పట్నం నరేందర్‌రెడ్డికి ఊరట | Lagacherla: Hhigh Court Allow Special Barrack To Patnam Narender Reddy | Sakshi

పట్నం నరేందర్‌రెడ్డికి ఊరట

Nov 19 2024 12:51 PM | Updated on Nov 19 2024 2:55 PM

Lagacherla: Hhigh Court Allow Special Barrack To Patnam Narender Reddy

హైదరాబాద్‌, సాక్షి: లగచర్ల అధికారుల దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది.

తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే.. తన రిమాండ్‌ను కొట్టి వేయాలని నరేందర్‌ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై  జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరికాసేపట్లో విచారణ జరపనుంది.

మరోవైపు నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణనువికారాబాద్‌ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్‌ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌ ఉండడంతో బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్‌ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement