లు
పిలుస్తున్నాయ్..!
కేజీబీవీ అందుబాటులోని
కోర్సు
ఆమదాలవలస(తాళ్లవలస) ఎంపీసీ
బూర్జ(కొల్లివలస) బైపీసీ
ఎచ్చెర్ల(పొన్నాడ) ఎంపీసీ
జి.సిగడాం ఎంపీసీ
గార(శాలిహుండం) బైపీసీ
హిరమండలం(పాత హిరమండలం) బైపీసీ
ఇచ్ఛాపురం(బెల్లుపాడ) సీఈసీ
జలుమూరు ఎంపీసీ
కంచిలి(జాడుపుడి) ఎంపీసీ
కవిటి(కొత్తపాలెం) ఎంపీసీ
కోటబొమ్మాళి(కొత్తపేట) బైపీసీ
కొత్తూరు(వసప) ఎంపీసీ
ఎల్ఎన్పేట ఎంఎల్టీ
లావేరు(మురపాక) ఎంపీసీ
మందస(జీఆర్పురం) ఎంఎల్టీ
మెళియాపుట్టి బైపీసీ
నందిగాం(మదనాపురం) ఎంపీసీ
పాతపట్నం(ఇందిరమ్మకాలనీ) ఎంపీసీ
పోలాకి(గంగివలస) బైపీసీ
పొందూరు(లోలుగు కాలనీ) బైపీసీ
రణస్థలం(లంకపేట) ఎంపీసీ
సంతబొమ్మాళి ఎంపీసీ
సారవకోట(మెయిన్రోడ్) ఎంపీసీ
సోంపేట(రాజాం) బైపీసీ
శ్రీకాకుళం(సింగుపురం) ఎంపీసీ
ఇంటర్మీడియట్ కోర్సులు
కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కో కోర్సును ప్రభుత్వం అందుబా టులోకి తీసుకొచ్చింది. వాటి వివరాలు పరిశీలిస్తే...
● ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● 6వ తరగతి, ఇంటర్మీడియట్లో
ప్రవేశాలకు దరఖాస్తులు
● ఈనెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ
● మొత్తం 2,224 సీట్ల భర్తీకి చర్యలు
శ్రీకాకుళం న్యూకాలనీ:
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు వేళయ్యింది. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చు.
25 కేజీబీవీల్లో ప్రవేశాలు
పునర్విభజన అనంతరం 30 మండలాల శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1,000 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించడంతో కేజీబీవీకి 40 చొప్పున మొత్తం 1,000 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 7, 8, 9, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను సైతం భర్తీ చేపట్టనున్నారు. ఇందులో 7వ తరగతిలో 34, 8వ తరగతిలో 11, 9వ తరగతిలో 4, 12వ తరగతి ఇంటర్ సెకండియర్లో 172 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద కొత్త విద్యా సంవత్సరంలో 2,224 సీట్లను భర్తీ చేయనున్నారు. పేద, అనాథ పిల్లలతో పాటు బడిబయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు టెన్త్క్లాస్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జ్ట్టిఞ:// ్చఞజుజఛఠి. ్చఞఛిజటట. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
మెరుగైన ఫలితాలు
కేజీబీవీలు 2004లో ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు, సదుపాయాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ఏటా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేవిధంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 2018 నుంచి ఇంటర్మీడియట్ కోర్సులను కూడా అందిస్తున్నారు. 2018లో జిల్లాలో జి.సిగడాం, కోటబొమ్మాళి కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టగా, 2019లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరో 19 కేజీబీవీల్లో ప్రవేశాలకు గత రాష్ట్ర ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. 2021 నుంచి అన్ని చోట్ల ఇంటర్మీడియట్ కోర్సులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యార్థినుల భద్రతకు పెద్దపీట
● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం. ఉపాధ్యాయులు (టీజీటీ/ పీజీటీలు) సైతం మహిళలే.
● అలాగే ప్రహరీ, గేటు, వాచ్మ్యాన్లతో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది.
● అధికారుల తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు అవకాశం లేదు.
● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
● మనబడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు.
● అత్యద్భుతమైన మెనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు.
● సైన్స్ ప్రాజెక్టులు, యోగా, క్రీడలు, ఆటపాటలు నిర్విరామంగా ఉంటాయి. నీట్, జేఈఈ, ఏపీఈఏపీసెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా విద్యార్థినులను సన్నద్ధం చేస్తున్నారు.
● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక వంటి పథకాలకు వీరంతా అర్హులు.
హెల్ప్లైన్ కేంద్రం ఏర్పాటు
కేజీబీవీల్లో ఆన్లైన్లో దరఖాస్తుల సమయంలో ఏర్పడే సందేహాలు, సమస్యల నివృత్తి కోసం ప్రభుత్వం టోల్ఫ్రీ నంబర్ 18004258599ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సందేహాల కోసం సమగ్రశిక్ష జీసీడీవో 94401 12221 నంబర్ను సంప్రదించవచ్చని ఏపీసీ డాక్టర్ శశిభూషణ్ సూచించారు.
మంచి అవకాశం
కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రత్యేకంగా బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశమని చెప్పాలి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదు వు, వసతి కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. స్టేట్ ఎస్పీడీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. – డాక్టర్ సంపతిరావు శశిభూషణ్,
సమగ్ర శిక్ష ఏపీసీ, శ్రీకాకుళం
కేజీబీవీ
కేజీబీవీ
కేజీబీవీ