ప్రధాన వార్తలు

ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లాISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు

Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు
సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు.

ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్కు, రెండో టెస్ట్కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్లో జరిగే మూడో టెస్ట్కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

దేశపు యువరాణి ట్రంప్ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్
ఆమ్స్టర్డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) ఆ దేశపు క్వీన్ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్కు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్ ప్యాలెస్లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. Queen #Máxima of the #Netherlands mocked #Trump's facial expressions.🙃No hint of condemnation – just understanding. pic.twitter.com/hNP3Rp2UaM— Boris Alexander Beissner (@boris_beissner) June 25, 2025

మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు.

షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు.

రైల్వే ట్రాక్పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్తో దాడికి దిగింది.

కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్పర్సన్గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్తో ఇషా ప్రతి ఫ్రేమ్లో అందమమైన లుక్లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్లోని సెర్పెంటైన్ పెవిలియన్లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.
థియేటర్లలో కన్నప్ప.. ఓటీటీల్లో ఏకంగా డజన్ చిత్రాలు స్ట్రీమింగ్!
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
చైనా ప్రొడక్ట్లపై యాంటీ–డంపింగ్ సుంకం
ప్రియమణి థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘పవన్ ఎవరి నార తీస్తావ్..ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్!’
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
అమ్మ ఓడి.. 'పోయింది'
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
పెరగనున్న రైలు చార్జీలు
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఆధ్యాత్మిక పర్యటనలో అనసూయ (ఫోటోలు)
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
థియేటర్లలో కన్నప్ప.. ఓటీటీల్లో ఏకంగా డజన్ చిత్రాలు స్ట్రీమింగ్!
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
చైనా ప్రొడక్ట్లపై యాంటీ–డంపింగ్ సుంకం
ప్రియమణి థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘పవన్ ఎవరి నార తీస్తావ్..ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్!’
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
అమ్మ ఓడి.. 'పోయింది'
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
పెరగనున్న రైలు చార్జీలు
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
సినిమా

‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు.

24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్.. మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
మరికొన్న గంటల్లో(జూన్ 27) మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్లో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్కి ముందే భారీగా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్ని ఆన్లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 1,15,000 టికెట్స్ సేల్ చేసి కన్నప్ప రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.115,000 tickets sold in just 24 hours.My heart is racing! 🙏🏽To witness this kind of pre-release love and anticipation is truly humbling.I’m deeply grateful to every movie lover for the unwavering support.This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025

ధోనీని గంగూలీ బీట్ చేయగలడా? క్రికెటర్లలో ఎవరి బయోపిక్ రేంజ్ ఏంటి?
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్. ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్ మాలిక్ చిత్రంలో హీరోగా చేసిన రాజ్కుమార్ రావ్ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...సచిన్..విన్సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఫిల్మ్ 2017లో విడుదల అయింది. ఇండియన్ క్రికెట్ గాడ్గా అభిమానులు పిలుచుకునే సచిన్ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్ బాల్య దశ నుంచి 2011 వరల్డ్ కప్ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకుంది.థోనీ...ధనాధన్ మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ ద అన్టోల్డ్ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్గా మారడం నుంచి భారత కెప్టెన్గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది. అజహర్...యావరేజ్ సర్..మహ్మద్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పోషించాడు. క్రికెటర్గా అజార్ కెరీర్ కొనసాగిన విధం, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.మిథాలీ...సారీ...మహిళల క్రికెట్కు భారత్లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.కపిల్...కప్ ఫుల్...కపిల్దేవ్ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్ ప్రకారం కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా...

కన్నప్ప తీసింది వాళ్ల కోసమే.. కక్కుర్తి పడి కాదు: మంచు విష్ణు
సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్కార్న్, కోక్ ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు
ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్ట్లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలు (టెస్ట్ల్లో) సహా చివరి 9 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.డ్రా అయినా చేసుకోవాల్సింది..!తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ను భారత్ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్లు క్యాచ్లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది.టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్ల వివరాలు..ఇంగ్లండ్తో- ఓటమి (టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)

వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న శ్రీలంక బ్యాటింగ్ సంచలనం
శ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో మెరిశాడు. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా దినేశ్ చండీమల్ (59) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో లహీరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు.

నేనే గనుక గంభీర్ అయితే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి..: అశ్విన్
ఇంగ్లండ్తో రెండో టెస్టు (Ind vs Eng)కు ముందు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలన్న ఈ స్పిన్ దిగ్గజం.. పరుగులు సాధించడం కంటే కూడా ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు. ఏదేమైనా.. ఐదో రోజు వరకు ఆటను పొడిగించాలని.. ప్రత్యర్థిని ఫీల్డింగ్లో అలసిపోయేలా చేయాలని పేర్కొన్నాడు.అతడిని తీసుకోండిఇక తుదిజట్టులో పెద్దగా మార్పులు అక్కర్లేదన్న అశ్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఓటమికి భయపడాల్సిన పనిలేదు. వెనువెంటనే జట్టులో మార్పులూ చేయకూడదు.రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమిండియాకు ఉంది. అయితే, ఇంగ్లండ్ వ్యూహాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సిరీస్ మన చేజారిపోవడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు.ఒత్తిడి పెంచాలిఐదో రోజు వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. లేదంటే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద టార్గెట్ అయినా తాము ఛేదిస్తామని ఇంగ్లండ్ బహిరంగంగానే చెప్పింది. ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయంలోనే.. ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేలా ఒత్తిడి పెంచాలి.కనీసం 400- 450 పరుగుల మేర లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ గెలవగలం. వికెట్ను బట్టి ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి’’ అశ్విన్ భారత జట్టుకు సూచించాడు.అద్భుతమైన ఆటగాడు అతడుఇక రిషభ్ పంత్ తొలి టెస్టులో రెండు శతకాలు బాదడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విరాట్ కోహ్లితో పోల్చగల ఆటగాడు. ఒకవేళ నేనే గనుక హెడ్కోచ్ గౌతం గంభీర్ అయి ఉంటే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ‘నువ్వు అద్భుతంగా, అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశావు. ఈసారి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చు.130 పరుగులు చేసినపుడు కూడా నువ్వొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన లోయర్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ చేయలేదు కాబట్టి.. నువ్వు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి’ అని చెప్పేవాడిని. వాహ్.. ఎంతటి అద్భుతమైన ఆటగాడు అతడు’’ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. శతకం బాదిన తర్వాత ఫ్లిప్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవద్దని అశూ ఈ సందర్భంగా పంత్కు సూచించాడు. ఐపీఎల్ ఆడేటపుడు శరీరం ఎక్కువగా అలసిపోదని.. అప్పుడు జంప్ కొట్టినా పర్లేదన్న అశూ.. టెస్టు క్రికెట్ అందుకు భిన్నమని సున్నితంగా హెచ్చరించాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లో జూలై 2-6 రెండో టెస్టు జరుగుతుంది. చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!

నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్పై తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ 4, జాన్ క్యాంప్బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్లో ఉన్నారు. బ్రాత్వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్లో ఆసీస్పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు.
బిజినెస్

మెసేజ్ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం
మెటా వాట్సప్లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్లో చదవని మెసేజ్ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్ మేసేజ్లను స్క్రోల్ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్లు వచ్చే గ్రూప్లు, వ్యక్తులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ్లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్ డిఫాల్ట్గా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్గానే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ కంట్రోల్స్లో యూజర్లు తమ సెట్టింగ్స్ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది.

వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు.

ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం కంపెనీ సమర్పించిన ఫైలింగ్లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్ ఎక్స్పర్ట్ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపుతాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్షిప్ రోల్స్లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి.

దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది.
ఫ్యామిలీ

Jagannath Rath Yatra నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతజ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.రథాలపై నీలచక్రాల అమరిక పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు.

ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్వే లుక్లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!)

మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే.

చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..!
అతడు మలిచిన శిల్పాలు జీవం పోసుకున్నాయా అన్నట్లు కనిపిస్తాయి.. కాస్త దూరం నుంచి చూస్తే అరె అక్కడ ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. చేతితో తాకి చూస్తే తప్ప శిల్పం అని తెలుసుకోలేం.. మనతో లేని వారు మనమధ్యే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. శిల్పం తయారు చేస్తున్నంత సేపు అతడు తపస్సులో ఉన్నాడా అనిపిస్తుంటుంది. అతడి పేరే రాజేష్ – విజయనగర్కాలనీ నగరంలో పుట్టిపెరిగిన అతడు 1993లో మాసబ్ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివాడు. ఆ సమయం నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. 2021లో అతడు రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్కు అందజేయగా అక్కడ ధ్యాన మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సజీవ శిల్పాన్ని చూసి అబ్బురపడ్డ పలువురు మరో ఐదు విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ ఇవ్వగా ఆయన మొదటి వారంలోనే విగ్రహాలను తయారు చేసి షిరిడీ సంస్థాన్కు అందజేశారు. అతడి చేతులమీదుగా దివంగత జి.పుల్లారెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు, మైకెల్ జాక్సన్, రాఘవేంద్రస్వామి, చంద్రశేఖర సరస్వతిజీ, సంత్సేవాలాల్ విగ్రహాలతో పాటు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎం తదితర సంస్థలకు రాజేష్ ప్రస్తుతం పెయింటింగ్, శిల్పాలు వారి ఆర్డర్ మేరకు తయారు చేసి ఇస్తున్నారు.
ఫొటోలు
అంతర్జాతీయం

ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్ యత్నాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఐసీబీఎంలు లేని పాక్పాక్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్పీటీపై సంతకం చేయని పాక్ వద్ద 170 అణువార్హెడ్లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అణుఫైటర్ల కొనుగోలు
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు. కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.స్వాగతించిన నాటో.. ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఉన్నందుకు అమెరికాలో ప్రవేశించనివ్వలేదు
న్యూయార్క్: ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మికెల్సెన్ను అడ్డుకున్నారు. ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్ప్యాక్ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్ను అన్లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు. వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.

నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు.

బిహార్ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్లో
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి తుది ఓటరు జాబితాను ప్రకటించిన వెంటనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం బిహార్లో వచ్చే నాలుగు నెలల్లోగా ఓటర్ల జాబితా ఖరారుపై ఒక షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది.

మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది.

ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్కు పైలట్గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్ను భారత్కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది.హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
క్రైమ్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్పేట లాడ్జ్కి తీసుకెళ్లి..
హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్ పీఎస్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్నగర్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్ ద్వారా అయిన భరత్రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్నగర్లోని భరత్రెడ్డి ఇంటికి వెళ్ళగా దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఆర్నగర్కు పంపారు.

మద్యం తాగించి ఈవెంట్ డ్యాన్సర్పై లైంగిక దాడి
గచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం..సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈవెంట్లలో డ్యాన్సర్గా పని చేసే ఓ యువతి (23) గచ్చిబౌలి జంక్షన్లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్గా పనిచేసే ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రకాష్ (32) అదే వైన్ షాపు వద్దకు వచ్చాడు. మద్యం తాగుతున్న యువతిని పరిచయం చేసుకొని..ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేవగా..ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి మోసం చేశావంటూ ప్రకాష్ తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్ తన మొబైల్లో తీసిన యువతి న్యూడ్ ఫొటోలు చూపించాడు. ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు. అయినా యువతి మాత్రం తాను ఇక్కడ ఉండనని గొడవ పడి ఫ్రెండ్కు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ఫోన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు.