జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 32కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెంలో 2, హుజూర్నగర్లో 2, మఠంపల్లిలో 1, నేరేడుచర్లలో 1, తిరుమలగిరిలో 2, తుంగతుర్తిలో 2, ఆత్మకూరు (ఎస్) మండలంలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని, అలాగే రోజూ పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment