కిలో | - | Sakshi

కిలో

Mar 15 2025 1:27 AM | Updated on Mar 15 2025 1:27 AM

కిలో

కిలో

జోష్‌ హైలీ..
ఆనందపు రంగులను మొహానికి పూసుకున్నారు, అందమైన క్షణాలను, జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకున్నారు. సప్తవర్ణాల చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంగా వికసించేలా హోలీ జరుపుకున్నారు. విశాఖలోని సాగరతీరాల్లో హోలీ జోష్‌ కనిపించింది. ప్రముఖ హోటళ్లలో హోలీ సందర్భంగా రెయిన్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. కురుసుర మ్యూజియం పక్కనే ఏర్పాటు చేసిన రెయిన్‌ డ్యాన్స్‌ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువత పాల్గొని రంగులు పూసుకుంటూ జోష్‌ నింపారు. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌లో అపార్ట్‌మెంట్‌ వాసులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం
అంటే
900
గ్రాములే..!

శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025

సాధారణంగా ఒక కేజీకి ఎన్ని గ్రాములు అంటే.. ఠక్కున 1000 గ్రాములు అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ లెక్కలు మారిపోయాయి. కేజీ అంటే 900 గ్రాములు..అంతకంటే తక్కువేనంటూ కొత్త భాష్యం చెబుతున్నారు కొందరు వ్యాపారులు. నమ్మట్లేదా.? ఇది పచ్చి నిజం..

మహరాణిపేటకు చెందిన రాజేశ్వరి పూర్ణామార్కెట్‌కు వెళ్లి కేజీ వెల్లుల్లి కొన్నారు.

– సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్‌/

ఆరిలోవ/తాటిచెట్లపాలెం

ధర్నాలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల నేతలు

కూర్మన్నపాలెం: నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచలేరని ఉక్కు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే.. వాటిని విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం మంచి పరిణామం కాదని హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్ద కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం పాత గాజువాకలో ధర్నా నిర్వహించాలని ముందుగా నిర్ణయించి, అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కుటిల రాజకీయం చేసిందని ఆరోపించారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేతలను పోలీసుల ద్వారా నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులను స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ విషయం నగర పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ అడ్డంకుల మధ్య చివరకు కూర్మన్నపాలెం జంక్షన్‌లో దీక్ష శిబిరం వద్దే ధర్నా చేసినట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఉక్కు కర్మాగారానికి పైసా ప్రయోజనం కలగలేదని తేల్చి చెప్పారు. కనీసం ప్లాంట్‌ అభివృద్ధికి గాని, ఉపాధి కల్పనకు గాని, ఉత్పత్తి వ్యయానికి గాని, కనీసం కార్మికుల వేతనాలు చెల్లింపునకు గాని ప్యాకేజీ దోహదపడలేదన్నారు. ధర్నాలో 78వ వార్డు కార్పొరేటర్‌ గంగారావు, పోరాట కమిటీ చైర్మన్‌ బి.ఆదినారాయణ, హెచ్‌ఎంఎస్‌ నాయకులు గణపతిరెడ్డి, సీఐటీయూ నేత ఎన్‌.రామారావు, సన్యాసిరావు, ఐఎన్‌టీయూసీ నాయకులు రామచంద్రరావు, మద్ది అప్పలరాజు రెడ్డి, వరసాల శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పల్లా చినతల్లి తదితరులు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా ఏసీపీ త్రినాథ్‌ నేతృత్వంలో సీఐలు మల్లేశ్వరరావు, కేశవరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉక్కు కార్మిక నాయకుల నిర్బంధం

గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాతగాజువాక జంక్షన్‌లో శుక్రవారం ధర్నా తలపెట్టిన కార్మిక సంఘాల నాయకులను స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు నిర్బంధించారు. పాతగాజువాక జంక్షన్‌లో ధర్నాకు అనుమతి లేదని పేర్కొంటూ నాయకులను స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిర్బంధించిన వారిలో నాయకులు డి.ఆదినారాయణ, కె.ఎస్‌.ఎన్‌.రావు, రామస్వామి, సుబ్బయ్య, పల్లా పెంటారావు, కామేశ్వరరావు తదితరులున్నారు.

ఆరిలోవ టీఐసీ పాయింట్‌కు చెందిన కూరగాయల వ్యాపారి దగ్గర కిలో క్యారెట్‌ కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి పక్కన ఉన్న పండ్ల దుకాణంలో తూకం వేయిస్తే 740 గ్రాములు మాత్రమే కనిపించింది. ఇక్కడ రెండూ ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మెషీన్లే కావడం గమనార్హం.

దాడులు జరుగుతున్నా

తూకంలో మోసాలెందుకు?

రాష్ట్ర తూనికలు కొలతల శాఖ నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. కానీ వినియోగదారులు ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం.. అడపాదడపా దాడులు చేస్తూ.. వెయింగ్‌ మెషీన్లకు సీల్‌ ఉందా.? సాంకేతికంగా ఏమైనా మోసాలకు పాల్పడుతున్నారా లేదా అని చెక్‌ చేస్తూ.. మోసం చేస్తున్న వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. 2023–24లో ఇప్పటి వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,227 కేసులను వ్యాపారులపై నమోదు చేశారు. బరువు తూచే యంత్రాల తయారీ, మరమ్మతు, యంత్రాలు సరిచూసి అధికారుల ఆమోదంతో ధ్రువీకరించేందుకు కొందరికి తూనికలు, కొలతల శాఖ అనుమతులిస్తుంది. అవి పొందిన లైసెన్స్‌దారులు ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు బరువు తూచే యంత్రాల్ని ఏటా మరమ్మతు చేసి తనిఖీ అధికారి ద్వారా ధ్రువీకరించి వ్యాపారికి ధ్రువపత్రం ఇవ్వాలి. అంతా సక్రమంగా ఉంటేనే సీల్‌ వేస్తారు. అయినా వ్యాపారి మోసానికి పాల్పడితే వ్యాపారిపై చర్యలు తీసుకుంటున్నారు.

మోసాన్ని తూకమేస్తున్నారు.!

జిల్లాలో ఎక్కడ చూసినా.. ఏదో ఒక చోట తూనికలు, కొలతల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు అడపాదడపా దాడులు జరుగుతున్నా.. వ్యాపారులు మాత్రం తమ హస్తలాఘవాన్ని చూపిస్తూనే ఉన్నారు. పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకుల విక్రయాల్లో కొనుగోలుదారులు మోసపోవడం పరిపాటిగా మారిపోయింది. మెషీన్లకు వేసిన సీళ్లు వేసినట్లే ఉంటున్నాయి. కానీ మోసం మాత్రం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పలు రైతు బజార్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ప్యాకింగ్‌లోనూ మోసాలు

క సూపర్‌ మార్కెట్లలోనూ మోసాలు జోరందుకుంటున్నాయి. ప్యాకింగ్‌ చేసి సొంత స్టిక్కర్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సూపర్‌ మార్కెట్‌లో అక్కడ తూకం వేసి చూసుకునేందుకు యంత్రాలు ఏర్పాటు చెయ్యాలి. కానీ ఏ సూపర్‌ మార్కెట్‌లోనూ ఇవి కనిపించడంలేదు. అంతేకాదు ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్న పదార్థాలపై ఎప్పుడు తయారు చేశారు. ఎంత బరువు ఉంది. ఎక్స్‌పైరీ డేట్‌ ఎప్పటి వరకూ ఉంటుందనే విషయాలు కూడా ముద్రించడం లేదు. ఎంవీపీ కాలనీలోని విశాఖ సూపర్‌ మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని తమ సొంత ప్యాకింగ్‌లలో విక్రయిస్తున్నారు. కానీ దానిపై ఎంఎఫ్‌జీ డేట్‌, ఎక్స్‌పైరీ డేట్‌ కూడా లేదు. అదేవిధంగా తినుబండారాలపై కేవలం ధర స్టిక్కర్‌ మాత్రమే అతికించి అమ్మేస్తున్నారు. దానిపై ఎక్కడ తయారు చేశారు.? ఏఏ పదార్థాలతో తయారు చేశారన్న వివరాలూ కనిపించడం లేదు. కేవలం ఈ ఒక్క సూపర్‌ మార్కెట్‌లోనే కాదు.. నగరంలో ఉన్న సగానికిపైగా సూపర్‌ మార్కెట్‌లు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

స్థానికులకు ఉపాధి కరువు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానికులకు ఉపాధి మృగ్యమైపోయింది. అన్ని రకాల పనులు జిందాల్‌, మిట్టల్‌ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోతారు. కర్మాగారానికి పూర్తి స్థాయి సీఎండీని కూడా నియమించడం లేదు. సంబంధం లేని వ్యక్తిని ఇన్‌చార్జి సీఎండీగా నియమించి.. కర్మాగారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.

–డి.ఆదినారాయణ,

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

ఉద్యోగులను తొలగించేస్తున్నారు

ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విషయాలలోనూ అణచివేతకు గురిచేస్తున్నాయి. అందువల్లే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఇప్పటికే వందలాది మందిని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఇంటి దారి పట్టించారు. ఇంకా కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులను అనేక రూపాల్లో తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

– జి.గణపతిరెడ్డి, ఉక్కు హెచ్‌.ఎం.ఎస్‌.

ప్రధాన కార్యదర్శి

ఉక్కు కార్మిక సంఘాల హెచ్చరిక

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు

కూర్మన్నపాలెం వద్ద ధర్నా

గాజువాకలో ధర్నా అడ్డుకోవడంపై ధ్వజం

కిలో1
1/15

కిలో

కిలో2
2/15

కిలో

కిలో3
3/15

కిలో

కిలో4
4/15

కిలో

కిలో5
5/15

కిలో

కిలో6
6/15

కిలో

కిలో7
7/15

కిలో

కిలో8
8/15

కిలో

కిలో9
9/15

కిలో

కిలో10
10/15

కిలో

కిలో11
11/15

కిలో

కిలో12
12/15

కిలో

కిలో13
13/15

కిలో

కిలో14
14/15

కిలో

కిలో15
15/15

కిలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement