ప్రధాన వార్తలు

సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్. మరి జడ్ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్పార్టీలను జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025

IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 370 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు.

Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్లో ఉంటున్నారు. అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్లాండ్లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.

IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డ సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడంతో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్ 137 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (20) క్రీజ్లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 332/4గా ఉంది. భారత్ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్లో మరో భారత ఆటగాడు రిషబ్ పంత్ (118) కూడా శతకొట్టాడు. పంత్ తొలి ఇన్నింగ్స్లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో 9 టెస్ట్ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం విశేషం. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్లు..కేఎల్ రాహుల్-3విజయ్ మర్చంట్-2సునీల్ గవాస్కర్-2రవిశాస్త్రి-2రాహుల్ ద్రవిడ్-2లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్గా రికార్డు. రాహుల్కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్గ్లూ లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్ ఇంగ్లండ్పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (6), సచిన్ టెండూల్కర్ (4), దిలీప్ వెంగసర్కార్ (4), రిషబ్ పంత్ (4) మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్ గంగూలీ రాహుల్తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (17), విరాట్ కోహ్లి (12), రాహుల్ ద్రవిడ్ (10), సునీల్ గవాస్కర్ (8) రాహుల్ కంటే ముందున్నారు. రాహుల్తో సమానంగా మహ్మద్ అజారుద్దీన్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు

IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్కీపర్ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్కు ముందు కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 120, కరుణ్ నాయర్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

సుపరిపాలన సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
బీచ్లో కాజల్ అగర్వాల్ .. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్!
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డ సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
ఎమోషనల్ ఎంటర్టైనర్.. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’
ఈ ఫోటోలోని చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్... ఎవరో గుర్తుపట్టారా?
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
తోడల్లుడు కావడమే అర్హతా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
బీచ్లో కాజల్ అగర్వాల్ .. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్!
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డ సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
ఎమోషనల్ ఎంటర్టైనర్.. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’
ఈ ఫోటోలోని చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్... ఎవరో గుర్తుపట్టారా?
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
తోడల్లుడు కావడమే అర్హతా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
సినిమా

నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ధనుశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున ఎవరి కాళ్లకు దండ పెట్టడు.. ఒక్క ఆయనకు తప్పా.. అని అన్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయన మీ నాన్నగారి( సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్దాస్ నారంగ్) కాళ్లకు తప్పా. నాకు ఆయన అంతే ఇష్టం. ఆయన గౌరవాన్ని నిలబెడుతూ మీరిద్దరు కూడా వెళ్లడం చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా థర్డ్ జనరేషన్ జాన్వీ కూడా అదే బాటలో వెళ్తోంది. మళ్లీ మాతో సినిమా చేయొచ్చు కదా అని సునీల్ నారంగ్ నాతో అన్నారు. మా నాన్నగారు మీ సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించాం. కానీ ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత మీకు సినిమాలు రాకుండా పోయాయి కదా (నవ్వుతూ). ఇక మీ మూడో తరం నిర్మాత జాన్వీకి ఆల్ ది బెస్ట్. ఇక జాన్వీతో కూడా సినిమా చేస్తే మూడు జనరేషన్స్తో చేసినట్లవుతుందని' చిరంజీవి అన్నారు.

బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్ వైడ్గా ఏకంగా 9వ స్థానం!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్కు కాస్తా దగ్గరగా ఉంది.

మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
తెలుగు సీరియల్ నటి అంజలికి సీమంతం వేడుకలు సందడిగా జరిగాయి. 'మొగలిరేకులు' సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇప్పుడు తనకు సీమంతం జరిగిందని చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?)'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం సీరియల్స్ పూర్తిగా తగ్గించేసిన అంజలి.. భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఎక్కువగా కూతురు చందమామతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన ఈమె.. ఇప్పుడు తనకు గ్రాండ్గా సీమంతం జరిగిన విషయాన్ని వీడియో రూపంలో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు యాంకర్ స్రవంతితో పాటు అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ తదితరులు వచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఇంగ్లండ్తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.రాహుల్ శతక ఇన్నింగ్స్లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్ కూడా సెంచరీ బాదాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది.ఇందుకు బదులుగా స్టోక్స్ బృందం తమ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేయగా.. భారత్కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుదలగా నిలబడగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్- పంత్ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్ 100, రాహుల్ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.𝗖 𝗛 𝗔 𝗠 𝗣 𝗜 𝗢 𝗡 𝗦 𝗧 𝗨 𝗙 𝗙 🫡🙌🏻After missing out in the first innings, @klrahul makes it count in the second! A priceless century that puts #TeamIndia in a commanding position in the 1st Test! 🇮🇳#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on JioHotstar 👉… pic.twitter.com/FVrutSIABd— Star Sports (@StarSportsIndia) June 23, 2025

కేఎల్ రాహుల్ మాస్టర్ మైండ్.. జట్టు పీక్కున్న పాకిస్తాన్ సంతతి బౌలర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడగా (భారత్ 471, ఇంగ్లండ్ 465).. భారత్కే స్వల్ప ఆధిక్యం లభించింది. 6 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రాహుల్ 98, పంత్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 232 పరుగులుగా ఉంది.ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతుంది. భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంత క్లాసీ ఆటగాడో అంతే తెలివిపరుడని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఓ సందర్భంలో రాహుల్ తన మాస్టర్ మైండ్ను ఉపయోగించిన తీరును భారత క్రికెట్ అభిమానులు తెగ ప్రశంశిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అనంతరం రాహుల్కు తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సాయి సుదర్శన్ జత కలిశాడు. సాయి సుదర్శన్ వచ్చీ రాగానే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఎత్తుగడలను మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై అప్పటికే ఒత్తిడిలో ఉన్న సాయి సుదర్శన్పై బెన్ తన స్పిన్ అస్త్రం, పాకిస్తానీ సంతతి ఆటగాడు షోయబ్ బషీర్ను ప్రయోగించాడు.ఈ సమయంలో రాహుల్ తన మాస్టర్ బుర్రను (సాయి సుదర్శన్ను అలర్ట్ చేసే క్రమంలో) ఉపయోగించాడు. సాయి సుదర్శన్తో హిందీ, ఇంగ్లీష్లో కాకుండా తమిళంలో సంభాషించాడు. పాకిస్తానీ సంతతి వాడైన షోయబ్ బషీర్కు హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్దమవుతుందనే ఉద్దేశంతో రాహుల్ సాయితో తమిళంలో మాట్లాడాడు. రాహుల్ తనకు అర్దం కాని భాషలో మాట్లాడటం చూసి బషీర్ జట్టు పీక్కున్నాడు. కర్ణాటకు చెందిన రాహుల్కు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలే కాకుండా తమిళం కూడా తెలుసని చాలామందికి తెలీదు. వాస్తవానికి ఈ ట్రిక్కు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వాడేవారు. పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడే సమయంలో వారికి ఇంగ్లీష్, హిందీ అర్దమవుతాయని ఆ ఇద్దరు దిగ్గజాలు మరాఠీలో మాట్లాడేవారు. తమ వ్యూహాలు ప్రత్యర్ధికి అర్దం కాకుండా భారత దిగ్గజాలు ఈ ఎత్తుగడను ఉపయోగించేవారు. తాజాగా రాహుల్ సచిన్, ద్రవిడ్ మాస్టర్ మైండ్స్ను ఫాలో అయ్యి క్రికెట్ అభిమానులచే శభాష్ అనిపించుకున్నాడు.

KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30), కెప్టెన్ శుబ్మన్ గిల్ (8)ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట దశలో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్లపై భారం పడింది.నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదిలోనే గిల్ అవుట్ కావడంతో.. పంత్ రాహుల్ (KL Rahul)కు జతయ్యాడు. ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఓవైపు కేఎల్ రాహుల్ కూల్గా తన పని తాను చేసుకుపోతుంటే.. రిషభ్ పంత్ (Rishabh Pant) మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ముప్పై మూడవ ఓవర్లో మూడో బంతికి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఫోర్ బాదిన పంత్.. అదృష్టవశాత్తూ క్యాచ్ అవుట్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిని బంతి ఫైన్-లెగ్ రీజన్లో గాల్లోకి లేవగా.. వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పంత్ బతికిపోయాడు.చూసి ఆడు.. నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదుఈ నేపథ్యంలో రాహుల్ పంత్కు సలహా ఇచ్చాడు. ‘కాస్త చూసి ఆడు.. జాగ్రత్త’ అని హెచ్చరించాడు. అయితే, పంత్ ఇందుకు కాస్త దురుసుగానే సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. ‘‘నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు. జాగ్రత్తగానే హిట్టింగ్ చేస్తున్నా’’ అని పంత్ పేర్కొన్నాడు. స్టంప్ మైకులో ఈ మాటలు రికార్డయ్యాయి.స్కోర్ చేయలేకపోతున్నాంఆ తర్వాత మరోసారి.. ‘‘బంతి పాతబడిపోయింది. మరీ ఆచితూచి ఆడటం వల్ల స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ అయిపోతున్నాం’’ అని పంత్ పేర్కొనడం గమనార్హం. వీరికి సంభాషణను హైలైట్ చేస్తూ కామెంటేటర్లు హర్షా భోగ్లే, ఛతేశ్వర్ పుజారా నవ్వుకున్నారు. మరోవైపు.. టీమిండియా అభిమానులు రాహుల్ కూల్గానే పని పూర్తి చేస్తాడని ప్రశంసిస్తూనే.. పంత్ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టాననికి 175 పరుగుల వద్ద నిలిచింది. రాహుల్ 83, పంత్ 41 రన్స్తో ఆడుతున్నారు. ఇక 57వ ఓవర్ ముగిసే సరికి భారత్ 57 ఓవర్లలో 192 పరుగులు చేసింది. పంత్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. ఇక ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మెరుగ్గా ఆడి.. మంచి స్కోరు నమోదు చేస్తేనే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరగలదు.UPDATE: Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’Give us a day full of stump mic Pant, we won't complain! 🎙️ 🤭 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @RishabhPant17 pic.twitter.com/51XLsNwqu9— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025

IND VS ENG 1st Test: సెహ్వాగ్ సరసన రాహుల్.. గవాస్కర్ ఒక్కడే మిగిలాడు..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్కు కెరీర్లో ఇది 18వ హాఫ్ సెంచరీ. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓపెనర్గా అతనికిది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ ఒక్కడే ప్రస్తుతం రాహుల్ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్గా గవాస్కర్ సేనా దేశాల్లో 19 హాఫ్ సెంచరీలు చేశాడు.సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్లలో9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్లలో9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్లలో9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్లలోమ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది.ఈ దశలో రిషబ్ పంత్ రాహుల్కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 153/3గా ఉంది. రాహుల్ 72, పంత్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
బిజినెస్

మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్ ఫండ్..
ఇటీవలి కాలంలో మార్కెట్లలో దిద్దుబాటు నెలకొన్నప్పటికీ.. స్మాల్, మిడ్క్యాప్ విభాగంలో వ్యాల్యూషన్లు (కంపెనీల విలువలు) సౌకర్యంగా లేవని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చిత పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్–ఇజ్రాయెల్, ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాలు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పెంపు వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ అనుకూలమన్నది నిపుణుల సూచన. మెజారిటీ ఇన్వెస్టర్లకు వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడమే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్. ఎక్కువ మంది అమ్మేస్తుంటే ఈ ఒత్తిడికి కొన్ని స్టాక్స్ (ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా కానీ) ధరలు అధికంగా పడిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా కాంట్రేరియన్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ స్థిరమైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన పనితీరు చూపిస్తోంది. ఏడాది కాలంలో 17.3 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 25.4 శాతంగా ఉంది. ఐదేళ్లలో 28.4 శాతం, పదేళ్లలో 17.6 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2013 నుంచి 2025 మధ్య ఐదేళ్ల కాల రోలింగ్ రాబడులు బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. నెలవారీ సిప్ రాబడులు పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 19.2 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం.. ఈ పథకం కాంట్రేరియన్ విధానం ఒక్క దానినే పూర్తిగా అనుసరించదు. రంగాల వారీ కేటాయింపుల పరంగా వివేకంతో వ్యహరిస్తుంటుంది. స్టాక్స్ ఎంపికకు మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కరోనా క్రాష్ తర్వాతి కాలంలో లార్జ్క్యాప్నకు 70 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఈ కేటాయింపులను తగ్గించుకుంది. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 3–4 శాతం మంచి నగదు నిల్వలను కలిగి ఉండదు. ఎప్పటికప్పుడు రంగాల వారీ వస్తున్న మార్పులను గమనించి, వేగంగా తన పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుంది. దీంతో మెరుగైన రాబడులు ఇవ్వడం, రిస్క్ తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. కాంట్రేరియన్ విధానం మధ్యలో కొంత కాలం పాటు మెరుగైన రాబడులు ఇవ్వకపోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసమే (5–7 ఏళ్లకు మించి) కాంట్రా ఫండ్స్ను ఎంపిక చేసుకోవడం సూచనీయం.పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,398 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.45 శాతం మేర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. 0.55 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పెట్టుబడులను గమనిస్తే 69.36 శాతం మేర లార్జ్క్యాప్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ స్టాక్స్లో 26.90 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 3.74 శాతానికి పరిమితమయ్యాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 81 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 33 శాతం మేర పెట్టుబడులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం మేర పెట్టుబడులు కేటాయించింది. హెల్త్ కేర్ కంపెనీల్లో 14 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది.

ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే పాత ఫోన్ కండిషన్ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్ఐఫోన్ ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి అప్గ్రేడ్ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది.

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..
ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలి. చాలా మంది ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కింద తెలుసుకుందాం. సరైన ధ్రువపత్రాలు, తగినంత శ్రద్ధ పెడితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ముందుగా కొత్త విధానమా, పాత విధానమా ఎంచుకోవాలి. మీరు చేయాల్సినది ఏమిటంటే రెండు విధానాల్లోనూ ఆదాయాన్ని లెక్కించండి. ఆదాయపు పన్ను భారాన్ని లెక్కించండి. ఎందులో తక్కువగా భారం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం ఒక పద్ధతి. సెక్షన్ 80సీ మొదలైన వాటి కింద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు కంపల్సరీగా ఉన్నా ఈ విధంగా చేయొచ్చు. ముందుగా మీకు క్లారిటీ ఉంటే వేరే చెప్పనవసరం లేదు.ఏఐఎస్, ఫారం 26 ఏఎస్.. ఈ రెండింటినీ డౌన్లోడ్ చేసుకోండి. వీటి ద్వారా టీడీఎస్, టీసీఎస్, మీరు చెల్లించిన ట్యాక్సులు అంటే అడ్వాన్స్ ట్యాక్స్, ఇవన్నీ కచి్చతంగా తెలుస్తాయి. ఏవైనా తేడాలు, హెచ్చుతగ్గులుంటే, మీ యజమానిని/ డిడక్టర్లను/ బ్యాంకులను వెంటనే సంప్రదించండి.అన్ని కాగితాలను సమకూర్చుకుని వాటిని పరిశీలించండి. ఫారం 16, ఫారం 16ఏ, బ్యాంకు స్టేట్మెంట్, పాస్బుక్లు, వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు, గత వారం చెప్పిన విధంగా ప్రతి డిడక్షన్కి సంబంధిత కాగితాలు పూర్తి వివరాలతో ఉండాలి. వాటిని చదవండి. అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మవిద్యేమీ కాదు.ప్రీ–ఫిల్డ్ ఫారంలలో సాధారణంగా తప్పులు ఉండవు. అయినా ఏదైనా అప్డేట్ చేయకపోయినా, చేర్చకపోయినా అవి అప్డేట్ కావు. ఉదాహరణకు ఇంటి అడ్రెస్లాంటివి. మీరు ఇల్లు మారొచ్చు. మీ బ్యాంకు ఖాతాలు మారి ఉండొచ్చు. అలాగే మీ సెల్ నంబర్లు. ఇలా ప్రతి అంశం కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.ఇక ఏయే ఫారం వాడాలో తెలుసుకోండి. ఎంచుకోవడమనేది మీ ఇష్టం కాదు. 1,2,3,4,5,6,7.. ఇలా మొత్తం ఏడు ఫారంలు ఉన్నాయి. మీకు నచ్చినది.. మీకు ఇష్టమైనది ఎంచుకోవడానికి వీల్లేదు. మీ ఆదాయాన్ని బట్టి ఫారంలు వర్తిస్తాయి. గతంలో ఎన్నో సార్లు తెలియజేశాం. కావాలంటే వెబ్సైట్లో వివరాలు ఉంటాయి. సాధారణంగా ఏ ఫారానికీ ఎటువంటి కాగితమూ జతపర్చనక్కర్లేదు. డాక్యుమెంట్లలోని అంకెలను చెక్ చేసుకుని, వాటిని కరెక్టుగా ఎటువంటి తేడాలు రాకుండా/లేకుండా నింపాలి. గడువు తేదీ లోపల ఈ ఫైల్ చేయండి. 2025 జులై 31 నుంచి 2025 సెప్టెంబర్ 15 వరకు గడువు తేదీని పొడిగించారు. తేదీ దాటితే లేటు ఫీజు పడుతుంది. నష్టాన్ని సర్దుబాటు చేయరు. ఇది చాలా పెద్ద నష్టం. అంతే కాకుండా డిడక్షన్లు, మినహాయింపులు ఇవ్వరు. గతంలో లేటుగా చేస్తే ఇన్ని నష్టాలు ఉండేవి కావు. అందుకని ఎలాంటి ఆలస్యం చేయొద్దు.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా!ఈ–ఫైలింగ్ తర్వాత వెరిఫై చేయాలి. పాన్తో ఆధార్ అనుసంధానం చేసిన వారికి సులువుగా ఈ–వెరిఫై అయిపోతుంది. మాన్యువల్గా చేసే వారు అక్నాలెడ్జ్మెంట్ కాపీ తీసుకుని, సంతకం పెట్టి, ఈ ఫారం ఐటీఆర్– Vని సకాలంలో బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి స్పీడ్ పోస్టులో పంపాలి. అలా పంపకపోతే రిటర్ను వేయనట్లే. జాగ్రత్త వహించండి. ఏ ఫారం దాఖలు చేయాలన్న విషయాన్ని హెల్ప్డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త విధానం కంపల్సరీ. అయితే, మీరు ప్రతి సంవత్సరం విధానాన్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్లో నింపేటప్పుడు వర్తించే విషయాలకు YES అని, వర్తించని వాటికి NO అని రాయాలి.అన్ని ఫారంలలో కొత్త షెడ్యూల్స్ను పొందుపర్చారు. వీటి వల్ల అదనపు సమాచారం ఇవ్వాలి. అయితే, ఇది ఇవ్వటానికి సరైన కాగితాలు ఉండాలి. పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అబద్ధం/తప్పు/ఎక్కువ/తక్కువ/పొరపాటుకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. అలాగని భయపడిపోవాల్సిన పని లేదు. తగినంత శ్రద్ధ పెడితే.. ఇదేమీ కష్టమైన పని కాదు.

అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది.
ఫ్యామిలీ

అందానికి ఆధారం..నీరు, ఆహారం..!
ప్రతి వ్యక్తి అందానికీ దోహదం చేసేవాటిలో నీరు, ఆహారం ప్రధానమైనవని బ్యూటీ క్వీన్, నటి మనసా వారణాసి అన్నారు. కొత్తపేటలో నూతనంగా నెలకొల్పిన సికారా క్లినిక్స్లో సౌందర్య పోషణలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల వినియోగం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంప్రదాయ ఆహారం, సౌందర్య సాధనాల విలువ అమూల్యమైనదని, అయితే ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ట్రీట్మెంట్లు తప్పవని అన్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన హైడ్రో ఫేషియల్ వంటి చికిత్సలు తనకు ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సౌదర్య చికిత్స నిపుణులు, సంస్థ నిర్వాహకులు రాఘవేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య నిపుణులు సైతం కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తాగమని సూచిస్తుంటారు. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే గాక, శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది. తద్వారా చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉంటుందనేది సౌందర్య నిపుణుల వాదన. ఇది ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే తేలికపాటి అందుబాటులో ఉన్న రెమిడీ. అంతేగాదు చల్లటి నీటిలో ముఖంపై పెట్టిన రక్తసరఫరా జరిగి మృతకణాలు పోతాయని కూడా అంటుంటారు నిపుణులు. అందువల్ల నీళ్లని తప్పనిసరిగా ఎక్కువగా తాగేలా ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగానూ, అందంగానూ ఉందాం. (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!)

Ooty టీ తోటలు తప్ప ఏముంది బ్యూటీ అనుకుంటున్నారా?
ఊటీలో తేయాకు తోటలున్నాయి. వందలాది గులాబీల తోట ఉంది. బొటానికల్ గార్డెన్లో శిలాజవృక్షం ఉంది. ఏడు వేల అడుగుల ఎత్తులో సరస్సు.ఎనిమిది వేల అడుగుల్లో పర్వత శిఖరం. ఊటీ అంటే... యాభై ఏళ్ల కిందటబాలీవుడ్ హీరో హీరోయిన్లు... యుగళగీతాలు పాడిన నేల.. టాలీవుడ్... పాటల తోట. రకరకాల టీల రుచిని ఆస్వాదిస్తూఊ... టీ తోటల్లో విహరిద్దాం.1వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నంబర్ 17230, శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ప్రయాణం రాత్రంతా సాగుతుంది. 2వ రోజు ఉదయం (07.57గంటలకు) రైలు కోయంబత్తూరుకి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ఊటీకి బయలుదేరాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, రిఫ్రెష్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్లో విహరించి రాత్రికి హోటల్కి చేరడం. రాత్రి బస ఊటీలోనే. 3వ రోజు: బేక్ఫాస్ట్ తరవాత దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శనం తర్వాత హోటల్కు చేరడం. ఆ రాత్రి బస కూడా ఊటీలోనే.4వ వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కూనూరు సైట్ సీయింగ్కి వెళ్లాలి. తిరిగి ఊటీకి వచ్చి హోటల్కి చేరి విశ్రాంతి. షాపింగ్ చేసుకోవచ్చు.5వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంత సమయం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతిగా ఫొటో షూట్ చేసుకుంటూ గడిపిన తర్వాత మధ్యాహ్నం గది చెక్ అవుట్ చేసి కోయంబత్తూరుకు బయలుదేరాలి. ట్రైన్ నంబర్ 17229 శబరి ఎక్స్ప్రెస్ 15.55 గంటలకు కోయంబత్తూరు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు సికింద్రాబాద్కి ఆరవ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుతుంది. బ్రిటిష్ కాలం నాటి ఉద్యానవనం ఊటీకి ఎందుకెళ్లాలి? ఊటీలో టీ తోటలు తప్ప ఏమున్నాయ్ చూడడానికి? అనే పెదవి విరుపులు ఉంటాయి. కానీ ఊటీలో చూసి తెలుసుకోవాల్సినవి, ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దీనిని కలయ తిరిగి చూడడం ఆహ్లాదంతోపాటు బోనస్గా విజ్ఞానం కలుగుతుంది. ఇది 54 ఎకరాల గార్డెన్స్ సముదాయం. బ్రిటిష్ పాలన కాలం నాటిది. తమిళనాడు ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోంది. చెట్లలో ఆరు వందల రకాలున్నాయి. గార్డెన్స్ మధ్యలో ఫాజిల్డ్ ట్రీ ట్రంక్ (శిలాజ వృక్షం) ఉంది. రెండు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన వృక్షం అది. ఔషధ వృక్షాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్, లోయర్ గార్డెన్, ఫౌంటెయిన్ టెర్రస్ గార్డెన్ ఇలా రకరకాలుగా విభజించి ఉంటుంది. ఫాజిల్ ట్రీ ట్రంక్ లోయర్ గార్డెన్లో ఉంది.తెలుగు పాటల తోటకూనూరు పట్టణం ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఒకప్పటి తెలుగు సినిమాపాటల చిత్రీకరణ కేంద్రం అనవచ్చు. సినిమా కథలో సన్నివేశాలు ఊటీలో చిత్రీకరించి, పాటలకు మాత్రం కూనూరుకు వచ్చేవాళ్లు తెలుగు దర్శకులు. అప్పట్లో ఊటీ, కూనూరు... ఈ రెండు ప్రదేశాలనూ ఊటీగానే పరిగణిస్తూ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఊటీ వెళ్తున్నట్లు దర్శకులు చెప్పేవారు. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలనీని తలపించేది. యూరోపియన్ శైలి ఫుడ్ రెస్టారెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వెయ్యి రకాల మొక్కలతో సిమ్స్ పఆర్క్ ఉంది. ఊటీ ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయితే కూనూరు పాశ్చాత్య విలాసంగా కనిపిస్తుంది. గులాబీల తోట!ఊటీ బొటానికల్ గార్డెన్స్ అనగానే ఎక్కువ మందికి రోజ్ గార్డెన్ గుర్తు వస్తుంది. ఇక్కడ వందల రకాల గులాబీ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏటా జరిగే నీలగిరి ఫ్లవర్ షోకి ప్రపంచ దేశాల నుంచి లక్షా యాభై వేల మంది సందర్శకులు వస్తారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కలతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్రాల మ్యాప్ను నిశితంగా పరిశీలించి ఆస్వాదించాలి. అన్నట్లు బోన్సాయ్ వృక్షాలను చూడడం మరిచి΄ోవద్దు. ఈ గార్డెన్స్ పరిధిలో తోడా గిరిజన తెగ నివసించే చిన్న ప్రదేశం కూడా ఉంది. దానిని తోడా మండ్ అంటారు. వారి జీవనశైలి ప్రత్యేకం. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలు అందంగా ఉంటాయి.బాలీవుడ్ డ్యూయెట్లు ఇక్కడే!ఊటీలో మనం చూసే సరస్సు సహజసిద్ధమైనది కాదు. బ్రిటిష్ ΄ాలన కాలం నాటిది. చల్లటి నీలగిరుల్లో ఉన్న ఊటీ బ్రిటిష్ వారి వేసవి విడిది. విహారం కోసం సరస్సును తవ్వించారు. యాభై ఎకరాల బొటానికల్ గార్డెన్స్కు దీటుగా ఏడు వేల అడుగుల ఎత్తులో తవ్విన 65 ఎకరాల సరస్సు ఇది. బ్రిటిష్ అధికారులు సరదాగా వేటాడడం కోసం చేపలను పెంచేవారు. ప్రస్తుతం చేపల వేట లేదు. పర్యాటకుల వినోదం కోసం బోట్ షికారు ఉంది. సరస్సు చుట్టూ విస్తరించిన ఎత్తైన చెట్లను చూస్తూ పెడల్ బోట్లో నిదానంగా విహరించడం అనిర్వచనీయమైన అనుభూతి. వేగంగా ప్రయాణించే మోటర్ బోట్లు కూడా ఉంటాయి. సరస్సు చుట్టూ రౌండ్ కొట్టాలంటే సైకిళ్లు అద్దెకిస్తారు. ఈ సరస్సు దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అందులో పిల్లలను ఆకర్షించే టాయ్ ట్రైన్, హాంటెడ్ హౌజ్, హార్స్ రైడ్ ఉంటాయి. ఇక ఊటీ గొప్పదనాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సినిమా చిత్రీకరణ లొకేషన్. ఓ యాభై ఏళ్ల కిందట సినిమాల చిత్రీకరణ ఎక్కువ భాగం ఊటీ, కూనూరుల్లో జరిగేది. తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఇక్కడే డ్యూయెట్లు పాడుకున్నారు. టెలిస్కోప్లో చూద్దాం!ఊటీ పేరు ఉదకమండలం. ఇది తూర్పు కనుమలలోని నీలగిరుల్లో విస్తరించిన ప్రదేశం. నీలగిరుల్లో ఎత్తైన కొండను దొడబెట్ట అంటారు. దొడబెట్ట అనేది కన్నడ పదం. పెద్ద కొండ అని అర్థం. ఈ ప్రదేశం ఊటీ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉంది. శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల అడుగులు. శిఖరాన్ని చేరడానికి ట్రెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఉంది, వాహనాలు వెళ్తాయి. ఈ శిఖరం మీద టెలిస్కోప్ హౌస్ ఉంది. సముద్ర తీరాల్లో లైట్ హౌస్లను చూస్తుంటాం. ఈ శిఖరం మీద ఉన్న టెలిస్కోప్ నుంచి నీలగిరుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. టీ కప్పు తెచ్చుకుందాం!టీ మ్యూజియం ఊటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో విస్తారమైన టీ తోటల మధ్య ఉంది. దొడబెట్ట రూట్లో∙వస్తుంది. నిజానికి ఇది పెద్ద టీ ఫ్యాక్టరీ. ఇక్కడ తేయాకును కట్ చేయడంతోపాటు ఆకును స్టీల్ కంటెయినర్లలో వేసి వేడితో ఎండబెట్టడం, క్రష్ చేసి ప్రాసెస్ చేయడం అన్నింటినీ చూడవచ్చు. రకరకాల టీలను రుచి చూడవచ్చు. అలాగే పొడులు కొనుక్కోవచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన గుర్తుగా టీ మ్యూజియం లోగో ముద్రించిన టీ కప్పులు, ప్లేట్లు, టీ షర్ట్లు కొనుక్కోవచ్చు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. టూర్ ప్యాకేజ్ నిర్వహకుల ఐటెనరీ ఈ సమయానికి అనుగుణంగానే ఉంటుంది.బోట్హౌస్లో షికారు!ఊటీకి 20 కిమీల దూరాన ఉంది పైకారా. ఇది తోడా గిరిజనుల ఆరాధ్య ప్రదేశం. నది పేరు, జలపాతం పేరు, జలపాతం ఉన్న ప్రదేశం పేరు అన్నీ పైకారానే. ఇక్కడ గిరిజనులు కొలిచే ఆలయంలో దేవతను కూడా పైకారా అమ్మ అని పిలుస్తారు. ఈ నది మీద డ్యామ్ ఉంది. రిజర్వాయర్లో బోట్ షికార్ చేయవచ్చు. ఇక్కడ మామూలు పడవలు కాదు, పైకప్పుతో బోట్ హౌస్లుంటాయి. ప్రశాంత పర్యటనహైదరాబాద్లో మొదలై హైదరాబాద్ చేరడంతో పూర్తయ్యే ఈ టూర్ ప్యాకేజ్ పేరు... ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ఎస్హెచ్ఆర్094)’. ఇది ఆరు రోజుల పర్యటన. గడియారంతో పరుగులు పెడుతూ ఎక్కువ ప్రదేశాలను చుట్టేసే పర్యటన కాదు. ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగే చక్కటి విహారం. మూడు రోజులు ఊటీలో బస చేయవచ్చు. టూర్ కోడ్: ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు ప్యాకేజీ ధరలివి! కంఫర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ) సింగిల్ షేరింగ్లో ఒకరికి సుమారుగా 30 వేలవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 17 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 16 వేలు, పిల్లలకు ఒక్కరికి పదివేలు సుమారుగా. స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్) సింగిల్ షేరింగ్లో ఒకరికి 27 వేలకు పైగా, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 15 వేలు, ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా అవుతుంది.రోడ్డు ప్రయాణానికి ఏసీ వాహనాలు, బసకు నాన్ ఏసీ హోటళ్లు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.హోటల్లో ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్యాకేజ్లో ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలు వర్తించవు.బోటింగ్, హార్డ్ రైడింగ్, పర్యాటక ప్రదేశాల ఎంట్రన్స్ టికెట్లు కూడా ప్యాకేజ్ ధరలో వర్తించవు. వాతావరణం: ఈ నెలలో ఉష్ణోగ్రతలు 25–17 డిగ్రీల మధ్య ఉంటాయి. ఉలెన్ దుస్తులు తీసుకెళ్లాలి. స్వల్ప వర్షపాతం ఉండవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లేవాళ్లు గొడుగు దగ్గర ఉంచుకుంటే మంచిది. పెద్దవాళ్లకు చిరు తుంపరలో ఊటీ గార్డెన్స్లో విహరించడం బాగుంటుంది. ఇదీ రూట్: సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాల గూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో ఎవరికి సౌకర్యమైన స్టేషన్లో వాళ్లు రైలెక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఏ స్టేషన్లోనైనా దిగవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలు దాటిన తరవాత రైలు తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇది వీక్లీ ట్రిప్. వారానికి ఒక టూర్ మాత్రమే. ప్రతి మంగళవారం ఉంటుంది. ఇదీ చదవండి: Beauty Tips ఆలూతో అందం : అదిరిపోయే చిట్కాలు– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి

ఇలా అయితే వేదన తప్పదు : అదే నీవు... అదే దైవం!
దైవం ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నాసరే ఆత్మస్థితిలోకి వెళ్ళగలవు. అదే దివ్యచైతన్యం. అదే నీవు, అదే దైవం. ఆ సమాధి స్థితి దైనందిన జీవితంలో నిరంతరం ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మదర్శనంలోనే ఉండాలి. చూసేవాడివే నీవు, శరీరానికి, మనస్సుకు ఏమి జరుగుతున్నా సరే సంపూర్ణంగా స్వీకరించు, వాటికి అంటకుండా దూరంనుంచి గమనిస్తూ ఉండు. విషయాలను తర్కించి, జరుగుతున్నది మంచేనా లేక చెడా అని రకరకాలుగా అలోచిస్తూ సంస్కారాలను పెంచుకోవద్దు. జరుగుతున్నది ఏదైనా సరే నీవు సాక్షిగా చూస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. అదే నిన్ను మనస్సుకు అతీతంగా తీసుకెళ్తుంది. శరీరము–మనస్సులకు జరుగుతున్న వాటితో కలిసిపోయావంటే వేదనలను అనుభవిస్తావు. జరుగుతున్న వాటిని సాక్షిగా గమనిస్తే ఆత్మలోని అనందమే నీవు అవుతావు. దుఃఖించేవాడివి నీవు కాదు, దుఃఖించేవాడిని గమనించేవాడివే నీవు. ఇలాంటి జీవనశైలిని అలవర్చుకుంటే నిత్యం సచ్చిదానందంలో ఉంటావు. అది నొప్పిఐనా, అవమానమైనా, సంతోషమైనా, విజయమైనా, ప్రశంసైనా.... ఏదైనాసరే నీకు అంటకూడదు. సమభావంతో స్వీకరించు, సాక్షిగా గమనించు. సత్యం నీలో ఉంది. దేన్ని వెంబడించినా ఆనందం రాదు గుర్తుంచుకో. అన్నింటిలోనూ జీవించు కానీ వేటితోనూ కలిసిపోవద్దు. ఆధ్యాత్మికంగా ఉండడమంటే కోరికల్ని అణిచివేయడమని, కొన్ని పనుల్ని చేయకూడదని, సంసారాన్ని త్యజించడమని, హిమాలయాలకు వెళ్ళడమని కొందరు చెప్పే అజ్ఞానపు పోకడలను అనుసరించవద్దు. అసలు జరుగుతున్నదేదీ సత్యం కానపుడు దాన్ని వదిలేయడం ఏమిటి? నీవే దైవమైనప్పుడు దేన్ని వదిలేయాలి? మనస్సుతో మాత్రం ఎప్పుడూ ఏకమవ్వద్దు. మనకున్న నమ్మకాలు, భయాలు, అ΄ోహలు అన్నీ మనస్సు వల్లనే. సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేసేది మనస్సే. నీవు సాక్షివైనప్పుడే మనస్సు అంతమవుతుంది. అలోచనలు లేని శుద్ధ చైతన్యం అనుభవమౌతుంది.చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలుబుద్ధుడు, మహా వీరుడు మొదలైన యోగులు కూడా దేవుడు భౌతికమని ఎన్నడూ చెప్పలేదు. సత్యమే దైవం. అదే నీ నిజస్థితి. దేవుడు అనేది నీచివరి మజిలీ. దైవాన్ని నమ్మడం అనేది దైవాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఏమాత్రం సహకరించదు. పైగా నమ్మకమే దైవాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతుంది. నమ్మకాలనేవి నీ మనస్సులోని ఊహలే. సత్యాలు మాత్రం కావు. దైవాన్ని తెలుసుకోవడానికి ఏ క్రతువులు, భాషలు అవసరమే లేదు. కానీ ఈ రోజు ప్రతి మతంలోనూ మనస్సు తాలూకు నమ్మకాలు, అలవాట్లు అనేవే ఉన్నాయి కానీ నిన్ను నీవు తెలుసుకోవడం, సాక్షీభావనతో ఉండడం అనే అంశాలే ఉండటం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, గ్రంథాలు చదివినా అది మన అహంకారాన్ని పోషించి మనస్సును ఇంకా బలపరచి సత్యానికి అడ్డుగోడలు కడుతుందే కానీ సత్యాన్ని తెలుసుకోనివ్వదు. నిన్ను నీవు తెలుసుకోనివ్వకుండా అడ్డుపడేది మనస్సే. రోజాపువ్వు గురించి తెలుసుకున్నంత మాత్రాన నీవు ఆ రోజాపువ్వుని ఆస్వాదించలేవు. ఒక విషయం గురించిన జ్ఞానం ఆ విషయానుభవానికే అడ్డమవుతుంది. మనస్సు నిన్ను సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఆనందాన్ని అనుభవించ నీయదు. ఏదో ఒక కొత్త సమస్యను, కోరికను సృష్టిస్తూ, ప్రశ్నిస్తూ, ఈ క్షణాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. ఆనందం మనస్సుకు అతీతమైన స్థితి కనుక అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. దీని ఉచ్చునుండి బయటపడడానికి అనుక్షణం నీవు సాక్షీభావనతో నిన్ను నీవు గమనిస్తూ ఉండాలి. చేతనలో ఉండాలి. చేతన అనేది మనస్సుకాదు కానీ మనస్సు ద్వారా ప్రవహిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. నిత్యజీవితంలో ఈ సాక్షీభావన అనేది సాధన చేయటం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు – స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు

రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!
‘బైక్ స్టార్ట్ అవ్వగానే భయం కాదు, స్వేచ్ఛ, సాధికారత మొదలవ్వాలనే’ ఆత్మవిశ్వాసాన్ని మహిళల్లో నింపేందుకు నగరం వేదికగా ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’ అనే మోటార్ సైకిల్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వరల్డ్ మోటర్సైకిల్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలోని హాస్టెన్ గో కారి్టంగ్ జోన్లో బైక్ రెంటల్ సంస్థ రాయల్ బ్రదర్స్ ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు బైక్ రైడింగ్తో సందడి చేశారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ 11వ ఎడిషన్లో 120 మందికి పైగా మహిళలు ప్రొఫెషనల్ శిక్షకుల ఆధ్వర్యంలో స్కూటర్లు, బైకులు నడిపారు. ఈ కార్యక్రమానికి యమహా మోటార్ కంపెనీ (జపాన్) అనుబంధ సంస్థ మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా (ఎంబీఎస్ఐ) భాగస్వామిగా వ్యవహరించింది. సురక్షితమైన, నియంత్రిత ప్రాంగణంలో మహిళలకు బైక్ రైడింగ్పై శిక్షణ అందించారు. ఆర్ బీ ఫర్ ఉమెన్ పేరుతో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరం మహిళలకు అవసరమైన అన్ని రకాల రైడింగ్ గేర్, బైకుల ఎంపికతో, వయసు, అనుభవంతో సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి అభ్యాసం ఉన్నవారిని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసి విజయవంతంగా పూర్తిచేశారు. పలువురు మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. బైక్ రైడింగ్కు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. మహిళలు సైతం..! ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా 570 మందికి పైగా మహిళలకు రైడింగ్లో శిక్షణ ఇచ్చింది. గృహిణుల నుంచి ప్రొఫెషనల్స్ వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత శిక్షణతో పాటు, బైక్ నడపడం మీద నమ్మకం కలి్పంచడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. బైక్ నడిపే ఈ చేతుల ద్వారా ఇప్పుడు మహిళలు తాము ఎంచుకునే దారిలో స్వతంత్రంగా ప్రయాణించగలుగుతున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఈ వినూత్న కార్యక్రమం మహిళల భవిష్యత్తు ప్రయాణానికి శుభారంభమని నిర్వాహకుల మాట. నూతన యాత్రకు ఆనం.. ఈ శిక్షణ కేవలం రోడ్డుపై నడవడానికి కాదు. ఇది మహిళల స్వతంత్రతకు చిహ్నం. సొంతగా బయటకు, ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఈ శిక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, సంప్రదాయ భావాలను వెనక్కి నెట్టే సాహసం కూడా మహిళల్లో పెరిగుతోంది. బైక్ నడిపే కళ మహిళల్లో సరికొత్త నైపుణ్యాన్ని మాత్రమే కాదు, సమానత్వం పట్ల స్ఫూర్తిని కూడా రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నగరంలో స్వేచ్ఛగా తిరగడానికి ఒక మార్గం చూపుతుంది.భవిష్యత్తు దిశ.. ఇకపై మరిన్ని నగరాల్లో ఈ శిక్షణ విస్తరించనుంది. ఒక సాధారణ శిక్షణ మాత్రమే కాదు, మహిళల జీవన శైలిని మార్చే ఒక శక్తివంతమైన ప్రయత్నంగా ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’ నిలుస్తోంది. తలా తోకా లేకుండా ట్రాఫిక్లో చిక్కుకుపోయే నగర జీవితం మధ్య, ఒక చిన్న బైక్ స్వేచ్ఛను ఇచ్చే మార్గం కావడం ఎంతో గొప్ప విషయం కాదా..!?ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగు.. ‘మేము 500 మిలియన్ల భారతీయులకు బైక్ మౌలిక అంశాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇందులో భాగంగా మహిళలకు స్కిల్ ఇవ్వడం అత్యంత కీలకమైన దశ. ఈ శిక్షణ కొత్త నైపుణ్యం మాత్రమే కాదు.. వారి స్వేచ్ఛకు, ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగు!’ – అభిషేక్ చంద్రశేఖర్, రాయల్ బ్రదర్స్ సీఈఓ. ఎంబీఎస్ఐ దృష్టికోణం.. ‘మొబిలిటీ లోపం వల్ల మహిళలు ఎన్నో పనులకు ఇతరులపై ఆధారపడుతున్నారు. బైక్ నడపడం నేర్చుకోడం ద్వారా వారి జీవన ప్రమాణం మెరుగవుతుంది. ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’ ద్వారా మేము వారి జీవితాల్లో విలువను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం’. – నకావో హిరోషి ఎంబీఎస్ఐ సీఈఓ. (చదవండి: ఆసనం.. ఓ ఔషధం..! అధ్యయనం చెబుతోందిదే..)
ఫొటోలు
అంతర్జాతీయం

సిరియాలో దారుణం.. 30 మంది మృతి
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ శివారులోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని మీడియా తెలిపింది. కనీసం 30 మంది చనిపోగా మరో 53 మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. బాధితుల్లో పలువురు చిన్నారులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది.చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి ముందుగా తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం పేల్చేసుకున్నట్లు ఓ వీడియో వైరలవుతోంది. కాగా, మృతులు, క్షతగాత్రుల కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. చర్చిల్లో దాడులు జరగడం సిరియాలో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సిరియాలో బషర్ అస్సద్ పాలన అంతమయ్యాక పగ్గాలు చేపట్టిన అహ్మద్ అల్ షరా యంత్రాంగంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది తొలుత చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సిరియా అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు తొలుత చర్చిలో గ్రెనేడ్ విసిరేసినట్లు చర్చి బిషప్ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని, అతనివెంట మరో ఇద్దరు సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుండగుడు తొలుత కాల్పులు ప్రారంభించి, అనంతరం చర్చిలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చివేసుకున్నట్లు పేర్కొన్నాడు.

భారత్కు వెళ్తున్నారా? జాగ్రత్త!
వాషింగ్టన్: భారత్లో పర్యటించాలనుకునే తమ పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, భారత్కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. ప్రత్యేకించి మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ లెవల్ 2 సలహా జారీ చేసింది.జూన్ 16న జారీ చేసిన ఈ అడ్వైజరీలో ‘‘భారత్లో మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయి. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. అలాగే పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది’’ అని హెచ్చరించింది.జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ‘‘ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో ప్రయాణించవద్దు. తూర్పు లద్దాఖ్, రాజ«దాని లేహ్ తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత్–పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి హింస సర్వసాధారణం. భారత్–పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దు’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఒంటరిగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. ఇక ‘‘తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది’’ అని సూచించింది. భారత్కు వెళ్లాలనుకునేవారు శాటిలైట్ ఫోన్ తీసుకెళ్లొద్దని సలహా ఇచ్చింది.ఖండించిన కాంగ్రెస్.. భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ ఖండించింది. ఆ దేశ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, ఇబ్బందికి గురి చేసిందని ఎక్స్లో పోస్ట్ చేసింది. యూఎస్ ట్రావెల్ అడ్వైజరీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. భారత్లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం.. ప్రధాని నరేంద్రమోదీ ‘సురక్షిత భారత్’ పతనమైనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది.

ఆ 3 అణు కేంద్రాలు
ఇరాన్లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా...1.ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ టెహ్రాన్కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో పర్వతం అంతర్భాగంలో 90 మీటర్ల లోతున ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. నతాంజ్ కంటే ఇది పరిమాణంలో చిన్నదే. వైమానిక దాడుల నుంచి రక్షణతోపాటు అణుపరీక్షల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో కొండ దిగువన దుర్భేద్యంగా నిర్మించారు. ఫోర్డోను ఇజ్రాయెల్తోపాటు పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఇది పటిష్ట స్థితిలో ఉండడంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో అత్యాధునిక సెంట్రీఫ్యూజ్లను బిగించే సామర్థ్యం కలిగి ఉండడం. ఫోర్డోలో సైతం 60 శాతం శుద్ధి చేసిన యురేనిజం నిల్వలున్నాయి. ఈ అణుకేంద్రంపై అమెరికా సైన్యం బి–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ద్వారా 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ (జీబీయూ–57) బాంబును ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి వల్ల ఫోర్డోకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వత ప్రాంతం భారీగా దెబ్బతినడంతోపాటు రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అమెరికా దాడి చేయడం తథ్యమన్న ముందస్తు అంచనాతో ఫోర్డో నుంచి యురేనియం, సెంట్రీఫ్యూచ్లు, కీలక పరికరాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 135 మైళ్ల దూరంలో నతాంజ్ అణుకేంద్రం ఉంది. ఇరాన్కు ఇదే అత్యంత ముఖ్యమైన యురేనియం శుద్ధి, నిల్వ కేంద్రం. అణు కార్యక్రమంలో నతాంజ్దే కీలక పాత్ర. అమెరికా దాడుల కంటే ముందు ఇక్కడ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వచేశారు. అణు బాంబు తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం. అంటే అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా సమీపంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా దాడుల కంటే ముందే ఇజ్రాయెల్ సైన్యం నతాంజ్పై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో భూఉపరితలంపై ఉన్న మౌలిక సదుపాయాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. భూఅంతర్భాగంలో ఉన్న పటిష్ట స్థితిలో సదుపాయాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, అమెరికా దాడుల్లో నతాంజ్లోని సెంట్రీఫ్యూజ్లు, ఇతర పరికరాలు చాలావరకు నామారూపాల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. నతాంజ్పై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. అవి సఫలం కాలేదు. నతాంజ్కు సమీపంలోని పికాక్స్ అనే పర్వతం కింద మరో భారీ అణుకేంద్రాన్ని నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు గతంలో వార్తలొచ్చాయి.3. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 215 మైళ్ల దూరంలోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్లో యురేనియం కన్వర్షన్ సదుపాయాలు, ల్యాబ్లు, చైనా తయారీ రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది అణు శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడికి దిగడంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ, అమెరికా దాడిలో భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్లో రేడియేషన్ లీకేజీ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ప్రకటించింది.ఇరాన్లోని మరికొన్ని అణు కేంద్రాలు (ఇక్కడ దాడులు జరగలేదు) బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరాన్లో ఇదొక్కటే కమర్షియల్ అటామిక్ రియాక్టర్. పర్షియన్ గల్ఫ్లో ఏర్పాటు చేశారు. రష్యా సరఫరా చేస్తున్న యురేనియంతో ఇక్కడ అణ్వస్త్ర తయారీ పరిశోధనలు జరుగుతుంటాయి.అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పెవన్స్–గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నెలకొల్పారు. 2015లో ఈ కేంద్రాన్ని పాక్షికంగా ఆధునీకరించారు.టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్‘శాంతి కోసం అణుశక్తి’ అనే కార్యక్రమంలో భాగంగా 1967లో అమెరికా సరఫరా చేసిన టెక్నాలజీ, పరికరాలతో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తక్కువ శుద్ధి చేసిన యురేనియంతో అణు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి కూడా...→ కరాజ్ (అణు పరిశోధన కేంద్రం) → దార్కోవిన్(నిర్మాణంలో ఉన్న అణుకేంద్రం) → అనారక్(అణు పరిశోధన కేంద్రం) → అర్దాకన్(అణు పరిశోధన కేంద్రం) → సఘాంద్(యురేనియం మైన్) – సాక్షి, నేషనల్ డెస్క్

ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

మావోయిస్టులను నిద్రపోనివ్వను
రాయ్పూర్: మావోయిస్టులు సాధారణగా వర్షాకాలంలో విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈ వర్షాకాలంలో కూడా మావోయిస్టులను నిద్రపోనివ్వనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వర్షాకాలంలో కూడా ప్రభుత్వ ఆపరేషన్ కొనసాగుతుందని హెచ్చరించారు. చర్చల ప్రసక్తే లేదన్న మంత్రి.. అడవుల్లో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. చత్తీస్గఢ్లోని నవా రాయ్పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ)కి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సెజ్బహార్లోని ఎన్ఎఫ్ఎస్యూ ట్రాన్సిట్ క్యాంపస్ను, ఛత్తీస్గఢ్లోని ఐ–హబ్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామన్నారు. అవసరమైతే అంతకన్న ఎక్కువ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను పూర్తిగా అమలుతో మన దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, వేగవంతమైన, శాస్త్రీయ న్యాయ వ్యవస్థగా మారుతుందని షా అన్నారు. నవ రాయ్పూర్లోని ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్కు రూ. 145 కోట్లు, సీఎఫ్ఎస్ల్కు రూ. 123 కోట్లు ఖర్చవుతుందని, ఇవి మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక పురోగతిపైనే కాకుండా సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో, విజయ్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలిసి పనిచేస్తేనే లాభం!
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో సంబంధాలు ఎల్లప్పుడూ సజావుగా సాగాలని ఆశించకూడదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. పాలకులతో సంబంధం లేకుండా సంబంధాల్లో స్థిరత్వాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం ప్రయతి్నంచిందని నొక్కి చెప్పారు. అందుకు శ్రీలంక, మాల్దీవులను ఆయన ఉదహరించారు. అక్కడ నాయకత్వం మారినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఏ దేశంతోనైనా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు చేతులెత్తేయకూడదన్నారు. భారత్తో కలిసి పనిచేయడం ఇతర దేశాలకే లాభిస్తుందని, లేదంటే వారే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని గ్రహించడానికి కొన్ని దేశాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సైన్యం చేతుల్లో అధికారం, భారత్పై శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఇందుకు మినహాయింపని, ఒక్క పాక్ను పక్కనపెడితే.. దౌత్యం అన్ని చోట్లా వర్తిస్తుందన్నారు. డీడీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ను తన ఎక్స్ హ్యాండిల్లో శనివారం రాత్రి ఆయన పోస్టు చేశారు. దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో దౌత్యసంబంధాలపై అనేక విషయాలను జైశంకర్ పంచుకున్నారు. చైనాతో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి మన సామర్థ్యాలను పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జూన్ 2020లో గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే.. గత దశాబ్దాల్లో మన సరిహద్దు మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి వచ్చింన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలపై నిర్మించడం వల్ల పరిస్థితి మారిపోయిందని, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతున్నామని జైశంకర్ తెలిపారు. గత 11 ఏళ్లలో భారత్ పొరుగు దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకుందని, గల్ఫ్ దేశాలకు చేరువైందని, ఆసియాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతాలతో సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ పట్ల భారతదేశ విధానం మారిపోయిందని, 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019 బాలకోట్ వైమానిక దాడులను ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, భారత్ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విస్తృత వ్యూహంలో భాగాలుగా చూడాలని జైశంకర్ చెప్పారు. ప్రధాని మోదీని ‘మన కాలపు నాయకుడు’గా జైశంకర్ అభివరి్ణంచారు. ప్రజల మానసిక స్థితి మారిందని, ప్రజల ఆత్మవిశ్వాసానికి’ప్రధాని మోదీ నిదర్శనమని మంత్రి నొక్కి చెప్పారు.

పాక్కు సమాచారం చేరవేత.. పంజాబ్లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్
చంఢీగఢ్: పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి గుర్ప్రీత్ సింగ్ సాహిల్ మాసిహ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఐఎస్ఐ ఏజెంట్ జావెద్తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధానంగా జావెద్తో గుర్ప్రీత్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారలో వెల్లడైంది. పంజాబ్లోని ధరివాల్కు చెందిన గుర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సాహిల్కు అదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నేరుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరుచుకుని కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనేది ప్రధాన అభియోగం.

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
ఎన్ఆర్ఐ

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి
క్రైమ్

‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది’
సాక్షి, హైదరాబాద్: ‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఈ కేసు నుంచి మీ కూతుర్ని తప్పించాలంటే మేం చెప్పిన ఫోన్పే నంబర్కు రూ.50 వేలు వెంటనే పంపండి’అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి వలకు చిక్కకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు నగరవాసి శ్రీనివాస్రెడ్డి. కేసు వివరాల్లోకి వెళితే..సరూర్నగర్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను నడిపే శ్రీనివాస్రెడ్డికి ఈనెల 19న ఒక వాట్సప్ కాల్ వచ్చింది. అందులో పేరు సీబీఐ విక్రమ్గా..డీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లిష్ లో మాట్లాడుతూ.. మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని చెప్పింది. వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్ పే చేయాలంటూ ఒక నంబర్ ఇచ్చింది. పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్రెడ్డి ఆ వాట్సప్ కాల్ను కట్ చేసి, కెనడాలో ఉన్న కూతురుకు ఫోన్ చేశారు. ఇంట్లోనే నిద్రపోతున్నానని..తాను క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది. దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. టీజీ సీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి కారణమైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా నేరమే. నిఘా వేసి ఉంచే రెండు సంస్థలు..చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ చర్యలు ముమ్మరం అయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ (ఐసీఎస్ఈ), గూగుల్కు సంబంధించిన సైబర్ టిప్లైన్ రిపోర్ట్స్ సీఎంఏఎంని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన ఐపీ అడ్రస్లను రీడ్ చేస్తుంది. ఈ వివరాలను ఎన్సీఎంఈ, ఐసీఎస్ఈలకు చెందిన సర్వర్ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలు రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని ఐ4సీ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. ఇలా గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. నిందితుల్లో అన్ని రకాల వాళ్లూ... వీటిపై కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సైబర్ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్టు అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగి కూడా ఉన్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్తో పాటే కొన్ని రకాలైన వైరస్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ఆయా వైరస్లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లు హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు వారికి చేరి పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగానూ నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీనే కాదు..అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచి్చనప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తున్నారు. వీటిని హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటుండటంతో కఠిన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెబుతున్నారు.

అత్తింటి వేధింపులకు నవ వధువు బలి
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.