స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో?

Apr 8 2025 11:13 AM | Updated on Apr 8 2025 11:13 AM

స్వరూపకు  న్యాయం జరిగేదెప్పుడో?

స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో?

సాక్షి, వరంగల్‌: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప ఆడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో చివరగా సిరొంచ కమాండర్‌గా పనిచేస్తూ 2012లో పోలీసులకు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్‌మెంట్‌ చేయలేదు. ఆమె కుటుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవన స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చి మరోసారి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసా ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement