రోజుల్లో సేఫ్టీవాల్ నిర్మించి పిల్లల భద్రత చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. లింగంగుంట్ల రాజుపాలెం వాటర్ట్యాంక్ పక్కనే ఉన్న ఎంపీపీ స్కూల్ను సోమవారం ఆమె సందర్శించి, పాఠశాల రికార్డులను పరిశీలించారు. పాఠశాల మరుగు దొడ్లకు 20 అడుగుల దూరంలోనే రైల్వే ట్రాక్ ఉండటాన్ని గమనించారు. పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సేఫ్టీవాల్ నిర్మించాలని ఆదేశించారు.
సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ను పరిశీలించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి