సూర్యాపేట టౌన్: వీక్లీ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ కె.నర్సింహ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. సమయం దొరికినప్పుడల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యాయామం చేయడం చాలా ముఖ్యమన్నారు. పోలీసులు తమ ఫిట్నెస్ను నిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నర్సింహాచారి, ఆర్ఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ కె.నర్సింహ