ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!

Published Sat, Apr 5 2025 12:18 AM | Last Updated on Sat, Apr 5 2025 12:18 AM

ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!

ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!

–రూ.20 లక్షలు కాజేసిన వైనం

–ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

వేలూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు వేలూరు ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు..కాట్పాడి సమీపంలోని కయంజూరుకు చెందిన బాధితులు కొన్ని నెలల క్రితం వేలూరులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తన చిన్నాన కొడుకు చైన్నె సచివాలయంలో పనిచేస్తున్నారని, డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. తన కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం కోసం 2021లో రూ.18 లక్షలు, ఆ తర్వాత 2022లో రూ.2 లక్షలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా, నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement