breaking news
Visakhapatnam District Latest News
-
విశాఖ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
విశాఖ సిటీ : విశాఖ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ, ఐజీబీసీ సంయుక్త సహకారంతో ‘పట్టణ ప్రణాళిక–భవిష్యత్తు నగరాలు’ అంశంపై శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విశాఖలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 2028–29 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నగర రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రహదారి భద్రత, వేగవంతమైన ప్రయాణానికి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి రూ.200 కోట్ల అంచనా విలువతో ప్రతిపాదనలను ఏడీఎంకు సమర్పించామన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా తీర ప్రాంత కోతను నివారించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు వివరించారు. మధురవాడ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.550 కోట్ల భూగర్భ సొరంగం ప్రాజెక్టు ప్రతిపాదన దశలో ఉందన్నారు. నగరం నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న 41 కాలువలను మురుగునీటి శుద్ధి కర్మాగారాలకు అనుసంధానిస్తామన్నారు. వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ కె.రమేష్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి కేవలం 10 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఈ ఛాలెంజ్లను సమర్ధంగా ఎదుర్కొనడానికి వీఎంఆర్డీఏ థీమ్ ఆధారిత నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని వివరించారు. ఎస్బీఐ డీజీఎం రాహుల్ సాంకృత్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఎస్బీఐ గ్రీన్ఫైనాన్సింగ్, సోలార్ప్లాంట్లు, సూర్యశక్తి వంటి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కె.కుమార్రాజా మాట్లాడుతూ సంస్కృతి, వారసత్వ, వాతావరణానికి అనుగుణంగా పట్టణీకరణకు ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ జి.ఎస్.శివకుమార్, సీఐఐ విశాఖ హెడ్ మౌళి, సీఐఐ ఐజీబీసీ వైస్ చైర్మన్ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కన్న తండ్రిని రోడ్డుపై వదిలేసి..
అల్లిపురం: రోజురోజుకీ మానవత్వ విలువలు పడిపోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. కన్న తల్లిదండ్రులను వారి అంతిమ దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు వారిని బరువుగా భావిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఆస్తులు కావాలి గానీ, కన్నవారు అవసరం లేదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం విజయనగరం నుంచి సుమారు 75 ఏళ్ల వృద్ధుడిని రైల్వే స్టేషన్ దరి సిగ్నల్ పాయింట్కు సమీపంలో ఒక ఆటోలో తీసుకువచ్చి వదిలివెళ్లారు. ఆయనకు యూరినల్ బ్యాగు తగిలించి ఉండగా, డైపర్ వేసి ఉంది. వృద్ధుడి పరిస్థితిని చూసిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వెంటనే టూటౌన్ బ్లూకోల్ట్ కానిస్టేబుల్ నారాయణకు సమాచారం అందించారు. నారాయణ అక్కడికి వెళ్లి, ఆ వృద్ధుడి దుస్థితి చూసి చలించిపోయారు. అనంతరం రక్షక్కు ఫోన్ చేసి, విషయాన్ని టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడుకు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు వృద్ధుడిని భీమ్నగర్ నిరాశ్రయ వసతి గృహానికి తరలించి, ఆశ్రయం కల్పించారు. వృద్ధుడు తనది విజయనగరం అని మాత్రమే చెప్పగలుగుతున్నారని, ఇతర వివరాలు చెప్పలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి కౌన్సెలింగ్ చేసి, మరొకరు ఇలాంటి పనులు చేయకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు. -
కొత్త వెలుగులేవీ..?
నాటి మెరుపులే తప్ప..సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటక రాజధానిగా’ విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా టూరిజం రంగాన్ని గాలికొదిలేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయే తప్ప, కూటమి వచ్చాక ఒక్క కొత్త టూరిజం ప్రాజెక్టు అయినా పట్టాలెక్కకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్త మెరుపులు లేకుండానే మరో పర్యాటక దినోత్సవం ముగిసిపోతోందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఐఎస్–2023 సదస్సులో రూ. 8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఈ ప్రాజెక్టులు పడకేయడంతో విశాఖకు ప్రపంచ పర్యాటక పటంలో లభించాల్సిన స్థానం చేజారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమి నాయకులు ఉన్న భూములను కొల్లగొట్టేందుకు పీపీపీ పేరుతో స్కెచ్లు వేస్తున్నారే తప్ప, కొత్తగా అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలున్నాయి. 2024 ఏప్రిల్లోనే గ్లాస్ బ్రిడ్జికి ఎల్వోఏ కై లాసగిరిపై నిర్మాణం పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఈ ప్రతిపాదన 2022లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందే. 2024 జనవరిలో పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు ఎల్వోఏ ఇచ్చారని, ఇప్పుడు పనులు పూర్తవడంతో ఆ క్రెడిట్ కూటమి తన ఖాతాలో వేసుకుంటోంది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అవకాశాలున్నా.. ఆలోచన సున్నా.! మాటల్లోనే విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప.. వాస్తవ రూపం దాల్చేలా ఒక్క అడుగు కూడా కూటమి ప్రభుత్వం వెయ్యడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం ప్రకారం అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరహా ఒప్పందం ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. విశాఖ నగరంలో పర్యాటక వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా.. పీపీపీ పద్ధతిలో భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందే తప్ప.. కొత్త ఆలోచనల్ని అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది. నేడు పర్యాటక సంబరాలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో ప్రత్యేక సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి జె.మాధవి తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో విశాఖపట్నం హోటల్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. మర్చెంట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో మరో హిప్హాప్ బస్సు ఉమ్మడి విశాఖలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే బీచ్రోడ్డులో రూ.5 కోట్లతో రెండు హిప్హాప్ బస్సులు నడుపుతున్నాం. త్వరలోనే మరో హిప్హాప్ బస్సు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. రుషికొండ, జోడుగుళ్ల పాలెం, భీమిలి బ్యాక్ వాటర్లో వాటర్స్పోర్ట్స్, కయాకింగ్, స్కూబాడైవింగ్ మొదలైనవి అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ, అరకు క్యారవాన్స్ తీసుకొస్తున్నాం. టూరిజం హోటల్స్కు టెండర్లు వేశాం. త్వరలోనే వైజాగ్లో 2 వేల రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డీవీఎం ప్రపంచ స్థాయి హోటల్స్తో పర్యాటకుల తాకిడి ఈ ఏడాది టూరిజం డేని పర్యాటకంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధి అనే థీమ్తో నిర్వహిస్తున్నాం. పర్యాటక రంగంలో హాస్పిటాలిటీ ప్రధాన పాత్రపోషిస్తోంది. ప్రపంచస్థాయి హోటల్స్ రాబోతుండటంతో.. విశాఖకు సందర్శకుల తాకిడి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం కోటికి పైగా ఉంది. ఇది రెట్టింపు చేసుకునే అవకాశాలు బోలెడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖకు విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగితే మెడికల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చెందనున్నాయి. – పవన్ కార్తీక్, ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
ఎన్నికల హామీలను అమలు చేయాలి
అఖిల భారత న్యాయవాదుల సంఘం విశాఖ లీగల్: ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అఖిల భారత న్యాయవాదుల సంఘ కార్యదర్శి, సినీయర్ న్యాయవాది నూకల వెంకటేశ్వరరావు శుక్రవారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చాలంటూ సంఘం రాష్ట్రవ్యాప్తంగా సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 60 వేల మంది న్యాయవాదులు ఉన్నారని, వారిలో అధిక శాతం మంది గ్రామీణ నేపథ్యం కలిగిన వారేనన్నారు. కనీస వసతులు లేక వృత్తిలో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు రూ.5వేలు చొప్పున నెలసరి భృతి అందజేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తం కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. అలాగే నెలసరి భృతి రూ.10 వేలకు పెంచుతామన్న హామీ అమలుకు నోచు కోలేదని ఆరోపించారు. వివిధ కారణాలతో న్యాయవాదులు మరణిస్తే ఇచ్చే రూ.4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ కూడా అమలు కాలేదన్నారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. పవన్ కల్యాణ్ హామీలకు కార్యరూపం ఎప్పుడు? వారాహి యాత్ర సమయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన అనేక హామీలు కూడా నేటికీ కార్యరూపం దాల్చలేదని న్యాయవాదులు గుర్తు చేశారు. న్యాయవాదులకు ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలు కావడం లేదన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు, కోర్టుల నవీకరణ, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్రంథాలయాలు తక్షణం అవసరమన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్ఏ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బి.వి.రామాంజనేయలు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
సన్యాసిపాత్రుడికి కేకే రాజు పరామర్శ
ఎంవీపీ కాలనీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల పరిశీలకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అనారోగ్య కారణంతో మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేకే రాజు వెంట ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్స్ అంబటి శైలేష్, ముత్తి సునీల్ కుమార్, జిల్లా ట్రేడ్ యానియన్ ఉపాధ్యక్షులు గాలి ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
అందరూ దోషులే!
● ఈ ఏడాది మార్చి 25న అనకాపల్లి టౌన్లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి గడ్డర్ను క్వారీ లారీ ఢీకొనడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే గడ్డర్ పాక్షికంగా దెబ్బతింది.● ఈ ఏడాది మార్చి 16వ తేదీన మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త, ఎల్ఐసీ ఏజెంట్ గన్నారావు మైనింగ్ టిప్పరు గుద్ది ప్రాణాలు కోల్పోయారు. కంటితుడుపుగా కేసు పెట్టడం మినహా రోజువారీగా అక్రమ మైనింగ్, అధిక లోడు వాహనాల విషయంలో తనిఖీలు మాత్రం జరగడం లేదు. ఇవే కాదు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్కు అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అటు మైనింగ్ అధికారులు కానీ... ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ప్రతి నెలా ఆయా విభాగాలకు ఠంచనుగా మామూళ్లు అందుతుండటమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కూటమి నేతల ధనదాహం, అధికారుల అలసత్వం వెరసి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.● అక్రమ మైనింగ్ కోసం అనుమతి లేకుండా మైనింగ్ మాఫియా వేసుకున్న రహదారి. ఎటువంటి అనుమతి లేకున్నా రోడ్డు నిర్మిస్తుంటే... పదే పదే గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తప్ప అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా మైనింగ్ అవకతవకలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. శుక్రవారంనాటి తాజా సంఘటననే ఇందుకు ఉదాహరణ. వాస్తవానికి రాంబిల్లి మండలంలోని కొండవారిపాలెం వద్ద రెండు బండరాళ్లను విడిచిన టిప్పర్లు పక్క జిల్లా కాకినాడ నుంచి వస్తున్నాయి. తుని, పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి నియోజకవర్గాలను దాటుకుని రాంబిల్లి వద్ద జరుగుతున్న నావికాదళ పనుల కోసం ఈ బండరాళ్లను తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు, రవాణా, మైనింగ్ అధికారులు తనిఖీలు జరిపితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించే వీలుంటుంది. ప్రతి రోజూ పక్క జిల్లా నుంచి పదుల సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్లు వస్తున్నప్పటికీ ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు, రవాణా శాఖల సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా భారీగా అందుతున్న మామూళ్లే ఇందుకు కారణమని వేరే చెప్పనక్కరలేదు. అధిక లోడుతో చక్కర్లు...! అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్తో టిప్పర్లు అధికలోడుతో వెళుతున్నాయి. తద్వారా రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వివిధ క్వారీల ద్వారా రోజువారీ 1,000 ట్రిప్పుల బండరాళ్లను మునగపాక మీదుగా రోడ్లపై భారీ శబ్దాలు చేస్తూ రాంబిల్లిలోని నావికాదళ పనుల కోసం తరలిస్తున్నారు. 32–36 టన్నుల సామర్ధ్యం కలిగిన టిప్పర్లల్లో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు. అక్రమ సంపాదన నెలకు రూ.2 కోట్లు ఒక్కో ట్రిప్పునకు నెలకు రూ.22 వేల చొప్పున కూటమి నేతలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నెలవారీ వసూలవుతున్న మొత్తం రూ.2 కోట్లకు పైమాటే. కూటమి నేతలతోపాటు మైనింగ్, రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు అధిక లోడుతో వెళుతున్న వాహనాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. అనధికారిక క్వారీల్లో జరుగుతున్న మైనింగ్ను పట్టించుకోకుండా ఉండేందుకుగానూ మైనింగ్ అధికారులకూ భారీగా ముడుతోందన్న విమర్శలున్నాయి. అక్రమ మైనింగ్తో పాటు అధిక లోడుతో భారీగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఇక మైనింగ్ విజిలెన్స్ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాడులు చేసి అక్రమ మైనింగ్ను నిలిపివేసేందుకు గత 6 నెలల కాలంలో ప్రయత్నించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా అన్ని విభాగాల అధికారులకు వాటాల లెక్కన పంచుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూటమి నేత బంధువు దగ్గరుండీ మరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వాటా వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తం భారీ స్థాయిలో సదరు కూటమి నేత బంధువు జేబులోకి వెళుతోంది. నేరుగా వాయిస్ మెసేజ్లు ఉన్నా... ‘‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి... కన్ఫర్మ్ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్ పేలు ఎవ్వరూ చేయవద్దు’’ ఇది అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్. ఈ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి ధైర్యంగా ట్రాన్స్పోర్టు యాజమాన్యాలకు ఆడియో మెసేజ్లు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే... సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్, ఇటు ఫ్లై యాష్.... అంతేకాకుండా సెజ్లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాలి. లేని పక్షంలో దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. -
అన్నయ్య కంటే బాబు ఎక్కువయ్యారా?
బీచ్రోడ్డు: అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. సొంత అన్నయ్యను వాడు.. వీడు అంటూ బాలకృష్ణ చులకనగా మాట్లాడినా పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంలో మర్మమేంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి, బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. 15 నెలల కూటమి పాలనలో ప్రజాప్రతినిధులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, పాలనను గాలికొదిలేసి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తితో అమర్యాదకరంగా మాట్లాడించి సభా ప్రతిష్టకు భంగం కలిగించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వీధి రౌడీలా చొక్కా గుండీలు విప్పుకుని, నెత్తి మీద కళ్లజోడు పెట్టుకుని, రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, చిరంజీవిని కించపరిచేలా మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు.’అని అన్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ సైతం బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించారే తప్ప ఒక్కరూ ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఆయనకు అన్నయ్య కంటే చంద్రబాబే ముఖ్యమైనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా నడుచుకోవాలని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డికి, చిరంజీవికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, ముఖ్యనేతలు దొడ్డి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్, కనకాల ఈశ్వరరావు, మువ్వల సంతోష్, తాడి రవితేజ, రవి కుమార్ రెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు ముత్తి సునీల్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, సనపల రవీంద్ర భరత్, ఎస్.ప్రసాదరావు, జీలకర్ర నాగేంద్ర, మార్కండేయులు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, వార్డు అధ్యక్షులు చిల్లింగి నాగేశ్వర్ రావు, ఉమ్మడి కల్యాణ్, రాష్ట్ర, జిల్లా, నాయకులు ప్రగడ జాన్, సంపంగి సురేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష లేదట
వీసీ బంగ్లాకు రూ.64 లక్షలతో మరమ్మతులుడాక్టర్ క్వార్టర్కుఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏయూ రిజిస్ట్రార్ మొన్నటివరకు నివసించిన బంగ్లా. ఇప్పుడు ప్రస్తుత వీసీ రాజశేఖర్ నివాసం ఉంటున్నారు. తాను నివాసం ఉండేందుకు వీలుగా వీసీ ఏకంగా రూ.64 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నారు. అయితే డాక్టర్ క్వార్టర్ మరమ్మతులకు రూ.లక్ష మంజూరు చేసేందుకు మాత్రం ససేమిరా అంటూ వీసీ మోకాలడ్డారు. ఏయూ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాను ఉండేందుకు రిజిస్ట్రార్ బంగ్లాను రూ.64 లక్షలతో మరమ్మతులు చేయించుకున్న ఏయూ వీసీ రాజశేఖర్.. ఏయూ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ నివాసం ఉండేందుకు లక్ష రూపాయలతో క్వార్టర్లో మరమ్మతులు చేయించాలని కోరినా పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విద్యార్థి మరణంపై విద్యార్థులు ఇంత తీవ్రస్థాయిలో స్పందించేందుకూ వీసీ వైఖరే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వీసీ తన బంగ్లాలో ఉందామనుకుని.. ఐఐటీ నుంచి ప్రత్యేక టీమ్తో మరమ్మతులు చేయించుకునేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బంగ్లా నివసించేందుకు అంతగా అవకాశం లేదని తేల్చిచెప్పడంతో రిజిస్ట్రార్ బంగ్లాలో నివాసం ఉండాలని వీసీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుకున్న వెంటనే ఈ బంగ్లాలో మరమ్మతుల పేరిట భారీగా వెచ్చించేందుకు సమాయత్తం కావడంతో పాటు ఇప్పటికే రూ. 64 లక్షల మేర ఖర్చు చేసినట్టు సమాచారం. ఒకవైపు తన బంగ్లా కోసం లక్షలకు లక్షలు తగలేస్నున్న వీసీ... డాక్టర్ కోసం క్వార్టర్ మరమ్మతుకు రూ.లక్ష ఖర్చు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకంగా ఆరుసార్లు ఫైలును పంపినప్పటికీ తిప్పిపంపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏయూలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత వివాదాలను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నవన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలను విద్యార్థులు తప్పుపడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్థులపై నెపం నెట్టడాన్ని విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వీసీ వైఖరితోనే..! శాతావాహన హాస్టల్లో ఉంటున్న బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి మణికంఠ గురువారం ఆకస్మికంగా మరణించారు. ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురికాగా.. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ మిత్రుడు మరణించాడంటూ సహచర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. తమ ప్రాణాలకు విలువలేకుండా పోయిందని విద్యార్థులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఏయూ ఆరోగ్య కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కనీసం ఆక్సిజన్ పెట్టేవారు కూడా లేరని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండే డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వీలుగా క్వార్టర్ కేటాయించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఒక క్వార్టర్లో రూ.లక్ష వెచ్చించి మరమ్మతులు జరిపితే అక్కడ నివసించేందుకు అనువుగా ఉంటుందని భావించి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిని కనీసం వీసీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫైలును కనీసం 6 సార్లు వీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే డాక్టరు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డాక్టరు అందుబాటులో ఉంటే... విద్యార్థి మణికంఠ ఏయూ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వెంటనే ఆక్సిజన్ అందించడంతో పాటు అంబులెన్స్లో జాగ్రత్తగా తరలించే వీలు కలిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సొంత భవంతికి లక్షలకు లక్షలు ఖర్చు చేసి సొబగులు అద్దుకుంటున్న వీసీ.. డాక్టర్ కోసం క్వార్టర్ మరమ్మతుకు రూ.లక్ష ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మొత్తంగా వీసీ వ్యవహార శైలితో ఇప్పటికే ఏయూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఏకంగా విద్యార్థుల ప్రాణాలకు కూడా సమస్యగా మారిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. డాక్టర్ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణం ఫైల్ను ఆరు సార్లు పంపినా పట్టించుకోని ఏయూ వీసీ విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శల వెల్లువ వరుసగా వివాదాలు..! కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏయూలో వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక ప్రైవేటు విద్యా సంస్థకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూలో నియమితులైన అధికారులందరూ సదరు ప్రైవేటు సంస్థలో గతంలో పనిచేయడమూ ఇందుకు కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అన్నం సరిగ్గా లేదని ఒకసారి... కనీస సౌకర్యాలు లేవని మరోసారి.. నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఇంకోసారి ఇలా వరుస వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా విద్యార్థి మరణించిన సంఘటనతో ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ఆందోళన కాస్తా.. ఆగ్రహంగా మారిపోయింది. ఏకంగా తమ ప్రాణాలనే బలితీసుకునేందుకూ వెనుకాడటం లేదన్న ఆవేశం విద్యార్థుల్లో కట్టలు తెంచుకుంది. వాస్తవానికి గతంలో కోవిడ్ సమయంలోనూ ఏయూలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించారు. ఏకంగా 600 మంది విద్యార్థులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు క్వారంటైన్ ముగిసిన తర్వాత వారి తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో అప్పగించారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో ప్రయాణానికి అనుమతి లేని 500 మంది విదేశీ విద్యార్థులకు టీకాలు లభించని సమయంలో కూడా టీకాలు వేయించి మరీ వారి ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదని వచ్చిన విద్యార్థినికి సమయానికి ఆక్సిజన్ అందించి కాపాడుకోలేని ధీనస్థితికి ఏయూను పాలకులు దిగజార్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వసూలు చేసిన రూ.2 లక్షలు వెనక్కి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి పోలీస్ స్టేషన్లోనే వసూళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ కేసులో నగదు తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి చిక్కగా... స్టేషన్లో తీసుకున్న రూ.2 లక్షలు కాస్తా ఎవరి జేబులోకి వెళ్లాయనే కోణంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ఇందుకోసం స్టేషన్ సీసీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. అంతిమ లబ్ధిదారు ఎవరనే కోణంలో విచారణ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే రూ.2 లక్షల వ్యవహారం బయటపొక్కకుండా ఉండేందుకుగానూ.. తన జేబులోకి వేసుకున్న వ్యక్తి కాస్తా తిరిగి ఫిర్యాదుదారుడికి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ పోలీసు అధికారి ద్వారా రాయబారం నడుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. తనకు రూ.2 లక్షలు ఇచ్చినట్టు చెప్పవద్దంటూ బతిమలాడుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఏసీబీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన ఎస్ఐ కాస్తా... తిరిగి త్వరలోనే తనకు లా అండ్ ఆర్డర్ పోస్టింగు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటుండటం ఇప్పుడు అనకాపల్లిలో హాట్టాపిక్గా మారింది.పేరు చెప్పొద్దు ప్లీజ్..!వాస్తవానికి ఈ కేసు వ్యవహారంలో ఎంత మొత్తం తీసుకోవాలనే డైరెక్షన్ మొత్తం ఎస్ఐ వెనుక ఉండి ‘విజయ’వంతంగా నడిపించిన వ్యక్తి ఇప్పుడు తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలో పడినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఫిర్యాదుదారుడితో రాయబారాలు నడిపినట్టు కూడా సమాచారం. ఈ వ్యవహారంలో తనకు సహాయంగా ఉండేందుకు సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ సీఐ సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగానూ రూ.2 లక్షలు వెనక్కి ఇవ్వడంతో పాటు నమోదైన కేసు వ్యవహారంలోనూ సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో ఇప్పటికే రూ.2 లక్షలు అందజేసినట్టు స్పష్టంగా పేర్కొన్న ఫిర్యాదుదారుడు.. అంతిమంగా ఎవరికోసం ఇచ్చారనేది ఇప్పటివరకు వెల్లడించలేదని తెలుస్తోంది. ఇదే అదునుగా తన పేరు చెప్పకుండా ఉండాలంటూ తీసుకున్న రూ.2 లక్షలు తిరిగి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా నగదు రూపంలో సదరు బంధువు ద్వారా లావాదేవీలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని కూడా ఏసీబీ లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఎమ్మెల్యే బంధువని తెలిసినా..!వాస్తవానికి బంగారం షాపు యజమాని స్థానిక ఎమ్మెల్యే బంధువు అని తెలుస్తోంది. తన షాపులోనికి రంధ్రం చేసుకుని వచ్చేందుకు ప్రయత్నించారని.. స్వయంగా సదరు బంధువు వెళ్లి కేసు నమోదు చేయాలంటూ కోరారు. అయితే దొంగతనం ఏమీ జరగలేదు కదా అంటూ.. వెంటనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కూడా ఫోన్ చేసి విచారణ చేయాలంటూ కోరినట్టు సమాచారం. అయినప్పటికీ అవతలి పార్టీ నుంచి లంచం తీసుకుని తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే బంధువు వ్యవహారంలోనే పోలీసులు ఇంత ఉదాసీనంగా కేసు పెట్టకుండా అవతలి వ్యక్తుల నుంచి పైసలు తీసుకున్నారంటే పోలీసింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఎస్ఐ తనకు తిరిగి లా అండ్ ఆర్డర్లో పోస్టింగు వస్తుందంటూ.. ఇందుకోసం సిటీలోని ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తనకు అండదండలందిస్తున్నట్టు కూడా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్
మల్కాపురం : ఓ ఇంటి సర్వే నెంబర్ మార్పు కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా రంగోలి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్గా కర్రి నగేష్ పనిచేస్తున్నారు. ములగాడ మండల పరిధిలో బొడ్డేపల్లి రవితేజ అనే వ్యక్తి ఇంటికి సంబంధించి సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది. దీంతో అతడు తన సర్వే నెంబర్ సరిచేయాలని ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ ఇటీవల రవితేజ ఇంటికి వెళ్లి సర్వే చేశారు. సర్వే సర్టిఫి కెట్ (ఎండార్స్మెంట్ సర్టిఫికెట్) కావాలంటే రూ.30 వేలు అవుతుందని డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఇచ్చేందుకు పంజాబ్ దాబా జంక్షన్ వద్ద గల సచివాలయానికి రావాలని చెప్పారు. ఈక్రమంలో రవితేజ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం అతడు పంజాబ్ జంక్షన్ వద్ద సచివాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ నగేష్, సర్వేయర్ సత్యనారాయణకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ములగాడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు సర్వేయర్ రూమ్లో ఫైల్ను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరచనున్నారు. -
కేజీహెచ్లో సీబీఐ అధికారుల విచారణ
మహారాణిపేట : విశాఖలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతి సాహా కేసుపై సీబీఐ ఆరా తీస్తోంది. గురువారం సీబీఐ డీఎస్పీ దినేష్కుమార్ ఆధ్వర్యంలో కేజీహెచ్లో విచారణ చేశారు. అనుమానాస్పద మృతి చెందడంతో అప్పట్లో నిపుణుల కమిటీ వేసి వారి చేత పోస్టుమార్టమ్ నిర్వహించారు. అప్పుడు కమిటీ సభ్యులు డాక్టర్ మమత, డాక్టర్ హయగ్రీవరావు, డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రజనీకాంతరావులు పోస్టుమార్టం జరిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు మమత, రజనీకాంతరావులకు ఇటీవల బదిలీ అయ్యింది. మిగిలిన ముగ్గురు వైద్యులను గురువారం దినేష్కుమార్ విచారించారు. రికార్డులను, అప్పటి పోస్టుమార్టమ్ నివేదికలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన విద్యార్థిని నీట్ శిక్షణ కోసం విశాఖలో ఆకాష్ బైజూస్ కాలేజ్లో చేరింది. 2023, జూలై 14న రాత్రి విశాఖ 4వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధి దొండపర్తిలో కాలేజీ నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనం పైనుంచి పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 17న మృతి చెందింది. పోలీసులు తొలుత ఆమెది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని కాలేజీకి చెందిన ఇద్దరిని, హాస్టల్కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఆమె మృతిపై తండ్రి సుఖ్దేవ్ సాహా మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు సక్రమంగా లేదని, కాలేజీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మకై ్కపోయారని ఆరోపణలు చేశారు. అలాగే సీసీ కెమెరా పరిశీలిస్తే.. తన కుమార్తె బిల్డింగ్పైకి వెళ్లినపుడు ఒక కలర్ డ్రెస్ ఉందని, కింద పడిన తర్వాత మరో కలర్ డ్రెస్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అప్పట్లో విశాఖలో సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసు విషయంలో స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం బెంగాల్ సీఐడీని విశాఖకు పంపించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరోసారి దర్యాప్తు జరుగుతోంది. సిటీ పోలీసులకు తలనొప్పులు విద్యార్థిని మృతి కేసు విశాఖ పోలీసుల పరువు తీసినట్టయింది. ముందు ఆమెది ఆత్మహత్యగానే పేర్కొంటూ స్వయంగా అప్పటి సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు. బెంగాల్ నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత అప్పటి కప్పుడు సెక్షన్లు మార్చారు. దర్యాప్తు అధికారిని తప్పించి ఉన్నతాధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు వేశారు. ఇపుడు మళ్లీ అప్పటి పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పోలీస్ శాఖలోనే జరుగుతోంది. -
బాలకృష్ణ వ్యాఖ్యలు సరికావు
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ప్రవర్తన ‘మానసిక అస్థిరత్వానికి నిదర్శనం’గా అభివర్ణించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేకే రాజు, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలకృష్ణ మాట్లాడిన భాష, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో సభా సంప్రదాయాలను పాటించకుండా, సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా నెత్తిమీద కళ్లజోడు పెట్టుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడి అసెంబ్లీ గౌరవాన్ని బాలకృష్ణ దెబ్బతీశారని ఆరోపించారు. అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేకే రాజు హెచ్చరించారు. బాలకృష్ణ పిచ్చి చేష్టలు, మాట్లాడే తీరును గమనిస్తే దాన్నే ‘సైకో ఇజం’ అంటారన్నారు. బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ‘వెరీగుడ్’ అనడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ ‘వాడు’, ‘వీడు’ అని మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ, ఇది చిరంజీవిపై ఆయనకున్న అసూయను వెళ్లగక్కడమేనని కేకే రాజు ఆరోపించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
విజిలెన్స్ అవగాహన వాక్థాన్
సీతంపేట: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్ అవగాహన వాక్థాన్, సముద్రతీర శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలుత ద్వారకానగర్లో ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు విజిలెన్స్ వాక్థాన్లో పాల్గొని, పాలనలో జాగ్రత్త (విజిలెన్స్), పారదర్శకత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆర్కే బీచ్లో సముద్రతీర శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రధాన అధికారి ఏవీ రమణమూర్తి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి జాగ్రత్త (విజిలెన్స్), శుభ్రత రెండూ తప్పనిసరి అని అన్నారు. -
ఈపీడీసీఎల్తో ఫ్లూయెంట్గ్రిడ్, సీసీఎఫ్ ఒప్పందాలు
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరాలో నాణ్యత, వ్యవస్థలో ఆధునికీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఒప్పందాలు చేసుకుంది. సాగర్నగర్లోని ఈసీబీసీ భవనంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీవోఈఈటీ) కోసం ఫ్లూయెంట్గ్రిడ్, కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ (సీసీఎఫ్) సంస్థలు ఏపీఈపీడీసీఎల్తో గురువారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ఆధునికీకరణ, కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యంగా కొత్త స్టార్టప్లను గుర్తించడం, ప్రోత్సహించడం ఈ ఎంవోయూల ద్వారా నిర్వహించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ గ్రిడ్ ల్యాబ్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను పరీక్షించి, మెరుగులద్దనున్నారు. యునెజా, గ్రెయిల్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్ల సహాయంతో నాలెడ్జ్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త పరిశోధన పత్రాల ప్రచురణకు తోడ్పడుతుంది. అదేవిధంగా విశాఖ ఎనర్జీ సమ్మిట్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లను నిర్వహిస్తూ, పరిశ్రమ నేతలు, స్టార్టప్లు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ఉద్యోగ–నైపుణ్య మేళాలు ఈ సంస్థల సహకారంతో ఈపీడీసీఎల్ ఏర్పాటు చేస్తుంది. ఫ్లూయెంట్గ్రిడ్ ఎంవోయూలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్లో స్మార్ట్ గ్రిడ్ కమాండ్–కంట్రోల్ సెంటర్ను పైలట్ ప్రాజెక్ట్గా స్థాపించనుంది. ఏఐ ఆధారిత యాక్టిలిజెన్స్ గ్రిడ్ మోడరనైజషన్ ప్లాట్ఫామ్ను వినియోగించి సైదీ, సైఫీ అంచనాలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు నిర్వహణ, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్, రియల్టైమ్ డేటా యాక్సెస్కు ఏఐ అసిస్టెంట్ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. విపత్తు నిర్వహణలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపు, వాటికి అనుగుణంగా నెట్వర్క్ను పటిష్టపరిచేందుకు సూచనలు అందించనుంది. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ కొత్తగా కుదుర్చుకున్న ఎంవోయూలు పునరుత్పాదక ఇంధన రంగం, ఎనర్జీ ట్రాన్సిషన్లో జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర పోషించేందుకు తోడ్పతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆక్సిజన్ పెట్టేవారే లేరు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. ఉద్యోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోంది. ఏయూ పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యం అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకవైపు వందేళ్ల సంబరాలు చేసుకుంటున్న ఏయూలో డిస్పెన్సరీ ‘ఊపిరి’ తీసేస్తున్నారు. నిత్యం వందల మంది వచ్చే ఏయూ ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలతో పాటు వైద్యులు, సిబ్బంది లేకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సదుపాయం లేని కారణంగానే ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మణికంఠ మరణించాడని విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన ఏయూ పాలకుల నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. 200 మంది రోగులు.. ఇద్దరే వైద్యులు ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ ఉంటుంది. ఈ సమయంలో రోజుకు 200 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే. వీరిద్దరే చాలా ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టులు వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. అలాగే ఫార్మసిస్టులు ముగ్గురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే ఒక్కో షిఫ్ట్లో ఒక వార్డుబాయ్ ఉంటున్నారు. వీరే మొత్తం పనిచేయాల్సి వస్తోంది. ఎవరు సెలవు పెట్టినా మిగిలిన వారిపై పనిభారం పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రిలో ఒకటి, అంబులెన్సులో ఒకటి ఉన్నాయి. కానీ అంబులెన్సులో రోగిని తీసుకెళ్లడానికి సిబ్బంది వెళ్లే పరిస్థితి లేదు. రోగికి ఆక్సిజన్ పెట్టేందుకు వార్డుబాయ్ వెళితే.. ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి ఎవరూ లేకుండా పోతున్నారు. ఇదే పరిస్థితి గురువారం ఎదురైంది. అస్వస్థతకు గురైన మణికంఠను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆక్సిజన్ పెట్టేందుకు సిబ్బంది లేరు. ఆక్సిజన్ పెట్టి ఉంటే మణికంఠ ప్రాణాలతో ఉండేవాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలా ఆస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసుకొని కూర్చున్నాయి. ఇక్కడి పరిస్థితులు, అసౌకర్యాలు, సిబ్బంది లోటు వంటి విషయాలను ఏయూ పాలకుల దృష్టికి పలువురు తీసుకువెళ్లినా ఇప్పటి వరకు వాటిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. జీతాలు అరకొరే.. ఆస్పత్రిలో సిబ్బంది జీతాల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దానికి పైగా పనిచేస్తున్న నర్సుకు ఇక్కడ కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తుండడం గమనార్హం. అలాగే ఫార్మసిస్టులకు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. జీతాలు పెంచాలని సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని, సిబ్బందిని నియమించాలని గత ఏడాది కాలంగా పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్లో ఏయూ.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వకళాపరిషత్ను ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏయూ ప్రతిష్ట దిగజారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆందోళనకు, నిరసనలకు కేంద్రంగా మారుతోంది. పాలనపై ఆరోపణలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై విమర్శలు.. పురుగుల భోజనాలతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏయూలో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏయూ వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒక రగడతో ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిసారి ఆందోళనల సమయాల్లో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. -
ప్రశాంతంగా దసరా వేడుకలు జరగాలి
విశాఖ సిటీ: నగరంలో ప్రశాంత వాతావరణంలో విజయ దశమి వేడుకలు జరిగేలా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో ఏడీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో యాక్టివ్గా ఉన్న రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని చెప్పారు. నగరం నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తిగా నివారించాలని, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పికెట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి, డీసీపీ(క్రైమ్స్) లతా మాధురి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆటపాటలతో అదుర్స్
ఏయూక్యాంపస్: నిత్యం తెల్లని యూనిఫాంలో కనిపించే నర్సింగ్ విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 31వ ఎస్ఎన్ఏఐ ద్వివార్షిక రాష్ట్ర స్థాయి సదస్సులో సందడి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పుస్తకాలకు, ప్రాక్టికల్స్కు కాస్త విరామం ఇచ్చి, రంగురంగుల దుస్తుల్లో ఆట పాటలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో – జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినులు ఆసక్తిగా పాల్గొన్నారు. టీఎన్ఏఐ ఏపీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్. సంషీర్ బేగం మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యం, సమన్వయం సదస్సును విజయవంతం అయిందని, వారి సహజ నైపుణ్యాల ప్రదర్శన అభినందనీయమని కొనియాడారు. సంస్థ కార్యదర్శి, ఏపీ ఎన్ఎంసీ రిజిస్ట్రార్ ఆచార్య కె. సుశీల మాట్లాడుతూ, నిత్యం చదువులతో గడిపే నర్సింగ్ విద్యార్థులకు ఈ క్రీడలు, సాంస్కృతిక పోటీలు మంచి ఆటవిడుపునిచ్చాయన్నారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న యువత భవిష్యత్ తరాల నాయకత్వానికి వారసులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మిస్ నర్సింగ్ విజేతగా ఎస్తేర్ ఎం. డేవిస్, మిస్టర్ నర్సింగ్ విజేతగా జిబిన్ బిజు నిలిచారు.రంగోలీ, పేపర్ ప్రజెంటేషన్, ఏకపాత్రాభినయం, బృంద నృత్యాలు, శాసీ్త్రయ నృత్యాలు, క్రీడల పోటీల విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను ప్రదానం చేశారు.టిఎన్ఏఐ ఏపీ సలహాదారు డాక్టర్ సత్యవల్లి అసోసియేషన్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె. ఝాన్సీ లక్ష్మీభాయి, డి. ఉష పన్నగ వేణి, డాక్టర్ టి. అన్నమ్మ, ఆచార్య బి. అనంతమ్మ, కె.వి శ్రీదేవి, జె. లీల, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్ పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్ పర్సన్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన నర్సింగ్ విద్యార్థులు సమ్మేళనం -
ఏఐ సాయంతో ట్రాఫిక్ నియంత్రణ
మహారాణిపేట: పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణను సులభతరం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారం అవసరమని ఎంపీ ఎం. శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అనుసరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గి, నిర్వహణ సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ, నిబంధనల ఉల్లంఘన, అపరాధ రుసుం వంటి అంశాలపై జీవీఎంసీ అధికారులు, వివిధ సాంకేతిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. సమావేశంలో ఎంపీ శ్రీభరత్తో పాటు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు అందించారు. బృహస్పతి, అవిరోస్, ఆర్కడిస్, నయన్ వంటి సాంకేతిక సంస్థల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో అమలు చేస్తున్న సాంకేతిక విధానాలను వివరించారు. సాంకేతికత సహాయంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలను నమోదు చేయడంపై ఇటీవల చేపట్టిన పైలట్ ప్రాజెక్టు నమూనాలను ప్రదర్శించారు. ఎయిర్ పోర్టు రోడ్డు, ఆర్కే బీచ్, బిర్లా జంక్షన్, పంజాబీ హోటల్, ఆర్ అండ్ బీ జంక్షన్లలో సేకరించిన నమూనాలను చూపించారు. భవిష్యత్తు ట్రాఫిక్ సమస్య, సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం, డ్యాష్ బోర్డు నిర్వహణ, వేగ నియంత్రణ, ట్రాఫిక్ అలర్ట్స్, పార్కింగ్ రూల్స్ వంటి అంశాలపై ప్రజెంటేషన్ చేశారు. విశాఖకు తగిన విధంగా సాఫ్ట్వేర్ను రూపొందించాలని, ప్రజల అవసరాలకు తగ్గట్టు సరైన పరిష్కార మార్గాలను చూపే సంస్థ సేవలను వినియోగించుకోవడానికి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. అక్టోబర్ తొలి వారంలో జీవీఎంసీ నుంచి ఆర్.ఎఫ్.పి. సిద్ధం చేసి సాంకేతిక సంస్థలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి, అక్టోబర్ చివరి నాటికి టెండర్లను పిలవాలని జీవీఎంసీ అధికారులకు ఎంపీ సూచించారు. భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టర్, సీపీలతో ఎంపీ శ్రీభరత్ సమీక్ష -
అనకాపల్లి టౌన్ సీఐకి బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు ఏకంగా వసూళ్లకు కేంద్రంగా మారిపోతున్నాయా? అక్కడ ఇక్కడ ఎందుకంటూ నేరుగా స్టేషన్లోనే లంచాలు వసూలు చేస్తున్నారా? అంటే.. గత నెలలో అనకాపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన వ్యవహారాన్ని గమనిస్తే ఇట్టే తెలుస్తోంది. బాధితుడి నుంచి ఫిర్యాదు అందినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఏకంగా అనకాపల్లి స్టేషన్లోనే రూ.2 లక్షలు వసూలు చేసిన వ్యవహారం సీసీ ఫుటేజీ సాక్షిగా బయటపడినట్టు సమాచారం. నేరుగా స్టేషన్కే వచ్చి రూ.2 లక్షలు అందజేసినట్టు ఏసీబీని ఆశ్రయించిన పెందుర్తి వ్యాపారి స్పష్టం చేయడంతోపాటు స్టేషన్ సీసీ ఫుటేజీలో కూడా అదే దృశ్యం కనిపించినట్లు తెలుస్తోంది. ఈ రూ.2 లక్షలు ఎస్ఐ తీసుకున్నప్పటికీ అంతిమంగా ఎవరి జేబులోకి వెళ్లాయనే కోణంలో ఏసీబీ దృష్టి సారించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ‘విజయ’వంతంగా జేబులోకి వేసుకున్న వ్యక్తిని కూడా నిందితుడిగా ఏసీబీ చేర్చనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నాన్చుడు ధోరణి అవలంబించిన అనకాపల్లి సీఐ పేరును కూడా కేసులో ఏసీబీ చేర్చనున్నట్లు సమాచారం. స్టేషన్లోనే లంచాలు తీసుకుంటున్న సీసీ ఫుటేజీ లభించడంతో ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో అసలు దోషి తప్పించుకుంటున్నారంటూ ఆగస్టు 17వ తేదీన ‘సాక్షి’లో ‘అసలు దోషి ఎవరు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇప్పుడు ఏసీబీ తాజా విచారణలో అసలు దోషి బయటపడే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది.పెందుర్తికి చెందిన బంగారు వ్యాపారి అప్పారావు అనకాపల్లిలో ఖాళీగా ఉన్న తన షాపును ఈ ఏడాది మే నెలలో శాస్తి మండల్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి రూ.రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. శాస్తి మండల్ జూలై 16న తన అద్దె షాపు నుంచి పక్కనే ఉన్న బంగారు దుకాణంలోకి రంధ్రం తవ్వి బంగారు ఆభరణాలను దొంగలించడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో పరారయ్యాడు. పక్క షాపు యజమాని బుద్ద శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఈశ్వరరావు షాపు యజమాని అప్పారావును పిలిపించి విచారించారు. ఈ కేసులో ఇరికించకుండా అడ్వాన్స్గా తీసుకున్న రూ.2 లక్షలు, షాపు తాళాలు ఇవ్వడానికి లక్ష రూపాయలు ఎస్ఐ డిమాండ్ చేశాడు. అతడు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.50 వేలకు తగ్గించారు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించగా ఆగస్టు 14వ తేదీన ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే నేరుగా స్టేషన్లోనే రూ.2 లక్షలు ఎస్ఐకి అందజేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఫిర్యాదు వచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన సీఐ మిన్నకుండిపోవడం బట్టి చూస్తే వ్యవహారమంతా ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఐపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
మేయర్కు స్మార్ట్ చెక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో మేయర్ ప్రాభవానికి క్రమంగా చెక్ పడుతోందా? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమికి ఆయన వ్యవహారశైలే కారణమని టీడీడీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందా? ఎమ్మెల్యేలతో ఆయన వ్యవహరశైలిపై కూడా ఆగ్రహంగా ఉందా? అంటే.. తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పరిధిలో తనకు తెలియకుండా హాస్టల్ భవనాలకు టెండర్లను పిలవడంపై కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్పై మేయర్ పీలా శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆ టెండర్లను రద్దు చేస్తూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే, మేయర్ ప్రయత్నాలను చిత్తుచేస్తూ.. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు కూడా జారీచేశారు. అంతేకాకుండా జీవీఎస్సీసీఎల్ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులతో పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రాజెక్టు పనులను కూడా పర్యవేక్షిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. తద్వారా మేయర్ నిర్ణయాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషనర్కు వ్యతిరేకంగా..! వాస్తవానికి జీవీఎంసీ కమిషనర్గా కేతన్ గార్గ్ తనదైన ముద్రతో ముందుకెళుతున్నారు. కమిషనర్గా ఆయన వచ్చిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు, టీడీఆర్ల వ్యవహారాల్లోనూ కమిషనర్ సూటిగా వ్యవహరిస్తుండటం మేయర్ ఆగ్రహానికి కారణమన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కమిషనర్పై మేయర్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై తన అనుయాయుల వద్ద ఆయన బయటపడిన సందర్భాలు ఉన్నట్టు జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణాలపై జీవీఎస్సీసీఎల్ ద్వారా సీఈవో హోదాలో టెండర్లను కమిషనర్ ఆహ్వానించారు. ఈ విషయం తనకు తెలియదంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టెండర్లను రద్దు చేస్తున్నట్టు కూడా పరోక్షంగా కొన్ని మీడియాల్లో కథనాల ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా కమిషనర్ వైఖరితో మేయర్కు ఇబ్బందిగా మారుతోందంటూ లీకులిచ్చారు. తద్వారా కమిషనర్పై నేరుగా యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవీఎస్సీసీఎల్ టెండర్లను రద్దు చేయడమే కాకుండా ఏకంగా బీచ్రోడ్లోని సంస్థ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. తనదే పైచేయి అన్నట్టుగా మేయర్ వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో మేయర్కు ‘స్మార్ట్’గా చెక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేయర్కే ముప్పు..! కేవలం జీవీఎస్సీసీఎల్లోనే కాకుండా చికెన్ వ్యర్థాల విషయంలోనూ కమిషనర్పై నెపం పెట్టే ప్రయత్నం జరిగింది. చికెన్ వ్యర్థాల తరలింపులో పట్టుబడిన వారిపై కేసులు పెట్టకుండా కమిషనర్ అడ్డుపడుతున్నారంటూ మేయర్ వర్గం ప్రచారం చేసింది. వాస్తవానికి కేతన్గార్గ్ కమిషనర్గా వచ్చిన తర్వాత చికెన్ వ్యర్థాల తరలింపునకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కాపులుప్పాడకు తరలించేలా చూస్తున్నారు. దీంతో ఈ ప్రచారం కాస్తా విఫలమైంది. అయితే ఏ టెండర్లను మేయర్ రద్దుచేశాడో... అవే టెండర్లను జీవీఎస్సీసీఎల్ ద్వారానే పిలిచేందుకు అనుమతిస్తూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తద్వారా మేయర్ పీఠానికి తాము ఇస్తున్న గౌరవం ఎంత మేర ఉందనే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పినట్టు ఉందన్న అభిప్రాయం జీవీఎంసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా మేయర్ అధికారాలకు ముప్పు వచ్చేలా తాజా నిర్ణయం ఉందన్న అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. -
‘మహా’ విస్తరణ
డాబాగార్డెన్స్: నగర జనాభా పెరుగుదల, సమీప గ్రామీణ ప్రాంతాల విలీనంతో ఒకప్పటి విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేషన్ గ్రేటర్గా మారింది. 32 గ్రామాల విలీనంతో 72 వార్డులున్న జీవీఎంసీ 98 వార్డులు, 8 జోన్లకు చేరింది. ఇప్పుడు గ్రేటర్ కార్పొరేషన్ మరో అడుగు ముందుకేస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల విలీనంతోపాటు, 8 జోన్లను కాస్తా.. 10 జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. పరిధి పెరగనుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మరింత విస్తరించనుంది. కొత్త విశాఖ జిల్లాలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు జీవీఎంసీలోకి వచ్చే అవకాశముంది. విశాఖ మొత్తాన్ని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని పాలకవర్గం భావిస్తోంది. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం పెరుగుతుండడంతో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. 10 జోన్లకు పెంపు జీవీఎంసీ విస్తీర్ణం పెరిగితే పరిపాలన, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరంగా మారుతుంది. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు జోన్ల సంఖ్యను పెంచాలని పాలకవర్గం భావించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధి రెండు, మూడు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఇప్పుడు ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఒక జోన్ మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జోన్ల వికేంద్రీకరణ పూర్తి చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న వార్డులన్నీ ఒకే జోన్ పరిధిలోకి రానున్నాయి. అలాగే ఇప్పటి జోన్లుగా పిలిచే ఈ కార్యాలయాలు ఇకపై నియోజకవర్గ పేర్లతో ఏర్పాటు కానున్నాయి. దీని ప్రకారం విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, పెందుర్తి, గాజువాక, భీమిలి, అనకాపల్లి పేర్లతో జోన్లు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కొత్తగా మరో రెండు జోన్లు ఏర్పాటు చేయనున్నారు. పెందుర్తిలో గ్రామీణ ప్రాంతాలు కలిస్తే పరిధి పెరుగుతుంది. దీంతో గోపాలపట్నం జోన్ కొత్తగా రానుంది. అలాగే ఆనందపురం, పద్మనాభం మండలాలు కలిస్తే ప్రస్తుతమున్న మధురవాడ జోన్ పరిధి భారీగా పెరగనుంది. దీంతో కొత్తగా భీమిలి జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 జోన్లు 10కి పెరగనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను పాలకవర్గం ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. ఈ జోన్ల పెంపునకు ప్రభుత్వం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే తుది ప్రక్రియకు కసరత్తు జరగనున్నట్లు జీవీఎంసీలో చర్చ జరుగుతోంది. పరిపాలన సౌలభ్యం.. పారదర్శకత జీవీఎంసీ పరిపాలనలో అనూహ్య మార్పులు రానున్నాయి. పరిపాలన సౌలభ్యం, పారదర్శకతలో భాగంగా ఈ ప్రక్రియను గత కౌన్సిల్ సమావేశంలో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఒక్కో జోన్ పరిధిలో 8 నుంచి 15 వార్డులు వరకు ఉన్నాయి. ఒక జోన్ పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాలున్నాయి. దీంతో పరిపాలన సక్రమంగా ఉండడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని మార్చాలని దీర్ఘకాలిక డిమాండ్ ఉంది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక జోన్గా చేయడం ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు. జీవీఎంసీలోకి మండలాలు.. ఉమ్మడి విశాఖ విభజన తర్వాత విశాఖ జిల్లాగా మారాక పద్మనాభం, ఆనందపురం, పెందుర్తిలో కొన్ని గ్రామాలు జీవీఎంసీకి దూరంగానే ఉన్నాయి. దీంతో ఆయా మండలాలకు జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తాజాగా మొత్తం విశాఖ జిల్లా అంతటినీ జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబును ప్రజా ప్రతినిధులు విశాఖ పర్యటనలో కోరారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ను సీఎం ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మండలాలుగా ఉన్న ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే పెందుర్తిలో కొంత మేర జీవీఎంసీలో ఉన్నప్పటికీ మెజార్టీ విస్తీర్ణంలో ఇంకా అనేక గ్రామాలున్నాయి. వీటిని కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం భారీగా పెరగనుంది. -
డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా?
విశాఖ సిటీ: డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా? నీ ఉద్యోగం తీయిస్తా.. అంటూ ఓ కారు డ్రైవర్ కానిస్టేబుల్పై విరుచుకుపడ్డాడు. బుధవారం సంపత్ వినాయగర్ ఆలయం రోడ్డులో కారును నిలిపారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపైనే కారు నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, ముందుకు వెళ్లాలని కానిస్టేబుల్ సూచించాడు. అందుకు కారు డ్రైవర్ అంగీకరించలేదు. కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ కారుకు ఫొటో తీశాడు. వెంటనే డ్రైవర్ రెచ్చిపోయాడు. డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా? అంటూ ఒంటికాలిపై లేచాడు. నీ ఉద్యోగం తీయిస్తా అంటూ హెచ్చరించడం గమనార్హం. -
నౌకా నిర్మాణంలో తిరుగులేని శక్తిగా షిప్యార్డు
హెచ్ఎస్ఎల్ సీఎండీ గిరిదీప్ సింగ్ సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్, మారీటైమ్ ఇండియా విజన్–2030 నాటికి భారత్లో నౌకా నిర్మాణంలో హిందుస్థాన్ షిప్యార్డు(హెచ్సీఎల్) తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని సంస్థ సీఎండీ గిరిదీప్ సింగ్ అన్నారు. నగరంలో బుధవారం జరిగిన స్వరక్ష మహోత్సవ్–2025 సదస్సులో ఆయన మాట్లాడారు. రక్షణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా ఇండియన్ నేవీ, కోస్ట్గార్డ్, వాణిజ్య సంస్థలకు సేవలందిస్తున్న షిప్యార్డు.. ఇప్పటి వరకూ 200 నౌకల్ని డెలివరీ చేయగా, 2000 కంటే ఎక్కువ షిప్స్కు మరమ్మతులు, రీఫిట్ పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దశాబ్దాలకు పైగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పోరాటం సాగించిన తర్వాత.. 2024–25లో అత్యధిక వృద్ధి రేటు, లాభాల్ని నమోదు చేసి.. మినీరత్న హోదాకు అర్హత పొందడం శుభపరిణామమన్నారు. దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లని పొందడం ద్వారా షిప్యార్డు మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ల్యాండ్మార్క్ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రొగ్రామ్, అధునాతన జలాంతర్గాముల నిర్మాణాలపై దృష్టి సారించామన్నారు. షిప్యార్డు ప్రయాణంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ సంస్థల సహకారం మరువలేనిదని సీఎండీ గిరిదీప్ సింగ్ తెలిపారు. -
యువత భవిష్యత్ నాయకులుగా ఎదగాలి
సీతంపేట: యువతలో నాయకత్వాన్ని పెంపొందించడానికి జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఎంతగానో దోహదపడుతుందని ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం.సుధాకర్ అన్నారు. ఏయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్ డే–2025, విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్ నాయకులుగా, బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా విద్యార్థులు కళలు, మేధో పోటీల్లో తమ ప్రతిభను చాటారని తెలిపారు. యువతలో సృజనాత్మకత, సహజ నైపుణ్యాలు వెలికితీసి ఉన్నతంగా తిర్చిదిద్దుతామన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డి.సింహాచలం అప్పటి వరకు జరిగిన కార్యక్రమాల వివరాలను సభకు వివరించారు. -
పోర్టు ఇన్చార్జ్ చైర్మన్గా అంగముత్తు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీపీఏ చైర్మన్గా ఉన్న డా.అంగముత్తు ఈ నెల 22న ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యాక.. కొత్త చైర్మన్ని నియమించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్ని నియమించే వరకూ లేదా ఆరు నెలల కాలం వరకూ వీపీఏ చైర్మన్గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
నిరంతర నైపుణ్యాల పెంపుతో వృత్తిలో రాణింపు
ఏయూక్యాంపస్: నైపుణ్యాలతో మెరుగైన అవకాశాలు లభిస్తాయని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం.శ్రీభరత్ అన్నారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31వ ఎన్ఎన్ఏఐ ద్వైవార్షిక రాష్ట్ర సదస్సు–2025ను బుధవారం ఆయన ప్రారంభించారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రాంతీయ శాఖ ‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో, ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్’అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తోంది. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిరంతరం నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. విదేశాల్లో సైతం నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. ఇండియన్ రెసిటేషన్ ఫెడరేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు మాట్లాడుతూ ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో, సార్వత్రిక రోగ నిరోధకత కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు(సౌత్) డాక్టర్ బి.వల్లి మాట్లాడుతూ నిరంతరం నేర్చుకోవాలనే తపనతోనే వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. టీఎన్ఏఐ ఏపీ శాఖ అధ్యక్షురాలు సీఆర్ సంషీర్ బేగం, టీఎన్ఏఐ ఏపీ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్ఎంసీ రిజిస్ట్రార్ ఆచార్య కె.సుశీల మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకుంటూ, సమష్టిగా పనిచేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఏపీ నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య ఎస్.జ్యోతి మాట్లాడుతూ ప్రత్యక్ష జ్ఞానాన్ని, సామర్థ్యాలను పెంచుకోవడానికి నర్సింగ్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. సంస్థ సలహాదారు డాక్టర్ ఎం.సత్యవల్లి, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్పర్సన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రంగోలి, క్రీడలు, పేపర్ ప్రజెంటేషన్, సాంస్కృతిక పోటీలతో ఆకట్టుకున్నారు. రెండు రోజుల నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు ప్రారంభం -
జైల్ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్
ఆరిలోవ: దేవి నవరాత్రులు సందర్భంగా మహిళలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె బుధవారం సందర్శించారు. జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లతో కలిసి మహిళా ఖైదీల బ్యారక్ను పరిశీలించారు. అక్కడ మహిళలతో సమావేశమై, పలు అంశాలపై అవగాహన కలిగించారు. వారికి పోషకాహారం అందించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. జైల్లోని బ్యారక్లను, ఖైదీలు పనిచేస్తున్న వివిధ పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం జైల్ బయటకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నారీ పరివార్ అభియాన్లో భాగంగా ‘పోషణ్ మా’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జైల్లో మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. కారాగారంలో 80 మంది మహిళా ఖైదీలున్నారని, వారిలో సుమారు 50 మంది గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికినవారేనని పేర్కొన్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్తో పాటు చైన్నె, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారున్నట్లు వెల్లడించారు. మహిళలల్లో మంచిమార్పు తీసుకొచ్చి తిరిగి సమాజంలోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. -
మేయర్కు నిరసన సెగ
పీలా ఇంటి ముందు చిరు వ్యాపారుల బైఠాయింపు పెందుర్తి: ఆపరేషన్ లంగ్స్ పేరిట బడ్డీలను తొలగించడంపై చిరువ్యాపారులు కన్నెర్రజేశారు. దుకాణాల తొలగింపు బాధిత చిరు వ్యాపారులంతా పెందుర్తిలోని మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంటి ముందు బైఠాయించారు. మేయర్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన మేయర్ పీలా శ్రీనివాసరావు బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దుకాణాలు తొలగించిన వారు ఆందోళన చెందవద్దని చెప్పారు. అర్హులైన పేదలను గుర్తించి వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించారు. కాగా మేయర్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ఆధారాలు చూపని నగదు స్వాధీనం
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు చూపకుండా అధిక మొత్తంలో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాలు... జీఆర్పీ, రైల్వే భద్రతా దళం బుధ వారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తెలంగాణా, నిజామాబాద్ జిలాకు చెందిన ముగ్గురు విశాఖ మీదుగా ఒడిశా రాష్ట్రం, కంఠాబంజికు వెళ్తున్నారు. వీరు తమతో ఎలాంటి పత్రాల్లే కుండా రూ.43 లక్షలు తరలిస్తున్నారు. దీన్ని తెలంగాణాలో తమ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలకు అడ్వాన్స్గా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వీరితోపాటు, వీరి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును మహారాణిపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచినట్లు పేర్కొన్నారు. -
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. -
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్
కొమ్మాది: భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందని విధాన నిర్ణేతలు, సైనిక నాయకులు, పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో బుధవారం జరిగిన స్వరక్ష మహోత్సవ్–2025 కార్యక్రమంలో వీరు సమావేశమయ్యారు. దేశ భద్రత విషయంలో వేగవంతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ నుంచి మానవ రహిత సముద్ర వ్యవస్థ, పట్టణ నిఘా కోసం డ్రోన్ల వరకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల గురించి మాట్లాడారు. రక్షణ వ్యవస్థలో ప్రవేశపెడుతున్న మార్పులు, ఆధునిక విధానాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. కోస్ట్గార్డ్ విస్తరణ, పనితీరు, ప్రైవేటు పరిశ్రమల ద్వారా వచ్చే అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా షిప్యార్డులు ప్రపంచ స్థాయిలో పోటీపడాలని, సైబర్ భద్రత విషయంలో ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 40 మంది ప్రదర్శనకారులు అత్యాధునిక రక్షణ, అంతరిక్షం, జియోస్పేషియల్ మొదలైన వాటి సాంకేతికల గురించి ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్గార్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మనీష్వర్మ, తూర్పు నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ అధికారి(ఆపరేషన్స్) అడ్మిరల్ శంతను, హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ గిరిదీప్ సింగ్, చైర్మన్ సాజిద్ ముక్తార్, ఎక్స్ఈ లింక్స్ స్పేస్ ల్యాబ్స్ సీఈవో రూపేష్ కుండపల్లి, విశాఖ ఎంపీ శ్రీభరత్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు. -
సంగం–శరత్లో ఓజీ గోల
సీతంపేట: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా నగరంలోని సంగం శరత్ థియేటర్ అద్దాలను ఫ్యాన్స్ పగులగొట్టారు. బుధవారం రాత్రి 10 గంటల షో టిక్కెట్ల కోసం సాయంత్రం 6 గంటలకే పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ భారీగా థియేటర్కు చేరుకోవడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా నియంత్రించేందుకు ఫోర్త్టౌన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఫ్యాన్స్ అల్లరి శృతిమించింది. కేకలు, నినాదాలతో రెచ్చిపోయారు. హాల్లోకి వెళ్లేటపుడు తోపులాట జరగడంతో థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద గ్లాస్ డోర్ విరిగిపోయింది. టిక్కెట్లు దొరకని వారు థియేటర్ అద్దాలు పగులగొట్టారు. ఆఖరుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి తోపులాటను నియంత్రించి, టికెట్లున్నవారిని థియేటర్ లోపలకు పంపించారు. -
యూత్ జోష్
ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో భాగంగా వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. ర్యాలీ సాంతం కేరింతలు, తమ రాష్ట్రానికే పరిమితమైన నృత్యాలతో అంబరాన్నంటేలా సంబరాలు చేశారు. ఫెస్టివల్ ర్యాలీలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ ప్రాంతీయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. విద్యార్థులతో కలిసిన అధ్యాపకులు, ఆచార్యులు కూడా తమ వయసుకు యువరక్తాన్ని దట్టించి మరీ సందడిని రెట్టింపు చేశారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
అందరికీ అందుబాటులో ప్రజా సేవలు
విశాఖ లీగల్: ప్రభుత్వం అందించే అన్ని సేవలు ప్రజలకు సత్వరమే చేరేలా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా శాశ్వత ప్రజా న్యాయ పీఠం అధ్యక్షుడు జస్టిస్ జి.వల్లభనాయుడు సూచించారు. విశాఖ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాలను ప్రజలందరికీ సత్వరమే చేరేలా పలు సంస్థలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, విద్యుత్, టెలికాం, రవాణా, తపాలా, గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ అభివృద్ధి శాఖ తదితర విభాగాల నుంచి అధికారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకపోతే వారు న్యాయ సేవా ప్రాధికార సంస్థను ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి వల్లభనాయుడు స్పష్టం చేశారు. లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ ప్రయా ప్రయోజన సేవలన్నీ ప్రజలకు సత్వరమే అందేలా అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో ఉత్తమంగా జిల్లా
మహారాణిపేట: జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమంగా నిలిపేందుకు అధికారులు నూతన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు. బుధవారం శాఖల వారీగా అధికారులతో జిల్లా అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి, ఆదాయ మార్గాల సాధనకు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చించారు. రైతు సేవా కేంద్రాల స్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పశుసంవర్ధకంలో డీఆర్డీఏ సహకారంతో కొత్త యూనిట్ల స్థాపన, ఉద్యానవన పంటల విస్తీర్ణం పెంపు, మత్స్య రంగంలో ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. టూరిస్ట్ డెస్టినేషన్ విశాఖలో పర్యాటకులు రెండు మూడు రోజులు గడిపేలా అడ్వెంచర్ టూరిజం స్పాట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంటర్ప్రిన్యూర్షిప్ కోసం శిక్షణ ఇవ్వడానికి విశాఖ ఐఏఎం ముందుకొచ్చిందని, స్థానిక ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లాలో 1,05,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, 64 వేల మందిని దత్తత ఇచ్చామని, ఆ కుటుంబాల అవసరాలు తీరేలా చూడాలన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో పక్షులు ఎగరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, వీధిలైట్ల మరమ్మతులు, రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ 2.0 సంస్కరణ ఫలితాలు ప్రజలకు తెలిసేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేడు గంట పాటు శ్రమదానం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఏక్ దిన్.. ఏక్ ఘంటా.. ఏక్ సాత్ పేరిట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. డీఆర్వో భవానీ శంకర్, జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అప్రెంటిస్ నియామక పత్రాల అందజేత
డాబాగార్డెన్స్: 2025–26 సంవత్సరానికి సంబంధించి డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్ (సివిల్) ట్రేడుల్లో ఉత్తీర్ణులైన ఐటీఐ అభ్యర్థులకు ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ జిల్లాకు చెందిన వివిధ డిపోలలో అప్రెంటిస్ నియామక పత్రాలను జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రెంటిస్షిప్కు ఎంపికై న ప్రతి అభ్యర్థి అంకితభావంతో, నిబంధనలకు అనుగుణంగా తమ విధులు నిర్వర్తించాలని కోరారు. అప్రెంటిస్లకు నెలకు రూ7 వేలు స్టైఫండ్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, అసిస్టెంట్ మేనేజర్ జి. శ్రీధర్ పాల్గొన్నారు. -
విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయిలో క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగర్ నగర్లో రూ. 13.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సూపర్ ఈసీబీసీ భవనాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్గా మార్చాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును మొదట బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నుంచి రూ. 5 కోట్ల గ్రాంట్తో ప్రారంభించారు. భవిష్యత్ ఖర్చులను ఏపీ డిస్కాంలు, ఏపీజెన్కో, ఏపీట్రాన్కోతో కలిసి భరించనున్నాయి. ఈ కేంద్రం కేవలం ఒక పరిశోధనా సంస్థగా మాత్రమే కాకుండా, విద్యుత్ రంగంలో ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లకు ఒక వేదికగా పనిచేయనుంది. ఇది ఒక రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటై, పరిశ్రమలు, విద్యాసంస్థలు, థింక్ ట్యాంకులు కలిసి పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. పునరుత్పాదక శక్తి, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీలు, ఈవీ చార్జింగ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై పరిశోధనలు చేస్తుంది.ఇంజనీర్లు, టెక్నీషియన్లకు సర్టిఫికెట్ కోర్సులు, విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, ఫెలోషిప్లు అందిస్తుంది. స్టార్టప్లకు ఇంక్యుబేషన్, పరిశ్రమ నిపుణులతో మెంటార్షిప్, నిధుల సేకరణకు మద్దతు ఇస్తుంది. ఈ సొసైటీ జనరల్ బాడీకి చైర్మన్గా ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ కేంద్రం స్థాపనతో విశాఖ దేశవ్యాప్తంగా ‘క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ హబ్’గా గుర్తింపు పొందనుంది. -
● గజ్జె ఘల్లుమన్నది.. జానపదం వెల్లివిరిసింది
గజ్జఘల్లుమన్నది...జానపదం వెల్లివిరిసింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రెండు రోజుల యువజనోత్సవంలో విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. మంగళవారం నిర్వహించిన నృత్య పోటీలకు పెద్దసంఖ్యలో యువత పోటీ పడ్డారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలతో తమ ప్రతిభను చాటారు. అధిక శాతం మంది గ్రామీణనేపథ్యం కలిగిన జానపద నృత్యాలను ప్రదర్శించడానికి ఆసక్తి చూపారు. బృందాలుగా వీరు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువత ముందుగా ఎన్ఎస్ఎస్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై తమ నృత్యం సాధన చేశారు. –ఫొటోలు : సాక్షి ఫొటో గ్రాఫర్, విశాఖపట్నం -
అపర సంజీవని
అంపశయ్యపై.. మహారాణిపేట : రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యాలు, పురిటి నొప్పులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే సంజీవనిగా పేరుగాంచిన 108 అంబులెన్స్ సేవలు ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయాయి. సకాలంలో అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడంతో రోగులు, క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే వచ్చే అంబులెన్స్లు ఇప్పుడు మరమ్మతులు కారణంగా ఆలస్యమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ సేవలు, ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో కూడా సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. వైఎస్సార్ కలల పథకం 108 దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2005లో 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ‘కుయ్... కుయ్’ అనే సైరన్ వినగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ సేవలు వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. వై.ఎస్. జగన్ హయాంలో బలోపేతం 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 108 వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఒకేసారి 1,088 కొత్త అంబులెన్స్లను ప్రారంభించి, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉండేలా చూశారు. పట్టణాల్లో 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరేలా సమయపాలన నిర్ధారించారు. ప్రతి అంబులెన్స్ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్తో అనుసంధానం చేసి, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసేలా అధునాతన సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్లలో కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్, ఆటోమెటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ బాక్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. కరోనా సమయంలో కీలక సేవలు 2020–21లో కరోనా మహమ్మారి సమయంలో, 108 అంబులెన్స్లు వేలాది మంది ప్రాణాలు కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించాయి. అంతేకాకుండా, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, నవజాత శిశువులు, పాము కాటుకు గురైన వారు, విషప్రయోగం వంటి అనేక సందర్భాల్లో ఈ అంబులెన్సులు ప్రజలకు సేవలు అందించాయి. కొత్త కాంట్రాక్టర్తో సమస్యలు ఆంధ్రప్రదేశ్లో 2020 జూలై 1 నుంచి అరబిందో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యం లో నడిచిన 108 సేవలు, ఆ కాంట్రాక్ట్ గడువు మే 31తో ముగిసింది. జూన్ 1 నుంచి భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. జిల్లాకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ కలిగిన 108 వాహనాలను కేటాయించారు. అయితే మరమ్మత్తులకు గురైన వాహనాలను సకాలంలో రిపేర్ చేయకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ అత్యవసర సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖలో 108 వాహనాలు విశాఖలో 16 అంబులెన్స్లు ఉన్నాయి. ఇందులో అంబులెన్స్ రిజర్వు ఉంచుతారు. ఎదైనా మరమ్మతులకు గురైతే దాని స్థానంలో ఈ అంబులెన్స్ పంపుతారు. సమస్య ఉంటే తెలియజేయండి పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 108 వాహనాలను నడుపుతున్నాం. మొత్తం 16 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాహనాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా రోగులకు తమకు తెలియజేయవచ్చు. – ఎం.సురేష్, జిల్లా మేనేజర్.సేవలలో జాప్యం అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ప్రాణదాత అయిన 108 అంబులెన్స్ సేవలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహనాలు తరచూ మరమ్మత్తులకు గురవుతుండటం, వాటిని సకాలంలో రిపేర్ చేయకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఫోన్ చేసిన చాలా సమయం తర్వాత కూడా అంబులెన్స్ అందుబాటులోకి రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాద బాధితులు, రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. వాహనాలకు చిన్నపాటి రిపేర్లు వచ్చినా, వాటిని మరమ్మతులు చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీనివల్ల చాలా అంబులెన్స్లు సేవలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో, పేదలు అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది వారి జేబులకు చిల్లు పెడుతోంది. వర్షాల కారణంగా అంటువ్యాధులు పెరిగిన ఈ సమయంలో, ప్రజలు ఆస్పత్రులకు వెళ్లడానికి అంబులెన్సులు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి 108 సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కీలకం
విశాఖ సిటీ : ప్రజల కేంద్రీకృతంగా సమర్ధవంతమైన పాలన అందించడంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర సమాచార కమిషన్ కార్యదర్శి రష్మిచౌదరి పేర్కొన్నారు. 28వ జాతీయ ఈ–గవర్నెన్స్–2025 సదస్సు రెండో రోజు నోవోటెల్ హోటల్లో జరిగింది. ముందుగా ‘సివిల్ సర్వీస్–డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రష్మిచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ విధానాల రూపకల్పన నుంచి పట్టణ ప్రణాళిక, వరద పర్యవేక్షణలో అనేక డిజిటల్ ప్లాట్ఫారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. లేఖలు, నివేదికల తయారీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందని వివరించారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ మాట్లాడుతూ విధానాల తయారీ, అమలు, వ్యవస్థల నడిపించే విషయంలో సివిల్ సర్వెంట్స్ పాత్రను వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఆధార్ సీడింగ్, నగదు రహిత ప్రజా పంపిణీ వ్యవస్థల అమలు, డిజిటల్ చెల్లింపుల స్వీకరణ, ప్రజా సాధికార పల్స్ సర్వే, కృష్ణా పుష్కరాల సమయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని విశదీకరించారు. 2026–27 నాటికి 11 కోట్ల రైతులకు గుర్తింపుకార్డులు అగ్రిస్టాక్–డిజిటల్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చర్ అనే అంశంపై జరిగిన మరో ప్లీనరీలో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది (వర్చువల్) మాట్లాడుతూ 2026–27 నాటికి 11 కోట్ల రైతులకు డిజిటల్ గుర్తింపుకార్డులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం, వారి ఆధార్ లింకేజ్, భూ యాజమాన్య రికార్డులు, మ్యుటేషన్లు, పంట పొలాల ఫొటోలు, జియోట్యాగ్లతో జాతీయ స్థాయిలో కచ్చితమైన పంటల రికార్డులను నమోదు చేయనున్నట్లు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్తో 710 సేవలు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ జీఎస్డబ్ల్యూఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనవన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వాట్సాప్ డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా 40కి పైగా విభాగాలకు చెందిన 710 సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈవో ప్రఖార్ జైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీటీవీ నిఘా వ్యవస్థలపై మాట్లాడారు. ప్రభుత్వం 2017లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, రెడ్–లైట్ ఉల్లంఘనలను గుర్తించేందుకు 14,770 కెమెరాల నెట్వర్క్ను ఏర్పాటు చేసిందన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించడానికి స్మార్ట్ పోలీసింగ్, గవర్నెన్స్ కోసం 300 అధునాతన కెమెరాలు, 38 అనలిటిక్స్ సాధనాలతో ఏఐని అనుసంధానం చేసినట్లు చెప్పారు. అనంతరం సదస్సులో చర్చించిన 11 అంశాలతో రూపొందించిన డిక్లరేషన్కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ముగిసిన 28వ జాతీయ ఈ–గవర్నెన్స్–2025 సదస్సు -
సాగరగిరి బోటుకు పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్: దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని సాగర గిరి కనకదుర్గ దేవాలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సాగర గిరి కనకదుర్గ ఆలయానికి నగరం నుంచి వెళ్లాలంటే సాగరాన్ని దాటాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి నగరం నుంచి రోడ్డు మార్గం లేదు. పోర్టు అథారిటీ అనుమతితో బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పాత పోస్టాఫీస్ దరి వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఫెర్రీ నుంచి ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోటు సౌకర్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సాగరగిరి కనకదుర్గ దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు పొటెత్తారు. ఫెర్రీపై రాకపోకలు సాగిస్తున్న భక్తులు -
వరల్డ్ మెగా మారథాన్ పూర్తిచేసిన కల్యాణ్
బీచ్రోడ్డు: ఇండియన్ స్కేటింగ్ మాజీ కోచ్, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన కూరపాటి కల్యాణ్(54) జర్మనీలోని బెల్జియం నగరంలో జరిగిన వరల్డ్ మెగా మారథాన్లో పాల్గొని, పతకం సాధించారు. రాష్ట్రం తరఫున ఎంపికై న ఆయన ఈ నెల 20న జరిగిన ఇన్లైన్ స్పీడ్లో 42 కిలోమీటర్లు, 21న 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు సకాలంలో పూర్తిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 181 దేశాల నుంచి 80 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 8 వేల మంది విజేతలుగా నిలిచారు. విశాఖ వుడాపార్క్లో కోచ్గా ఉంటూ వేలాది మందిని స్కేటింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. కల్యాణ్ రోలర్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపకులు. విశాఖ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్చంద్ర, ఉపాధ్యక్షుడు కరణం గంగాధర్, జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్, కోచ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కల్యాణ్కు అభినందనలు తెలిపారు. -
నేడు జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు
డాబాగార్డెన్స్: తోపుడు బండ్లు, వీధి విక్రయదారులపై వెంటనే దాడులు ఆపాలంటూ బుధవారం అన్ని జోనల్ కార్యాలయాల వద్ధ ధర్నాలు చేపట్టాలని సిటు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం జగదాంబ జంక్షన్ సమీపాన సిటూ కార్యాలయంలో విశాఖపట్నం తోపుడుబండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిటు జిల్లా కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ అన్ని జోన్ల పరిధిలో తోపుడు బండ్లు, బడ్డీలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తూ వేలాది మంది చిల్లర వర్తకులను రోడ్డుపాల్జేశారన్నారు. తక్షణం తొలగించిన తోపుడుబండ్లు, బడ్డీలను అదే స్థలంలో కొనసాగించాలని, ధ్వంసం చేసిన బండ్లు, బడ్డీలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిటు జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉండగా, తోపుడుబండ్లు, బడ్డీ కార్మికులపై దాడులు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సిటు మధురవాడ జోన్ నాయకుడు పి.రాజ్కుమార్, పి.వెంకట్రావు, పి.మూర్తి, వరలక్ష్మి, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. సిటు పిలుపు -
పీహెచ్సీ వైద్యుల సమ్మెబాట
మహారాణిపేట : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25లోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 26 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్కు, డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావుకు సమ్మె నోటీసులు అందజేశారు. చాలా మంది వైద్యులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నారని సకాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ పీజీ కోటాను తిరిగి పునరుద్ధరించాలని, ఎస్టీ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి బేసిక్ పేపై 50శాతం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంలో పనిచేస్తున్న వారికి రూ.5 వేల అలవెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఇంక్రిమెంట్లను తదితర సమస్యలపై అనేక వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె తప్పడం లేదని అసోసియేషన్ నాయకులు డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. -
ఆదిలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. అలంకరణకు నగరానికి చెందిన ఆర్.గణేశ్వరరావు రూ.35వేల రుసుం చెల్లించి పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్మాల్ అందజేసింది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం కనకమహాలక్ష్మీ ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమివ్వనున్నారని, లక్ష చామంతులతో పూజ నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. -
గంజాయి రవాణా అడ్డుకట్టకు ఉమ్మడి వ్యూహం
సాక్షి, విశాఖపట్నం : ప్రాంతీయ భద్రత, శాంతిభద్రతలను పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసుల మధ్య జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్–రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు సరిహద్దు సమస్యలు, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై చర్చించారు. గత కొన్నేళ్లుగా గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని, 2021–22లో 7,515 ఎకరాల నుంచి 2024–25లో 93 ఎకరాలకు తగ్గిందని విశాఖ రేంజ్ పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణాలో 377 కేసులు నమోదు చేసి, 22,207 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం, సమాచార మార్పిడిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో కోరాపుట్ సౌత్ వెస్టర్న్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, రాయగడ ఎస్పీ ఎం. స్వాతి ఎస్ కుమార్, కోరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, మల్కాన్గిరి ఎస్పీ హెచ్. వినోద్ పాటిల్, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. -
● దంచి కొట్టిన వాన
మహారాణిపేట: నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు కుండపోతగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూ కాలనీ, ఆశీల్మెట్ట, దొండపర్తి, చావులమదుం, అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణా మార్కెట్, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్త రోడ్డు, పాత పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
కూటమి కక్ష
విశాఖపట్నంచిరు వ్యాపారులపై7బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 202575 కేసుల్లో 103 మంది నిందితుల అరెస్ట్బీచ్రోడ్డు : చిరు వ్యాపారుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు ఇవ్వకుండా వారి దుకాణాలను తొలగించడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బళ్లు, బడ్డీల తొలగింపును నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, హాకర్లతో కలిసి మంగళవారం ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అయినా వైఎస్సార్ సీపీ శ్రేణులు, హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం బడ్డీలు, తోపుడు బళ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి హాకర్ జోన్లలో వ్యాపారాలను ప్రోత్సహించిన ఇదే జీవీఎంసీ అధికారులు ప్రభుత్వం మారగానే కుట్ర పూరితంగా దుకాణాలను తొలగించడం దుర్మార్గమన్నారు. జీవీఎంసీ అధికారుల దాడుల్లో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు తక్షణం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. నాడు అనుమతులిచ్చి నేడు కూల్చేస్తారా..? చిరు వ్యాపారాలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఉన్నపళంగా దుకాణాలు కూల్చివేస్తే ఎలా?.. వారు ఎక్కడికి పోవాలి? కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న జీవీఎంసీ కమిషనర్లే హాకర్ జోన్ల పేరుతో స్థలాలు కేటాయించి నంబరింగ్, ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వ్యాపారాలను ప్రోత్సహిస్తే ఇప్పుడు ఉన్న కమిషనర్ కర్కశంగా వాటిని తొలగించేశారన్నారు. రోడ్డున పడ్డ 40 వేల కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా నగరంలో దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. డైలీ ఫైనాన్స్, ముద్ర లోన్స్ తీసుకొని వ్యాపారులు చేసుకుంటున్న వారంతా ఇప్పుడు లోన్లు కట్టేదారి లేక అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చేతనైతే భూ కబ్జాలను అడ్డుకోండి.. కూటమి ప్రభుత్వానికి చేతనైతే నగరంలో బడాబాబులు చేస్తున్న అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలను అడ్డుకోవాలని కానీప రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులపై విరుచుకుపడటం దుర్మార్గమన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలను క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. కూటమి ఎమ్మెల్యేలు చిరువ్యాపారులకు క్షమాపణలు చెప్పి వారి దుకాణాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖను పణంగా పెడుతున్నారు.. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావనే ఆలోచనతో కుట్రపూరితంగా నిత్యం నగరంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కె.కె.రాజు ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను ఇక్కడ నుంచి వెనక్కి పంపే కుట్ర జరుగుతోందన్నారు. ఇక్కడి సంపదను అమరావతికి తరలించుకుపోతున్నారన్నారు. ఇక్కడి భూములను తనఖా పెట్టి బ్యాంకు లోన్లు తీసుకుని అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ సీనియర్ నాయుకులు రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, గొలగాని శ్రీనివాస్, పిన్నమరాజు సతీష్ వర్మ, నడింపల్లి కృష్ణంరాజు, కటారి అనిల్కుమార్రాజు, అల్లు శంకర్రావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, రవి రాజు, పల్లా చినతల్లి, అల్లంపల్లి రాజబాబు, రామన్న పాత్రుడు, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, నీలపు కాళిదాస్ రెడ్డి, ముత్తి సునీల్ కుమార్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సకలభక్తుల ప్రసాద్ రావు, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమకిరణ్ జగదీష్, రామి రెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, దేవరకొండ మార్కెండేయులు, కార్పొరేటర్ గులివిందల లావణ్య, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, చిరువ్యాపారులు పాల్గొన్నారు. విశాఖ సిటీ : నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆగస్టు నెలలో నగరంలో 105 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 75 కేసులు ఛేదించి 103 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.5,70,500 , 557.392 గ్రాముల బంగారం, 18 బైక్లు, 423 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తంగా రూ.1,21,24,953 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా ఆగస్టులో నగరంలో 247 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పోలీసులు రికవరీ చేసిన సొత్తు, వస్తువులను సీపీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(కై మ్) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ జేడీగా శంకరరావు కూటమి ప్రభుత్వం ముంచేసింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిరు వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్సార్ చేదోడు, చేయూత పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వం మా బతుకులను బజారుకీడ్చింది. సీతమ్మధారలో కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న టిఫిన్ షాపును తొలగించటంతో కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. – నారాయణ రావు, టిఫిన్ షాపు, సీతమ్మధారవృద్ధాప్యంలో ఇన్ని కష్టాలా? గత 30 ఏళ్లగా కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ ఒంటరి జీవితం కొనసాగిస్తున్నా. దుకాణాలు తొలగింపుతో జీవనాధారం లేకుండా పోయింది. ఈ వయసులో ఇతర పనులకు వెళ్లాలేని పరిస్థితి. ఎలా బతకాలో ఆందోళనగా ఉంది. ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆర్థికంగా దెబ్బతీసింది. – ఎల్లాయ్యమ్మ, వృద్ధురాలు, దొండపర్తిరోడ్డున పడ్డాం.. నా భార్య, కుమారుడు దివ్యాంగులు. కుటుంబమంతా కలిసి పకోడీ షాపు ద్వారా జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు షాపు తొలగించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం చర్యలతో వీధినపడ్డాం. – వెంకట రమణ, పకోడి షాపు, కృష్ణకాలేజ్ రోడ్డుఆరిలోవ: విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డెరెక్టర్గా డాక్టర్ దేవులపల్లి శంకరరావు బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా ఇంతవరకు పనిచేసిన ఆయనకు జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఇంతవరకు ఇక్కడ స్మైల్ విభాగానికి చెందిన డాక్టర్ కరుణాకరరావు జేడీ(ఎఫ్ఏసీ)గా పనిచేసి సోమవారం రిలీవై డాక్టర్ శంకరరావుకు బాధ్యతలు అప్పగించారు. -
వేధింపులు ఆపి.. ఉద్యోగ భద్రత కల్పించాలి
బీచ్రోడ్డు : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గునూరు వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కార్మికులపై టీడీపీ నాయకులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ల వేధింపులు తీవ్రమయ్యాయని.. అకారణంగా తొలగిస్తూ.. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మనాభం మండలంలో అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వొద్దని కోరారు. కార్మికులకు హామీ ఇచ్చిన విధంగా గ్యాస్ సరఫరా చేయాలని, రెండు నెలల బకాయి బిల్లులను చెల్లించాలని, మెనూ చార్జీలను విద్యార్థికి రూ.20 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు భవాని, జి.మంగశ్రీ, యూనియన్ నాయకులు పి.మణి, రాము, గౌరీ, నర్సియమ్మ, ధనలక్ష్మి, సావిత్రి పాల్గొన్నారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ వర్కర్ల ధర్నా -
పిడుగుపాటుకు శాప్ కార్మికుడు దుర్మరణం
పీఎం పాలెం: కొమ్మాదిలో గల శాప్(ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్)లో పనిచేస్తున్న దోహార్తి సూర్యప్రకాష్(38) పిడుగుపాటుకు గురై మరణించాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు.. సూర్యప్రకాష్ ఆరిలోవలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తూ కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్ మెయింటెనెన్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు గ్రౌండ్కు వెళ్లిన అతడు మెషీన్తో గ్రాస్ కట్ చేస్తుండగా 11.10 సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ ధాటికి సూర్యప్రకాష్ గ్రౌండ్లో పడిపోయాడు. శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108 వాహనానికి ఫోన్ చేశారు. వారు వచ్చి పరిశీలించి మరణించినట్లు ఽఽఽధ్రువీకరించారు. మృతుని భార్యకు, పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. భార్య ఆశ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
విశాఖ రైల్వేస్టేషన్లో జీఎం తనిఖీలు
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) పరమేశ్వర్ ఫంక్వాల్, వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి విశాఖపట్నం స్టేషన్లో పర్యటించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను, పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. రిజర్వేషన్ కార్యాలయం, జనరల్ బుకింగ్ కార్యాలయం, క్యాప్సూల్ హోటల్, కేటరింగ్ స్టాల్స్ను తనిఖీ చేశారు. ప్లాట్ఫాంలు, పాదచారుల వంతెనలను పరిశీలించారు. ఎస్ఎంవీటీ బెంగళూరు–హతియా ఎక్స్ప్రెస్లో ఆన్బోర్డ్ తనిఖీలు చేపట్టారు. అనంతరం మర్రిపాలెంలోని మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి, అక్కడ శిక్షణ పొందుతున్న వారితో, ఫీల్ట్ సిబ్బంది, సూపర్వైజర్స్తో ముఖాముఖి మాట్లాడారు. డీజిల్ లోకోషెడ్లో పర్యటించిన జీఎం ఆక్కడి సిబ్బంది చేపట్టిన నూతన ఆవిష్కరణలను పరిశీలించి, అభినందించారు. న్యూకోచింగ్ కాంప్లెక్స్, ప్యాంట్రీకార్లను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట వాల్తేర్ డివిజన్ ఉన్నతాధికారులు ఉన్నారు. -
కార్మికులే రైల్వేకు బలం
ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్తాటిచెట్లపాలెం : ఉద్యోగులు, కార్మికులే భారతీయ రైల్వేకు బలమని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. సోమవారం తాటిచెట్లపాలెంలో గల ఆశీర్వాద్ కల్యాణ మండపంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఽ11వ ద్వివార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నిత్య శ్రామికులు ఒక్క రైల్వే కార్మికులు మాత్రమేనని తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కార్మికుల పక్షాన పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిందని, త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్బోహ్ర మాట్లాడుతూ రైల్వే కార్మికులంతా కలిసి పనిచేస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతీ అడుగులోనూ కార్మికుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే(ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కార్మికులు సరిగా పనిచేయకపోతే అధికారులు వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకంటారని, మరి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఎటువంటి చర్యలు లేవని వాపోయారు. వెంటనే 8వ వేతన సంఘం ఏర్పాటుచేసి 2026 జనవరి నుంచి తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్ను ప్రతీ రైల్వే కార్మికుడికి అమలుచేయాలని, పాత డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ముందుగా ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జి.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్.సి.సాహూలు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పీసీపీవో ఎల్విఎస్ఎస్ పాత్రుడు, సీనియర్ డీపీవో జూసుఫ్ కబీర్ అన్సారి, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్ సాహూ, ఈ.శాంతరాం, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎస్టీఈ, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్, వాల్తేర్ డివిజన్, డివిజనల్ కో ఆర్డినేటర్ టి.వి.మౌళీశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.నరసింగరావు, వాల్తేర్, ఖుర్దారోడ్, సంబల్పూర్ డివిజన్ల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. -
వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ లోగో ఆవిష్కరణ
విశాఖ సిటీ: ‘వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్’ విశాఖపట్నం లోగోను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న నగర క్రీడాకారుల సహాయార్థం ‘ప్రత్యేక క్రీడా సంక్షేమ నిధి’ కోసం నూతనంగా ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీ కమల్ బయిద్ సీపీకి వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు సామాజిక సేవా సంస్థలు ఆర్థిక సాయాన్ని అందించి ప్రోత్సహించి క్రీడాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ ట్రస్ట్ను ప్రారంభించిన కమల్ బయిద్తో పాటు ట్రస్టీలు నండూరి రామకృష్ణ , శుభోద్ కుమార్ రాకేచ, డా.మంగ వరప్రసాద్, చింతలపాటి శ్రీనివాసరాజు, కపిల్ అగర్వాల్లను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎల్.సుధాకర్, కోశాధికారి ఎం.రామారావు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం
అల్లిపురం: అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా, ది కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్, జిల్లా సహకార శాఖ సంయుక్తంగా రామ్నగర్లోని పైడా కాలేజీలో సోమవారం బ్యాంకింగ్పై అవగాహన సదస్సును నిర్వహించాయి. సదస్సులో భాగంగా బ్యాంకులు అందించే వివిధ సేవలు, పొదుపు ఖాతాల నిర్వహణ, ముఖ్యంగా విద్యా రుణాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు అందిస్తున్న విభిన్న సేవలు, రుణాలు, ఇతర సౌకర్యాలను వివరించారు. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ బ్యాంకు ప్రత్యేక విద్యా రుణాలను అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్, సహకార శాఖ జిల్లా అధికారి సత్యశ్రీ, ప్రిన్సిపాల్ డాక్టర్ సరోజిని, కనకమహాలక్ష్మీ కో–ఆపరేటివ్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్యామ్కిశోర్, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మీ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రాంబాబు -
దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి
మద్దిలపాలెం: విద్యార్థులు విభిన్న రంగాల్లో ప్రతిభ సాధించాలని ఏయూ జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) సమన్వయకర్త ఆచార్య డి.సింహాచలం అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల యువజనోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు విద్యతో సమానంగా కళలు, సాంస్కృతిక, సాహస కృత్యాల్లో చురుకై న భూమిక పోషిస్తారని పేర్కొన్నారు. విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ఆచార్య ఎస్.హరినాథ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగి ఉంటారని, వాటిని గుర్తించి ఆ దిశగా కృషి చేయాలన్నారు. రెండు రోజులపాటు 11 అంశాలలో యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తొలి రోజు వక్తృత్వ, వ్యాసరచన, వాద ప్రతివాద, క్విజ్, రంగవల్లులు, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు జరిగాయి. మంగళవారం సోలో, గ్రూప్ సాంగ్లు, శాసీ్త్రయ, జానపద నృత్యాలు, నాటికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ఎన్ఎస్ఎస్ దినోత్సవమైన సెప్టెంబర్ 24న బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొగ్రాం అధికారి ఈపీఎస్ భాగ్యలక్ష్మి, జోనల్ అధికారి డాక్టర్ పి.ఉమామహేశ్వరరావు, వివిధ జిల్లాల ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు. ఏయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు -
స్టీల్ప్లాంట్ మాజీ సీఎండీ బి.ఎన్.సింగ్కు ఘన నివాళి
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ పూర్వ సీఎండీ డాక్టర్ బి.ఎన్.సింగ్కు స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఘనంగా నివాళి అర్పించింది. సోమవారం ఉక్కు పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో బి.ఎన్.సింగ్ మృతికి ఇన్చార్జ్ సీఎండీ అజిత్కుమార్ సక్సేనా, డైరెక్టర్లు ఎ.కె.బాగ్చీ, ఎస్.సి.పాండే, జి.వి.ఎన్.ప్రసాద్, సలీం జి.పురుషోత్మన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ కరుణ రాజు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎన్ సింగ్ తన నాయకత్వంతో విశాఖ స్టీల్ప్లాంట్ను దేశంలోనే విలువైన ఉక్కు సంస్థగా తీర్చిదిద్దారన్నారు. రూ.4 వేలు కోట్ల నష్టంతో ఉన్న స్టీల్ప్లాంట్ను తన నాయకత్వ లక్షణాలతో 2002లో టర్న్ అరౌండ్ స్థాయికి తీసుకు వెళ్లారన్నారు. స్టీల్ప్లాంట్లో చేరకముందు ఆయన టిస్కో, సెయిల్, రూర్కెలా స్టీల్ప్లాంట్లో కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఉక్కు పరిశ్రమలో సెలక్షన్ కమిటీ, సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారన్నారు. ఆయన స్టీల్ప్లాంట్కు చేసిన సేవలను ఉద్యోగులు తమ గుండెల్లో శాశ్వతంగా నిలుపుకుంటారన్నారు. -
బతుకు పడవలు
ఒడ్డున ఆగినఆశాజనకంగా లేని వేట తూర్పు తీరంలో మత్స్యకారుల బతుకుచిత్రం ఆందోళనకరంగా మారింది. వేట సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా, వారి వలలకు ఆశించిన సంపద చిక్కడం లేదు. వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చు, తిరిగి వస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కని దుస్థితి. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లోని 643 బోట్లకు గాను కేవలం 150 బోట్లు మాత్రమే నామమాత్రంగా వేటకు వెళ్తున్నాయి. సుమారు 80 శాతానికి పైగా మరబోట్లు ఒడ్డుకే పరిమితమై, అప్రకటిత వేట విరామాన్ని పాటిస్తున్నాయి. ఉపాధి లేక ఎందరో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆరంభ శూరత్వమే.. విశాఖ చేపల రేవు తూర్పు తీరానికి కేంద్రంగా ఉంది. జూన్ 15న వేట నిషేధం ముగిసినప్పుడు మత్స్యకారులు ఎన్నో ఆశలతో సముద్రంలోకి అడుగుపెట్టారు. తొలి రెండు నెలలు చేపలు, రొయ్యల దిగుబడి జోరుగా సాగడంతో ఈ సీజన్ తమను ఆదుకుంటుందని భావించారు. కానీ ఆగస్టు నుంచి పరిస్థితి తలకిందులైంది. చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి, సెప్టెంబర్ నాటికి పూర్తిగా పడిపోయింది. దీంతో వేట గిట్టుబాటు కాక.. యజమానులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 15 రోజుల వేటకు సుమారు రూ. 3.5 లక్షలు ఖర్చవుతుంటే, కనీస ఆదాయం కూడా రాకపోవడంతో బోట్లను హార్బర్లోనే నిలిపివేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య దిగుబడులు వచ్చాయని మత్స్య పరిశ్రమ వర్గాలు చెబుతుంటే.. సుమారు 40 శాతం మేర తగ్గిపోయాయని వ్యాపారులు అంటున్నారు. ట్యూనా వేటదీ అదే కథ అధిక ధర పలికే ట్యూనా చేపల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంది. 70 నుంచి 100 వరకు బోట్లు ట్యూనా కోసం వెళ్లినా, ఆశించిన ఫలితం దక్కడం లేదు. నాణ్యమైన గ్రేడ్–1 ట్యూనా చేపలు దొరికినా, వాటిని 48 గంటల్లోపు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్లో లేవు. దీంతో చేతికొచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. జిల్లాలో 32 మత్స్యకార గ్రామాలు, సుమారు 1.5 లక్షల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కారణాలెన్నో.. కష్టాలెన్నో.. మత్స్య సంపద తగ్గడానికి ప్రధాన కారణం సముద్ర వాతావరణంలో వస్తున్న మార్పులేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో చేపలు, రొయ్యలు చల్లదనం కోసం లోతైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. అంత లోతుకు వెళ్లి వేటాడే సాంకేతికత, వనరులు సాధారణ మత్స్యకారులకు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరిగిపోయి, మత్స్య సంపద నశించిపోతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ భారం పెరిగిపోవడంతో వేట గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సముద్రమే జీవనాధారంగా బతికే గంగపుత్రుల జీవితాలు.. ఇప్పుడు అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ఎన్నో ఆశలతో ప్రారంభమైన వేట సీజన్.. వారి ఆశలను ఆవిరి చేస్తూ కన్నీటి గాథగా మారుతోంది. లక్షలు పెట్టుబడిగా పెట్టి సముద్రంలోకి వెళ్తే, కనీసం డీజిల్ ఖర్చులు కూడా రాక, బోట్లను ఒడ్డుకే కట్టేసి నిస్సహాయంగా చూస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ .. ఒకప్పుడు వేలాది బోట్ల రాకపోకలతో, మత్స్యకారుల కోలాహలంతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు 80 శాతానికి పైగా బోట్లు లంగరేసుకుని నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. – మహారాణిపేట ప్రభుత్వమే ఆదుకోవాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలి. పెరిగిన డీజిల్ ధరలు, తగ్గిన వేటతో గంగపుత్రుల బతుకులు కష్టాల్లో ఉన్నాయి. పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, వైఎస్సార్ సీపీ నాయకుడు మత్స్య పరిశ్రమను కాపాడండి మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇది కేవలం మత్స్యకారుల సమస్య కాదు, మొత్తం పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించి, గిట్టుబాటు ధరలు కల్పించి, పరిశ్రమకు చేయూతనివ్వాలి. లేకపోతే ఈ వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. – సూరాడ సత్యనారాయణ(సత్తిబాబు), ఉపాధ్యక్షులు, వైశాఖి మరపడవల సంఘం -
పేలిన గ్యాస్ సిలిండర్
గోపాలపట్నం: జీవీఎంసీ 90వ వార్డు విమాన్నగర్లోని ఓ ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. విమాన్నగర్లోని వినాయక ఆలయం సమీపంలో ఉన్న గ్రూప్ హౌస్లోని మూడో అంతస్తులో ఆర్మీలో జేఈగా పనిచేస్తున్న మురళి కుటుంబం నివాసం ఉంటోంది. అతని భార్య రాధ సోమవారం ఉదయం పూజ కోసం దూపం వేయడానికి బొగ్గులు రాజేస్తుండగా, ఆ నిప్పు రవ్వలు గాలికి ఎగిరి కిటికీ తెరలకు అంటుకున్నాయి. ఆ మంటలు వాషింగ్ మెషీన్కు, ఆ తర్వాత దాని పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించాయి. దీంతో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రాగా.. ఈ శబ్దం విన్న పక్కనే ఉన్న వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సిలిండర్పై నీళ్లు చల్లడంతో మంటలు వారిపైకి ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో డి.వి.పాత్రుడు, కె.ఎన్.కుమార్, కుమార్ సింగ్లతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మర్రిపాలెం అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా వాషింగ్ మెషీన్ పేలిందని, దాని వల్ల పక్కనే ఉన్న నిండు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయని వారు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి స్వల్ప గాయాలు -
మారుతుందా?
విశాఖ స్వరూపం మహారాణిపేట: జిల్లా సరిహద్దుల మార్పుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా, ఎస్.కోట అసెంబ్లీని పాక్షికంగా విశాఖ జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో జీవీఎంసీ పరిధి 89శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతం కేవలం 11 శాతం మాత్రమే ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాన్ని పెంచడం, అలాగే అవకాశం ఉన్న ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పునర్విభజన అంశాలను తీసుకువచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలం ఇప్పటికే విశాఖ జిల్లాలో ఉండగా, అదే నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాలను కూడా విశాఖ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై పరిశీలన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎస్.కోట విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక. అయితే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి వల్ల ప్రజల పరామర్శలు, పర్యటనలు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఎస్.కోటను విశాఖ జిల్లాలో విలీనం చేయడంపై అధ్యయనం జరుగుతోంది. ఒకే ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. జిల్లా భౌగోళిక స్వరూపంలో మార్పులు ఒకప్పుడు పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్నగా మారింది. గతంలో మైదాన, గిరిజన, పట్టణ ప్రాంతాలు విశాఖ జిల్లాలో భాగంగా ఉండేవి. జిల్లాల విభజన తర్వాత గ్రామీణ ప్రాంతం తగ్గి, గిరిజన ప్రాంతం పూర్తిగా లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో అదనపు ప్రాంతాలను కలిపితే ఎలా ఉంటుందనే దానిపై అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ఈ చర్చలు విశాఖ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, కొన్ని ప్రాంతాలను ఆయా జిల్లాల్లో కలపడానికి కసరత్తు జరుగుతోంది. జిల్లా పునర్విభజన కమిటీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. వాటిలో కొన్నింటిని సవరించడానికి కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. జిల్లాల సంఖ్యను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా ఈ ఉప సంఘం పరిశీలిస్తోంది. జిల్లాల విలీనం, తొలగింపు వంటి అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. -
క్యూట్ వాక్
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫ్యాషన్, ఇంటీరియర్, ఫొటోగ్రఫీ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అద్భుతంగా రూపొందించిన డిజైన్లు, సృజనాత్మకమైన ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు డిజైన్ చేసిన వస్త్రాలను ధరించి ర్యాంప్పై చేసిన వాక్ అందరినీ కట్టిపడేసింది. ఈ ప్రదర్శన ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ రంగంలో రాణించాలనుకునే యువతకు ఒక చక్కటి వేదికగా నిలిచిందని నిర్వహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థుల ప్రతిభకు విస్తృత ప్రచారం కల్పించి, గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమసుందర్ టెంకా తెలిపారు. – సీతంపేట -
సమన్వయంతో ఈ–గవర్నెన్స్ సదస్సు విజయవంతం చేయాలి
మహారాణిపేట: 28వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సును విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్లతో కలిసి వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం, మంగళవారం నోవాటెల్ హోటల్లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులతో వారు చర్చించారు. సదస్సు ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రతి పనినీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే, లైజన్ అధికారులు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ల నుండి వచ్చే అతిథులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈ ప్రతిష్టాత్మక సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. -
పోలీస్ కమిషనరేట్కు స్కోచ్ అవార్డు
అల్లిపురం: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే ప్రత్యేక కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా విశాఖ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన ఈ సహాయ కేంద్రం ద్వారా, 69 రోడ్డు ప్రమాద కేసులలో బాధితులకు రూ. 63.50 లక్షల పరిహారం అందించారు. ఈ సేవా కార్యక్రమానికి గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన 102వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో విశాఖ పోలీసులు ఈ అవార్డును స్వీకరించారు. ఈ విజయంతో హిట్ అండ్ రన్ కేసుల బాధితులు, వారి కుటుంబ సభ్యులు, నగర పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సేవా కేంద్రం ఏర్పాటు చేసినందుకు గాను కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నేటి నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో దసరా ఉత్సవాలు
డాబాగార్డెన్స్: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి వచ్చే నెల 2 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22న కనకమహాలక్ష్మి స్వర్ణకవచ కిరీటధారిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజున అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, సహస్రనామార్చన జరపనున్నారు. 23న ఆదిలక్ష్మిగా దర్శనమిస్తారు. ఆ రోజు విశేష అర్చన, లక్ష కుంకుమార్చన జరుపుతారు. 24న ధనలక్షి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆ రోజు అమ్మవారికి లక్ష చామంతులతో పూజ, 25న ధాన్యలక్ష్మి అవతారంలో లడ్డూల పూజ అందుకుంటారు. 26న ధైర్యలక్ష్మి అవతారంలో తులసీదళాలతో సహస్రనామార్చన నిర్వహించనున్నారు. 27న సంతానలక్ష్మి అవతారంలో కలువపూలతో పూజలందుకుంటారు. 28న విజయలక్ష్మిగా గులాబీల పూజలందుకుంటారు. 29న మూలానక్షత్రం సందర్భంగా విద్యాలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు. 30న గజలక్ష్మి అలంకరణలో లక్ష గాజులతో పూజలందుకుంటారు. అక్టోబర్ 1న మహాలక్ష్మిగా శాకంబరి అలంకరణలో పూజలందుకుంటారు. నవరాత్రుల చివరి రోజు అక్టోబర్ 2న స్వర్ణ కవచాలంకృత కనకమహాలక్ష్మి అమ్మవారికి 108 పుష్పాలతో స్వర్ణపుష్పార్చన నిర్వహించనున్నారు. ఈదురుగాలులతో కకావికలం -
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
మహారాణిపేట: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పిలుపునిచ్చారు. ఇటీవల వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో పలువురికి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రత్యేక అధికార ప్రతినిధిగా అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా జి. విక్టర్ జోసెఫ్లు నియమితులయ్యారు. ఈ మేరకు వారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అభినందించారు. ఈమేరకు వీరంతా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర వలంటరీ విభాగం ప్రధాన కార్యదర్శి పోలగం శ్రీనివాసరెడ్డి, వార్డు అధ్యక్షుడు చొల్లంగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం, ఎస్సీ విభాగం నాయకులు అల్లంపల్లి రాజబాబు, విక్టర్ జోసెఫ్లు కేకే రాజును సత్కరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
AIతో చెక్
విద్యుత్ లోపాలకుసాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఆవిష్కరణలను చేపడుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును వినియోగిస్తోంది. విద్యుత్ సరఫరా, స్తంభాల లోపాలు, డిమాండ్ అంచనా వంటి కార్యకలాపాల్లో ఏపీఈపీడీసీఎల్ ఇప్పటికే ఏఐని ఉపయోగిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, క్షేత్రస్థాయి సమస్యలను కనిపెట్టడానికి కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఏఐతో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కొద్ది నెలలుగా ఏపీఈపీడీసీఎల్ తమ ఫ్రంట్లైన్ కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించింది. విద్యుత్ వ్యవస్థకు ఏఐ సాంకేతికతను అనుసంధానించడం వల్ల సమస్యల పరిష్కారం మరింత సులభమైంది. ఈ కొత్త వ్యవస్థను ఏపీఈపీడీసీఎల్ ఐటీ ఇంజినీర్లు, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, బెంగళూరుకు చెందిన జోనాయిక్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఏడాది మార్చిలో ఏపీఈపీడీసీఎల్ డేటా సెంటర్లో ఒక ఏఐ సర్వర్ను ఏర్పాటు చేశారు. ఈ సర్వర్ను స్మార్ట్ఫోన్కు అనుసంధానించి, విద్యుత్ సరఫరాలో లోపాలను సరికొత్త సాంకేతికతతో పరిష్కరించే ప్రయోగాల్లో విజయం సాధించారు. స్మార్ట్ఫోన్ కెమెరాతో స్తంభాల లోపాలు కూడా జోనాయిక్ స్టార్టప్ సంస్థ సీఈవో శశాంక్ చిలంకుర్తి మార్గదర్శకత్వంలో విద్యార్థులు జీపీయూ ప్రోగ్రామింగ్, ఏఐ వర్క్ఫ్లో ఫ్రేమ్వర్క్పై శిక్షణ పొందారు. అలాగే, ఏపీఈపీడీసీఎల్ ఐటీ టీమ్ను కూడా వాన్ శ్రీనివాస్ సుశిక్షితుల్ని చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తిందో లైన్మెన్ల సహకారంతో ఏఐ ద్వారా గుర్తించడంలో 100 శాతం విజయం సాధించారు. పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్స్ వద్ద ఎక్కడైనా లోపం ఉంటే, స్మార్ట్ఫోన్ కెమెరా ఉపయోగించి క్షణాల్లో కనిపెట్టే వ్యవస్థను రూపొందించారు. ఇన్సులేటర్లకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నా వెంటనే ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్టార్టప్ సంస్థ, ఏపీఈపీడీసీఎల్ కోసం ఒక ప్రైవేట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోడ్ను రూపొందిస్తోంది. దీని ద్వారా విద్యుత్ సరఫరాలో లోపాలను ముందుగానే అంచనా వేసి, సంబంధిత ఆపరేటర్లకు సమాచారం చేరవేస్తుంది. ఈ వ్యవస్థ వల్ల సరఫరాలో లోపాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మీటర్ల లోపాలను కూడా పసిగట్టే ఏఐ స్మార్ట్ మీటర్ల డేటాను అంచనా వేయడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ డేటా సహాయంతో తప్పుడు రీడింగ్లు నమోదు చేస్తున్న మీటర్లను సులభంగా పసిగట్టవచ్చు. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్కు కలిగే ఆదాయ నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు. అంతేకాకుండా, ఏఏ ప్రాంతాల్లో లో–వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో ఏఐ రియల్–టైమ్ మానిటరింగ్, గ్రాఫ్ విశ్లేషణల ద్వారా సమాచారాన్ని అందిస్తోంది. ఈ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి పటిష్టమైన యాంటీవైరస్ వ్యవస్థను కూడా రూపొందించారు. స్మార్ట్ మీటర్లు, ఫీడర్ నిర్వహణ, విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి సేకరించిన డేటాను ఏకీకృత డేటా లేక్ వ్యవస్థలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది ఓవర్లోడ్లను ముందుగానే గుర్తించడాన్ని మరింత సులభతరం చేసింది. పోల్ నుంచి.. డిమాండ్ సరఫరా వరకూ.. రాష్ట్ర స్థాయిలో దీర్ఘకాలిక డిమాండ్ అంచనా, సామర్థ్య ప్రణాళికల కోసం ఇప్పటికే ఈపీడీసీఎల్ పరిధిలో ఏఐని విజయవంతంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళిక, ఖర్చుల్ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాం. స్మార్ట్మీటర్ ఇంటిగ్రేషన్తో ఇప్పుడు ఫీడర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్థాయిలో స్థానికంగా డిమాండ్ అంచనాల్ని కూడా కనుగొనే సాంకేతికతని అందిపుచ్చుకున్నాం. ఓవర్లోడ్ని ముందుగానే గుర్తించడం, సకాలంలో లోడ్ షిఫ్టింగ్ మొదలైన అంశాలపై మరింత చురుగ్గా వ్యవహరించేలా ఈపీడీసీఎల్ నిరంతరం సేవలందించేందుకు సిద్ధమైంది. ఏఐ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరగడంతో పాటు.. సిబ్బందికి.. లోపాలు పరిష్కరించే మార్గాలు మరింత సులువవుతుండటం శుభపరిణామం. – పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ -
ఉత్సాహంగా గ్లోబల్ గోల్స్ రన్
ఏయూ క్యాంపస్: బీచ్రోడ్డు వేదికగా ఐసెక్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గ్లోబల్ గోల్స్ రన్ 2025 నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఆ దిశగా ప్రజలను నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానశ్రీ బోకం తెలిపారు. ఏఐఈఎస్ఈసీ ఉపాధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో బాధ్యతను పెంపొందిస్తాయన్నన్నారు. నిర్వాహకులు సార్థక్ మాట్లాడుతూ యువతలో నాయకత్వం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదకారిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసెక్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
వరి పొలంలో మృతదేహం లభ్యం
పద్మనాభం: మండలంలోని విలాస్కాన్పాలేనికి చెందిన బోని ముత్యాలనాయుడు(68) ఆదివారం పొలంలో శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. తన తండ్రి ముత్యాలనాయుడు పొలంలోకి వెళ్లి తిరిగి రాలేదని ఈ నెల 18న కుమారుడు నరేష్ పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేఽశారు. దీనిపై పోలీసులు ముత్యాలనాయుడు అదృశ్యమైనట్టు కేసు నమోదుచేశారు. ముత్యాలనాయుడు తమ వరి పైరు పొలంలోనే బోర్లాపడి మృతిచెంది ఉన్నాడు. పొలంలో ముత్యాలనాయుడు మృతదేహాన్ని అదే గ్రామానికి చెందిన కాళ్ల శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో చూశాడు. ఈ విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలిపాడు. తన తండ్రి గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని కుమారుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముత్యాలనాయుడు మృతదేహం బాగా కుళ్లిపోవడంతో భీమునిపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సంఘటన స్థలానికి వచ్చి, నమూనాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ జెండా తొలగింపుపై ఆందోళన
ఆరిలోవ ప్రాంతంలో ఆదివారం జీవీఎంసీ సిబ్బంది వైఎస్సార్సీపీ జెండా తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. జీవీఎంసీ సిబ్బంది అత్యుత్సాహంవైఎస్సార్సీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. స్థానిక టీడీపీ నాయకుల కనుసైగలతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మహేష్ రోడ్డు పక్కన బడ్డీల తొలగింపు ఆదేశాలను పక్కన పెట్టి, వారి మెప్పు కోసం 13వ వార్డు పరిధి ఆరిలోవ ఆఖరి బస్టాప్ వద్ద ఎవ్వరికీ ఎలాంటి ఆటంకం లేని, ఐదేళ్ల నుంచి ఉన్న పార్టీ జెండాను జేసీబీతో పూర్తిగా జెండా దిమ్మతో సహా తొలగించారు. -
విశాఖ ఉక్కు ప్రగతిలో.. డా.బీఎన్ సింగ్ది సువర్ణాధ్యాయం
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు స్ఫూర్తి ప్రదాత, ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్లాంట్ను లాభాల బాట పట్టించిన మేధావి, మాజీ సీఎండీ డాక్టర్ బీఎన్ సింగ్ ఆదివారం లక్నోలో కన్నుమూశారు. ‘నా ఉద్యోగులే నా బలం’అని చాటి చెప్పి స్టీల్ప్లాంట్ పునరుజ్జీవానికి మార్గదర్శకులైన ఆయన మరణ వార్త స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. రూ.4 వేల కోట్ల నష్టాల నుంచి.. 1997 నవంబర్ 28న బీఎన్ సింగ్ స్టీల్ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి సంస్థ రూ.4 వేల కోట్ల నష్టాలతో, సిక్ ఇండస్ట్రీగా ప్రకటించి, బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్(బీఐఎఫ్ఆర్)కు రిఫర్ చేయబడింది. కంపెనీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన పరిస్థితులు. అసాధారణ మెటలర్జిస్ట్, టెక్నోక్రాట్ మాత్రమే కాకుండా కార్మికుల పట్ల మానవీయ దృక్పథం కలిగిన నాయకుడాయన. ‘టెక్నాలజీ ఒక ప్లాంట్ను నిర్మిస్తుంది.. కానీ దాన్ని లాభాల్లో నడిపేది మనుషులే’అని ఎప్పుడూ చెప్పేవారు. ఆనాడు సంస్థ నష్టాలకు వెరవకుండా స్టీల్ప్లాంట్ శ్రామిక శక్తిని సమీకరించారు. అప్పటి 16 వేల మంది సిబ్బందిని ‘వుయ్ కెన్’అంటూ ఉత్తేజపరిచారు. 2002 నాటికి లాభాల బాట పట్టించారు. తరచూ ఉత్పత్తి విభాగాలను సందర్శిస్తూ, అక్కడి ఉద్యోగులతో నేరుగా మమేకమవుతూ వారితో సన్నిహితంగా ఉండేవారు. ఉక్కునగరంలోని సీఎండీ బంగ్లాలో పండే మామిడి పండ్లను ఉద్యోగులతో పంచుకునేవారంటే.. ఆయనకు ఉద్యోగుల పట్ల ఉన్న దృక్పథం ఏంటో తెలుసుకోవచ్చు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి.. యూనియన్లు, అధికారులు, కార్మికులు, యాజమాన్యం కలిసి కట్టుగా పనిచేసేలా సంఘటితం చేసిన వ్యక్తిగా బీఎన్ సింగ్ను చెప్పుకోవచ్చు. క్లిష్టమైన ఆర్థిక సవాళ్లను అధిగమించి, 2002 నాటికి సంస్థను లాభాల్లోకి తీసుకురావడం వెనుక ఆయన నాయకత్వ పటిమే కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు. తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల హక్కులు, సంక్షేమం ఆలస్యం కాకుండా చూసుకున్న నిజమైన మానవతావాదిగా ఆయన్ని ఉద్యోగులు, కార్మికులు చెప్పుకుంటారు. స్టీల్ప్లాంట్ కోసం ఆయన చేసిన సేవల్ని గుర్తించి, ఆయన గౌరవార్థం ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటలర్జికల్ ఇంజినీరింగ్లో ఆయన పేరిట గోల్డ్ మెడల్ను అందిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త కూడా అయిన డాక్టర్ బిఎన్ సింగ్ టువార్డ్స్ ది క్రియేటర్, లైఫ్ ఏ జర్నీ, రిలిజియన్ సైన్స్ అండ్ సొసైటీ అనే వైజ్ఞానికతతో కూడిన ఆధ్యాత్మిక పుస్తకాలను రచించారు. ఆయన మృతి పట్ల స్టీల్ప్లాంట్ అధికార, కార్మిక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
యువత డ్రగ్స్ బారిన పడొద్దు
ఏయూ క్యాంపస్: యువతరం డ్రగ్స్కు బానిసలు కాకుండా, డ్రగ్స్ రహిత దేశంగా నిలిపే దిశగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నమో యువ 3కే రన్ బీచ్రోడ్డులో భారతీయ యవ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద రన్ని ప్రారంభిస్తూ మాధవ్ మాట్లాడారు. గంజాయి. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారత్ నిలుస్తుందని, ఈ బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు భారతీయులే అధిపతులుగా నిలచారని, వారిని ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ రోజు నిర్వహించిన ఈ పరుగు దేశాభివృద్ధి దిశగా యువతను తీసుకెళ్లాలా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, కోశాధికారి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుష్, మీడియా ఇన్చార్జి కోటేశ్వరరావు, యువమోర్చా నాయకులు ధోని నాగరాజు, వంశీ యాదవ్, కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
లేపాక్షిలో ఫెస్టివల్ డిస్కౌంట్ సేల్
● ఉదయం ఎండ.. మధ్యాహ్నం భారీ వాన ఐ ఫోన్ కొనలేదని యువకుడి ఆత్మహత్య వైఎస్సార్సీపీ జెండా తొలగింపుతోఉద్రిక్తతవిక్రయానికి తీసుకువెళ్తున్న ఆరిలోవ: స్థానిక టీడీపీ నేతల మౌఖిక ఆదేశాలకు జీవీఎంసీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అత్యుత్సాహం తోడవడంతో ఆరిలోవ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఎవరికీ అడ్డంకి లేకుండా, ఐదేళ్లుగా ఉన్న వైఎస్సార్సీపీ జెండాను జీవీఎంసీ సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 13వ వార్డు పరిధి ఆరిలోవ ఆఖరు బస్టాప్ వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. ఆరిలోవ ఆఖరి బస్టాప్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కనే ఏ వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా 2019లో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. వార్డు టీడీపీ నాయకుల కనుసైగలతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్(బీఐ) మహేష్ రోడ్డు పక్కన బడ్డీల తొలగింపు ఆదేశాలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ జెండాను దిమ్మతో సహా పొక్లెయిన్తో తొలగించి ముక్కలు చేయించేశారు. అక్కడితో ఆగకుండా ఆ జెండా కర్ర(ఇనుప రాడ్డు)ను పొక్లెయిన్ తొట్టెలో వేసుకుని సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో కిలోల లెక్కన విక్రయించేశారు. విషయం తెలుసుకున్న వార్డులోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ జీవీఎంసీ సిబ్బంది విక్రయించిన స్క్రాప్ దుకాణం వద్దకు చేరుకున్నారు. అక్కడ సిబ్బందిని నిలదీయడంతో వెంటనే ఆ జెండా కర్రను అదే పొక్లెయిన్లో వేసుకుని తిరిగి తొలగించిన స్థానం వద్దకు తీసుకొచ్చారు. ఇంతలో వైఎస్సార్ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని కూటమి ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొక్లెయిన్ డ్రైవర్, జీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. దీంతో బీఐ మహేష్ చెప్పడం వల్లే తొలగించినట్లు డ్రైవర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మహేష్ తొలుత తనకేమీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈలోగా ఆరిలోవ ఎస్ఐ రాందాస్ సిబ్బందితో చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలను వారించారు. బీఐ మహేష్ను ఎస్ఐ ప్రశ్నించడంతో టీడీపీ నాయకుల పేరు చెబితే తనకు ఇబ్బంది అవుతుందని, పార్టీ జెండా తొలగించడం తన తప్పేనంటూ ఒప్పుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు శాంతించారు. అనంతరం అక్కడ గొయ్యి తీయించి జెండా ఏర్పాటు చేయించారు. దీనిపై కొంత సేపు నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఇదిలా ఉండగా ఈ చర్యను పార్టీలకు అతీతంగా పలువురు ఖండించారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట్, రాష్ట్ర చేనేత విభాగం జనరల్ సెక్రటరీ వానపల్లి ఈశ్వరరావు, నాయకులు బేత దుర్గారావు, కాకర గోవింద్, వంకర బాబూరావు, ప్రసంగి వాసు, పాండ్రంకి శ్రీనివాసరావు, బేగం, పోలారావు, బొండా ఉమామహేష్, డాక్టర్ నాయుడు, వానపల్లి మంగరాజు, బంగార్రాజు, భాస్కర్, కామేశ్వరరావు, రాము, సురేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్స్, బహుమతులతో విద్యార్థులు, జపాన్ ప్రతినిధులు -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర
అల్లిపురం: రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నెల రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. నాగరాజు మాట్లాడుతూ, మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న రూ. 6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3400కు పైగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం బస్సు యాత్రతో పాటు వివిధ రూపాలలో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. శేఖర్, కోశాధికారి భవాని, సహాయ కార్యదర్శిలు కె.మౌనిక, హేమానందం, ఉపాధ్యక్షుడు కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రేపు జీఎస్టీ సంస్కరణలపై ఉత్సవాలు
బీచ్రోడ్డు: జీఎస్టీ సంస్కరణలపై ఈనెల 22న జీఎస్టీ 2.0 పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో జీఎస్టీ సంస్కరణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అన్ని వర్గాల ప్రజల కు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసు కొచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. దసరా కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి గొప్ప బహుమతి ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలియజేశాయన్నారు. పన్నుల భారం తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ అధికార ప్రతినిధులు సుహాసిని, నాయకులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాల పరిశీలన
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్ను వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా శనివారం సందర్శించారు. పండగల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, తాగునీటి సదుపాయం, ప్లాట్ఫారాల పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే వెయిటింగ్ హాళ్లు, ఏసీ లాంజ్లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ ప్రాంతాలు, బుకింగ్ కౌంటర్లను పరిశీలించి, రైల్వే మార్గదర్శకాల ప్రకారం విధులు జరుగుతున్నాయా లేదా అని నిర్ధారించుకున్నారు. ఈ పర్యటనలో డీఆర్ఎంతో పాటు కమర్షియల్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, సెక్యూరిటీ, సిగ్నల్ అండ్ టెలికం విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రెయిలింగ్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆరిలోవ: జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలివి.. ఉదయం సుమారు 7 గంటల సమయంలో విశాఖ నుంచి పార్వతీపురం వెలుతున్న ఆర్టీసీ బస్ జాతీరహదారిపై జంతు పునరావాస కేంద్రం (ఏఆర్సీ) సమీపంలో అదుపుతప్పింది. దీంతో ఆ బస్ రోడ్డు పక్కన రెయిలింగ్పైకి దూకుపోయింది. సుమారు 50 మీటర్లు వరకు రెయిలింగ్ మీద నుంచి ముందుకు దూసుకుపోయి ఆగింది. దీంతో బస్సులో ఉన్న కొద్ది పాటి ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. అటుగా వెళ్లే వాహనచోదకులు బస్సులో ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్మిక ఒప్పందాలు అమలు చేయాలి
బీచ్రోడ్డు: గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను విద్యుత్ సంస్థల యాజమాన్యం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు(ఏపీఎస్పీఈ) నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఈ డిస్కం యూనిట్ చైర్మన్ గణపతి మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులను, సమస్యలను ఇప్పటికే విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు, రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో శాంతియుత ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జూనియర్ లైన్మన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్) కు కొత్త సర్వీసు నిబంధనలను రద్దు చేసి, పాత నిబంధనలు వర్తింపజేసి పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మన్ పోస్టుల్లో జూనియర్ లైన్మన్ గ్రేడ్–2లకు వెంటనే పదోన్నతి కల్పించాలని కోరారు. 1999 నుంచి 2004 వరకు నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ప్రకారం నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న అభద్రతాభావాన్ని తొలగించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరారు. విద్యుత్ ఉద్యోగుల నిరసన -
ఏపీఈపీడీసీఎల్లో స్వచ్ఛాంధ్ర
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) కింజరాపు వెంకట రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సర్కిల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విశాఖ సర్కిల్ ఎస్ఈ జి.శ్యాంబాబు, విజిలెన్స్–ఏపీటీఎస్ సీఐ ఇ.వెంకునాయుడు, జోన్–1 డీఈ పోలాకి శ్రీనివాసరావు, డీఈ టెక్నికల్ ఎం.ధర్మరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం విజిలెన్స్–ఏపీటీఎస్ విశాఖ పోలీస్ స్టేషన్లను సీవీవో రామకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. అక్కడ రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
ప్రజల భద్రత, రక్షణ కోసమే ‘ఆపరేషన్ లంగ్స్’
జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: ప్రజల భద్రత, రక్షణ, ఆరోగ్య పరిరక్షణకు, ఫుట్పాత్ల స్వేచ్ఛకు, విశాలమైన రోడ్ల ఉపశమనానికి, పాదచారులు, వాహనాలు లేని వారి సురక్షిత నడకకు, వాహనదారుల రాకపోకలకు రక్షణ కల్పించే ధ్యేయంగా ఆపరేషన్ లంగ్స్ 2.0 చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. నగరంలో ఫుట్పాత్లు, రోడ్లు, ప్రధాన జంక్షన్లలో అనధికారికంగా బడ్డీలు, తోపుడు బళ్లు, ఫుడ్ స్టాళ్ల వ్యాపారాలు కొనసాగించడం వల్ల.. ప్రజలు రోడ్ల నడుస్తూ ట్రాఫిక్లో చిక్కుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు హానికరమైన ఆహారం విక్రయించే ఫుడ్ స్టాళ్లలో ఆహార పదార్థాలు తింటూ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. అందువల్లే ఫుట్పాత్ల నిర్వహిస్తున్న బడ్డీలు, స్టాళ్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. చిరువ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ నిబంధనలకు అనుగుణంగా వెండింగ్ జోన్లలో కేటాయిస్తామన్నారు. ఫుట్పాత్లు, రోడ్లు, జంక్షన్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు తొలగించి జీవీఎంసీకి సహకరించాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర పబ్లిక్ వింగ్ కార్యదర్శిగా పరవాడ ఈశ్వరరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుడపాటి వి.డబ్ల్యూ.జోసెఫ్(విశాఖ తూర్పు), కార్యదర్శులుగా గుంట సుందర్ రావు(విశాఖ పశ్చిమ), డోల ఆనంద్(భీమిలి), ప్రత్యేక అధికార ప్రతినిధిగా అల్లంపల్లి రాజుబాబు(విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్గా మట్టి సునీల్కుమార్(విశాఖ ఉత్తర), రాష్ట్ర వలంటీర్ వింగ్ సంయుక్త కార్యదర్శిగా పచ్చిరాపల్లి రామారావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ కార్యదర్శిగా శంఖబత్తుల సన్యాసిరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా పటాన సంషద్ భేగం(విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు. -
‘చలో మెడికల్ కళాశాల’ విజయవంతం
పెందుర్తి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వానికి ఏమీ పాలుపోవడం లేదన్నారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదనే నాయకుల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారన్నారు. ఇప్పటికై నా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందని, 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. -
సమస్యలు చెప్పనీయరా?
ఏయూ మహిళా హాస్టల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన మద్దిలపాలెం: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతిగృహం వద్ద శనివారం రాత్రి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల సావిత్రిబాయి వసతిగృహంలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) బాలికల విభాగం నాయకులను యాజమాన్యం లోనికి అనుమతించలేదు. అయితే, తమ సమస్యలు చెప్పడానికి విద్యార్థినులు బయటకు వస్తున్న తరుణంలో వర్సిటీ యాజమాన్యం, వార్డెన్ వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాత్రి వేళల్లో వసతిగృహంలోకి బయటివారిని అనుమతించబోమని యాజమాన్యం తెలిపిందని పోలీసులు సర్దిచెప్పారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం కో–కన్వీనర్ పి.ప్రగతి మాట్లాడుతూ.. విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి తాము వస్తే అడ్డుకోవడం అన్యాయమన్నారు. విద్యార్థినులను ఇలా నిర్బంధించడం దారుణమని పేర్కొన్నారు. విద్యార్థినులందరూ ఏకమై హాస్టల్ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థుల నుంచి వేల రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తూ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, మంచి నీటి సమస్యతో పాటు అనేక ఇతర ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థినుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ వర్సిటీ కార్యదర్శి డి.వెంకటరమణ, కమిటీ సభ్యులు సంజయ్, తరుణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులతోసౌమ్యంగా మెలగాలి
ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడిసాక్షి, విశాఖపట్నం: సమస్యలు వివరించడానికి వచ్చే విద్యుత్ వినియోగదారులతో అధికారులు, సిబ్బంది సౌమ్యంగా మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఐఐఎం విశాఖపట్నం సహకారంతో, ఏపీఈపీడీసీఎల్ సాగర్ నగర్ శిక్షణ కేంద్రంలో ‘ఆర్గనైజేషనల్ బిహేవియర్–మేనేజింగ్ పీపుల్’అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుతాయని, తద్వారా సిబ్బంది వినియోగదారులకు మరింత దగ్గర అవుతారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సీఎండీ పృథ్వీతేజ్ ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. సంస్థ ఫైనాన్స్–హెచ్ఆర్డీ డైరెక్టర్ డి.చంద్రం, ఐఐఎం ప్రోగ్రామ్ డైరెక్టర్లు ప్రొఫెసర్ హ్యాపీ పాల్, ప్రొఫెసర్ అనుపమ శర్మ పాల్గొన్నారు. -
జియో స్పేషియల్ టెక్నాలజీ అనువర్తనాలు అపారం
మద్దిలపాలెం: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని, ఆవిష్కరణలను ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవాలని వర్కింగ్ గ్రూప్ ఐఎస్పీఆర్ఎస్ చైర్మన్ ఆచార్య ఐ.వి.మురళీకృష్ణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమ్యాటిక్స్ విశాఖ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ‘జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్’అనే అంశంపై శనివారం ఒక్క రోజు వర్క్షాపు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియోస్పేషియల్ టెక్నాలజీస్ అనువర్తనాలు అపారమని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరిగితే మేక్ ఇన్ ఇండియా కల సాకారమవుతుందన్నారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ జియోస్పేషియల్ రంగంలో ఏయూ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని తెలిపారు. దీనికి నిదర్శనంగా విశ్వవిద్యాలయానికి లభించిన ‘టెస్ట్ యూనివర్సిటీ అవార్డు’, ఆచార్య వజీర్ మహమ్మద్కు లభించిన ‘నేషనల్ జియోస్పేషియల్ ఫ్యాకల్టీ అవార్డు’లను ప్రస్తావించారు. జియోస్పేషియల్ స్టూడెంట్ క్లబ్ ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టులకు విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. సదస్సు కన్వీనర్ ఆచార్య వజీర్ మహమ్మద్, విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణరెడ్డి వర్క్షాప్ ప్రాముఖ్యత, విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరించారు. ఐఎస్పీఆర్ఎస్ చైర్మన్ ఆచార్య మురళీకృష్ణ -
విశాఖ విశిష్టతను పెంచేలా ఈ–గవర్నెన్స్ సదస్సు
ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగంకార్యదర్శి కాటమనేని భాస్కర్ మహారాణిపేట: విశాఖ నగర విశిష్టతను, ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించనున్న ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐటీ, ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సదస్సు నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో భాగస్వామ్యం అవుతారని, వారంతా హర్షించేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోర్డింగ్లు పెట్టాలని చెప్పారు. నోవాటెల్ హోటల్ వద్ద వైద్య బృందాలు, ఆధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రావెలింగ్ ప్లాన్ పక్కాగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అనుగుణంగా నియమించిన కమిటీలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలను పీపీటీ ద్వారా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ విభాగం ఎండీ సూర్యతేజ, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, డీఆర్వో భవానీ శంకర్, పలువురు డిప్యూటీ కలెక్టర్లు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
జీవీఎంసీలోకి గ్రామీణ ప్రాంతాలు!
మహారాణిపేట: విశాఖ కేంద్రంగా నవంబర్లో పెట్టుబడుదారుల సదస్సు, వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) జరగనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పా రు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధా న రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పార్కుల ఆధునికీకరణ, లైటింగ్ మెరుగుదల వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఈ పనుల కోసం స్మార్ట్ సిటీ నిధుల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు పలు ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, మధురవాడ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ(యూజీడీ) వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.540 కోట్ల రుణం మంజూరైందని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు రావడంతో, సుమారు ఐదు వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లాలో 89 శాతం జీవీఎంసీ పరిధిలో ఉందని, కేవలం 11 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతం ఉందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్నందున, ఆ ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే లాభనష్టాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. -
నవశకం
నౌకా నిర్మాణంలో ● అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో.? ● విశాఖలో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం ● నౌకా నిర్మాణ మార్కెట్లో వాటా పెంచుకోవడంపై గురిరక్షణ ఉత్పత్తులు, త్రివిధ దళాల పాటవాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్.. నౌకా నిర్మాణం విషయంలో మాత్రం ఇప్పటి వరకు వెనుకబడే ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏటా ఈ రంగంలో దూసుకుపోతుంటే.. ఇన్నాళ్లూ నెమ్మదిగా నెట్టుకొచ్చిన భారత్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్లు, ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతో భారత నౌకా నిర్మాణ రంగ దశ, దిశ మారబోతోంది. భారీ కార్గో నౌకల తయారీ కోసం అగ్రదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి.. ఇకపై 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను తయారుచేసే శక్తిగా భారత్ అవతరించబోతోంది. దేశ తూర్పు, పశ్చిమ తీరాలకు మణిహారాల్లా ఈ మెగా షిప్ బిల్డింగ్ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. –సాక్షి, విశాఖపట్నం రెండు మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు భారీ నౌకల నిర్మాణంపై దృష్టి సారించిన భారత్ ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్లో ప్రస్తుతం భారత్ వాటా కేవలం 0.06 శాతం మాత్రమే. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు 85 శాతం వాటాతో షిప్ బిల్డింగ్ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మన దేశ తీరానికి వచ్చే భారీ నౌకలకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే, వాటిని బాగుచేసే అత్యాధునిక షిప్యార్డులు లేకపోవడం ఒక ప్రధాన లోటుగా కేంద్రం భావించింది. ఈ ఏడాది జూలైలో అరేబియా సముద్రంలో ‘ఎంవీ మెర్క్స్ ఫ్రాంక్ఫర్ట్’అనే భారీ కార్గో షిప్ అగ్నిప్రమాదానికి గురైనప్పుడు.. దానికి అవసరమైన మరమ్మతు సౌకర్యాలు భారత్లో లేకపోవడంతో మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలోని రెండు ప్రాంతాల్లో రూ.75వేల కోట్ల పెట్టుబడులతో మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో చెరొకటి చొప్పున ఈ క్లస్టర్లను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సమక్షంలో భావనగర్లో జరిగిన కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీలో ఈ మెగా క్లస్టర్ను శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మెగా క్లస్టర్లను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయనుండగా.. కేంద్ర ప్రభుత్వమే రోడ్లు, భూమి అభివృద్ధి, విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది. నౌకల నిర్మాణం భారత్లో మొదలైనా.. సింధులోయ నాగరికత కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నౌకల నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ చెక్క నౌకలను నిర్మించేవారు. మధ్యయుగంలో భారతీయ నౌకా నిర్మాణదారులు తయారు చేసిన నౌకలకు మంచి గిరాకీ ఉండేది. అయినప్పటికీ ఆధునిక షిప్బిల్డింగ్లో మనం వెనుకబడ్డాం. ప్రస్తుతం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల కింద ఉపాధి, ఎగుమతులు, దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా నౌకా నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారుతు న్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మన నావికా దళాన్ని ఆధునీకరించడంలో భాగంగా విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలను నిర్మించడంలో ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్లు కొత్త ఒరవడిని సృష్టించనున్నాయి. విశాఖలో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ విశాఖలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఆవరణలో సాగరమాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను(ఐఎస్టీసీ) ప్రధాని మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. మారిటైమ్ విజన్–2030లో భాగంగా నెలకొల్పిన ఈ కేంద్రం.. మారిటైమ్ టెక్నాలజీకి జాతీయ హబ్గా మారనుంది. ఇక్కడ నౌకా నిర్మాణ అభివృద్ధిపై పరిశోధనలు, స్వదేశీ నౌకల రూపకల్పన, డిజిటల్ ఆవిష్కరణలు జరగనున్నాయి. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ షిప్యార్డులకు అనుసంధానంగా పనిచేస్తూ, భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడే నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ను కూడా పునరుద్ధరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. షిప్యార్డులో నౌక నిర్మాణం దేశంలో ప్రస్తుతం ఉన్న కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గోవా షిప్యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ షిప్యార్డ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ఎల్ అండ్టీ, రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ షిప్యార్డులకు ఈ కొత్త మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ల ద్వారా విస్తృతమైన అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం గరిష్టంగా 1.25 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను మాత్రమే నిర్మిస్తున్న భారత్.. ఈ క్లస్టర్లు పూర్తయితే ఏకంగా 3 మిలియన్ టన్నుల వరకు కార్గో సామర్థ్యంతో అతిపెద్ద నౌకలను నిర్మించగలుగుతుంది. అదేవిధంగా భారీ యుద్ధనౌకలు, ప్రత్యేక నౌకల నిర్మాణం కూడా ఈ మెగా క్లస్టర్లలో జరగనుంది. దేశంలో విస్తరిస్తున్న చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రెడ్జర్లు, ఆఫ్షోర్ సపోర్ట్ షిప్లకు పెరుగుతున్న గిరాకీని కూడా ఈ కేంద్రాలు తీర్చనున్నాయి. విస్తరణకు భారీ అవకాశాలు భారత నౌకానిర్మాణ పరిశ్రమ ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక విస్తరణ, జాతీయ భద్రతకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. దేశంలో 200 కంటే ఎక్కువ చిన్న ఓడరేవులు, 12 ప్రధాన పోర్టులు, 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం స్వదేశీ నౌకానిర్మాణాన్ని ప్రోత్సహించడానికి బలమైన పునాదిగా ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో మన దేశ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ వాటా దక్షిణ కొరియా (25 శాతం), జపాన్ (18 శాతం), చైనా (47 శాతం) కంటే చాలా తక్కువ. ఆ దేశాలు బలమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణ వ్యవస్థలను స్థాపించగా, భారత్ ఇప్పుడు ఆ దిశగా పయనిస్తోంది. 2024లో ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్ విలువ 150.42 బిలియన్ డాలర్లు కాగా.. ఇది 2033 నాటికి 203.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అనుగుణంగా నౌకలకు డిమాండ్ పెరగనుండటంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. -
ఆరోగ్యకర సమాజం మనందరి లక్ష్యం
విశాఖ సిటీ: పోలీసు కమిషనరేట్ ఆవరణలో శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో పాటు ఉన్నతాధికారులు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బందితో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ స్వచ్ఛత.. ప్రతి పౌరుడి విధి అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అందరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్) కృష్ణకాంత్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తీరం.. శుభ్రం
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని ఇండియన్ కోస్ట్గార్డ్–6 ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛతా హి సేవ పిలుపును స్వీకరిస్తూ.. సాగర తీరాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ), సౌత్ ఏషియా కో–ఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఏసీఈపీ)లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, కోస్ట్గార్డ్ డిస్ట్రిక్ట్ హెచ్క్యూ–6 కమాండర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాజేష్ మిట్టల్ పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్, ఎన్సీసీ, అదానీ, హెచ్పీసీఎల్, ఐవోసీఎల్ సంస్థలతో పాటు పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని.. సుమారు 600 కిలోల రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్ వ్యర్థాలను, మరో 700 కిలోల ఇతర వ్యర్థాలను సేకరించారు. చెత్త సేకరిస్తున్న హెచ్పీసీఎల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు -
జోధ్పూర్లో జీవీఎంసీ బృందం
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక చర్చ డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం శుక్రవారం జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, అధికారుల బృందం.. జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ మేయర్ వనితా సేథ్, కమిషనర్ సిద్ధార్థ పళనిచామితో కలిసి సమావేశమైనట్లు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న అభివృద్ధి పనులపై, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి వనరుల సద్వినియోగం, పచ్చదనం అభివృద్ధి వంటి అంశాలపైనా చర్చ జరిగింది. ఈ వివరాలను జోధ్పూర్ మేయర్ బృందం వివరించింది. అలాగే విశాఖ నగరాభివృద్ధి, ఆదాయ వనరులు, రోడ్లు, రవాణా, జంక్షన్లు, పార్కుల అభివృద్ధి, నీటి శుద్ధి కర్మాగారాలు, డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, ఉద్యానవనాలు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు కార్యదర్శి రమణ తెలిపారు. అనంతరం జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ కార్పొరేటర్లకు జ్ఞాపికలు అందజేసి, సత్కరించింది. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే రణభేరి
తగరపువలస: ప్రభుత్వ పాఠశాలల రక్షణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే రణభేరి బైక్జాతా నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్, కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. ఆనందపురంలో రణభేరి కార్యక్రమాన్ని శుక్రవారం డప్పు మోగించడం ద్వారా వీరు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలలో రణభేరి ప్రచారజాతా జరుగుతుందన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న సాల్ట్ పథకాన్ని విమర్శించారు. దీనివలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నాణ్యత, ఎన్రోల్మెంట్ పెరగకపోగా తగ్గుదల కనిపిస్తోందన్నారు. దీనికి ఉపాధ్యాయులు సరిగా బోధన చేయడం లేదని సాకుగా చూపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. యాప్లతోనే పాఠశాల సమయం హరించుకుపోతోందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. 2023 జూలై నుంచి రావలసిన 12వ పీఆర్సీ 25 నెలలు గడిచినా ఇవ్వలేదన్నారు. సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ ఇవ్వలేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో నిర్వహిస్తున్న ఈ రణభేరి ఈ నెల 25న గుంటూరులో ముగుస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కిషోర్, శ్రీలక్ష్మి, పూర్వ రాష్ట్ర సహధ్యక్షురాలు కోరెడ్ల విజయగౌరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్ అంబేడ్కర్, ఎన్.ప్రభాకర్, ఎ.పైడిరాజు, విజయకుమారి, రాంబాబు, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఏయూ అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో భాగంగా పురుషుల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఏయూ జిమ్నాజియం కబడ్డీ మ్యాట్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ గుర్తింపు పొందిన కళాశాలల కబడ్డీ క్రీడాకారులు పాల్గొనడంపై అభినందనలు తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏయూలోని క్రీడా మైదానాలను సింథటిక్ మైదానాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. అలాగే, ఈ సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజియేట్ క్రీడల్లో పాల్గొనే వారికి భోజన సదుపాయంతో పాటు, ఇతర యూనివర్సిటీలకు వెళ్లే క్రీడాకారుల డీఏను పెంచినట్లు వివరించారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ వివిధ జిల్లాలకు చెందిన అనుబంధ కళాశాలల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో సుమారు 35 జట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, ఐఐపీఈ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, పలు కళాశాలల పీడీలు పాల్గొన్నారు. కబడ్డీ పోటీల ఫలితాలు ● చింతపల్లి డిగ్రీ కళాశాల, సాంకేతిక కళాశాల మధ్య జరిగిన మ్యాచ్లో సాంకేతిక కళాశాల 15 పాయింట్లతో గెలిచింది. ● గరివిడి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నర్సీపట్నానికి జరిగిన మరో మ్యాచ్లో గరివిడి 7 పాయింట్ల ఆధిక్యంతో గెలిచింది. ● ఏవీఎన్ కళాశాల, వాగ్దేవి కళాశాల మధ్య జరిగిన మ్యాచ్లో వాగ్దేవి 3 పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ● జీడీసీ పాడేరు, జీడీసీ తగరపువలస మధ్య జరిగిన మ్యాచ్లో జీడీసీ పాడేరు 16 పాయింట్లతో విజయం సాధించింది. ● స్పెష్ డిగ్రీ కళాశాల, జీడీసీ సబ్బవరం మధ్య జరిగిన మ్యాచ్లో సబ్బవరం 15 పాయింట్లతో గెలిచింది. ● ఎంవీఆర్ డిగ్రీ కాలేజ్, ఆదిత్య మధ్య జరిగిన మ్యాచ్లో ఎంవీఆర్ 9 పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. -
టీఎన్ఏఐ పోస్టర్ ఆవిష్కరణ
విశాఖ సిటీ: ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్ఏఐ) 31వ రాష్ట్ర ద్వైవార్షిక సమావేశాలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అసోసియేషన్ అడ్వైజర్, గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సత్యవల్లి, సెయింట్ లూక్స్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ కార్యదర్శి ఎం.ప్రీతం లూక్ మాట్లాడుతూ ‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో–ది జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్’ థీమ్తో సమావేశాలను బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల ప్రతినిధులు, విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. -
కేజీహెచ్లో కమీషన్ల చిచ్చు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్నతాధికారుల మధ్య కమీషన్ల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలు, కుమ్ములాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటు కేజీహెచ్లో.. అటు వైద్య ఆరోగ్య శాఖలో పంపకాల బాగోతం హాట్టాఫిక్గా మారింది. ఇటీవల ఆసుపత్రిలో ఆక్సిజన్, సర్జికల్ పరికరాలు, మందుల కొనుగోలు కోసం సుమారు రూ. 7 కోట్లు వెచ్చించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.42 లక్షలు కమీషన్గా చేతులు మారినట్లు సమాచారం. అయితే, ఈ కమీషన్ డబ్బు పంపకాల్లో తేడాలు రావడంతో పరిపాలన విభాగాల్లోని అధికారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వాటాల విషయంలో తలెత్తిన వివాదం ఎంతగా ముదిరిందంటే, ఒక అధికారి చాంబర్లో చెక్కులు, కాగితాలు విసిరికొట్టే స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల గుమస్తాలు, అధికారుల నుంచి ఉన్నత స్థాయి వరకు పంపకాలు జరిగాయని సమాచారం. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు.. కేజీహెచ్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్యామ్యాల ముట్టజెప్పకపోతే కొనుగోళ్లు, టెండర్లు, ఇతర పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలవని, వాటిని ఏదో ఒక మూలన పడేస్తున్నారని సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి పనికి డబ్బులు లంచంగా ఇవ్వనిదే జరగని పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కమీషన్ల బాగోతం బయటకు పొక్కడంతో.. నీ వల్లే బయటపడింది అంటూ అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్లు సమాచారం. కేజీహెచ్లో ఈ అవినీతి జాడ్యం ముదరకముందే కలెక్టర్ జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కూటమిలో కూల్చివేతల కల్లోలం
విశాఖ సిటీ : బడ్డీల తొలగింపు ప్రక్రియ కూటమిలో కల్లోలం రేపుతోంది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారి పొట్ట కొట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే విశాఖలో కూటమి పార్టీలకు వ్యాపార, ప్రజా, వామపక్షాల సెగ తగులుతోంది. దీంతో కూటమి పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విశాఖ దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నేరుగా మేయర్ పీలా శ్రీనివాసరావునే టార్గెట్ చేశారు. తన నియోజకవర్గంలో నైట్ ఫుడ్కోర్ట్లో బడ్డీలను ఎవరికి చెప్పి తొలగించారని గట్టిగా ప్రశ్నించారు. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. తనకు తెలియకుండా ఫుడ్కోర్ట్ను తొలగించాలని కౌన్సిల్లో తీర్మానం చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టూర్కు వెళ్లిన సమయంలో తెలివిగా.. నగరంలో ఫుట్పాత్లపై దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారి బడ్డీలను, ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద ఉన్న నైట్ఫుడ్ కోర్టును తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేశారు. మేయర్, కార్పొరేటర్లు నగరంలో ఉన్న సమయంలో వీటిని తొలగిస్తే వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని భావించారు. ప్రస్తుతం మేయర్, కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో ఉత్తర భారతదేశం పర్యటనకు వెళ్లారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం అమరావతిలో ఉన్నారు. ఇదే మంచి సమయమని భావించిన ప్రజాప్రతినిధులు నగరంలో బడ్డీలను తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకే అధికారులు నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నారు. వారి జీవనాధారం దూరం చేసి పొట్టకొడుతున్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా బడ్డీలను ధ్వంసం చేయడాన్ని ప్రజా సంఘాలు సైతం తప్పుబడుతున్నాయి. అన్ని వైపుల నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం కూటమి పార్టీల్లో అగ్గి రాజేస్తోంది. భగ్గుమంటున్న జనసేన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతోనే ఈ బడ్డీల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారని జనసేన నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తుండడం దుమారం రేపుతోంది. ప్రధానంగా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ మేయర్ పీలా శ్రీనివాసరావుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎమ్మెల్యేగా తనకు ఎటువంటి సమాచారం లేకుండా నైట్ఫుడ్ కోర్ట్ను తొలగించి కమిషనర్పై నెపం నెట్టడాన్ని మేయర్పై మండిపడ్డారు. అలాగే దీని వెనుక విశాఖ ఎంపీ శ్రీభరత్ హస్తం కూడా ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తెరవెనుక ఆదేశాలతోనే జీవీఎంసీ అధికారులు ఇంతటి దుశ్చర్యకు తెరలేపారని బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన సమయంలో మేయర్, కార్పొరేటర్లు లేకపోవడాన్ని జనసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ నెల 17న సీఎం విశాఖకు వచ్చారు. ఒక రోజు ముందే మేయర్, కార్పొరేటర్లు విహార యాత్రకు పయనమయ్యారు. ఒక రోజు ఆగి యాత్రకు వెళితే నష్టమేంటన్న ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇప్పుడిదే విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు నగరంలో అన్ని నియోజకవర్గాల్లో వ్యాపారుల పొట్టే కొట్టే కార్యక్రమం జరుగుతోంది. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటి వరకు నోరుమెదపకపోవడం విశేషం. ఒకవైపు తమ జీవనాధారం దూరం చేసి కుటుంబాలను రోడ్డు పాలు చేశారని చిరువ్యాపారులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు దిగుతున్నారు. కానీ తెలుగుదేశం తమ్ముళ్లు దీనిపై కిక్కురుమనడం లేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతోనే ఈ తతంగం జరుగుతోందన్న విషయం అర్థమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. కౌన్సిల్ తీర్మానం మేరకే ఫుడ్కోర్ట్ తొలగింపు డాబాగార్డెన్స్: కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగానే పాత జైల్ రోడ్డు వద్ద ఉన్న ఫుడ్ కోర్ట్లో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. ఫుడ్ కోర్ట్లో 160 దుకాణాలు అనధికారకంగా నిర్వహిస్తున్నారని.. 60 మంది వ్యాపారస్తులు శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వచ్ఛందంగా దుకాణాలు తరలించారని పేర్కొన్నారు. ఈ ఫుడ్కోర్ట్ తొలగింపు కోసం కౌన్సిల్లో 2025 ఆగస్టు 22వ తేదీన తీర్మానం జరిగిందని తెలిపారు. ఫుడ్ కోర్ట్ తొలగించాలని పీజీఆర్ఎస్లో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. -
పోరు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్రపై వైఎస్సార్ సీపీ పోరుబాట పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి నిరసన భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025హోరెత్తిన విద్య, వైద్యానికి పెద్దపీట రాష్ట్రంలో విద్య, వైద్యానికి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి చరిత్రలో నిలిచిపోయారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే.. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పాడేరు వైద్య కళాశాల 70 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. గత విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఎందుకు కనబడటం లేదు. గిరిజనులకు దుప్పట్లు, పండ్లు పంపించామని చెప్పుకోవడం కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగా గిరిజనాభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలి. – కేకే రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ మెడికల్చలో మెడికల్ కాలేజ్ విజయవంతం సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ‘చలో పాడేరు మెడికల్ కాలేజ్’ విజయవంతమైంది. విశాఖ, అల్లూరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు పాడేరుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా వ్యతిరేకతను చూసి భయపడిన ప్రభుత్వం.. తన నిరంకుశ ధోరణిని మరోసారి బయటపెట్టుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలను వంతాడపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నేతలు పోలీసులను నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ నిర్బంధకాండ కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అక్కడకు చేరుకుని, పోలీసులతో వాదించారు. వారి వాదనల తీవ్రతకు తలొగ్గిన పోలీసులు.. వాహనాలను విడిచిపెట్టడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పాడేరుకు కదంతొక్కాయి. జై జగన్, సీఎం చంద్రబాబు డౌన్డౌన్ నినాదాలతో పాడేరు వీధులు మార్మోగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైద్య కళాశాల వరకు జరిగిన భారీ ర్యాలీ.. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి అద్దం పట్టింది. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పాడేరు వైద్య కళాశాలలో తరగతులు జరుగుతున్నా.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు సవిత, అనితలకు కనిపించడం లేదా అని వారు మండిపడ్డారు. పేదలకు ఉన్నత వైద్యాన్ని దూరం చేసే ఈ కుట్రను తిప్పికొడతామని హెచ్చరించారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎంపీ తనూజరాణి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర జోన్ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్కుమార్, చెట్టి పాల్గుణ, చింతలపూడి వెంకట రామయ్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ చంద్ర, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, అల్లూరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు లోచలి వరప్రసాద్. విశాఖ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 17 వైద్య కళాశాలలు చరిత్రాత్మకం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. గిరిజనులకు 500 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయితే కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. – అదీప్రాజ్,యువజన విభాగంఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ పాలకులకు కళ్లు కనబడటం లేదా? పాడేరు వైద్య కళాశాలలో 70 శాతం పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. గత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు కూడా పూర్తయితే కూటమి పాలకులకు కళ్లు కనబడ లేదా? పాడేరు వంటి మారుమూల ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మాణం గిరిజనులకు వరం. – వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైద్య విద్య దూరం చేయొద్దు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల్లో పదింటిని ప్రైవేట్పరం చేసి పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు దూరం చేయడం అన్యాయం. సీఎం చంద్రబా బు బినామీలు, బంధువులకు వీటిని అప్పగించే చర్యలను అడ్డుకుంటాం. ఐదు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనప్పటికీ కూటమి పాలకులు తప్పుడు ప్రచారం చేయడం దారుణం. – డాక్టర్ తనూజరాణి,అరకు ఎంపీ ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తే ఊరుకునేది లేదు. పేదలకు ఉచిత వైద్య విద్య, కార్పొరేట్ వైద్యం లక్ష్యంగా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మారుమూల పాడేరు ప్రాంతంలో కూడా రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 70 శాతం మేర పాడేరు కళాశాల నిర్మాణ పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. మిగతా 30 శాతం పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు కదంతొక్కిన యువతమాకవరపాలెం: వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళం హోరెత్తింది. వైఎస్సార్ సీపీ పిలుపుతో పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్ కాలేజ్’కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తపరచింది. పీపీపీ విధానం పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం చేసేందుకేనని నేతలు మండిపడ్డారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత వస్తుండగా బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో గల మెడికల్ కళాశాల ప్రాంతానికి చేరుకున్న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను ముందుగా పోలీసులు అడ్డుకుని, నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని నోటీసులు జారీ చేశారు. 15 మందికి మించి వెళ్లకూడదనే ఆంక్షలు పెట్టారు. అయినా తగ్గేదేలే అంటూ.. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత గళమెత్తింది. పెండింగ్ పనులపై నిర్లక్ష్యం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. పాడేరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య కళాశాల మంజూరు చేసి రూ.500 కోట్లతో పనులు చేపట్టారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. – జల్లిపల్లి సుభద్ర, జెడ్పీ చైర్పర్సన్ -
346 వాహనాలు యజమానులకు అప్పగింత
విశాఖ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేసిన 346 వాహనాలను యజమానులకు అప్పగించేందుకు మూడో విడత వెహికల్ రిటర్న్ మేళాను నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ సమావేశ మందిరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో పట్టుకున్న వాహనాలను, చోరీకి గురైన వాటిని ఎలా తీసుకోవాలో తెలియక చాలా మంది యజమానులు వదిలేస్తున్నారని పేర్కొన్నారు. కొంత మంది కోర్టుల నుంచి రిలీజ్ చేసుకోవడం తెలియక విడిపించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో ఈ రిటర్న్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న తొలి దఫాలో 152, ఏప్రిల్ 22న రెండో దఫాలో 320 వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుందన్నారు. అనంతరం యజమానులకు సీపీ చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. -
సమష్టి కృషితో విశాఖను అగ్రస్థానంలో నిలుపుదాం
మహారాణిపేట: జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ విశేషాలను శుక్రవారం జిల్లా అధికారులకు వివరించిన ఆయన, ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ డాక్యుమెంట్లోని పది సూత్రాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పట్టణాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. మత్స్యకారులకు ఆధునిక సాంకేతికతను అందించాలని, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, గృహ నిర్మాణ పథకాలు, ‘ప్రసాద్’ పథకం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత విశాఖను నిర్మించడానికి కృషి చేయాలని, కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించాలని సూచించారు. పోర్టు, పరిశ్రమలలో పారిశుధ్య చర్యలను డ్రోన్ల సహాయంతో పరిశీలించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలిపారు. రెవెన్యూ పెంచడానికి ఆస్తుల పన్ను, నీటి పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని కోరారు. ‘బంగారు కుటుంబాలను’ దత్తత తీసుకునే ప్రక్రియను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో భవానీ శంకర్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
దివ్యాంగుడిని ఎలా బతకాలి
గత 19 ఏళ్లుగా సీతంపేట జంక్షన్లో పకోడి బండి వేస్తున్నాను. నేను దివ్యాంగుడిని, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పకోడి బండిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ముందస్తు నోటీసు, సమాచార ఇవ్వకుండా ఉన్నపళంగా లారీలో బండిని పట్టుకుపోయారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఎలా బతకాలి. – పతివాడ శ్రీరాములు, పకోడి బండి, సీతంపేట రోడ్డున పడేశారు సీతంపేట మెయిన్రోడ్లో మార్గదర్శి బిల్డింగ్ పక్క రోడ్లో టీ కొట్టు నడుపుతున్నాను. సుమారు 15 సంవత్సరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాను. మెయిన్రోడ్పై లేకపోయినా నా బండి తొలగించారు. ఉన్నపళంగా తొలగిస్తే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. మా కుటుంబాన్ని రోడ్డునపడేశారు. – ఎల్.మహేష్, టీ కొట్టు, సీతంపేట -
సెల్లార్లో స్పెషల్ బార్!
సెల్లార్.. పార్కింగ్కు మాత్రమే వినియోగించాలి. లేదంటే.. ఆ భవనంపైనా, యజమానిపైనా చర్యలు తీసుకుంటామంటూ జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు మాత్రం సామాన్యులకు మాత్రమే. అధికారం చేతుల్లో ఉంటే.. సెల్లార్ కాస్తా.. స్పెషల్ బార్గా మారిపోయినా.. పట్టించుకోరు. దీనికి ఉదాహరణే ఈ ఫొటోలో కనిపిస్తున్న రెస్టారెంట్ అండ్ బార్. ఎంపీ అండదండలు.. అధికార పార్టీలో చోటా నేతగా హల్చల్ చేస్తే చాలు.. అనుమతులు లేకపోయినా.. బార్ పెట్టెయ్యొచ్చు. టీడీపీ ఎంపీ భరత్ అనుచరుడిగా చెప్పుకుంటున్న ఆళ్ల వాసు నేతృత్వంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బార్ ఇది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా డాబాగార్డెన్స్లోని సెల్లార్లో అకస్మాత్తుగా ఈ బార్ వెలిసింది. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. సెల్లార్లో నిర్వహిస్తుంటే.. జీవీఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తుంటే.. ఎకై ్సజ్ అధికారులేమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. ఏమో సార్.. మాకు కనబడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఒక వ్యక్తి మద్యం బాటిల్స్తో కనిపిస్తే వెంటనే పట్టుకొని నానా హడావుడి చేసే ఎకై ్సజ్ అధికారులు.. స్వాతి రెస్టారెంట్ అండ్ బార్ విషయంలో మాత్రం.. సైలెంట్ మోడ్లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. – విశాఖసిటీ/ఫొటో సాక్షి ఫొటోగ్రాఫర్ -
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం
అల్లిపురం: రోడ్డు ప్రమాద బాధితుల సహాయార్థం నగర పోలీస్ కమిషనరేట్లో ప్రారంభించిన సహాయక కేంద్రం ద్వారా మూడేళ్లలో 79 కేసుల్లో బాధితులకు రూ.63.50 లక్షలు పరిహారంగా అందించినట్లు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ బాధితులకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక పరిహారం అందేంత వరకు సహాయ సహకారాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.50 వేలు మంజూరు చేస్తామన్నారు. ఈ సహాయక కేంద్రం ద్వారా ఒక్కో బాధితునికి ఒక్కో పోలీస్ కానిస్టేబుల్ను ఎటాచ్ చేసి, రెవెన్యూ అధికారుల వద్ద తమ దరఖాస్తు ఇచ్చినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరే వరకు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఈ ప్రక్రియలో మూడేళ్లలో 79 మంది బాధితులకు న్యాయం జరిగిందని, మరో 106 దరఖాస్తులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం హిట్ అండ్ రన్ బాధితులు, బాధిత కుటుంబీకులతో ముఖాముఖి నిర్వహించారు. బాధితులెవరైనా తమ సహాయక కేంద్రాన్ని 7995095793 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదిస్తే, అవసరమైన సహాయం అందిస్తామన్నారు. మూడేళ్లలో 79 కేసుల్లో రూ.63.50 లక్షలు చెల్లింపు -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
పరవాడ: పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం శివారులోని జాలారీపేట గ్రామంలో బుధవారం జరిగిన హత్య కేసులో నిందితుడు ఒలిశెట్టి కొదండను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఆర్. మల్లికార్జునరావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కొదండ.. గొడవపడి తన భార్య లక్ష్మి (45)ని కత్తితో పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.గురువారం నిందితుడు కొదండ వెన్నలపాలెం సినిమా హాలు కూడలిలో సంచరిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అనకాపల్లిలోని 11వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించగా.. విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్టు సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. -
కాన్వెంట్ కూడలిలో మైరెన్ పార్క్ ప్రారంభం
కంచరపాలెం: కాన్వెంట్ కూడలిలో రూ.2.7 కోట్లతో నర్మించిన మైరెన్ పార్కు విశాఖ పోర్ట్ ఆథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ప్రారంభించారు. అలాగే ఇదే కూడలిలో 100 అడుగుల ఎత్తైన హైమాస్ట్ జాతీయ పతాకం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్ట్తో పాటు నగర సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, నడక మార్గాల మధ్య పచ్చదనం పెంచడం, రాత్రివేళల్లో పోర్ట్ అందంగా కనిపించేలా విద్యుత్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాన్వెంట్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేయనున్న జాతీయ పతాకం పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్, వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భారత్ ఎదురుదాడి చేస్తే.. అమెరికా దిగొస్తుంది
ప్రస్తుతం ఉన్న దాదాపు 3,200 జీసీసీల్లో 1,600 భారత్లో ఉన్నాయి. ఇందులో సగానికి పైగా యూఎస్కి సంబంధించినవే. వీటికీ హైర్ చట్టం వర్తిస్తే.. వాటి మనుగడ ప్రశ్నార్థకమే. ఎస్టీపీఐ అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడి నుంచి రూ.5 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో 70 శాతం వరకూ అమెరికా వాణిజ్యమే. వీటన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో హైర్ చట్టం అమల్లోకి రాదనే భావిస్తున్నాం.ఒకవేళ ఈ ప్రతిపాదనని చట్టబద్ధం చేస్తే.. భారత్ కూడా ఎదురుదాడి చెయ్యాలి. అమెరికా ఆధారిత ఐపీ ఉత్పత్తులని నిషేదించడం, మైక్రోసాఫ్ట్ అడోబ్ వంటి ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటిస్తే.. అమెరికా దిగొస్తుంది. – శ్రీధర్ కొసరాజు, ఏపీ డీప్టెక్ నైపుణ్య సంస్థ ప్రతినిధి -
విశాఖలోనే ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ మెడికల్ కాలేజీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై సీపీఎం, సీఐటీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం జరిగిందని సీపీఎం నాయకుడు, సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు ఆరోపించారు. సీపీఎం కార్యాలయంలో గురువారం సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అత్యధికంగా ఈఎస్ఐ సభ్యులు 14 లక్షల మంది ఉన్న ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో మెడికల్ కాలేజీ పెట్టడం సరికాదన్నారు. షీలానగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం తుది దశలో ఉందని, దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే కాదని, వెనుకబడిన ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు చేస్తామని నరసింగరావు హెచ్చరించారు. -
ఆర్పీ అలివేణిని పరామర్శించిన కేకే రాజు
తాటిచెట్లపాలెం: తెలుగుదేశం పార్టీ నాయకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్పీ ఎస్.అలివేణిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గురువారం జగన్నాథపురంలోని ఆమె నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, కర్రి రామారెడ్డి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీదేవివర్మ, భాను, నాగమని తదితరులు పాల్గొన్నారు. -
చిరు వ్యాపారులపై ముప్పేట దాడి
రెక్కాడితే కాని డొక్కాడని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకొని పొట్టపోసుకుంటున్న వారిపై జులుం ప్రదర్శించారు. ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా టీ స్టాళ్లు, టిఫిన్బళ్లు, బడ్డీలను జేసీబీలతో తొలగించారు. బడ్డీల్లో సరుకులు, డబ్బులు సైతం తీసుకునే సమయం ఇవ్వకుండా తరలించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏళ్లగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమను రోడ్డున పడేశారని, ఎలా బతికేది, ఎక్కడ బతికేదంటూ వ్యాపారులు బతిమలాడినా అధికారులు కనికరించలేదు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో సీతంపేట మెయిన్రోడ్, శంకరమఠం రోడ్, నరసింహనగర్ రైతుబజార్, గ్రీన్పార్క్ రోడ్డు, ఎన్ఏడీ నుంచి గోపాలపట్నం బంక్ వరకు, మధురవాడ, తగరపువలస, ఎండాడ, గాజువాక ప్రాంతాల్లో జీవీఎంసీ టౌన్ప్లానింగ్, పోలీస్ విభాగం సంయుక్తంగా గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. ఉదయం 7 గంటల నుంచే..సీతంపేట : జీవీఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు, సచివాలయ కార్యదర్శులు గురువారం ఉదయం 7 గంటలకే జేసీబీలు, లారీలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి చందు స్వీట్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి హైవే వరకు ద్వారకానగర్, సీతంపేట మెయిన్రోడ్లో రహదారికి ఇరువైపులా రోడ్డుపై, ఫుట్పాత్పై ఉన్న బడ్డీలు, టిఫిన్ బళ్లు, టీ స్టాళ్లు, ఫ్రూట్స్టాళ్లు, పకోడీ బళ్లు, బిర్యానీ, కర్రీపాయింట్లను జేసీబీలతో తొలగించి లారీల్లో తరలించారు. బీవీకే కళాశాల ఎదురుగా ఉన్న బడ్డీలను జేసీబీతో ధ్వంసం చేయడంతో వ్యాపారులు గగ్గోలుపెట్టారు. బడ్డీల్లోని సరుకులు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీతంపేట కూడలిలో దుర్గాగణపతి ఆలయం పరిసరాల్లో ఉన్న వ్యాపారాలను తొలగించారు. అక్కడ నుంచి గురుద్వారా కూడలి సమీపంలో వైన్షాపు ముందున్న బోర్డును తీసేశారు. అక్కడే ఉన్న టీ స్టాల్, టిఫిన్ స్టాళ్లలోని స్టీల్ కౌంటర్లు తరలించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం హైవే నుంచి డైమండ్ పార్కు వరకు ఉన్న శంకరమఠం రోడ్లో బడ్డీలు, తోపుడు బళ్లు తొలగించారు. ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రోడ్డుపాలు చేశారని చిరువ్యాపారులు మండిపడ్డారు.ప్రజాప్రతినిధులు లేని సమయంలో..ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయం చూసి ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులు చేపట్టారు. కార్పొరేటర్లు వారం రోజుల పాటు స్టడీటూర్కు రాజస్థాన్ వెళ్లారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లారు. చిరు వ్యాపారులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో లేని సమయంలో డ్రైవ్ చేపట్టారు. దీంతో ఏమి చేయాలో తెలియక వ్యాపారులు ఆవేదనకు గురయ్యారు.దివ్యాంగుడిని ఎలా బతకాలి గత 19 ఏళ్లుగా సీతంపేట జంక్షన్లో పకోడి బండి వేస్తున్నాను. నేను దివ్యాంగుడిని, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పకోడి బండిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ముందస్తు నోటీసు, సమాచార ఇవ్వకుండా ఉన్నపళంగా లారీలో బండిని పట్టుకుపోయారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఎలా బతకాలి.– పతివాడ శ్రీరాములు, పకోడి బండి, సీతంపేటరోడ్డున పడేశారుసీతంపేట మెయిన్రోడ్లో మార్గదర్శి బిల్డింగ్ పక్క రోడ్లో టీ కొట్టు నడుపుతున్నాను. సుమారు 15 సంవత్సరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాను. మెయిన్రోడ్పై లేకపోయినా నా బండి తొలగించారు. ఉన్నపళంగా తొలగిస్తే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. మా కుటుంబాన్ని రోడ్డునపడేశారు. – ఎల్.మహేష్, టీ కొట్టు, సీతంపేటకౌంటర్లో డబ్బులు తీసుకోనీయలేదు గత 28 ఏళ్లుగా సీతంపేట దుర్గాగణపతి ఆలయం పక్కన టీ, టిఫిన్ షాపు నిర్వహిస్తున్నాను. రోడ్డుకు అడ్డుగా లేకపోయినా, షాపు ముందున్న రెండు స్టీల్ కౌంటర్లు జేసీబీతో పట్టుకెళ్లిపోయారు. కనీసం కౌంటర్లో ఉన్న డబ్బులు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదు. పెద్దోళ్లని వదిలి చిరువ్యాపారులపై ప్రతాపం చూపడం దారుణం. – పిన్నింటి అప్పలనాయుడు, టిఫిన్ షాప్, సీతంపేట524 దుకాణాల తొలగింపు డాబాగార్డెన్స్ : విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. వివిధ జోన్లలో తొలగించిన ఆక్రమణల వివరాలు జోన్–1: తగరపువలస మెయిన్ రోడ్డు, భీమిలి రోడ్డులో మొత్తం 40 బడ్డీలు. జోన్–2: జాతీయ రహదారి–16, శ్రీకాంత్నగర్ జంక్షన్ నుంచి పెదగదిలి జంక్షన్ వరకు మొత్తం 90 జోన్–3: ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు నుంచి గురుద్వారా జంక్షన్, డైమండ్పార్క్, శాంతిపురం జంక్షన్లలో మొత్తం 84 జోన్–4: సిరిపురం జంక్షన్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు 60 జోన్–5: నరసింహానగర్, డీఎల్బీ గ్రౌండ్, సీఐఎస్ఎఫ్ గేట్, ఎన్జీవోస్ కాలనీ పరిధిలో మొత్తం 55 జోన్–6: పాత, కొత్త గాజువాక ప్రధాన రహదారులు, రాజీవ్నగర్ మార్గ్, కేకేఆర్ వాటర్ ప్లాంట్ రోడ్డులో మొత్తం 86 జోన్–7: నెహ్రూ చౌక్ నుంచి సుంకరమెట్ట రోడ్డు వరకు 42 జోన్–8: ఎన్ఎస్టీఎన్ జంక్షన్ నుంచి విమాన్నగర్ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు మొత్తం 67 టీ, టిఫిన్, బడ్డీలు, దుకాణాలను తొలగించామన్నారు. బడుగులపై ‘మహా’ ప్రతాపం భీమిలి పరిధిలో వందకు పైగా దుకాణాల తొలగింపుమధురవాడ/కొమ్మాది/తగరపువలస: భీమిలి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల దుకాణాలను, తోపుడు బళ్లను అధికారులు తొలగించడంతో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. జీవీఎంసీ జోన్.2 పరిధిలో తొలగింపు ఉద్రిక్తంగా మారింది. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో సుమారు 80 బడ్డీలు, దుకాణాలను అధికారులు తొలగించారు. కనీసం సమాచారమైనా ఇవ్వకుండా తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. పీఎం పాలెం పోలీసులు వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని చక్కబరిచారు. ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే డబుల్ రోడ్డు వెంబడి సుమారు 20 దుకాణాలను అధికారులు పొక్లెయిన్లతో తొలగించారు. రెండు రోజులైనా వ్యవధి ఇవ్వకుండా తోపుడు బళ్లు, టిఫిన్ సెంటర్లు, దుకాణాలను తొలగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్–1 పరిధిలోని తగరపువలస మెయిన్రోడ్డు, ఫుట్పాత్లపై ఆక్రమణలను జెడ్సీ అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తొలగించారు. చిట్టివలస ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు తొలగింపులు జరిగాయి.చాలా అన్యాయంఏళ్ల తరబడి రోడ్డుపై చిరు వ్యాపారాల ద్వారా బతుకుతున్నాం. ఏళ్ల తరబడి జీవీఎంసీకి ఆశీలు కడుతున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఉంది. కనీసం ముందుగా అయినా సమాచారం ఇవ్వకుండా, అధికారులు మాపై అకస్మాత్తుగా దాడి చేయడం అన్యాయం. ఇలా చేస్తే మా కుటుంబాలు ఏమై పోవాలి? –లక్ష్మి కుమారి, చిరు వ్యాపారిరోడ్డున పడిన 50 కుటుంబాలు తాటిచెట్లపాలెం: నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు సాగిస్తున్న 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గురువారం ఉదయం జీవీఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించి జీవనోపాధిని దెబ్బతీశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయాల సిబ్బంది ఉదయాన్నే ఇక్కడకు చేరుకొని పొక్లెయినర్లతో బడ్డీలను, వస్తువులను విరగ్గొట్టి మరీ లారీల్లోకి ఎక్కించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం తమకు మంచి శాస్తి చేసిందని చిరు వ్యాపారులంతా వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా.. బడ్డీలను తొలగించడంతో జీవనోపాధి కోల్పోయామని, ఎలా బతకాలని విలపించారు.జీవనాధారాన్ని తొలగించారుఉదయం నుంచి మామీద ముప్పేట దాడి చేసి జీవనాధారాన్ని తొలగించారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వారిని రోడ్డున పడేశారు. కనీసం సమయం కూడా ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాలి కదా. ఇప్పుడు ఎలా బతకాలి. – ప్రకాష్, చిరు వ్యాపారుల ప్రతినిధి, నరసింహనగర్ రైతుబజార్ఇది పేదలను వేధించే ప్రభుత్వంగత 20 ఏళ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు ఇలా తీసేస్తే ఎలా? కనీసం సమయం ఇవ్వాలి కదా? ఇప్పుడు వ్యాపారం కోసం చేసిన ఫైనాన్స్లు కట్టుకోవాలి? పిల్లల ఫీజులు కట్టుకోవాలి? ఇది పేదలను వేధించే ప్రభుత్వం. – సంతోష్, పండ్ల వ్యాపారి, నరసింహనగర్చావే శరణ్యంగత కొన్నేళ్లుగా రైతుబజార్ పరిసర ప్రాంతంలో బ్యాంగిల్స్, ఫ్యాన్సీ వ్యాపారం పాత తోపుడుబండిపై చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ఈ రోజు మా వ్యాపారాల్ని తొలగించారు. ఎలా బతకాలి. మాకు చావే శరణ్యం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఏ విషమో తాగి చస్తాం. – రమణమ్మ, ఫ్యాన్సి, బేంగిల్స్ వ్యాపారి, నరసింహనగర్చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం తాటిచెట్లపాలెం : నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. దీంతో ఆందోళన చెందిన నరసింహనగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాజు సీసాను పగులగొట్టి ఛాతీపై గట్టిగా కోసుకున్నాడు. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు, బంధువులు అతడిని అడ్డుకొని వారించారు. ఇక్కడే పుట్టి పెరిగానని, ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ను తొలగించి, జీవనోపాధిపై వేటువేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చిరు వ్యాపారులకందరికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయాడు. -
రోడ్డున పడిన 50 కుటుంబాలు
తాటిచెట్లపాలెం: నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు సాగిస్తున్న 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గురువారం ఉదయం జీవీఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించి జీవనోపాధిని దెబ్బతీశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయాల సిబ్బంది ఉదయాన్నే ఇక్కడకు చేరుకొని పొక్లెయినర్లతో బడ్డీలను, వస్తువులను విరగ్గొట్టి మరీ లారీల్లోకి ఎక్కించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం తమకు మంచి శాస్తి చేసిందని చిరు వ్యాపారులంతా వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా.. బడ్డీలను తొలగించడంతో జీవనోపాధి కోల్పోయామని, ఎలా బతకాలని విలపించారు. జీవనాధారాన్ని తొలగించారు ఉదయం నుంచి మామీద ముప్పేట దాడి చేసి జీవనాధారాన్ని తొలగించారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వారిని రోడ్డున పడేశారు. కనీసం సమయం కూడా ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాలి కదా. ఇప్పుడు ఎలా బతకాలి. – ప్రకాష్, చిరు వ్యాపారుల ప్రతినిధి, నరసింహనగర్ రైతుబజార్ ఇది పేదలను వేధించే ప్రభుత్వం గత 20 ఏళ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు ఇలా తీసేస్తే ఎలా? కనీసం సమయం ఇవ్వాలి కదా? ఇప్పుడు వ్యాపారం కోసం చేసిన ఫైనాన్స్లు కట్టుకోవాలి? పిల్లల ఫీజులు కట్టుకోవాలి? ఇది పేదలను వేధించే ప్రభుత్వం. – సంతోష్, పండ్ల వ్యాపారి, నరసింహనగర్ చావే శరణ్యం గత కొన్నేళ్లుగా రైతుబజార్ పరిసర ప్రాంతంలో బ్యాంగిల్స్, ఫ్యాన్సీ వ్యాపారం పాత తోపుడుబండిపై చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ఈ రోజు మా వ్యాపారాల్ని తొలగించారు. ఎలా బతకాలి. మాకు చావే శరణ్యం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఏ విషమో తాగి చస్తాం. – రమణమ్మ, ఫ్యాన్సి, బేంగిల్స్ వ్యాపారి, నరసింహనగర్ -
అమెరికా సంస్థలు, ప్రజలపైనే భారం
భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్న చట్టమే ఇది. తొలుత గూడ్స్పై రెండు సార్లు 25 శాతం చొప్పున సుంకాలు విధించారు. అప్పటికీ భారత్ దిగిరాలేదని భావించి.. నైపుణ్యాలపై దెబ్బతీసేందుకు హైర్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతోంది. దీనివల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ భారం. ఉదాహరణకు ఒక ఐటీ సంస్థ యూఎస్ సిటిజన్ని హైర్ చెయ్యాలంటే 10 వేల డాలర్లు చెల్లించాలి. అదే భారతీయులకు 2500 డాలర్లు వరకూ చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు భారతీయుల్ని తప్పించేందుకు యత్నిస్తే.. యూఎస్ కంపెనీలపైనా, అమెరికా ప్రజలపైనే ఈ భారమంతా పడుతుంది. – ఒ. నరేష్, రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ -
21 మందికి సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి
డాబాగార్డెన్స్: సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలు మరింత మెరుగ్గా నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ పేర్కొన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో జీవీఎంసీలో జూనియర్ అసిస్టెంట్లగా విధులు నిర్వహిస్తున్న 21 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారు అంకితభావంతో పనిచేయాలని, జీవీఎంసీకి మరింత పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
ఓపీటీ విద్యార్థులపైనా ప్రభావం
అమెరికా ప్రతిపాదిస్తున్న ఈ హైర్ చట్ట కంపెనీలు ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విద్యార్థులపై కూడా పన్ను విధిస్తుంది. ఓపీటీపై కూడా పన్ను విధించాలని ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు యూఎస్లో ఓపీటీ కింద పనిచేస్తున్న విదేశీ విద్యార్థులకు ఎఫ్ఐసీఏ పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభించేది. ఈ కొత్త చట్టం కనుక అమలులోకి వస్తే విదేశీ విద్యార్థులు కూడా ఈ పన్ను పరిధిలోకి వచ్చి వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా.. యూఎస్ వెళ్లి.. చదువుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలనుకున్న విద్యార్థులకు ఈ చట్టం గొడ్డలిపెట్టులా మారనుంది. – బి. కోటేశ్వరరావు, ఐటీ ఉద్యోగి -
కరుణకుమారికి కలెక్టర్ అభినందన
మహారాణిపేట: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణకుమారి భారత్ వేదికగా నవంబర్లో జరగనున్న అంధ మహిళల టీ–20 ప్రపంచకప్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభినందించారు. డీఈవో ప్రేమకుమారి, అంధ పాఠశాల నిర్వాహకులు గురువారం కరుణకుమారిని కలెక్టర్ చాంబర్కు తీసుకురాగా కలెక్టర్ విద్యార్థినికి శాలువా కప్పి, స్వీట్ తినిపించి సత్కరించారు. ప్రాక్టీస్ కోసం కరుణకు రెండు ప్రత్యేక క్రికెట్ కిట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సాగరనగర్లోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కరుణకుమారి స్వగ్రామం వంట్లమామిడి. -
చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం
తాటిచెట్లపాలెం : నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. దీంతో ఆందోళన చెందిన నరసింహనగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాజు సీసాను పగులగొట్టి ఛాతీపై గట్టిగా కోసుకున్నాడు. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు, బంధువులు అతడిని అడ్డుకొని వారించారు. ఇక్కడే పుట్టి పెరిగానని, ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ను తొలగించి, జీవనోపాధిపై వేటువేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చిరు వ్యాపారులకందరికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయాడు. -
అమెరికా బిల్లు.. ఐటీ కంపెనీలకు చిల్లు
సాక్షి, విశాఖపట్నం: అమెరికా ప్రతిపాదించిన ‘హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీ లొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్’ చట్టం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం విదేశీ సేవలపై 25శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తోంది. ఈ పన్ను విధానం అమలులోకి వస్తే, భారతదేశం, ముఖ్యంగా విశాఖపట్నంలోని ఐటీ, బీపీఓ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ‘హైర్’ చట్టం అంటే ఏమిటి? అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, విదేశీ కార్మికులను నియమించుకోవడాన్ని తగ్గించడం లేదా నిషేధించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా పౌరులకు ఉద్యోగాలు సృష్టించేందుకు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఈ చట్టం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్పై ప్రభావం భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికా నుంచే వస్తుంది. ఈ కొత్త పన్ను విధానం వల్ల వాటి లాభాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. విశాఖలో బీపీఓ సంస్థలన్నీ దాదాపుగా యూఎస్ ఆధారిత కంపెనీలే. ఇక్కడున్న 200 ఐటీ సంస్థల్లో 75శాతం యూఎస్ క్లయింట్లను కలిగి ఉన్నాయి. ఈ అదనపు పన్ను భారం వల్ల ఇక్కడి కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. లాభాలు తగ్గితే, కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం పాసయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అమెరికా కంపెనీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకకపోతే, వారి వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, భారత్తో పాటు అమెరికా కంపెనీల మార్జిన్లు కూడా క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. -
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
మర్రిపాలెం/గాజువాక: నగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కంచరపాలెం, గాజువాక పరిధిలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం రాత్రి మహిళల మెడలో నుంచి సుమారు 17.5 తులాల బంగారం వస్తువులను అపహరించారు. బాధితులు క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్పై జ్ఞానాపురం, కంచరపాలెం రైతుబజారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బిర్లా జంక్షన్ వంటి ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపగా, వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్ ధరించి మహిళలను అడ్రస్ అడుగుతున్నట్టు నటిస్తూ వారి మెడలోని గొలుసులను లాక్కొని పారిపోయారు. జ్ఞానాపురంలో ఎం. అనంతలక్ష్మి మెడలో 3 తులాల గొలుసు, రామ్మూర్తి పంతులుపేటకు చెందిన విజయలక్ష్మి మెడలో 4.5 తులాల గొలుసు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద సంతోషి మెడలో 22 గ్రాముల గొలుసు, బిర్లా జంక్షన్ వద్ద స్రవంతి మెడలో 3 తులాల గొలుసు దొంగతనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను వెంబడించగా, వారు బిర్లా జంక్షన్ దాటిన తర్వాత బైక్ను వదిలి పారిపోయారు. నిందితులు ఉపయోగించిన బైక్ గతంలో మహారాణిపేటలో చోరీకి గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, కంచరపాలెం క్రైమ్ ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ ఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. కంచరపాలెం క్రైమ్ సీఐ చంద్రమౌళి నేతృత్వంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజువాకలోని షీలానగర్లో బుధవారం రాత్రి రెండు వేర్వేరు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. రెండు దొంగతనాల్లో మొత్తం 4.5 తులాల బంగారం అపహరణకు గురైంది. షీలానగర్కు చెందిన లక్ష్మీ ప్రియ.. డీమార్ట్ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా, ఇద్దరు బైక్పై వచ్చిన యువకులు ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద లక్ష్మి తన అత్తతో కిలిసి వెళ్తుండగా అదే తరహాలో బైక్పై వచ్చిన యువకులు ఆమె మెడలోని 2.5 తులాల పుస్తెల తాడును తెంపుకొని వెళ్లిపోయారు.గాజువాక క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 17.5 తులాల బంగారం వస్తువుల అపహరణ -
మద్యం మత్తులో కారును ఢీకొట్టిన యువకుడు
కొమ్మాది: బీచ్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం సేవించి బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గీతం కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పుక్కళ్ల ప్రవీణ్ తన స్నేహితులు అభిషేక్, లోకేష్లతో కలిసి బైక్పై మద్యం తాగి అతివేగంగా వచ్చాడు. సాయిప్రియ రిసార్ట్ వద్ద యూ–టర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఒకవైపు పూర్తిగా దెబ్బతినగా, ప్రవీణ్ బైక్పై నుంచి ఎగిరి దూరంగా పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే గీతం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రవీణ్ స్నేహితులు అభిషేక్, లోకేష్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘చలో పాడేరు మెడికల్ కాలేజ్’ను జయప్రదం చేయండి
సాక్షి, విశాఖపట్నం: పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, భూములను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ కుయుక్తులు పన్నుతోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ పేరిట అతి పెద్ద స్కాంకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల అధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజ్’పేరిట నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ‘చలో మెడికల్ కాలేజ్‘పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని, వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం వైఎస్ జగన్ సంస్కరణలకు ఒక గొప్ప నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజీలు అంటే ఒక మెడికల్ విద్య మాత్రమే కాదని అక్కడ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ హయాంలో రెండేళ్ల పాటు కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణికుమారి, కర్రి రామిరెడ్డి, పులగా కొండారెడ్డి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, మాజీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, జిల్లా విద్యార్ధి విభాగం ఉపాధ్యక్షుడు జాడ శ్రావణ్కుమార్, యువజన, విద్యార్థి విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు కాగితాల రవికిరణ్, తాడి రవితేజ, మువ్వల సంతోష్కుమార్, పాల రమణిరెడ్డి, లక్ష్మణ, కార్తీక్, నితాష్, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీ సభ్యులు శ్రీదేవివర్మ, నాగమణి, బొట్ట రాజు, పార్టీ ముఖ్య నాయుకులు సునీల్, గీత రెడ్డి, బద్రి తదితరలు పాల్గొన్నారు. పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
ఆటో బోల్తా: డ్రైవర్ మృతి
తగరపువలస: ఆనందపురం మండలం, కుసులవాడ పంచాయతీ శివారులోని మలుపు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ యర్ర గౌరినాయుడు (39) మరణించాడు. చందక పంచాయతీ, జగన్నాథపురం గ్రామానికి చెందిన గౌరినాయుడు ఇంటికి తిరిగి వెళ్తుండగా, తీగలవానిపాలెం చెరువు వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడి చెరువులోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో అతను ఒక్కడే ఉన్నాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో ఆటో అతనిపై పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరినాయుడు తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పేదలకు లేటెస్ట్ కాస్మోటాలజీ సేవలు
మహారాణిపేట: కేజీహెచ్ డెర్మటాలజీ విభాగం రోగులకు శుభవార్త అందించింది. అత్యాధునిక చర్మ, సౌందర్య సమస్యలకు ఉచిత చికిత్స అందించేందుకు రూ. 45 లక్షల విలువైన క్యూ–స్విచ్డ్ ఎన్డీ–వై ఏజీ లేజర్ యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఈ లేజర్ యంత్రాన్ని ప్రభుత్వం ద్వారా సమకూర్చారని, దీంతో పాటు మరికొన్ని ఆధునిక యంత్రాలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా లభించాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి , ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎన్ఎం సంధ్యాదేవి తెలిపారు. ఈ కొత్త పరికరాలతో పేదలకు కూడా అధునాతన కాస్మోటిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సేవలు లేజర్ చికిత్సలు: కేజీహెచ్ డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ టి. శాంతి మాట్లాడుతూ.. ఈ కొత్త లేజర్ యంత్రం ముఖ్యంగా మంగు మచ్చలు, మొటిమల మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ సమస్యలకు చికిత్స అందించవచ్చని తెలిపారు. రోజేసియా, స్టెరాయిడ్స్ వాడకం వల్ల ఏర్పడిన మచ్చలను కూడా ఈ లేజర్తో సురక్షితంగా తొలగించవచ్చని వివరించారు. జుట్టు , చర్మ సంరక్షణ: అనవసరమైన హెయిర్ తొలగింపు, బొల్లి , సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు ‘నారో బ్యాండ్ ఫోటోథెరపీ’తో కాంతి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జుట్టు ఎదుగుదలకు చికిత్సలు: జుట్టు రాలడం సమస్య ఉన్నవారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో లెవల్ లైట్ థెరపీ ద్వారా చికిత్సలు కూడా ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ శాంతి తెలిపారు. ఈ ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా కేజీహెచ్ చర్మ చికిత్సల విభాగం మరింత బలోపేతం అయిందని, దీనివల్ల పేద, మధ్యతరగతి రోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కేజీహెచ్లో డెర్మటాలజీకి నూతన పరికరాలు -
బడుగులపై ‘మహా’ ప్రతాపం
భీమిలి పరిధిలో వందకు పైగా దుకాణాల తొలగింపుమధురవాడ/కొమ్మాది/తగరపువలస: భీమిలి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల దుకాణాలను, తోపుడు బళ్లను అధికారులు తొలగించడంతో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. జీవీఎంసీ జోన్.2 పరిధిలో తొలగింపు ఉద్రిక్తంగా మారింది. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో సుమారు 80 బడ్డీలు, దుకాణాలను అధికారులు తొలగించారు. కనీసం సమాచారమైనా ఇవ్వకుండా తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. పీఎం పాలెం పోలీసులు వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని చక్కబరిచారు. ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే డబుల్ రోడ్డు వెంబడి సుమారు 20 దుకాణాలను అధికారులు పొక్లెయిన్లతో తొలగించారు. రెండు రోజులైనా వ్యవధి ఇవ్వకుండా తోపుడు బళ్లు, టిఫిన్ సెంటర్లు, దుకాణాలను తొలగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్–1 పరిధిలోని తగరపువలస మెయిన్రోడ్డు, ఫుట్పాత్లపై ఆక్రమణలను జెడ్సీ అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తొలగించారు. చిట్టివలస ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు తొలగింపులు జరిగాయి.చాలా అన్యాయంఏళ్ల తరబడి రోడ్డుపై చిరు వ్యాపారాల ద్వారా బతుకుతున్నాం. ఏళ్ల తరబడి జీవీఎంసీకి ఆశీలు కడుతున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఉంది. కనీసం ముందుగా అయినా సమాచారం ఇవ్వకుండా, అధికారులు మాపై అకస్మాత్తుగా దాడి చేయడం అన్యాయం. ఇలా చేస్తే మా కుటుంబాలు ఏమై పోవాలి?–లక్ష్మి కుమారి, చిరు వ్యాపారి -
పీఎంఏవై–అర్బన్ 2.0 పథకంపై లబ్ధిదారులకు అవగాహన
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీఎంఏవై–అర్బన్ 2.0 ప్రచార అవగాహన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంగీకార్–2025 పేరుతో అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.00 లక్ష కలిపి మొత్తం రూ.2.50 లక్షలు ఉచితంగా అందిస్తుందని కమిషనర్ వివరించారు. ఈ పథకంతో పాటు, ఇల్లు నిర్మించుకున్న వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్తీ మలి యోగ ఉచిత విద్యుత్ పథకం వంటి ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. ప్రజలకు ఈ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. సత్యవేణితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మిల్లెట్ ఆర్ట్తో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు
ఏయూ క్యాంపస్: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్కుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సహజసిద్ధమైన చిరుధాన్యాలతో ఎనిమిది అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టిందని మోకా వెల్లడించారు. మోదీ నిలువెత్తు చిత్రపటం బ్యాక్గ్రౌండ్లో ఆపరేషన్ సిందూర్, మేక్ ఇన్ ఇండియా, వందే భారత్ రైలు, వ్యసాయం, నూతన పార్లమెంట్ భవనం, యోగా తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల చిత్రాలను తీర్చిదిద్దారు. దేశ ప్రధానిగా సేవలందిస్తూ, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్న మోదీని అభినందిస్తూ ఈ చిత్రపటాన్ని తీర్చిదిద్దినట్లు చిత్రకారుడు మోకా విజయ్కుమార్ పేర్కొన్నారు. -
బిగ్ రిలీఫ్
దసరా, దీపావళికి ముందే డబుల్ బొనంజాపాత జీఎస్టీతో పోలిస్తే 10 శాతం మేర తగ్గనున్న ధరలు 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలునగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవల కేంద్రం సవరించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గృహోపకరణాలు, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు 10 శాతం మేర తగ్గనున్నాయి. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో వాహనాలు, కార్లు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు ఈనెల 22 వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు సైతం ఈనెల 22 తర్వాతే ఆఫర్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. – విశాఖ సిటీగృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. బిల్డర్లతో పాటు సొంతింటి నిర్మాణాలు చేపట్టే ప్రజలకు నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఫ్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగుల ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు సైతం.. జీఎస్టీ సవరణతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి కంటే 10 నుంచి 13 శాతం మేర ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల్లో వ్యత్యాసం భారీగా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా అందుబాటు ధరల్లోకి రానున్నాయి. టీవీలపై రూ.5 వేలు నుంచి రూ.15 వేలు వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేలు నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా దసరా, దీపావళి సమయాల్లో ఎలక్ట్రానిక్, వస్తువులపై వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం వ్యాపారుల ఆఫర్లతో పాటు కేంద్రం జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఈ నెల 22వ తేదీ తర్వాతే గృహోపకరణాలు, మొబైల్స్ను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. తగ్గనున్న నిత్యావసర ధరలు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీఎస్టీ సవరణలతో మరో వారం రోజుల్లో ఈ ధరలు దిగిరానున్నాయి. సాధారణ ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. దీంతో పేస్ట్ నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు పన్నీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి, పాస్తా, నూడుల్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఖరీదైన బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై కూడా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించనుంది. ఈ–కామర్స్లో ఆఫర్ల వెల్లువ ఈ–కామర్స్ సంస్థల్లో కూడా డిస్కౌంట్ల సందడి మొదలైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేర్లతో భారీ సేల్కు సిద్ధమవుతున్నాయి. ఇక మింత్రా, మీషో, షాపి వంటివి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. జీఎస్టీ సవరణలతో ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. వాహనాలపై 28 నుంచి 18 శాతానికి.. వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి బైక్లు, కార్లపై 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉండడంతో భారీగా వాహనకొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్లపై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. దీంతో కొనుగోలుదారులు ఈనెల 22 తర్వాతే వాహనాలను కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నారు. అయితే కొన్ని షోరూమ్లు ప్రీ బుకింగ్లకు కూడా డిస్కౌంట్ ధరలు ప్రకటించాయి. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్ వడ్డించారు. -
అధ్యయన యాత్రలో.. అడ్డగోలుతనం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అధ్యయన యాత్రలు విహార యాత్రలుగా మారాయనే ఆరోపణలు సర్వసాధారణం. అందుకే వామపక్ష కార్పొరేటర్లు వీటిని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. అయితే అడ్డగోలుగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఈ అధ్యయన యాత్రలను మరింతగా దిగజార్చాయన్న ఆరోపణలు మూటుగట్టుకుంటోంది. కార్పొరేటర్లు, అధికారుల కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ షికార్ల వరకే పరిమితమయ్యేవారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి అక్కడి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం గమనార్హం. దీన్ని నియంత్రించాల్సిన మేయర్, జీవీఎంసీ అధికారులు ఇందుకు వత్తాసుగా నిలవడమే విశేషం..! అధ్యయనం పేరిట విహారం అధ్యయన యాత్రం కోసం మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు కార్పొరేటర్ల బృందం, వారి కుటుంబ సభ్యులు, జీవీఎంసీ అధికారులు మంగళవారం బయలుదేరిన విషయం తెలిసిందే. వీరంతా షెడ్యూల్ మేరకు బుధవారం జైపూర్ కార్పొరేషన్ను సందర్శించారు. వాస్తవానికి అధ్యయన యాత్ర మేయర్, కార్పొరేటర్లు, అధికారులకు మాత్రమే. వారి కుటుంబ సభ్యుల షికారుకు, వారు తీసుకున్న రూమ్ చార్జీల భారమూ జీవీఎంసీయే భరించడం రివాజుగా మారింది. ఈసారి మేయర్, కార్పొరేటర్ల బృందంతో వారి కుటుంబ సభ్యులు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. వీరి అవసరమేంటో..? భీమిలి నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ భర్త, ఉత్తర నియోజకవర్గానికి చెందిన మరో కార్పొరేటర్ సోదరుడు, దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఇంకో కార్పొరేటర్ దగ్గరి బంధువు.. ఇలా చాలా మంది నేరుగా జైపూర్ కార్పొరేషన్ను సందర్శించి, జైపూర్ నగర్ నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్ను కలుసుకున్నారు. అక్కడి కార్పొరేషన్లో నిర్వహించిన సమావేశంలో కూడా వీరంతా పాల్గొనడం గమనార్హం. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చా? నేరుగా అక్కడి కార్పొరేషన్లోనే కార్పొరేటర్లతో కూర్చుంటే మేయర్ పీలా శ్రీనివాసరావు, అధికారులు ఏం చేస్తున్నట్టో..! అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ సొమ్ముతో షికార్లు చేయడమే కాకుండా.. ఇలా జీవీఎంసీ పరువు తీసేలా వ్యవహరించడం సరికాదని నగరవాసులు ఆక్షేపిస్తున్నారు. జైపూర్ కార్పొరేషన్లో జీవీఎంసీ బృందం అధ్యయన యాత్రలో భాగంగా జీవీఎంసీ బృందం జైపూర్ కార్పొరేషన్ను బుధవారం సందర్శించినట్లు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ల బృందం జైపూర్(రెడ్ సిటీని) సందర్శించి జైపూర్ అభివృద్ధి కార్యక్రమాలు, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అధ్యయనం చేశారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికలు, సుస్థిర పట్టణాభివృద్ధిలో నూతన పద్ధతులను మేయర్, కార్పొరేటర్ల బృందం పరిశీలించారని తెలిపారు. ఈ సందర్భంగా జైపూర్ నగర నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్, ఇంజినీర్ ఓమన్ కార్గ్ జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల బృందానికి స్వాగతం పలికి, జైపూర్ నగరాభివృద్ధితో పాటు సాధించిన ప్రగతి వివరించారు. జీవీఎంసీ తరఫున జ్ఞాపిక అందించినట్లు సెక్రటరీ తెలిపారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం
మహారాణిపేట: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బుధవారం ఉదయం 11.16 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్లు గణబాబు, వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలోను, రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్కు హాజరయ్యారు. అనంతరం రాత్రి 8.55 గంటలకు విమానంలో తిరుగు పయనమయ్యారు. -
ఎండలో కిలోమీటరు నడిపించి..
విశాఖ సిటీ: స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో తల్లులకు చుక్కలు చూపించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలతో పాటు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ స్టాళ్లను సందర్శనకు వస్తుండడంతో ఇక్కడకు రోగులతో పాటు వ్యాక్సిన్ల కోసం పిల్లలను తీసుకువచ్చే బాధ్యతలను ఆర్పీలకు అప్పగించారు. దీంతో ఆర్పీలు తమ వార్డుల్లో ఉన్న వారిని ఆటోల్లో సీఎం కార్యక్రమానికి తరలించారు. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 11.30 గంటలకు కార్యక్రమం జరిగితే ఉదయం 8 గంటలకే వారిని తరలించారు. బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్టాళ్లను ఏర్పాటు చేయగా.. వీరిని కిలోమీటరు దూరంలో ఏయూ అవుట్ గేట్ వద్దే దించేశారు. దీంతో తల్లులు చంటి పిల్లలను ఎత్తుకొని ఎండలో అవస్థలు పడుతూ నడవాల్సి వచ్చింది. వ్యాక్సిన్ కోసం పిలిచి ఇబ్బందులకు గురి చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు దూరం నడవలేక మధ్యలోనే చెట్లు, ఇళ్ల ముందు కూర్చుండిపోయారు. -
కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరం
మహారాణిపేట: రాష్ట్ర ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పేదోడికి వైద్య విద్యను చేరువ చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి, ప్రజారోగ్య పరిరక్షణ లో కొత్త దశకు వైఎస్ జగన్ నాంది పలికారన్నారు. ఈ ఐదు కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. పాడేరు, పులివెందుల కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం మరింత ఖరీదుగా మారిందన్నారు. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల పెండింగ్తో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పడుతున్నాయని పేర్కొన్నారు. రేపు ‘చలో మెడికల్ కాలేజ్’ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. యువజన, విద్యార్ధి విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ పేరిట నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులను కలిసి 19న పాడేరులోని మెడికల్ కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కనకల ఈశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు జాడ శ్రావణ్కుమార్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కాగితాల రవికిరణ్, తాడి రవితేజ, మువ్వల సంతోష్ కుమార్, యువజన విభాగం నాయకులు బొట్ట రాజు, ప్రేమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాడ్యులర్ ఎంబీఏ కోసం అవగాహన ఒప్పందం
తగరపువలస: జాతీయ ప్రాధాన్యత గల మాడ్యులర్ ఎంబీఏ కోసం ఐఐఎంవీ, ఐఐఐటీ మణిపూర్ల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. గంభీరం ఐఐఎంవీలో బుధవారం ఐఐఎంవీ డైరెక్టర్ చంద్రశేఖర్, మణిపూర్లోని సేనాపతి ఐఐఐటీ డైరెక్టర్ కృష్ణన్భాస్కర్లు ఈ ఒప్పందపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో ప్రముఖ 18 ఎన్ఐటీ, ఐఐఐటీలకు విశాఖ ఐఐఎం పీజీపీఎంసీఐ సహకారం అందిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల కోసం మాడ్యులర్ ఎంబీఏ రూపొందించినట్లు వెల్లడించారు. ఇది బీటెక్, ఎంటెక్ డిగ్రీలతో పాటు అవసరమైన నిర్వహణ పరిజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. ప్రొగ్రాంలో భాగంగా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం చైర్ ప్రొఫెసర్ ఎం.షమీమ్ జావేద్, డీన్ మారిశెట్టి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్’లో ఇన్చార్జ్ల పాలన
మహారాణిపేట: ఉత్తరాంధ్రలో కీలకమైన జలవనరుల శాఖపై కూటమి సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోంది. సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు ఎస్ఈ పోస్టుల్లో వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ ఒక్కరే రెగ్యులర్. ఎస్ఈలు రిటైర్ అయినా ఇన్చార్జ్ బాధ్యతలు ఎక్కడో పనిచేస్తున్న వారికి అప్పగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. ధవళేశ్వరం నుంచి.. : విశాఖ ఎస్ఈ పోస్టులో ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఈని ఇన్చార్జ్గా నియమించారు. విస్తారంగా వర్షాలతో రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఆయన ఇక్కడికి రాలేక, అక్కడే ఉండలేక తిప్పలు పడే పరిస్థితి. కీలకమైన విశాఖలో అనేక రిజర్వాయర్లలో నీరుచేరి గేట్లు ఎత్తడంలో అనుమతులు రాక ఏఈలు, డీఈఈ తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈఈలు, డీఈఈలూ ఇన్చార్జిలే! : ఉమ్మడి ఉత్తరాంధ్రలో కీలకమైన నార్త్ కోస్టు సీఈ పోస్టు కూడా ఇన్చార్జితోనే నడుస్తోంది. ఉమ్మడి విశాఖలోని నాలుగు డివిజ్లలో మూడింట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ) కరవయ్యారు. దాదాపు అన్ని ఎస్ఈ, ఈఈ పోస్టులు ఇన్చార్జిలతోనే నడుస్తున్నాయి. ఇన్చార్జిలు రెండు/మూడు పడవల ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో దాదాపు అన్ని డివిజన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్ల(ఏఈ)తోనే నెట్టుకొస్తున్నారు. ఈ పోస్టుల్లో కూడా చాలా వరకు ఇన్చార్జిలే ఉండటం గమనార్హం. పదోన్నతులు, పోస్టింగుల్లోనూ అన్యాయం : జలవనరుల శాఖలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగుల్లో కూడా ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. ఉమ్మడి ఉత్తరాంధ్రలోని అన్ని ఎస్ఈలు, ఈఈ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. విశాఖ ఎస్ఈ పోస్టుకు ఇన్చార్జిగా ధవళేశ్వరం నుంచి వేశారంటే.. ఇక్కడి సిబ్బందిపై ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో.. తేటతెల్లమవుతోంది. -
ప్రజాస్వామ్యం ఖూనీ
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. వాటిపై కనీస ధ్యాస లేదు. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజా పక్షాన పోరాడే పత్రికలపై, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. పత్రికలపై, జర్నలిస్టులపై అక్రమ కేసులతో పత్రికాస్వేచ్ఛను హరిస్తామంటే ప్రజాస్వామాన్ని ఖూనీ చేసినట్లే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చూపించే సాక్షి పత్రికపై అక్రమ కేసులు నమోదుచేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి మీడియా సమావేశం పెడితే అది వార్తగా ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. – మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే -
అమల్లో.. రెడ్ బుక్ రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసే సాక్షి పత్రిక, టీవీ జర్నలిస్టులపై, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసే కుట్రలకు పాల్పడుతోంది. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్మీట్ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్మీట్ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. అంతమాత్రాన జర్నలిస్టులకు, ఆ పత్రికలకు వాటిని ఆపాదించి కేసులు వేయడం సరికాదు. – మొల్లి అప్పారావు, విశాఖ తూర్పు సమన్వయకర్త -
జాతీయస్థాయి టెన్నీకాయిట్ పోటీలకు గురుకుల విద్యార్థి
సబ్బవరం: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి పి.సాగర్ టెన్నీకాయిట్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో కోనసీమ జిల్లా, మండపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. వచ్చే నెల 8 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి కేఎన్వీ సత్యనారాయణ(పైసా)కు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సాగర్తో పాటు, శిక్షణ ఇచ్చిన పీడీ, పీఈటీలు సీఎల్ఎన్ ప్రసాద్, వి.సూర్యనారాయణలను ప్రిన్సిపాల్తోపాటు, వైస్ ప్రిన్సిపాల్ కె.చిరంజీవి, ఉపాధ్యాయులు రాంబాబు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్ను అడ్డుకుంటాం
● మండుటెండలో 4వ రోజు కొనసాగిన నిరాహార దీక్ష ● సహనాన్ని పరీక్షించవద్దని మత్స్యకారుల హెచ్చరిక ● మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు నక్కపల్లి: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు... శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అణగతొక్కాలని ప్రయత్నిస్తోంది... ప్రాణాలకు తెగించైనా బల్క్డ్రగ్ను అడ్డుకుంటాం.. ఓట్లేసి గెలిపిస్తే హోంమంత్రి అనిత తమపట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారను కోలేదు’ అంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. బల్క్ డ్రగ్పార్క్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహారదీక్ష నాల్గో రోజు బుధవారం కొనసాగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెంట్లు వేసి, దీక్ష కొనసాగించేందుకు సిద్ధపడగా సీఐ కుమార స్వామి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు పర్మిషన్ లేదని, టెంట్లు వేయడానికి వీల్లేదన్నారు. దీంతో గంగపుత్రులు గొడుగుల నీడలో దీక్షను కొనసాగించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మత్స్యకారులపై కేసులు నమోదు చేశారు. అరెస్టులవడానికి, జైలుకెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నామంటూ మత్స్యకార మహిళలు నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు, వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్, రైతు సంఘనాయకుడు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు, ఎండలో మత్స్యకారులతో కలసి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ మత్స్యకారులను కూటమిప్రభుత్వం దేశద్రోహులగా చిత్రీకరిస్తోందని, శాంతియుతంగా నిరాహరదీక్ష చేస్తున్న వారిపై ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. నాలుగు రోజులుగా రాజయ్యపేటలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. తనను ఆదరించిన మత్స్యకారులను ఆదుకోకపోగా పోలీసుల సాయంతో ఉద్యమంపై హోంమంత్రి అనిత ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అసెంబ్లీసమావేశాలు ప్రారంభ కానున్నాయని, ఈ సమావేశాల్లో రాజయ్యపేటలో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావించి బల్క్డ్రగ్పార్క్ రద్దుచేసే విధంగా బిల్లు పాస్చేయాలని కోరారు. దేశంలో మూడు చోట్ల..గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో ఈ బల్క్డ్రగ్పార్క్లను పెడుతున్నామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పెడుతున్నారన్నారు. ఈ పార్క్ ఏర్పాటయితే పదుల సంఖ్యలో ప్రమాదకర రసాయన పరిశ్రమలు వస్తాయని, ఈ ప్రాంత మంతా శ్మశానంగా మారుతుందని చెప్పారు. గంగపుత్రులు చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నామని, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇది ఒక్క రాజయ్యపేట మత్స్యకారుల సమస్య కాదని, తూర్పుతీరంలో ఉన్న అందరి సమస్య అని చెప్పారు. ఎండలో మహిళలు ఇబ్బంది పడుతుంటే టెంట్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మత్స్యకారులు తలచుకుంటే టెంట్లు వేయడం పెద్ద పనికాదని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నా రు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరిని ఏకం చేస్తామని, త్వరలోనే ఇతరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ రాజయ్యపేట తీసుకు వచ్చి తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. జాతీయమత్స్యకార సంఘ అధ్యక్షుడు, ఇతర మత్స్యకార పెద్దలను కలసి ఇక్కడి సమస్య వివరిస్తామన్నారు. వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, ఉపాధ్యక్షుడు నాగేశు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల పోలీసుల వైఖరి సరికాదన్నారు. ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు సోమేష్, పిక్కి తాతీలు, పిక్కి కోదండరావు, మైలపల్లిసూరిబా బు, నారాయణరావు,కాశీరావు,మహేష్, రాజశేఖర్, యజ్జల అప్పలరాజు, కోడకాశీరావు,పైడితల్లి,నూకరాజు, మహిళలు పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు జాలారిపేటకు చెందిన ఒలిశెట్టి కోదండ ఆయన భార్య లక్ష్మి(45)పై అనుమానం పెంచుకుని, మద్యం మత్తులో బుధవారం ఉదయం దారుణంగా కొట్టి, చాకుతో పొడిచి హత్య చేసినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. హత్యకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒలిశెట్టి కోదండ ఆముదాలవలస ప్రాంతానికి చెందిన హతురాలు లక్ష్మిని మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని, జాలారిపేటలో చేపల వేట సాగిస్తూ జీవిన్నాడు. మంగళవారం వేటాడిన చేపల్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో రెండు రోజులుగా మద్యం సేవిస్తున్నాడు. కోదండతో పాటు భార్య లక్ష్మి కూడా మద్యం సేవిస్తుంటుందని స్థానికులు చెప్తున్నారు. భార్యపై అనుమానం కూడా ఉండేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మద్యం సేవించిన కోదండ.. భార్య లక్ష్మితో తన ఇంటి ముందు గొడవపడ్డాడు. కర్రతో కొట్టుకుంటూ ఇంటిలోపలికి తీసుకెళ్లి చాకుతో పొడవడంతో లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు కోదండకు ఆమె మూడవ భార్య. ఈయన ప్రవర్తన బాగాలేక మొదటి భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అనంతరం పూడిమడకకు చెందిన ఒకామెను వివాహం చేసుకోగా ఆమె పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత ఆముదాలవలస ప్రాంతానికి చెందిన హతురాలు లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. హత్య విషయాన్ని తెలుసుకున్న సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. హతురాలు లక్ష్మికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాల్పడిన కోదండను అదుపులోకి తీసుకుని, కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ మల్లికార్జునరావు చెప్పారు. -
స్వచ్ఛతా పక్షోత్సవాలు ప్రారంభం
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ స్వచ్చతాహీ సేవా 2025 పక్షోత్సవాలను బుధవారం ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 9వ విడతలో భాగంగా ఈస్ట్ పాయింట్ కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. జీఎం నాయకత్వంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతి వరకు 15 రోజులు దేశవ్యాప్తంగా రైల్వే అధికారులు, పౌరులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్కోస్ట్ రైల్వే ఓఎస్డీ బి. చంద్రశేఖర్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
నేల పరీక్షలను అడ్డుకున్న దళిత రైతులు
తగరపువలస : ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ సర్వే నంబర్ 1లో 35/71/72/74/75లో తమకు చెందిన డి పట్టా భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని దళిత రైతులు వాపోయారు. బుధవారం నేల పరీక్షలకు యంత్రాలతో వచ్చిన వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1971లో అప్పటి ప్రభుత్వం 51 మంది దళితులతో పాటు బీసీ రైతులకు 2 ఎకరాల చొప్పున భూమి కేటాయించిందన్నారు. అప్పటి నుంచి ఈ భూములతో పాటు చుట్టుపక్కల ఉన్న బంజరు భూముల్లో జీడి, మామిడి, అరటి వంటి తోట పంటలు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామన్నారు. వ్యవసాయానికి అనువుగా ప్రభుత్వాలు బోరుబావులు, విద్యుత్ మోటార్లు, సోలార్ కనెక్షన్లు కూడా ఇచ్చాయన్నారు. గతంలో భీమిలి ఆర్డీవో, ఆనందపురం తహసీల్దార్ పంచాయతీకి వచ్చి గ్రామసభ నిర్వహించారన్నారు. రైతుల సాగులో ఉన్న భూములు, సర్వే నంబర్లు వేర్వేరుగా ఉన్నందున సరి చేసి ఇస్తామని నమ్మబలికారన్నారు. తరువాత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామనగా దళిత వార్డు సభ్యులు పైల బంగారమ్మ, కోండ్రు శంకర్ తదితరులు వ్యతిరేకించారన్నారు. అంతకు ముందే ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. వారం రోజుల క్రితం వచ్చిన అధికారులు 350 ఎకరాల వరకు గూగుల్ తదితర సంస్థలకు తమకు చెందిన డీ పట్టా భూములు, బంజురు భూములను ఇవ్వనున్నట్టు తెలిపారన్నారు. అందులో భాగంగా బుధవారం నేల పరీక్షలకు వచ్చిన వారిని అడ్డుకున్నామన్నారు. తమకు ఈ భూములు పోతే భవిష్యత్తు ఉండదని ఉద్యోగాలు, నష్టపరిహారం తగినంతగా ఇస్తే తప్ప భూములు వదులుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా నేల పరీక్షలు వాయిదా వేసుకుని అధికారులు వెళ్లిపోయారు. -
స్మార్ట్ పరేషన్
మహారాణిపేట : రేషన్ లబ్ధిదారులు గత కొన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి రేషన్ డిపోలకు వెళ్తున్నారు. తమ వద్దకు ఇంకా రాలేదు సచివాలయానికి వెళ్లాలని రేషన్ డీలర్లు సూచిస్తున్నారు. అక్కడికి వెళ్తే కొద్ది సేపు వెతికి కార్డు ఇక్కడ లేదు రేషన్ డిపోకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారు. ఇలా రేషన్ డిపో, సచివాలయాల చుట్టూ లబ్ధిదారులు చక్కర్లు కొడుతున్నారు. కాని ఎక్కడా స్మార్ట్ కార్డు జాడ దొరకడం లేదు. సెప్టెంబర్ సరుకులు తీసుకోవడానికి ఈనెల 15వ తేదీ గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత రేషన్ షాపులన్నీ మూత పడ్డాయి. మళ్లీ 26వ తేదీ నుంచి రేషన్ డిపోలు తెరిచి ఉంటాయి. అప్పటి వరకు ఎవరి రేషన్ కార్డులు తీసుకోవడానికీ వీలు లేకుండా పోయింది. 26వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ ఇవ్వనున్నారు. అయితే స్మార్ట్ కార్డు ఉంటే గాని రేషన్ సరుకులు ఇవ్వమని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఎస్వో భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి కార్డుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. అయినా డీలర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పంపిణీకి నోచుకోని 91,336 కార్డులు కూటమి సర్కార్ గత నెల 26న స్మార్డ్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 26 నుంచి 31వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి కార్డులు పంపిణీ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని రేషన్ డిపోల్లో వేలిముద్రలు వేసి కార్డులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోసం డీఎస్వో ఆధ్వర్యంలో అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారుల పర్యవేక్షణలో చెకింగ్ ఇన్స్పెక్టర్లు, సచివాలయం, చౌకధరల దుకాణాల వారీగా ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. 5,17,155 స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. ఈ కార్డుల పంపిణీ కోసం పలు ఏర్పాట్లు చేసినట్టు డీఎస్వో వి.భాస్కరరావు తెలిపారు. సచివాలయాల సిబ్బంది ద్వారా 1,92,008, డీలర్ల ద్వారా 2,33,811 కార్డుల పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 4,25,819 పంపిణీ చేయగా ఇంకా 91,336 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని డీఎస్వో పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల కోసం రేషన్ డిపోలకు వెళ్తే సచివాలయానికని.. అక్కడకు వెళ్తే రేషన్ డిపోలకు వెళ్లాలని తిప్పుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. కీలకంగా స్మార్ట్ కార్డు నిత్యావసర వస్తువులతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు ఈ స్మార్డు కార్డు అవసరం ఉంది. వివరాలు సక్రమంగా లేకపోతే కొన్ని సమయాల్లో అధికారులు తిరస్కరించే అవకాశం ఉంటుంది. కొత్తగా స్మార్ట్ కార్డులు మంజూరు చేసే సమయంలో లబ్ధిదారుని వివరాలు, అడ్రస్ సక్రమంగా ముంద్రించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. అలా జరగనందున కొన్ని సమయాల్లో ప్రభుత్వ పథకాలకు దూరమవుతామనే ఆందోళన ప్రజల్లో ఉంది. కార్డుల్లో పిల్లల పేర్లు, వయసు తేడా, చిరునామా తదితర అంశాలు సక్రమంగా ఉండాలని కార్డుదారులు కోరుతున్నారు. అయితే పూర్తిగా పంపిణీ జరగకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. -
ఎయిర్పోర్టులో ఘనంగా యాత్రి సేవా దివాస్
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో గురువారం నిర్వహించిన యాత్రి సేవా దివాస్ ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. టెర్మినల్ భవనంలో నృత్యభారతి డ్యాన్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ, ఫోక్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు పీవీఎన్ మాధవ్, గండి బాబ్జి, కె.ప్రభాకర్, కూన రవికుమార్ తదితరులు మొక్కలు నాటారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిపిన చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు. వైద్య శిబిరాలకు విశేష స్పందన ఎయిర్పోర్టు ఆవరణలో వాసన్ ఐ కేర్ సహకారంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. వైజాగ్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎయిర్పోర్టు అథారిటీ ఉద్యోగులు, ప్రయాణికులు, సిబ్బంది పాల్గొన్నారు. విమానాశ్రయ పరిశుభ్రత, సేవా ప్రమాణాలపై ప్రయాణికులతో మాట్లాడి, అభిప్రాయాలు తీసుకున్నారు. ఉద్యోగావకాశాలపై అవగాహన విమానాశ్రయాల్లో వివిధ రకాల ఉద్యోగావకాశాలు, అభ్యసించాల్సిన కోర్సులపై పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయం ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం మాట్లాడుతూ యాత్రి సేవా దివాస్ కార్యక్రమం ప్రయాణికులకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. విజయవంతం చేసిన ఉద్యోగులను, సిబ్బందిని అభినందించారు. -
ప్రభుత్వ తీరు దారుణం
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరిస్తోంది. జర్నలిస్టులపై, సాక్షిపై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. విలేకరుల సమావేశంలో నాయకుల మాటలను వార్తలుగా ప్రచురిస్తే పత్రికలపై కేసులు పెట్టడం చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే బాధ్యత మీడియాపై ఉంది. రాష్ట్రంలోని ప్రజలు ప్రతీ అంశాన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. – అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎమ్మెల్యే -
భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
డాబాగార్డెన్స్ : విశాఖ వేదికగా వచ్చే నవంబర్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. భాగస్వామ్య సదస్సు నిర్వహించే ఏయూ గ్రౌండ్ ప్రధాన వేదిక, ఇతర ప్రాంతాలను కమిషనర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సదస్సుకు ఎంతో మంది అతిథులు తరలిరానున్నారని, అందుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలపై గ్రీన్ మ్యాట్లు కప్పేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావును ఆదేశించారు. నగర సుందరీకరణలో భాగంగా సెంటర్ మీడియన్లలో పచ్చదనం, చెట్ల ట్రిమ్మింగ్, ఏయూ గ్రౌండ్ రోడ్డు పక్కన ఫుట్పాత్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి, ఆ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి పరచాలని డీడీహెచ్ దామోదరరావును ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో భాగంగా 26 స్ట్రెచ్ ప్రాంతాల్లో దృష్టి సారించి, ఫుట్పాత్లు, రోడ్లు, పెయింటింగ్, లైటింగ్ వంటి అభివృద్ధి పనులకు సంబంధించి నివేదిక సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజును ఆదేశించారు. సదస్సు జరిగే వరకూ అధికారులతో ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ సమన్వయ పనులపై దృష్టి సారించాలని అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మను ఆదేశించారు. సదస్సుకు నిర్వహించే పనుల్లో యూఐఎంఎల్ ప్రతినిధి చేతన్ను భాగస్వామ్యం చేయాలని ప్రధాన ఇంజనీర్కు సూచించారు. పారిశుధ్య నిర్వహణకు పిన్ పాయింట్ వారీగా కార్మికులను సర్దుబాటు, తదితర అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ను ఆదేశించారు. పర్యటనలో జోనల్ కమిషనర్లు కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్కుమార్, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్, సుధాకర్, ఏసీపీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. మీడియా గొంతును నొక్కే ప్రయత్నాలకు పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను నోటీసు లు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. – పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే -
చిన్నారి 'ఖుషీ'ని బతికిద్దాం
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారి ఇంట్లో సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 17 నెలల చిన్నారి ఖుషీని ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) టైప్–2’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కబళిస్తోంది. కండరాల కదలికలను స్తంభింపజేసే ఈ మహమ్మారి కారణంగా, ఆ చిన్నారి నడవలేని, కనీసం నిలబడలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకూ క్షీణిస్తున్న తన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.విషమంగా చిన్నారి ఆరోగ్యంనగరానికి చెందిన డి.తరుణ్కుమార్, ఉషారాణి దంపతులకు రెండేళ్ల కిందట వివాహం కాగా.. ఖుషీ జన్మించింది. తరుణ్కుమార్ ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సాధారణ ఉద్యోగి. భార్య గృహిణి. ఎటువంటి ఆస్తుల్లేవ్. కాగా.. తమ గారాలపట్టి ఖుషీ పుట్టిన 13 నెలల వరకు వారి జీవితం ఆనందంగానే సాగింది. కానీ ఉన్నట్టుండి పాప తినడం, ఆడుకోవడం మానేసింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆరిలోవ హెల్త్సిటీలోని వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. పాప ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–2’ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.కన్నీటి సంద్రంలో తల్లిదండ్రులుఈ వ్యాధికి చికిత్స ఉందని వైద్యులు చెప్పగానే ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆశ మెరిసింది. కానీ.. దానికి అయ్యే ఖర్చు అక్షరాలా రూ.9 కోట్లు అని తెలియగానే వారి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. జోల్జెన్మ్సా అనే ఒక్కసారి ఇచ్చే జన్యు చికిత్స ఇంజక్షన్తో పాపను బతికించుకోవచ్చని, అయితే అది తక్షణమే అందించాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పాపకు వైద్యం అందిస్తున్న ఆ మధ్యతరగతి కుటుంబానికి రూ.9 కోట్లకు పైనే సమకూర్చడం అనేది ఊహకు కూడా అందని విషయం. బిడ్డను ఎలా బతికించుకోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.ప్రభుత్వం, దాతలే ఆధారం‘మా లాంటి వాళ్లకు ఇన్ని కోట్లు తేవడం ఎలా సాధ్యం? మా బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వమే చొరవ చూపాలి. విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు మా గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలి.’ అని చిన్నారి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ‘మా పాప మళ్లీ నవ్వాలంటే, మాతో ఆడుకోవాలంటే దాతలు కరుణించాలి. మీరందించే చిన్న సాయం కూడా మా బిడ్డకు ప్రాణం పోస్తుంది.’ అంటూ వారు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు 73067 16745 నంబరులో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. దాతలు, ప్రభుత్వం సహకరిస్తే ఆ పసిమొగ్గ జీవితంలో మళ్లీ ‘ఖుషీ’ నింపవచ్చు. -
పనిభారం, వేధింపులు
మహారాణిపేట : సచివాలయ వ్యవస్థ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. కానీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిఒత్తిడి, అసంబద్ధమైన టార్గెట్లు ఈ వ్యవస్థ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చాలనే గొప్ప లక్ష్యంతో 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు 29 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 540 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ‘మీ సేవ’ కేంద్రాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మారిన సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చాక తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. జాబ్ చార్ట్కు మించిన పనులు గతంలో సచివాలయ ఉద్యోగులు తమ జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అదనపు పనుల భారం పెరిగిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సర్వేను సచివాలయ ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. గతంలో వలంటీర్లు నిర్వహించిన పనులను కూడా ఇప్పుడు వీరే చూసుకోవాల్సి వస్తోంది. అధికారుల వేధింపులు, టార్గెట్ల ఒత్తిడి దిగువ స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు సచివాలయ ఉద్యోగులను టార్గెట్లతో వేధిస్తున్నారని జిల్లా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జాబ్ చార్ట్కు సంబంధం లేని పనులను అప్పగించి, ప్రోగ్రెస్ పేరుతో ఒత్తిడి చేస్తున్నారు. వార్డు పరిపాలన కార్యదర్శులకు ఒకవైపు జియో ట్యాగింగ్ టార్గెట్లు ఇస్తూనే, మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని బలవంతం చేస్తున్నారు. ఈ వసూళ్లను పెంచాలని తరచూ సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇలాంటి నిరంతర ఒత్తిడి వల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటోందని, మానసిక ఒత్తిడి వారిని కుంగదీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి, ఉద్యోగుల జాబ్ చార్ట్కు అనుగుణంగా మాత్రమే పనులు అప్పగించాలి. పనిభారాన్ని తగ్గించి, మానసిక ప్రశాంతతను కల్పించగలిగితేనే సచివాలయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. లేకపోతే ‘ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అనే నినాదం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఆందోళనకు సన్నాహాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పెరుగుతున్న పనిఒత్తిడి తగ్గించాలి. అసంబద్ధమైన టార్గెట్లు విధించడం మానుకోవాలి. అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలి. ఉద్యోగుల సమస్యలపై అనేక సార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించాం. స్పందన లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. – పి.వి.కిరణ్కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన సమస్యలు ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీకి వెళ్లాలి. రాత్రి 6.30 గంటల తర్వాత కూడా అధికారులు సమావేశాలు నిర్వహించి గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. సెలవు రోజుల్లో కూడా వీరికి విశ్రాంతి లేకుండా పనులు అప్పగిస్తున్నారు. ఓడీఎఫ్ సర్వే (బాత్రూమ్ల ఫొటోలు), ఆర్డబ్ల్యూఎస్ పల్స్ సర్వే (కుళాయిల ఫొటోలు), పీ–4 సర్వే, పేదరిక నిర్మూలన సర్వే, విజన్ 2047 సర్వే వంటి అనేక రకాల సర్వేలు వీరిపై భారాన్ని పెంచుతున్నాయి. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడం, స్టిక్కర్లు అంటించడం, హౌస్ టూ హౌస్ జియో ట్యాగింగ్ లాంటి అదనపు పనులు వీరిని మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. సమ్మె నోటీసు ఇచ్చాం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఇప్పుటికే పలు రకాల ఉద్యమాలు చేశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు నోటీసులు ఇచ్చాం. ఐదేళ్ల సర్వీసు పూర్తయినా ఇప్పటి వరకు పదోన్నతులు కల్పించలేదు. 15 రోజుల వ్యవధిలో సమస్యలను పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం. – పి.జె.గణేష్ కుమార్, రాష్ట్ర జేఏసీ డీప్యూటీ జనరల్ సెక్రటరీ ఏపీ విలేజ్ వార్డు సెక్రటేరియట్ జేఏసీ -
ఇటుకతో మోది వృద్ధుడి దారుణ హత్య
గోపాలపట్నం: యల్లపువానిపాలేనికి చెందిన వృద్ధుడిని మతిస్థిమితం లేని యువకుడు ఇటుకతో మోది హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యల్లపువానిపాలెం నుంచి విమాన్నగర్కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. భీశెట్టి పరదేశి(79) మంగళవారం తన పశువులను మేత కోసం సమీపంలోని రైల్వే ట్రాక్ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పశువులను చూసేందుకు వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన అలమండ నితీష్ ఆ ప్రాంతానికి వచ్చాడు. నితీష్ ఒక్కసారిగా పరదేశిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు కేకలు వేసి వారించేందుకు ప్రయత్నించినా, అతను పట్టించుకోలేదు. దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. వృద్ధుడిని కింద పడేసి, ఇటుకతో తలపై మోదడంతో పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐలు అప్పలనాయుడు, రామారావు వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలను సేకరించింది. నిందితుడు నితీష్కు మతిస్థిమితం లేదని, గత ఏడాది మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పరదేశికి కుమారుడు ఈశ్వరరావు ఉన్నారు. తన తండ్రి గేదెలను నిందితుడి ఇంటి ముందు నుంచి తీసుకెళ్తుంటే, నితీష్ గొడవ పడేవాడని, ఆ కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని పరదేశి కుమారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టీల్ప్లాంట్ పర్సనల్ డైరెక్టర్గా రాకేష్ నందన్ సహాయ్
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ నూతన డైరెక్టర్ (పర్సనల్)గా ఎన్టీపీసీ హెచ్ఆర్ అదనపు జనరల్ మేనేజర్ రాకేష్ నందన్ సహాయ్ ఎంపికయ్యారు. స్టీల్ప్లాంట్ ప్రస్తుత డైరెక్టర్ (పర్సనల్)ఎస్.సి.పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఈ ఎంపిక చేశారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇంటర్వ్యూకు విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి నలుగురు, బీఎస్ఎన్ఎల్ నుంచి ఇద్దరు, ఎన్టీపీసీ నుంచి ఇద్దరు, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జీసీ నుంచి ఒక్కొక్కరు హాజరయ్యారు. వారిలో ఎన్టీపీసీకి చెందిన రాకేష్ నందన్ సహాయ్ను ఎంపిక చేసినట్టు పీఈఎస్బి వెబ్సైట్లో పొందుపరిచారు. -
అంబరం.. ఉట్ల సంబరం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మంగళవారం శ్రీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. సింహగిరిపై జరుగుతున్న శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా సాయంత్రం ఉట్ల సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని కనులారా తిలకించారు. ఆనంద డోలికల్లో మునిగితేలారు. సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీకృష్ణాలంకారం చేసి శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిలో వేంజేపచేశారు. తొలుత ఆలయ బేడా తిరువీధి నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులను రాజగోపురంలో వేంజేపచేశారు. ఆలయ ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు తాడు లాగగా స్థానిక యాదవుడు నమ్మి అప్పలరాజు ఉట్టిని అందుకున్నాడు. అనంతరం స్వామికి విశేషంగా హారతులిచ్చారు. భక్తులకు తీర్థాన్ని, వెన్నప్రసాదాన్ని అందజేశారు. తదుపరి సింహగిరి మాడ వీధుల్లో స్వామికి తిరువీధిని నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, అర్చకులు ఈ ఉత్సవాన్ని జరిపించారు. -
కేజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
మహారాణిపేట: కేజీహెచ్లో అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగింది. జన్యుపరమైన సమస్యలతో తల వెనుక భాగంలో పెద్ద గడ్డతో జన్మించిన నవజాత శిశువుకు వైద్యులు ప్రాణం పోశారు. ఈ శిశువు ప్రస్తుతం క్షేమంగా కోలుకుని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జూలై 31న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణి వండలం సత్యవతిని ఆమె భర్త శ్రీనివాస్ గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆగస్టు 1న ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. పుట్టుకతోనే శిశువు తల వెనుక పెద్ద గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు కేజీహెచ్కు పంపించారు. అదే రోజు శిశువును కేజీహెచ్లో చేర్చారు. వైద్యులు శిశువుకు ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. అది ‘జెయింట్ ఆక్సిపిటల్ మెనింగో ఎన్సెఫలోసిల్’ అనే అరుదైన గడ్డ అని గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 6న న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమజీత్ రే ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. బయటకు వచ్చిన మెదడు భాగాన్ని వైద్యులు జాగ్రత్తగా తొలగించి, తల భాగాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ ప్రేమజీత్ రే తెలిపారు. ఇలాంటి వ్యాధి పదివేల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్ తెలిపారు. సాధారణంగా ఇలాంటి శిశువులు పుట్టిన వెంటనే లేదా శస్త్రచికిత్స తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని, అయితే భవిష్యత్తులో ‘హైడ్రోసెఫలస్’ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నా రు. అందువల్ల ప్రతి నెలా న్యూరో సర్జరీ అవుట్ పేషెంట్ విభాగానికి తప్పకుండా రావాలని ఆ బిడ్డ తల్లిదండ్రులకు సూచించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.రాధాకృష్ణన్, సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి తదితరులు అభినందించారు. తల వెనుక భాగంలో పెద్ద గడ్డతో పుట్టిన నవజాత శిశువు నవజాత శిశువు తల వెనుక భాగంలోని గడ్డను తొలగించిన తర్వాత.. నవజాత శిశువుకు ప్రాణం పోసిన వైద్యులు -
బకాయిలు చెల్లించాలని టీచర్ల ధర్నా
మహారాణిపేట: తమకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, మధ్యంతర భృతి ఇవ్వాలని ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో ‘నిరసన వారం’లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ నిరసనకు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.కరుణాకరరావు, ప్రధాన కార్యదర్శి టి.రామకృష్ణారావు నాయకత్వం వహించారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ‘అసెస్మెంట్ పుస్తకం’పై సమీక్ష జరపాలని, సీపీఎస్ను రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కరుణాకరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా సంపాదిత సెలవు బిల్లు లు, బీమా పథకాల మెచ్యూరిటీ మొత్తాలు, భవిష్య నిధి ఫైనల్ సెటిల్మెంట్లు, గ్రాట్యుటీ మొత్తాలు అన్నీ పెండింగ్లో ఉన్నాయన్నారు. రామకృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో భవానీ శంకర్కు అందజేశారు. ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కొటాన శ్రీనివాసు, బొబ్బిలి ముత్యాల నాయుడు, బి.డి.కె.కుమారి పాల్గొన్నారు. -
ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు(ఏవో), విస్తరణాధికారుల(ఈవోఆర్డీ)కు మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా(ఎంపీడీవో) పదోన్నతులు లభించాయి. మొత్తం 9 మందికి పదోన్నతులతో పాటు పోస్టింగ్లు ఇస్తూ జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర వారికి నియామక పత్రాలు అందజేశారు. జి.కె.వీధి ఎంపీడీవోగా బి.హెచ్.వి.రమణబాబు, బుచ్చయ్య పేట ఎంపీడీవోగా కె.ఎన్.సి.నారాయణరావు, రావికమతం ఎంపీడీవోగా ఒ.మహేష్, కశింకోట ఎంపీడీవోగా సి.హెచ్.చంద్రశేఖరరావు, కోటవురట్ల ఎంపీడీవోగా చంద్రశేఖరరావు, నాతవరం ఎంపీడీవోగా ఎం.ఎస్.శ్రీనివాసులు, ఎస్.రాయవరం ఎంపీడీవోగా మీనా కుమారి, పాయకరావుపేట ఎంపీడీవోగా విజయలక్ష్మి, ముంచంగిపుట్టు ఎంపీడీవోగా కె.ధర్మారావు నియమితులయ్యారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తిబాబు, నాయకులు పాల్గొన్నారు. -
టూర్ పేరుతో టార్గెట్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో కూటమి నేతల వసూళ్ల పర్వానికి అంతులేకుండా పోతోంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ పేరుతో వసూళ్లకు తెగబడిన కూటమి నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో టార్గెట్లు విధించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. జీవీఎంసీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత విభాగాల వారీగా లక్ష్యాలు విధించి మరీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, యూసీడీ ఇలా అన్ని విభాగాల అధికారులను పిలిచి ఇంత మొత్తం వసూలు చేసి ఇవ్వాలంటూ లక్ష్యాలు విధించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జైపూర్, జోద్పూర్, జైసల్మార్, ఢిల్లీ ప్రాంతాల్లో అధ్యయన యాత్ర పేరుతో జీవీఎంసీ కార్పొరేటర్లు వెళుతున్నారు. ఈ యాత్రకు జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, సీపీఎం కార్పొరేటర్ గంగారావుతో సహా 15 మంది దూరంగా ఉంటున్నారు. అయితే, కార్పొరేటర్లు టూర్ వెళుతున్నందున.. కూటమి కార్పొరేటర్లకు కొంత మొత్తం ఖర్చుల కోసం ఇవ్వాలంటూ ఈ వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాల నుంచి సదరు కీలక నేతకు భారీ మొత్తం ముట్టినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కోటి రూపాయల మేర ఈ విధంగా దండుకున్నట్టు తెలుస్తోంది.సీఎం కంటే టూరే ముద్దు!వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విశాఖ వస్తున్నారు. అయితే, సీఎం నగరానికి వస్తున్న సమయంలో ప్రోటోకాల్ మేరకు నగర ప్రథమ పౌరుడు మేయర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయినప్పటికీ సీఎం పర్యటనకు ముందు రోజే మేయర్ పీలా శ్రీనివాసరావు విమానంలో పర్యటనకు వెళ్లిపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర ప్రథమ పౌరుడిగా సీఎంకు స్వాగతం పలకకుండా టూర్కు వెళ్లడం ఏమిటంటూ వాపోతున్నారు. ఇప్పటికే మేయర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సొంత పార్టీకి చెందిన నేతలు.. ఇదే విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 111 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 111 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి అత్యధికంగా 51 ఫిర్యాదులు అందాయి. ఇంజినీరింగ్ విభాగానికి 28, ప్రజారోగ్య విభాగానికి 13, రెవెన్యూ విభాగానికి 11, మొక్కల విభాగానికి 3, యూసీడీ విభాగానికి 3, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగానికి 2 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని మేయర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.