మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!! | TDP Activist Seema Raja Attack People In Kadapa Full Details Here | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన సీమరాజా.. తప్పతాగి, దాడి చేసి, పోలీసులకే హుకుం!!

Jun 5 2025 12:11 PM | Updated on Jun 5 2025 1:45 PM

TDP Activist Seema Raja Attack People In Kadapa Full Details Here

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్‌ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే..  

సీమరాజా మరికొందరు ఫుల్‌గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్‌ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.

తాను వైఎస్సార్‌సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్‌ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement