Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Fire On CM Chandrababu on Singaiah Row1
సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్‌ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్‌ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్‌ రానప్పుడు మేం మీకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌. మరి జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్‌ వెహికల్స్‌, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్‌ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్‌ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్‌. మంచి బుల్లెట్ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్‌, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్‌. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్‌మీట్‌ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్‌ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025

India Vs England 1st Test Day: Team India Set 370 Runs Target To England2
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్‌, పంత్‌.. ఇంగ్లండ్‌ ముందు భారీ లక్ష్యం

లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌ ముందు 370 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్‌ రాహుల్‌ (137), రిషబ్‌ పంత్‌ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్‌ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్‌), యశస్వి జైస్వాల్‌ 4, శుభ్‌మన్‌ గిల్‌ 8, కరుణ్‌ నాయర్‌ 20, శార్దూల్‌ ఠాకూర్‌ 4, సిరాజ్‌ 0, బుమ్రా 0, ప్రసిద్ద్‌ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌, జోష్‌ టంగ్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్‌ 2, వోక్స్‌, స్టోక్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్‌ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్‌ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్‌ డకెట్‌ 62, జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 రాణించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Khamenei Step down Exiled Iranian Crown Prince3
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!

టెహ్రాన్‌ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్‌ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్‌ 23వ తేదీ) పారిస్‌ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్‌) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్‌ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్‌లోని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్‌లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు.

Andhra woman becomes first Indian to complete Nasa program, to go to space in 20294
Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?

సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్‌లో ఉంటున్నారు. అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్‌ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్‌లాండ్‌లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్‌లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.

IND VS ENG 1st Test: List Of Records KL Rahul Broke With Century Vs England In Leeds5
IND VS ENG 1st Test: ఇంగ్లండ్‌ గడ్డ సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్‌ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో రాహుల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్‌.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్‌ 137 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (20) క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్‌ స్కోర్‌ 332/4గా ఉంది. భారత్‌ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్‌లో మరో భారత ఆటగాడు రిషబ్‌ పంత్‌ (118) కూడా శతకొట్టాడు. పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్‌పై భారత్‌ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్‌ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ తన కెరీర్‌లో 9 టెస్ట్‌ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం​ విశేషం. భారత ఓపెనర్లలో సునీల్‌ గవాస్కర్‌ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్‌ తర్వాత రాహుల్‌ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్‌ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్‌ ఓపెనర్లు..కేఎల్‌ రాహుల్‌-3విజయ్‌ మర్చంట్‌-2సునీల్‌ గవాస్కర్‌-2రవిశాస్త్రి-2రాహుల్‌ ద్రవిడ్‌-2లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్‌గా రికార్డు. రాహుల్‌కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్‌గ్లూ లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్‌ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్‌ ఇంగ్లండ్‌పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్‌ ద్రవిడ్‌ (6), సచిన్‌ టెండూల్కర్‌ (4), దిలీప్‌ వెంగసర్కార్‌ (4), రిషబ్‌ పంత్‌ (4) మాత్రమే ఇంగ్లండ్‌ గడ్డపై రాహుల్‌ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్‌ గంగూలీ రాహుల్‌తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్‌ టెండూల్కర్‌ (17), విరాట్‌ కోహ్లి (12), రాహుల్‌ ద్రవిడ్‌ (10), సునీల్‌ గవాస్కర్‌ (8) రాహుల్‌ కంటే ముందున్నారు. రాహుల్‌తో సమానంగా మహ్మద్‌ అజారుద్దీన్‌ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 471, ఇంగ్లండ్‌ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్‌ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Amazon CEO Andy Jassy stark warning to his 1 5 million employees6
వణికిస్తున్న సీఈవో వార్నింగ్‌..

అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్‌ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్‌ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్‌ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు

IND VS ENG 1st TEST: PANT BECOMES THE FIRST ASIAN WK BATTER TO SCORE HUNDREDS IN BOTH INNINGS7
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌

టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ టెస్ట్‌ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్‌ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పంత్‌ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో ​15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్‌ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్‌ రాహుల్‌ 120, కరుణ్‌ నాయర్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌ 4, సాయి సుదర్శన్‌ 30, శుభ్‌మన్‌ గిల్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్‌ బషీర్‌, బెన్‌ స్టోక్స్‌ తలో వికెట్‌ తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్‌ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్‌ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్‌ డకెట్‌ 62, జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 రాణించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer8
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Deputy Cm Pawan Kalyan Made Provocative Comments9
సుపరిపాలన సభలో పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Actor Sriram Brought for Questioning in Drugs Case10
డ్రగ్స్‌ కేసులో హీరో శ్రీరామ్‌ అరెస్ట్‌

చెన్నై: డ్రగ్స్‌ కేసులో సినీ హీరో శ్రీరామ్‌ (Sriram) అలియాస్‌ శ్రీకాంత్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్‌ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్‌లో ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ప్రసాద్‌ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్‌ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్‌ కోసం ప్రదీప్‌ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌కు 40 సార్లు డ్రగ్స్‌ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్‌ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్‌ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్‌ సినీజర్నీ..శ్రీరామ్‌.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్‌ పోలీస్‌, దడ, నిప్పు, లై, 10th క్లాస్‌ డైరీస్‌,స్నేహితులు(డబ్బింగ్‌ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement