Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
breaking news

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt Conspiracy On YS Jagan1
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!

సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్‌ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్‌–హ్యాకథాన్‌ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్‌ బైక్‌ల ఊబరైజేషన్‌ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్‌ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్‌ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్‌ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్‌ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్‌ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్‌ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్‌ మాస్‌ ఇమేజ్‌ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్‌–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్‌ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్‌ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్‌ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్‌ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్‌’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్‌లు లంచాలివ్వలేక లాకౌట్‌లు ప్రకటించాయి. నవీన్‌ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్‌ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్‌ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్‌ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్‌ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్‌ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్‌ హయాంలో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్‌ ప్రక టించుకుంటున్నది. జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్‌ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్‌ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్‌ లీడర్‌. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్‌మోహన్‌రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్‌ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్‌ వీడియోను సృష్టించి జగన్‌ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ లోకల్‌ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్‌ భద్రతపై కూటమి సర్కార్‌ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్‌ ఫర్‌ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్‌లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్‌ మస్క్‌ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబార్డ్‌ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్‌ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్‌ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్‌ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Railway Police Alert Visakha Express At Palnadu2
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా హల్‌చల్‌.. రైల్వే పోలీసుల కాల్పులు

సాక్షి, పల్ల్నాడు: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్‌, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.

Weekly Horoscope In Telugu From 29-06-2025 To 05-07-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠిచంండి.వృషభం...ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. బంధువుల నుంచి ధనప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.మిథునం...ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులను కలిసేందుకు చేసేందుకు యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం..కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.సింహం....కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులు పరిచయమై సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.కన్య...అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. పూర్వపు సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు.. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.తుల....ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. మీ వ్యూహాలు, ప్రణాళికలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం చివరిలో అనారోగ్యం. శ్రమ. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు.శివపంచాక్షరి పఠించండి.వృశ్చికం...ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది.దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొన్ని పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అయితే పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యమే ఈవారం మీకు ఆయుధాలు. మిమ్మల్ని బలహీనపర్చడానికి ప్రత్యర్థులు చేసే యత్నాలు ఫలించవు. దూరపు బ«ంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మకరం...కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ అభిప్రాయాలతో మిత్రులు ఏకీభవిస్తారు. బంధువుల రాకతో సందడిగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. మీ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గతంలో పొరపాట్లు సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వేడుకలకు ఆహ్వానిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.మీనం...కొన్ని సంఘటనలు బాగా ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జఠిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

Chandrababu Coalition govt target to destroy4
బాలికల విద్య భ్రష్టు!

గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్‌ ప్లస్‌(ఇంటర్‌)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్‌ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్‌ ప్లస్‌లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్‌ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్‌ జగన్‌పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్‌ ప్లస్‌ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతు­న్నారు. జీఓ నంబర్‌ 117 రద్దులో భాగంగా హైస్కూల్‌ ప్లస్‌లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్‌ ప్లస్‌లను ఇంటర్మీడియట్‌ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియ­మిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవ­డం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశా­లలను హైస్కూల్‌ ప్లస్‌గా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్‌ ప్లస్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్‌ విద్యను ప్రవేశపె­ట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్‌ జూనియర్‌ కళాశాలలను బాలికల జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్‌ తరగతుల బోధనకు సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్‌ ప్లస్‌ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్‌ ప్లస్‌లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్‌ ప్లస్‌లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్‌ ప్లస్‌లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్‌ ప్లస్‌లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్‌ ప్లస్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమై­న విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్‌ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజ­య­­వంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభు­త్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్‌ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, టోఫెల్‌ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్‌ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్‌ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపో­యా­యి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి వి­ద్యా­­ర్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రై­వేటు యాజ­మాన్యాలకు మేలుచేసేలా ప్ర­భు­­త్వం నిర్ణ­యాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హై­స్కూల్‌ ప్లస్‌ పేరిట ఇంటర్‌ విద్యను అందుబాటు­లోకి తెచ్చింది. అవి బాగా విజ­యవంతమ­య్యాయి. కానీ, కూటమి ప్రభు­త్వంలో ఇవ­న్నీ నిర్వీర్యమవుతు­న్నాయి. వీటిల్లో బోధన­కు పీజీటీల్లేరు. దీంతో విద్యా­ర్థులు నష్టపో­తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతా­భావనకు లోనై ప్రభుత్వ చదు­వులపై విశ్వాసం కోల్పోతు­న్నారు. హైస్కూల్‌ ప్లస్‌లను ప్రభుత్వం కొనసా­గిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌

Private schools trade hundreds of crores of books annually5
‘ప్రైవేటు’ పుస్తకాల దందా!

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావటంతో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. ప్రభుత్వ అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్‌షీట్ల పేరుతో లెక్కాపత్రం లేకుండా తామిచ్చే పుస్తకాలే కొనాలని స్కూళ్ల యాజమాన్యాలు హుకుం జారీచేస్తుండటంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్‌ పుస్తకాల కొనుగోలు విషయం తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1,000 లోపు ఖర్చుతో పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాదిపాటు చెల్లించే ట్యూషన్‌ ఫీజులో కనీసం మూడో వంతు భరించాల్సిన పరిస్థితి వస్తోంది. దండుకోవడమే లక్ష్యం.. రాష్ట్రంలో 41,628 పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,454. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 34,92,886 మంది ఉంటే.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు 3,55,254 మంది ఉన్నారు. నర్సరీ నుంచి పదోతరగతి వరకు 38,48,140 మంది ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు విక్రయిస్తున్నాయి. వీటిని పుస్తకాల పబ్లిషర్లతో కలిసి రూపొందిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి.. ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర)పైఒక్క పైసా తగ్గించకుండా బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. సగటున ఒక్కో తరగతికి రూ.6,370 చొప్పున పాఠ్యపుస్తకాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల విక్రయాలను లెక్కిస్తే ఏటా దాదాపు రూ.2 వేలకోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు స్పష్టమవుతోంది. బిల్లుకు చెల్లు.. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే 85 శాతం విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే, ఈ ‘ప్రైవేటు’పుస్తకాల విక్రయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఎక్కడా లెక్కా పత్రం కనిపించకుండా జాగ్రత్తపడుతున్నాయి. చాలా స్కూళ్లలో పుస్తకాలకు నగదు మాత్రమే స్వీకనిస్తున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు అవకాశం ఇవ్వటంలేదు. పుస్తకాలు కొనుగోలుకు సంబంధించిన బిల్లులు (రసీదు) కూడా ఇవ్వటం లేదు. దీంతో ఈ వ్యాపారం గుట్టుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పుస్తకాల విక్రయంపై ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించటంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పుస్తకాల వ్యాపారంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాదాపు రూ.457 కోట్లు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ఖాతాలోకే చేరుతున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో తరగతులవారీగా విద్యార్థుల సంఖ్య ఇలా... తరగతి విద్యార్థుల సంఖ్య 1 4,40,556 2 3,91,179 3 3,70,029 4 3,81,757 5 3,52,503 6 3,37,579 7 3,26,280 8 3,26,280 9 2,83,494 10 2,83,229 పుస్తకాల ధరలు రెట్టింపు చేశారు... నాకు ఇద్దరు పిల్లలు. 4, 5వ తరగతి చదువుతున్నారు. వీరికి గతేడాది పుస్తకాల కోసం రూ.8 వేలు ఖర్చు చేస్తే... ఈసారి ఏకంగా 15 వేలు చెల్లించాల్సి వచ్చింది. గతేడాది 4వ తరగతి విద్యార్థికి రూ.4 వేలు పుస్తకాలకు చెల్లిస్తే... ఈ ఏడాది రూ.8 వేలు అయ్యింది. అనవసరమైన పుస్తకాలు కట్టబెడుతున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి బోధన, అభ్యసన మాత్రం పట్టించుకోరు. చివరకు పాతసామాను వాడికి అమ్ముకోవాల్సిందే. – అఖిల, విద్యార్థి తల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న పుస్తకాల బ్యాగులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఆ పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేసినవారికి ఈ బ్యాగులో పెట్టి ఇస్తున్నారు. పుస్తకాల కోసమే స్కూలు యాజమాన్యం ఈ బ్యాగులు ప్రింట్‌ చేయించింది. అయితే, పుస్తకాలు కొనుగోలుకు సంబంధించి బిల్లు(రసీదు) మాత్రం ఇవ్వడం లేదు. రసీదు ఇవ్వాలని విద్యార్థుల తల్లదండ్రులు అడిగితే... రసీదు పుస్తకాలు లేవంటూ తెల్లకాగితంపై చీటీ రాసి చేతులు దులుపుకుంటున్నారు. తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాలు విక్రయించటం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్‌ లేదా దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. – రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి, వికారాబాద్‌ జిల్లా ప్రభుత్వంలో 3.. ప్రైవేటులో 6..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు 3 పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ మాత్రమే ఉంటాయి. 3, 4,5వ తరగతుల విద్యార్థులకు నాలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ ,ఈవీఎస్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) పుస్తకాలు ఇస్తారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ఆరు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో మూడు లాంగ్వేజెస్, మూడు ఆప్షనల్స్‌ ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పుస్తకాలకు బదులు ప్రైవేట్‌ పాఠశాలలు సబ్జెక్టువారీ పుస్తకాలను ఎంపిక చేసుకొని అమలు చేస్తున్నారు. దీంతో ఒకటో తరగతి నుంచే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌. సైన్స్, సోషల్‌ పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పుస్తకాలను అనుసరిస్తూ వాటికి వర్క్‌ బుక్‌లను కూడా అదనంగా జోడిస్తున్నారు.

Sakshi Guest Column On National Emergency of Indira Gandhi6
అక్షరం మీద ఆగ్రహం

అణచివేత, ఆంక్షలు బ్రిటిష్‌ ఇండియా కాలం నుంచి భారతీయ పత్రికారంగానికి అనుభవమే. ఎమర్జెన్సీ ప్రకటనపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సంతకం మరొకసారి బ్రిటిష్‌ కాలంనాటి నిర్బంధాలను పున రావృతం చేసింది. 1975 జూన్‌ 25 అర్ధరాత్రి భారత పత్రికా రంగం చీకటి తెరలోకి వెళ్లింది. 26న సెన్సార్‌షిప్‌ పేరుతో అణచివేత అధికారికంగా అమలైంది. ఆ రోజు నుంచి 1976 జనవరి 22 వరకు 272 పత్రికల మీద సెన్సార్‌ వేటు పడింది. 19 మాసాల తరువాత గాని పత్రికారంగం వెలుగు చూడలేదు. 1975లోనే తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరంలోని గోదావరి ఆనకట్ట బీటలు వారింది. ఆ వార్త సైతం సెన్సార్‌ కత్తెరకు గురైంది. 1976 జనవరి నాటి పార్లమెంట్‌ శీతకాల సమావేశాల వార్తలను కూడా సెన్సార్‌ చేసింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ తెచ్చిన సెన్సార్‌ షిప్‌ ఎంత గుడ్డిగా, నిరంకుశంగా సాగిందో చెప్పడానికి ఇవి చాలు. ఎన్ని కీలక వార్తలు కత్తెర పాలైనాయో ప్రఖ్యాత జర్నలిస్ట్‌ కుల్దీప్‌ నయ్యర్‌ ‘ది జడ్జిమెంట్‌’ పుస్తకానికి ఇచ్చిన అనుబంధంలో చూడవచ్చు. దీనికంతకూ బాధ్యత ఇందిరదే.జూన్‌ 26 ఉదయం ఇందిర ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య విధానాలతో సాధారణ పౌరులకు మేలు చేయా లని అనుకుంటే ప్రతిపక్షాలు, పత్రికలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని నేరుగా యుద్ధం ప్రకటించారు. ఆ రోజు నుంచే పత్రికలపై సెన్సార్‌షిప్‌ అమలులోకి వచ్చింది. అత్యధికంగా ఆంగ్ల దినపత్రికలు ఢిల్లీలోని బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లోనే కేంద్రీకృతమై ఉండేవి. 25వ తేదీ అర్ధరాత్రి ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కన్నాట్‌ప్లేస్‌లోని ‘ది స్టేట్స్‌మన్‌ ’, ‘ది హిందుస్తాన్‌ టైమ్స్‌’, ‘ది ఎకనామికల్‌ టైమ్స్‌’, ‘ది ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రికలు మాత్రం వెలు వడ్డాయి. కన్నాట్‌ ప్లేస్‌ ఢిల్లీ కార్పొరేషన్‌ పరిధిలో కాక ముని సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉంది. మునిసి పాలిటీకి కరెంట్‌ కట్‌ చేయలేదు. కరెంట్‌ కోత నుంచి పొరపాటున బయపడిన మరో ఆంగ్ల దినపత్రిక ‘మదర్లాండ్‌’. ఈ పత్రిక ఎడిటర్‌ కెఆర్‌ మల్కానీని 25 రాత్రే జేపీ, మొరార్జీలతో పాటే అరెస్టు చేశారు. ఒక ఉగ్రవాదిని పట్టుకున్నంత హడావిడి చేశారు. కాని పత్రిక యాజమాన్యం 26న ప్రత్యేక అనుబంధం ప్రచురించింది. అదే ‘మదర్లాండ్‌’ ఆఖరి సంచిక అయింది. ఎమర్జెన్సీ విధింపు, అర్ధ రాత్రి అరెస్టుల వివరాలతో అనుబంధాన్ని తెచ్చారు. ఉత్కంఠతో ఉన్న ప్రజలు పది పైసల ఆ అనుబంధాన్ని, ఇరవై రూపా యలకు కూడా కొన్నారు. అంతవరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఐ.కె. గుజ్రాల్‌కు ఉద్వాసన పలికి, పత్రికలను బుద్ధిగా నడుచు కునేటట్టు చేయగలిగిన సమర్థుడు వీసీ శుక్లాను ఆ పదవిలో నియమించారు ఇందిర. పత్రికలు సెన్సారింగ్‌ను తీవ్రంగా నిర సించాయి. ఇందుకు పరాకాష్ఠ చర్య, సంపాదకీయం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా ఉంచడం. వీసీ శుక్లా సమాచార మంత్రిగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఇందిర తొలి శత్రువుగా భావించిన ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ మీద యుద్ధం ప్రారంభించారు. నాటి సంపాదకుడు వీకే నరసింహన్‌ తన రచన ‘డెమాక్రసీ రిడీమ్డ్‌’లో అదంతా వివరించారు. మొదటి అడుగు ఎమర్జెన్సీ తొలినాళ్లలో ఎడిటర్‌గా ఉన్న మూల్గాంవ్‌కర్‌కు ఉద్వాసన పలి కించడం. ఆ పత్రికకు విద్యుత్‌ నిలిపివేశారు. ప్రభుత్వ ప్రకటనలు ఆపారు. ఢిల్లీ కార్యాలయాన్ని కూల్చడానికి ఉత్తర్వులు ఇచ్చారు. గుండె జబ్బుతో బాధపడుతున్న భగవాన్‌ దాస్‌ గోయెంకాను అరెస్టు చేస్తామని ఆయన తండ్రి, ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామ్‌నాథ్‌ను బెదిరించారు. అచ్చుకు వెళ్లే ప్రతి పేజీని సెన్సార్‌ అధికారులకు చూపాలని డీఐఆర్‌ 48 (1) నిబంధన విధించి ప్రీ సెన్సార్‌షిప్‌ను ప్రయోగించారు.పార్లమెంట్‌ ప్రసంగాలను ప్రచురించినందుకు ముంబై కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఒపీనియన్‌ ’ (ఎ.డి. గొర్వాలే సంపాదకుడు)పై ప్రభుత్వం కక్షకట్టింది. పత్రికను ముద్రించడానికి ప్రెస్‌ లేకుండా చేశారు పోలీసులు. అయినా సైక్లో స్టయిల్డ్‌ పత్రికను తెచ్చారు. ఆఖరికి ఈ పత్రిక ప్రచురణనే ప్రభుత్వం నిషేధించింది. ఎమర్జెన్సీని, నాటి విధానాలను సీపీఐ బాహాటంగానే సమర్థించింది. ఈ పార్టీకి మద్దతుపలికే పత్రికగా ఖ్యాతి ఉన్న పత్రిక, ‘మెయిన్‌ స్ట్రీమ్‌’. నిఖిల్‌ చక్రవర్తి సంపాదకుడు. కానీ ఈ పత్రిక నాడు సీపీఐ వైఖరికి దూరంగా ఉంది. సంజయ్‌గాంధీని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా వెలు వరించిన ‘డు వుయ్‌ నీడ్‌ నెహ్రూ టుడే’ వంటి వ్యాసాలు సర్కార్‌కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ పత్రికను అచ్చువేసే ప్రెస్‌ను జప్తు చేశారు.ప్రపంచంలోనే ‘పంచ్‌’ తరువాత ఖ్యాతిగాంచిన కార్టూన్ల పత్రిక ‘శంకర్స్‌ వీక్లీ’. దేశం గర్వించదగిన కార్టూనిస్ట్‌ శంకర్‌పిళ్లై ఈ పత్రిక అధిపతి, ఎడిటర్‌. ఈ వీక్లీ 1975, అక్టోబర్‌లో మూతపడిపోయింది. కారణం – ప్రీ సెన్సార్‌ నిబంధన. వినోబా భావే ‘మైత్రి’, జయ ప్రకాశ్‌ నారాయణ్‌ ‘ఎవ్రీమ్యాన్స్‌’, ఫెర్నాండెజ్‌ ‘ప్రతిపక్ష’... ఎన్నో శాశ్వతంగానో, తాత్కాలికంగానో ప్రచురణ నిలిపి వేశాయి. తెలుగులో ‘సృజన’, ‘జాగృతి’, ‘పిలుపు’, ‘ప్రజాసమస్యలు’ ఆగిపో యాయి (తరువాత కొన్ని మళ్లీ ప్రచురణ ప్రారంభించాయి).ఎమర్జెన్సీ విదేశీ విలేకరులను కూడా విడిచి పెట్ట లేదు. అమెరికా వారే ఢిల్లీలో 15 మంది ఉంన్నారు. 25 మంది పశ్చిమ యూరప్‌వారు, 20 మంది తూర్పు యూరప్‌ దేశాల వారు పనిచేసేవారు. పీటర్‌ హాజెల్‌ హ్రస్ట్‌ (లండన్‌ టైమ్స్‌) తరెన్‌ జెండిన్‌ ్స (న్యూస్‌ వీక్‌) పీటర్‌ గిల్‌ (లండన్‌ డెయిలీ టెలిగ్రాఫ్‌)లకు 24 గంటలలో దేశం విడిచి వెళ్లమని ఆదేశించారు. విదేశీ పత్రికలు ఏదో మార్గంలో భారతదేశ వార్తలను ప్రచురించాయి.దేశంలో జరుగుతున్నదేమిటో సాక్షాత్తు ప్రధానికి తెలి యకపోవడానికి మూల కారణం సెన్సార్‌షిప్‌. సెన్సార్‌షిప్‌ను తొలగించమని 1975 జూలై 5న తనను కలిసిన ఇండియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌కు ఇందిర చెప్పిన సమా ధానం – దేశాన్ని రక్షించడానికి సెన్సార్‌షిప్‌ విధించానని (ఆరో తేదీ పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయి). కానీ జరిగినదేమిటి మారుతి కారు ఉదంతం, స్నేహలతా రెడ్డి విషాదాంతం, పోలీసుల అరాచకాలు, ‘కిస్సా కుర్సీకా’, ‘ఆంధీ’ సినిమాల నిలిపివేతలు, బలవంతపు ఆపరేషన్లు, అరెస్టులు, తుర్క్‌మన్‌ గేట్, పోలీసు కాల్పులు, కూల్చివేతలు... అన్నీ సెన్సార్‌ ఇనుప తెర వెనుక ఉండిపోయాయి.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

At least 81 people killed in Israeli strikes in Gaza7
గాజాలో 24 గంటల్లో 81 మంది మృతి 

డెయిర్‌ అల్‌–బలాహ్‌: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో కనీసం 81 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 422 మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అపార్టుమెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో 23 మృతదేహాలను తమ ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారని నాస్సెర్‌ ఆస్పత్రి అధికారులు చెప్పారు. టుఫ్పాలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారని అహ్లి ఆస్పత్రి తెలిపింది. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు, ఖాన్‌యూనిస్‌ నగరంలోని అల్‌ ఖరారాలో నలుగురు చనిపోయారు. ఆ వార్తలు అబద్ధం: నెతన్యాహూ గాజాలో అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వాల సాయంతో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జనంపై కాల్పులు జరపాలని ఆరీ్మకి ఆదేశాలు జారీ చేసినట్లుగా వచి్చన వార్తలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా ఖండించారు. అవన్నీ సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేసే వార్తలంటూ కొట్టిపారేశారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచి్చన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్‌ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల వద్ద సైన్యం యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో ఇప్పటి వరకు కనీసం 500 మంది పాలస్తీనియన్లు చనిపోగా వందలాదిగా గాయపడ్డారు.త్వరలోనే కాల్పుల విరమణవచ్చే వారం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. ఈ ఒప్పందంతోపాటు ఇరాన్, తదితర అంశాలపై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రి రాన్‌ డెర్మర్‌ వచ్చే వారం వాషింగ్టన్‌ వెళ్తారని సమాచారం.

Irregularities in the establishment of waste to energy centers8
‘చెత్త’లోనూ నీకింత.. నాకింత!

సాక్షి, అమరావతి: ఏదైనా ఒక ప్రాజెక్టు పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం చోటుచేసుకుంటే.. స్టీలు, సిమెంట్, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ.. కేవలం నాలుగు గంటలు కూడా గడవక ముందే ఏపీ ఎన్‌ఆర్‌ఈడీసీ (సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఒక్కో డబ్ల్యూటీఈ (వేస్ట్‌ టు ఎనర్జీ – చెత్తతో విద్యుదుత్పత్తి) కేంద్రం అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.264 కోట్లకు పెంచేసింది. మొత్తంగా రెండు కేంద్రాలకు కలిపి రూ.128 కోట్లు అదనంగా పెంచేసింది. గంటల వ్యవధిలో బేరాలు మాట్లాడుకుని.. అయిన వారికి పనులు కట్టబెట్టి.. నీకింత.. నాకింత అని పంచుకునేందుకే అంచనా వ్యయాన్ని ఇలా పెంచేసేలా ఎన్‌ఆర్‌ఈడీసీ అధికారులపై ముఖ్య నేత ఒత్తిడి తెచ్చారని సమాచారం. వైఎస్సార్‌ కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో రోజుకు 781 టన్నుల చెత్త వస్తుందని ఎన్‌ఆర్‌ఈడీసీ అంచనా వేసింది. దీంతో కడపకు సమీపంలో కొలుములపల్లె వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో డబ్ల్యూటీఈకి గత నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో టెండర్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసింది. అదే రీతిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రోజుకు 763 టన్నుల చెత్త వస్తుందని అంచనా వేసిన ఎన్‌ఆర్‌ఈడీసీ.. కర్నూలుకు సమీపంలో గార్గేయపురం వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో మరో డబ్ల్యూటీఈకి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అదే రోజున అదే సమయానికి టెండర్లు పిలిచింది. అయితే ఆ వెంటనే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆ రెండు డబ్ల్యూటీఈల టెండర్‌ డాక్యుమెంట్లను తొలగించింది. ఆ తర్వాత అదే రోజు (గత నెల 21)సాయంత్రం 4.20 గంటలకు అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేస్తూ.. రెండు డబ్ల్యూటీఈలకు వేరువేరుగా టెండర్లు పిలుస్తూ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసింది. అంటే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఒక్కో డబ్ల్యూటీఈ అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు క్లస్టర్, కడప క్లస్టర్‌ డబ్ల్యూటీఈల నిర్మాణానికి మే 21న తొలుత రూ.200 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి.. ఆ వెంటనే రద్దు చేసి.. అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారనడానికి ఇదిగో ఆధారం ఒక్కో డబ్ల్యూటీఈకి ఒక్కో ధరా? నెల్లూరులో డీబీఎఫ్‌వోటీ (డిజైన్‌ బిల్డ్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌పర్‌) పద్ధతిలో 10 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనులకు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 25న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. యూనిట్‌ విద్యుత్‌ రూ.7.80తో డిస్కమ్‌లకు సరఫరా చేస్తామని కోట్‌ చేసిన జేఐటీఎఫ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఆ పనులు దక్కించుకుంది. రాజమండ్రిలో డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనుల వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మార్చి 17న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ టెండరు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. నెల్లూరు పది మెగావాట్ల సామర్థ్యం, రాజమండ్రిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయం రూ.200 కోట్లే. ఇదే తరహాలో కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్‌ల డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మే 21న ఎన్‌ఆర్‌ఈడీసీ తొలుత టెండర్లు పిలవడం గమనార్హం. కానీ.. కొన్ని గంటల వ్యవధిలో వాటిని రద్దు చేసి.. అదే రోజున అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి చూస్తే.. అంచనా వ్యయాన్ని పెంచేయడంలో భారీగా అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంచనాల్లో ఘరానా మోసం » కడప, కర్నూలు క్లస్టర్‌లలో డబ్ల్యూటీఈల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈడీసీ జారీ చేసిన టెండర్‌ డాక్యుమెంట్‌లో.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(సీఈఆర్‌సీ) ప్రకారం డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం ఒక మెగావాట్‌కు రూ.22 కోట్లుగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకున్నా ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం రూ.220 కోట్లే. కానీ.. రూ.264 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. అంటే.. సీఈఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో డబ్ల్యూటీఈ వ్యయాన్ని రూ.44 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడానికి సిద్ధమయ్యారన్నది ఇట్టే తెలుస్తోంది. » ఏదైనా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో వీజీఎఫ్‌ (వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌) 20 శాతం మించకూడదన్నది నీతి ఆయోగ్‌ నిబంధన. కానీ.. కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్‌ డబ్ల్యూటీఈలకు వీజీఎఫ్‌ను గరిష్టంగా 30 శాతంగా నిర్ణయించడం గమనార్హం. ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయంలో రూ.79.2 కోట్లను ప్రభుత్వం వీజీఎఫ్‌ కింద కాంట్రాక్టర్‌కు అందిస్తుంది. అంటే.. వీజీఎఫ్‌ రూపంలో రూ.79.2 కోట్లు, అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.143.2 కోట్లు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక కాంట్రాక్టర్‌ పెట్టుబడి పెట్టేది కేవలం రూ.120.8 కోట్లే. » ఇక ఈ రెండు డబ్ల్యూటీఈల ఏర్పాటుకు కారుచౌకగా ప్రభుత్వమే భూమి ఇస్తుంది. ఉచితంగా చెత్తను సరఫరా చేస్తుంది. కానీ, ఆ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయమూ రాదు. ఆ కేంద్రాన్ని 25 ఏళ్లపాటు నిర్వహించి.. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకోవడం, బూడిదతో తయారు చేసే ఇటుకలను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం డబ్ల్యూటీఈలు దక్కించుకున్న వారి జేబులోకే వెళ్తుంది. 25 ఏళ్ల తర్వాత ఆయా సంస్థలు వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తాయి.

Rayzon Solar, Credila Financial and Shadowfax Technologies movie to IPO9
ఐపీవో స్ట్రీట్‌ ...లిస్టింగ్‌కు కంపెనీల క్యూ 

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్‌లో గోప్యతా విధాన పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్‌ సర్వీసెస్‌ సెబీకి తాజాగా అప్‌డేటెడ్‌ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్‌ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్‌ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్‌లో బిజినెస్‌ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్‌బీఎఫ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ 2009లో ఇన్వెస్ట్‌ చేసింది. 2010 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్‌ గ్రూప్‌లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్‌ సోలార్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్‌ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్‌ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్‌ సోలార్‌ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా, కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ, మైక్రోటెక్‌ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్‌టెక్‌ సొల్యూషన్స్, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్‌ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ హోమ్‌ అండ్‌ ఫరీ్నíÙంగ్స్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్‌తోపాటు, లైసెన్స్‌ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్‌ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్‌ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్‌ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని నందెసారి యూనిట్‌లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్‌ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్‌ అంట్‌ న్యూట్రిషన్‌లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్‌ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్‌ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్‌ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్‌టాస్‌ ఫార్మా, మ్యాన్‌కైండ్‌ ఫార్మా, మెర్క్‌ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్‌తోపాటు ఫ్రెంచ్‌ దిగ్గజం గ్రూప్‌ దానోన్‌ చేరింది. గత క్యాలండర్‌ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్‌కార్ట్, మిరాయ్‌ అసెట్స్‌ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్‌ కంపెనీ షాడోఫ్యాక్స్‌ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్‌వర్క్‌పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది.

Vijay Devara Konda Speech at Grand Launch of Dil Raju Dreams Event 10
దిల్‌ రాజు డ్రీమ్స్‌ అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌

‘‘కొత్త వాళ్లకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్‌’రాజుగారికి ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌ సైట్‌ని ఎందుకుప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు. ఇది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌. లక్షలాది మందికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌ సైట్‌ లాంచ్‌కి న్యాయం జరిగినట్టే’’ అని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌ సైట్‌ లాంచ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై, వెబ్‌ సైట్‌ని లాంచ్‌ చేశారు. అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శేఖర్‌ కమ్ములగారి ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాకి నటుడిగా చాన్స్‌ కోసం అపై్ల చేశాను. దాదాపు 6 నెలలు వేచి చూశాను. 16 వేల అప్లికేషన్స్‌లో 11 మందిని ఎంపిక చేయగా వారిలో నేనూ ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మన కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్‌ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. మన కలని, మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి’’ అని చెప్పారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్‌ ఉండదు. అలాంటి కొత్త టాలెంట్‌ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ సంస్థనిప్రారంభించాం. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. ఇక్కడ సక్సెస్‌ అనేది ఒక్క శాతం మాత్రమే. ఎప్పుడైతే మీరు సినిమా రంగంలో సక్సెస్‌ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు 24 గంటలు కష్టపడాలి. నేను, విజయ్, దేవిశ్రీ, నాని... ఇలా అందరూ ఇండిపెండెంట్‌గా సక్సెస్‌ అయి వచ్చిన వాళ్లమే. అంతకుముందు జనరేషన్ లో చిరంజీవి, రజనీకాంత్‌గార్లు కూడా ఇండిపెండెంట్‌గానే సక్సెస్‌ సాధించారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇక్కడికి ఎంతోమంది ప్రతిభావంతులు వచ్చారు. మీరు ఎదిగాక ఇండస్ట్రీని మర్చిపోవద్దు’’ అని నిర్మాత శిరీష్‌ కోరారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement