తూర్పు కాపుల ఐక్యతను చాటిచెప్పాలి | - | Sakshi

తూర్పు కాపుల ఐక్యతను చాటిచెప్పాలి

Mar 25 2025 2:02 AM | Updated on Mar 25 2025 1:58 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా తూర్పుకాపు సామాజికవర్గం ప్రతినిధులు సురంగి మోహనరావు, డోల జగన్మోహన్‌, లంక గాంధీ, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావులు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో తూర్పుకాపుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో ముందుగా తూర్పు కాపు జాతి ఐక్యత చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపులు నేడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 38 మండలాల్లో జాతి ఐక్యత చైతన్య సదస్సులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. త్వరలో దీనికి సంబంధించిన టూర్‌ ప్రోగ్రాం విడుదల చేస్తామన్నారు.

పరిహారం ఇవ్వకపోవడం దారుణం

వంశధార ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం వలన దెబ్బతిన్న నిర్వాసితులకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా అర్హులైన నిర్వాసితులకు గత ప్రభుత్వం పెంచిన పరిహారాన్ని సత్వరమే అందించి ఆదుకోవాలని కోరారు. నిర్వాసితులకు కేటాయించిన కొత్తూరు మండలం గూనభద్ర కాలనీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని తీర్మానించారు. హిరమండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తూర్పు కాపు సామాజికవర్గం భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతలు వెంటనే కమిటీ ప్రతినిధులకు అందజేయాలని, చిరకాల స్వప్నం కాపు భవన్‌ నిర్మాణం త్వరలో సాకారం కాబోతుందన్నారు. లావేరు మండలం నుంచి తూర్పు కాపు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా భవనం నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ కూడా పునః ప్రారంభమవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డోల తిరుమలరావు, పొగిరి సుగుణాకరరావు, కిళ్లారి నారాయణరావు, డాక్టర్‌ ఎం.రామజోగినాయుడు, పడాల తమ్మునాయుడు, వాళ్ల శ్రీరాములునాయుడు, రౌతు గోపి, సురవరం పార్వతీ, గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌.సత్యనారాయణ, పిసిని వసంతరావు, కురిటి దుర్గారావు, డాక్టర్‌ చందక రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పల్లి సురేష్‌, పాండ్రంకి రమేష్‌ నాయుడు, డోల బాలమురళీకృష్ణ, ఎం.శంకర్‌నారాయణ, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement