Visakhapatnam District Latest News
-
నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండవ విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు. వీరంతా సోమవారం కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కొండపై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కోలలకు పూజలు చేసి.. సహపంక్తి భోజనాలు చేస్తారు. భక్తులతో అడవివరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. -
● ఎప్పుడొస్తుందో రేషన్?
నిరీక్షణలో పేదలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ లబ్ధిదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వం అందించిన విధంగా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు సరఫరా చేయకపోగా.. పంపిణీ ప్రక్రియ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నెల 11వ తేదీ గడిచినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. నిత్యం రేషన్ వాహనం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు తప్పడం లేదు. పేదలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి శివాజీపాలెంలోని చిన్నపూలమ్మ గుడి వద్ద చోటుచేసుకున్న ఈ దృశ్యం అద్దం పట్టింది. ఇక్కడ వృద్ధులు తమ రేషన్ సరుకుల కోసం గోనె సంచులు క్యూలో పెట్టుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ పంపిణీలో జరుగుతున్న ఈ ఆలస్యంపై లబ్ధిదారులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్కు వైఎస్సార్ సీపీ నేతల నివాళి మహరాణిపేట: పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఇమంది సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామి రెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యాడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోవింద్ బోదపు, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రంభ నారాయణమూర్తి పాల్గొన్నారు. -
కడలి ఒడిలోకి..
ఉగ్రవాద నిర్మూలనతోనే ప్రపంచ శాంతివిశాఖ విద్య: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారానే ప్రపంచశాంతి సాధ్యపడుతుందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం–దేశ సమైక్యతను పెంపొందిద్దాం–మేరా భారత్ మహాన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి సంఘీభావం లభిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు. ఐకమత్యమే భారతీయుల బలమని ప్రపంచం గుర్తించిందన్నారు. ప్రజలంతా దేశ భద్రతకు, అభివృద్ధికి, పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్రాజు మాట్లాడుతూ భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అదే సమయంలో దేశ ప్రజలకు ముప్పు తలపెట్టేవారిని ఎంత మాత్రం ఉపేక్షించదన్నారు. దేశ భద్రత కోసం సరిహద్దులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న త్రివిధ దళాల సిబ్బందికి భారతీయులంతా బాసటగా నిలవాలని కోరారు. యుద్ధంలో మృతి చెందిన తెలుగు జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం త్రివర్ణ పతాకాలను పట్టుకుని ‘భారత్ మాతాకీ జై.. మేరా భారత్ మహాన్..’అంటూ నినాదాలు చేశారు. -
నిఘా..
● మెడికల్ మాఫియానామ‘మాత్ర’మే! ● ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ ● ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందుల విక్రయం ● రికార్డుల నిర్వహణకు తిలోదకాలు ● మొద్దు నిద్రలో ఔషధ నియంత్రణ శాఖ ● విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు మహారాణిపేట: నగరంలో ఔషధ విక్రయాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. కాలం చెల్లిన మందులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేని మత్తు ఇంజెక్షన్లు, దగ్గు మందుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫార్మసిస్టులు లేకుండా, కనీస వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔషధ విక్రయాలపై సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడటం రోగులకు శాపంగా మారింది. అనేక మందుల షాపులు ప్రాథమిక నిబంధనలను కూడా పాటించకుండా నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 పైగా మెడికల్ షాపులు ఉండగా.. ఇందులో సుమారు 3,000 రిటైల్ షాపులు కాగా, 1,500 ఏజెన్సీలు, హోల్సేల్ షాపులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కనీస పారదర్శకత లేకుండానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మందుల షాపులో ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో మందుల విక్రయాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అమ్మకపు బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాలు, ఇంజెక్షన్లు విక్రయించడం, సరైన రికార్డుల నిర్వహణ లేకపోవడం, కంప్యూటర్లు వాడకపోవడం వంటివి సర్వసాధారణంగా మారాయి. నొప్పి నివారణ మందులు, మత్తు కలిగించే ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైన అక్రమాలు ఇటీవల మందుల విక్రయాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) అధికారులతో కూడిన 40 మంది సభ్యుల నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 16 మందుల షాపులు, ఏజెన్సీలపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ సోదాల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. ఈ తనిఖీల్లో రెండు షాపుల్లో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్స్లో రూ.50 వేల విలువైన గడువు ముగిసిన మందులను, గాజువాకలోని శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్స్లో రూ.90 వేల విలువైన కాలం చెల్లిన మందులను అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన మందులను స్వాధీనం చేసుకుని షాపులను సీజ్ చేశారు. ఈ దాడులు మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను బహిర్గతం చేశాయి. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఔషధ నియంత్రణ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొక్కుబడి కేసులు ఈ అక్రమాలపై సంబంధిత ఔషధ నియంత్రణ శాఖ నిఘా పూర్తిగా కొరవడిందని ఆరోపణలున్నాయి. ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్ రావు, అభిప్రియ, కూన కల్యాణి, ఎన్.కల్యాణి వంటి అధికారులు ఉన్నప్పటికీ.. తనిఖీలు, సోదాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ, వార్షిక తనిఖీల లక్ష్యాలను చేరుకోవడానికే ఈ శాఖ పరిమితమైందన్న విమర్శలున్నాయి. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు ● పరీక్షలకు హాజరుకానున్న 39,992 మంది విద్యార్థులు విశాఖ విద్య: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులతో ఆర్ఐవో మురళీధర్ ఆదివారం సమీక్షించారు. ఆర్ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందున, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలన చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని 188 జూనియర్ కాలేజీల నుంచి 32,780 మంది ఫస్టియర్ విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం జిల్లాలో 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా సెకండ్ ఇయర్ పరీక్షలకు 7,212 మంది నమోదు చేసుకోగా, వీరి కోసం 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా జిల్లాను ఏడు జోన్లగా విభజించి, పరీక్షల పర్యవేక్షణకు తనిఖీ అధికారులను నియమించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర సామగ్రిని భద్రపరిచేందుకు 14 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు. రెండు పూటలా పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఫస్టియర్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల సాయంత్రం 5.30గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 6న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఆర్ఐవో మురళీధర్ తెలిపారు. -
సింహాచలం ఈవోగా సుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.. -
నీ తోడే.. నా కనుచూపుగా..
● దాతల దీవెనలు.. పెద్దల ఆశీస్సులతోఒక్కటైన అంధ జంట ● అతిథుల రాకతో కళకళలాడిన ప్రేమ సమాజం డాబాగార్డెన్స్: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది. డాబాగార్డెన్స్లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు. అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అండగా నిలిచిన దాతలు ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి ఈ వేడుకలో అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు. -
జూలో సన్దడే సందడి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కు ఆదివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, అందులోనూ ఆదివారం కావడంతో సందర్శకులు పోటెత్తారు. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ సమయం జూ లోపల చెట్ల కిందే గడిపారు. చిన్నారులు చెట్ల నీడలో గంటల తరబడి ఆటలాడుతూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టాక జూలో వన్యప్రాణులను తిలకించారు. వాటికి ఫొటోలు తీస్తూ, ఎన్క్లోజర్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులు, పులులు, కోతులు, జిరాఫీ, జీబ్రాలు, జింకలతో పాటు నెమళ్లు, ఆఫ్రికన్ చిలుకలు, ఆస్ట్రిచ్లు, ఈములు వాటి ఎన్క్లోజర్లలో ఉదయం, సాయంత్రం సమయంలో హుషారుగా తిరుగుతూ జూకు వచ్చిన పిల్లల్ని, పెద్దలను అలరించాయి. మొసళ్ల జోన్ కొలనులో నీరు వేడెక్కడంతో వాటిలో మొసళ్లు సాయంత్రం వరకు బయటకు రాకుండా అడుగు భాగంలోనే ఉండిపోయాయి. ఆదివారం 4,303 మంది సందర్శించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ 3.62 లక్షల ఆదాయం లభించిందన్నారు. పోటెత్తిన సందర్శకులు.. రూ.3.62 లక్షల ఆదాయం -
అండర్–11 చెస్ విజేతలు సౌర్యాజేష్, అఫ్షిన్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–11 చదరంగం జట్ల ఎంపిక పోటీల్లో సౌర్యాజేష్, అఫ్షిన్ విజేతలుగా, శశాంక్, కమలప్రియ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విశాఖ జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో గాజువాక లయన్స్క్లబ్లో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఓపెన్ కేటగిరీలో ఏడు రౌండ్లలో సాగిన పోరులో 97 మంది, బాలికల కేటగిరీ ఆరు రౌండ్లలో 40 మంది పోటీపడ్డారు. ఓపెన్లో ఫిడే రేటింగ్ ఉన్న 9 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారు. ఓపెన్లో ఆరున్నర పాయింట్లతో ఎ.సౌరాజేష్(1422) విజేతగా, ఆరు పాయింట్లతో కె.శశాంక్(అన్రేటెడ్) ద్వితీయస్థానంలో నిలిచారు. బాలికల్లో ఐదున్నర పాయింట్లతో సమఉజ్జీగా నిలిచిన ప్రోగ్రసివ్తో ఎండీ అఫ్షిన్(1480) విజేతగా, బి.కమలప్రియ(1499) ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ఓపెన్, బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు జిల్లా జట్టుగా ఎంపికయ్యారు. -
నవాచర్ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
అల్లిపురం: ఒడిశాలోని బెర్హంపూర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–టెక్నాలజీ(ఎన్ఐఎస్టీ) విశ్వవిద్యాలయంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం(ఎఫ్డీపీ)ను బీఎస్ఎన్ఎల్ విశాఖ ట్రైనింగ్ పాయింట్ నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 14న జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ఆదివారం బెర్హంపూర్లో పరిశోధన–ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎం.సత్యప్రసాద్ ఇది బీఎస్ఎన్ఎల్ స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. నిస్ట్ విద్యార్థులు క్యాంపస్లో ఆచరణాత్మక ప్రయోగాలు, కొత్త ఆలోచనలతో స్టార్టప్లను స్థాపించడానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం పలు అంశాలపై సదస్సులు నిర్వహించారు. -
రాజకీయ ప్రయోజనాలే బీజేపీ లక్ష్యం
● వామపక్ష పార్టీల మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించ లేదు ● సీపీఐ జిల్లా మహా సభల్లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్లమురళీనగర్: రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. విశాఖలోని మురళీనగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి, తమ వైపు తిప్పుకొని బీజేపీ అధికారంలోకి వస్తోందని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వీటిలో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. 2019లో రెండోసారి అనేక కుయుక్తులతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మూడో సారి 420 సీట్లు సొంతంగా గెలుస్తామని చెప్పి, నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు తెచ్చుకోలేకపోయిందన్నారు. యూపీఏ –1 ప్రభుత్వానికి వామపక్షాలు బయట నుంచి మద్దతిచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపేందుకు కృషి చేసిందని, వామపక్షాల వల్లే ఉపాధి హామీ వంటి పలు చట్టాలు వచ్చాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను రూపొందించుకుని ప్రజలతో మమేకమవడానికి పార్టీ కృషి చేయాలన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పల్లెటి పోలయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కె.వనజాక్షి, కె.సత్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన మహాసభలో పార్టీ సీనియర్ నాయకులు మానం ఆంజనేయులు, పి.దుర్గాభవాని, జేవీ సత్యనారాయణమూర్తి, ఏజే స్టాలిన్, డి.ఆదినారాయణ, సీహెచ్ రాఘవేంద్రరావు, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 162 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గోపాలపట్నం: భార్యకు కడుపులో నొప్పిగా ఉందని మాత్రలు తీసుకొచ్చేందుకు గోపాలపట్నం వచ్చిన అక్కిరెడ్డి బాబూరావు(52)ను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖారవేలనగర్కు చెందిన అక్కిరెడ్డి బాబూరావు ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం భార్యకు కడుపులో నొప్పిగా ఉందని గోపాలపట్నంలోని మందుల దుకాణానికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతుని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పెద్ద కొడుకు జగదీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేపట్టారు. ారీ ఆచూకీ లభ్యమైనట్లు తెలిసింది. ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టిని తరలించేందుకు వచ్చింది. లారీ డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..
● ఒడిశాలోని తమ స్వగృహంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సింహాచల క్షేత్రంలో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలన్నీ ఆచరిస్తుంటారు. ● సింహాచలం క్షేత్రంలో లక్ష్మీకాంత్నాయక్దాస్ ఉన్న మూడు నెలల్లో స్వామికి ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఏటా నృసింహ హోమాన్ని నిర్వహిస్తుంటారు. ● దాసుడి దగ్గర తమకున్న మానసిక, ఆరోగ్య రుగ్మతలు చెప్పుకుంటే అవి కచ్చితంగా నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. దానికనుగుణంగానే సింహగిరిపై ఉన్న దాస సదనంలో తమను ఆశ్రయించేవారికి దాసుడు వైద్య సేవలందిస్తారు. ● స్వామికి అంతరాలయంలో ప్రతి రోజు పూజ అనంతరం దాసుడు భక్తులకు తులసి ప్రసాదాన్ని, గంగమ్మతల్లి సన్నిధిలో దీపం వెలగించిన నూనెను ఇస్తారు. ఆ తులసి ప్రసాదం తిన్నా, నూనెను శరీరానికి, తలకు పట్టించుకున్నా రోగాలు నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. ● 2008లో సింహగిరి దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా దాస సత్రాన్ని దేవస్థానం తొలగించింది. ప్రత్యామ్నాయంగా జఠల్సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇవ్వడంతో అక్కడే లక్ష్మీకాంత్నాయక్దాస్ సత్రాన్ని నిర్మించారు. ఆ సత్రంలోనే ఈ మూడు మాసాలు ఆయన బస చేస్తారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు(25) అనే యువకుడు మనస్తాపంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉన్న మృతుడికి ఆ కారణంతోనే వివాహం కాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా పని చేస్తున్న తాతారావు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1.30 సమయంలో సమీపంలోని అమ్మమ్మ వారి ఇంటి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి అమ్మానాన్న అప్పలకొండ, నారాయణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
3
అప్పన్న సేవలోశతాబ్దాలుగా.. ఒడిశా దాసులు● తరతరాల కుటుంబ సంప్రదాయం.. ఒడిశా దాసుల సొంతం ● ప్రస్తుతం స్వామి సేవలో 4వ తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ పది.. ఇరవయ్యేళ్లు కాదు.. ఏకంగా 300 ఏళ్లకు పైనే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సేవలో ఆ కుటుంబం తరిస్తోంది. ఏటా మూడు మాసాలు సింహగిరిపైనే ఉంటూ.. స్వామిని పూజిస్తూ, ఆర్జిత సేవలు చేస్తూ.. భక్తులకు ఇతోధికంగా సాయపడుతోంది. వారే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుంటుంబం. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన నాలుగో తరం వారైన లక్ష్మీకాంత్నాయక్దాస్ అప్పన్నస్వామి సేవలో తరించేందుకు సింహాచలానికి చేరుకున్నారు. సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్నాయక్దాస్ ఏడేళ్ల వయసు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తులకు ఆశ్రయం.. దాస సత్రం రుషికేష్నాయక్దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్నాయక్దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. ●300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్నాయక్ దాస్ (రుషికేష్నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) -
రిజర్వాయర్ల నిర్వహణ అస్తవ్యస్తం
● కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత దిగజారిన పరిస్థితి ● తుప్పు పడుతున్న గేట్లు, విద్యుత్ బిల్లులకూ నిధుల కటకట ● జీవీఎంసీ నుంచి నీటిపారుదల శాఖకు పేరుకుపోయిన బకాయిలు ● ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి మహారాణిపేట: విశాఖపట్నం, అనకాపల్లి ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కీలక జలాశయాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్లపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉమ్మడి జిల్లాలోని మేహాద్రి గెడ్డ, రైవాడ, గంభీరం, తాటిపూడి వంటి నాలుగు కీలక రిజర్వాయర్లలో గేట్లు తుప్పుపట్టి పాడైపోయా యి. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్లోని ఆరు గేట్లలో రెండు పూర్తిగా పని చేయడం లేదు. ప్రభుత్వం కనీసం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కూడా నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దీనికి తోడు ఈ జలాశయాల నుంచి నీటిని వినియోగించుకుంటున్న జీవీఎంసీ.. నీటి పారుదల శాఖకు రూ.210 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిల వసూలు కోసం నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ స్వర్ణకుమార్ పలుమార్లు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. తాజాగా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా పట్టణ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని, తమ వద్ద నిధులు లేవని జీవీఎంసీ అధికారులు నీటిపారుదల శాఖకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.210 కోట్ల మేర బకాయిలు విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో రైవాడ, మేహాద్రి గెడ్డ, గంభీరం, తాటిపూడి జలాశయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా రైవాడ రిజర్వాయర్ ద్వారా తాగునీటితో పాటు ఆయకట్టు రైతులకూ నీరు అందుతోంది. 114.00 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ నుంచి జీవీఎంసీకి రోజుకు 50 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారు. ఇలా 1985 నుంచి ఏటా 1.6 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు గాను ఏటా రూ.5.42 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. జీవీఎంసీ అరకొరగా మాత్రమే చెల్లింపులు చేస్తోంది. 1997 మే నుంచి బకాయిలు పేరుకుపోయి, మొత్తం రూ.156 కోట్లకు చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. ఈ రిజర్వాయర్ పరిధిలో 12 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి జీతాలు, విద్యుత్ చార్జీలు, నిర్వహణ, జనరేటర్ ఖర్చులను కూడా నీటి పారుదల శాఖే భరిస్తోంది. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ నగర పరిధిలోని ఈ జలాశయాన్ని పూర్తిగా జీవీఎంసీ తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. 169 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లోని ఆరు గేట్లు మరమ్మతులకు గురి కాగా.. రెండు గేట్లు పూర్తిగా పని చేయడం లేదు. ఏటా రూ.1.60 కోట్లు నీటిపారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది. గంభీరం రిజర్వాయర్ 125 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం కూడా జీవీఎంసీ తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతోంది. జీవీఎంసీ రూ.4.3632 కోట్లను నీటి పారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది. తాటిపూడి రిజర్వాయర్ 297 అడుగుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. నీటి పారుదల శాఖకు రూ.74 లక్షలు బకాయిలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా బకాయిల వివరాలు(రూ.కోట్లలో) -
విశాఖలో మాయా లోకం
● మధురవాడలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు వీఎంఆర్డీఏ ప్రణాళికలు ● రూ.460 కోట్లతో ఈస్ట్కోస్ట్ హేబిటేట్ సెంటర్ ● 2.82 ఎకరాల్లో వర్చువల్ రియాల్టీ ఎరీనా,త్రీ స్టార్ హోటల్ ● పీపీపీ విధానంలో చేపట్టేందుకు కసరత్తు ● ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ దరఖాస్తుల ఆహ్వానం రూ.470 కోట్లతో హేబిటేట్ సెంటర్ విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి ‘వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా.. పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్ హేబిటేట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్ఎఫ్పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి. –కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్2.82 ఎకరాల్లో వర్చువల్ ఎరీనా ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్’ను నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఐటీ స్పేస్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, ఆడిటోరియం, సెమినార్ హాల్, పార్టీ ఈవెంట్స్ లాన్లతో పాటు ట్రేడ్ ఫెయిర్లు, ఆర్ట్, కల్చర్ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్ హౌస్, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్ యాంఫీ థియేటర్, 400 మంది పట్టేలా కేఫ్టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డ్రైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్, 250 మందికి సరిపడా ఈవెంట్ లాన్్, సూపర్ మార్కెట్, మెడికల్, స్పోర్ట్స్ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. విశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. గేమింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్ టైమ్ ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్ రెస్టారెంట్ అవుట్లెట్లు, 10 శాతం కమర్షియల్ అవుట్లెట్లతో పాటు 100 రూమ్లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్ హాల్తో త్రీ స్టార్ హోటల్ను నిర్మించనున్నారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయులు, ఎ.జె.స్టాలిన్, సిహెచ్ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, నాయుడు, నాగభూషణం పాల్గొన్నారు. అమరావతి తప్ప వారికి మరొకటి కనిపించడం లేదు సీపీఐ సహాయ కార్యదర్శుల విమర్శ -
ప్రేమ సమాజానికి పెళ్లి కళ
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజానికి పెళ్లి కళ వచ్చేసింది. విద్యుత్ వెలుగులు.. పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న అంధురాలు శివజ్యోతికి అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన రాఘవేంద్రతో ఆదివారం పెళ్లి జరగనుంది. అతడు కోయంబత్తూర్లో పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి తంతులో భాగంగా శనివారం పెండ్లి రాట వేసి శివజ్యోతిని పెండ్లి కుమార్తెను చేశారు. ఆదివారం రాత్రి 7.05 గంటలకు వీరిద్దరికి వివాహం జరగనుంది. అందుకు ప్రేమ సమాజం కమిటీ అన్నీ తానై వ్యవహరిస్తోంది. పెండ్లి కుమార్తె శివజ్యోతికి బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి మెట్టెలు, పసుపు, కుంకుమ, స్వీట్స్తో పాటు మరికొన్ని చీరలు, పెండ్లి కుమారుడు రాఘవేంద్రకు పట్టు వస్త్రాలను నగర సీపీ శంఖబ్రాత బాగ్చి చేతుల మీదుగా కార్పొరేటర్ కందుల నాగరాజు, నళినిదేవి దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహనరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఎండల్లో హాయ్ హాయ్
అల్లిపురం: ఎండల్లో హాయ్.. హాయ్ అంటూ నగర ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి విధులు నిర్వహించనున్నారు. మొన్న కూలింగ్ జాకెట్లు, నేడు ఏసీ హెల్మెట్లతో నగర రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దర్శనమివ్వనున్నారు. మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కొంత ఉపశమనం కలిగే విధంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శఽంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కోసం ఏసీ హెల్మెట్లను నోయిడాలోని కరమ్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దాతల సహాయంతో కొనుగోలు చేశారు. శనివారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో రూ.6 లక్షలు విలువ గల 30 ఏసీ హెల్మెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది వీటిని తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు తగ్గుతుందన్నారు. హెల్మెట్ బరువు 740 గ్రాములు ఉంటుందన్నారు. 4 గంటల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందన్నారు. బ్యాటరీ 10 సంవత్సరాలు వారంటీ ఉందన్నారు. అలాగే ఇప్పటి వరకు 220 కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. కోరమాండల్ సిమెంట్స్, వైశ్యరాజ్ జ్యుయలర్స్, లడ్డు గోపాల్, మీరా కలెక్షన్స్ సహకారంతో మరో 40 కూల్ జాకెట్లను గుర్గావ్ నుంచి రప్పించి ట్రాఫిక్ సిబ్బందికి అందజేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ల పంపిణీ మండుటెండల నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడి -
విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత
గోపాలపట్నం: దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో భద్రతను పటిష్టం చేశారు. శనివారం విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి వాహనాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు పలు ప్రాంతాల్లో నిఘా ఉంచి పహారా కాశారు. టెర్మినల్ భవనంలో కూడా విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులతో పాటు దుస్తులను స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల నేపథ్యంలో ప్రయాణికులు కనీసం మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. హై అలర్ట్ కారణంగా విమానాశ్రయం లోపలికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. సందర్శకుల టిక్కెట్ల అమ్మకాలను కూడా నిలిపివేశారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తాటిచెట్లపాలెం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు భరోసా కల్పించారు. పార్టీ బలోపేతానికి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ అందుబాటులో ఉంటానని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలెవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానన్నారు. వార్డుల్లో ప్రజా సమస్యలపై సమన్వయంతో కలిసి పోరాడాలని.. అధికారులు స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. -
సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా సుజాత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా దేవదాయశాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ సెక్రటరీ వి.వినయ్చంద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఇప్పటివరకు ఇన్చార్జి ఈవోగా పనిచేసిన కె.సుబ్బారావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలావుండగా దేవస్థానం పర్మినెంట్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లేందుకు ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 30 వరకు సెలవు పెట్టారు. దీంతో రెవెన్యూ నుంచి డిప్యుటేషన్పై దేవదాయశాఖ రాజమహేంద్రవరం జోన్–1 ఆర్జేసీగా పనిచేస్తున్న కె.సుబ్బారావుకు 92 రోజులపాటు ఇన్చార్జి ఈవోగా పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన మార్చి ఒకటో తేదీన ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించగా.. ఈనెలాఖరుకు పదవీకాలం పూర్తవుతుంది. గత నెల 30న చందనోత్సవం రోజు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నెలాఖరుతో దేవస్థానం పర్మినెంట్ ఈవో వి.త్రినాథరావు 92 రోజుల సెలవు కూడా పూర్తవుతుంది. ఆయన తిరిగి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా అన్న చర్చ దేవస్థానంలో నడుస్తోంది. -
అతను.. మాజీ సైనికుడు
● అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన పోలీసులు ●● మానసిక సమస్యతోబాధపడుతున్నట్లుగా నిర్ధారణ విశాఖ సిటీ/మధురవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్కు తెరపడింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫొటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సీపీ శంఖబ్రత బాగ్చి అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి కార్షెడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. అతన్ని స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేయగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్కుమార్గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోన్లో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన, చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకు ఇచ్చి పంపించారు. -
14వ పోప్గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్: రోమన్ క్యాథలిక్ మిషన్కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిల్లో వారం రోజుల పాటు దేవునికి కృతజ్ఞత బలిపూజలు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫాదర్స్ దుగ్గంపూడి బాలశౌరీ, జాన్ ప్రకాష్, కె.జయరాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ బజార్ పై నుంచి పడి యువకుడి మృతి
అల్లిపురం: టర్నల్ చౌల్ట్రీ దరి సూపర్ బజార్ మేడ పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సాలిపేటకు చెందిన రాజేష్ అనే వ్యక్తి సూపర్ బజారు మేడపై ఇండియన్ జిమ్ నిర్వహిస్తున్నాడు. భూపేష్నగర్ ప్రాంతానికి చెందిన రాజు (20) రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జిమ్కు సంబంధించిన బ్యానర్ను కట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో లైటింగ్ రాడ్డును పట్టుకోగా.. అది విరిగిపోవడంతో రెండో అంతస్తు పైనుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం కాగా కేజీహెచ్కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ ఎర్రంనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మోదకొండమ్మ జాతరకు 20 బస్సులు
మద్దిలపాలెం: పాడేరులో జరిగే శ్రీ మోదకొండమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం విశాఖ నుంచి 20 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రజా రవాణా శాఖ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, పాడేరు నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మద్దిలపాలెంలోని విశాఖ ఆర్టీసీ డిపోను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల గురుతర బాధ్యత అని స్పష్టం చేశారు. బస్సులను మంచి కండిషన్లో ఉంచాల్సిన బాధ్యత గ్యారేజ్ సిబ్బందిపై ఉందన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు సేవలు అందించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, నీరు, ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిన విజయ నాయుడు, జి.బి.రావు, ఎం.ఎం.రావులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ కె.గంగాధర్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) కె.రామకృష్ణ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పెళ్లిలో ప్రతీకారం!
తాళ్లతో బంధించి ఒకరిని హింసించిన బంధువులు తగరపువలస: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తాతారావును ఆసుపత్రికి తరలించారు. వివరాలివి. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువ తితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్ల తో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు. -
గీతం ఆసుపత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు
కొమ్మాది: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(జిమ్సర్)కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రో వైస్ చాన్సలర్ డా.బి.గీతాంజలి శనివారం ఈ వివరాలు వెల్లడించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి నిర్వ హణ, సామాన్యులకు సైతం వైద్య సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ఏబీహెచ్ ఈ సర్టిఫికెట్ను మంజూరు చేసిందని ఆమె వివరించారు. జిమ్సర్ అక్రిడిటేషన్ కో–ఆర్డినేటర్ డా. కృష్ణకాంత్ బోగవల్లి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.వి.నరసింహారావు పాల్గొన్నారు. -
నోరూరగాయ..
● ఆంధ్రులకు ఆవకాయతో అనుబంధం ● వేసవి కాలంలోఇంటింటా సందడే సందడి ● కానీ అదంతా ఒకప్పటి మాట ● మారిన అభిరుచులతో తగ్గిన ఆదరణ ● పెరిగిన ధరలతో తయారీ భారమే.. నక్కపల్లి: ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురంఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది. -
విశ్వదాత పురస్కారం అందుకున్న గంట్ల
విశాఖ సిటీ: విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు జాతీయ స్థాయి విశ్వదాత పురస్కారం అందుకున్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, ఎమ్మెల్యే వర్లకుమార్రాజా చేతుల మీదుగా గంట్లకు పురస్కారాన్ని అందజేశారు. వేద మంత్రాల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అవార్డును పొందడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయీ అవార్డుల కంటే కాశీనాథుని పురస్కారం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. -
ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు. -
వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
కొమ్మాది: రుషికొండ బీచ్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శుక్రవారం వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శాప్ చైర్మన్ రవినాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విశాఖను వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి వేదికగా మారుస్తామన్నారు. ఇందుకోసం అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ దళాలకు మద్దతుగా నిలుద్దాం
వ్యక్తిగత విభజనలు, ప్రయోజనాలకు అతీతంగా మన సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలి. దేశంలోని పౌరులు, ప్రధానంగా యువత కీలక భూమిక పోషించాల్సిన తరుణమిది. ప్రభుత్వం, పరిపాలన అధికారులు జారీ చేసే అన్ని ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. సామాజిక సామరస్యాన్ని, జాతీయ ఐక్యతను దెబ్బతీసే కుట్రను ఓడించడంలో చురుకై న పాత్ర పోషించాలి. ఈ సవాలు సమయంలో మనమందరం దేశ భద్రత, సమగ్రత, గౌరవానికి మద్దతుగా ఐక్యంగా నిలబడదాం. – డాక్టర్ ఎన్.ఎం.యుగంధర్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్, ఆంధ్ర యూనివర్సిటీ -
నేను పీకే తాలుకా..తలచుకుంటే లేపేస్తా...!
● ఓ వైద్యుడిపై పవన్ కల్యాణ్ అభిమాని వీరంగం ● ప్రశ్నించినందుకు దౌర్జన్యండాబాగార్డెన్స్ : నేను పవన్ కల్యాణ్ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్ హార్బర్ వద్ద హోమియో క్లినిక్ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చాను. ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్ కల్యాణ్ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నిస్తున్నావ్? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్ రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పీడ్ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు.. ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. -
అడ్డొచ్చింది.. కూల్చేశాం
● పెచ్చుమీరుతున్న కూటమి నేతల ఆగడాలు ● మంచినీటి ట్యాంక్ కూల్చివేతపెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మండలంలోని గొరపల్లిలో పాత మంచినీటి పథకం ట్యాంక్ను జనసేన, టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారు. తమ సొంత అవసరాలకు ఈ ట్యాంక్ అడ్డు వస్తుందన్న కారణంతో, పంచాయతీ, మండల పరిషత్ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యకాండకు దిగారు. సొంత నిధులతో జేసీబీని సమకూర్చి ట్యాంక్ను కూలగొట్టారు. అర్ధరాత్రి వరకు ఆ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదెక్కడి దౌర్జన్యం? సాధారణంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఏ పాత భవనం, మంచినీటి పథకం, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను కూలగొట్టాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీ తీర్మానం తప్పనిసరి. అదే సమయంలో మండల పరిషత్ అనుమతి కూడా ఉండాలి. కానీ, ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం జెర్రిపోతులపాలెంలో కల్యాణ మండపం నిర్మించడానికి ఏకంగా అంగన్వాడీ కేంద్రం భవనాన్నే కూల్చేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించారు. తాజాగా గొరపల్లిలో స్థానిక జనసేన, టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి మరీ మంచినీటి పథకం ట్యాంక్ను కూల్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇన్ఛార్జ్ ఎంపీడీవో కొల్లి వెంకట్రావును వివరణ కోరగా, గొరపల్లిలో మంచినీటి పథకం ట్యాంక్ కూల్చివేతకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పంచాయతీ నుంచి సదరు ట్యాంక్ కూల్చివేతకు ప్రతిపాదన లేదని సర్పంచ్ గొరపల్లి శ్రీను తెలిపారు. -
హెచ్ఎస్ఎల్కు ప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్ఎస్ఎల్కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు. -
యుద్ధకాలపు అనుభవాలు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపై జపాన్ దాడి తప్పదని ముందుగానే ఊహించారు. 1942 జనవరిలో బర్మా, ఫిబ్రవరిలో సింగపూర్లను జపాన్ ఆక్రమించడంతో, వారి తదుపరి లక్ష్యం భారతదేశ తూర్పు తీరంలోని కీలక నగరమైన విశాఖపట్నం అని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని యూరోపియన్లు రైళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం అంతటా బంకర్లు నిర్మించారు. వీటిలో కొన్ని ఆర్కే బీచ్ పరిసరాలు, దసపల్లా హిల్స్ ప్రాంతాల్లో ఇప్పటికీ చూడవచ్చు. ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంపద(ఇన్టాక్) సంస్థకు చెందిన ఎడ్వర్డ్ పాల్ ‘సాక్షి’కి వివరించారు. ‘దాడిని ఎదుర్కొనేందుకు నగరంలో సరైన ఆయుధ సంపత్తి లేదు. జపాన్ సైన్యం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, పవర్ హౌస్లతో పాటు హార్బర్లోని నౌకలపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. దాడి జరుగుతున్న సమయంలో, నౌకల్లోని పాత తుపాకులతో ఎదురుదాడికి ప్రయత్నించినా.. జపాన్ విమానాలు వాటి పరిధిలో లేకపోవడంతో అవి నిష్ఫలమయ్యాయి. పోర్టు నగరంపై దాడి జరుగుతుందని తెలిసినప్పటికీ తగిన ఆయుధాలను మోహరించలేదని ఇది స్పష్టం చేస్తుంది. ఆనాటి దాడిలో మరణించిన వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని విశాఖపట్నం మ్యూజియంలో, అలాగే జారవిడిచిన ఒక పేలని బాంబును కూడా మ్యూజియంలో భద్రపరిచారు. ప్రజలు ఎడ్లబళ్లు, సైకిళ్లు, కాలినడకన నగరాన్ని విడిచి వెళ్లారు. అధికారులు మాత్రం తమ కుటుంబ సభ్యులను గ్రామాలకు పంపి.. విధుల్లో కొనసాగారు. ఆంధ్రా యూనివర్సిటీ భవనాలను ఖాళీ చేయించి బ్రిటిష్ సైన్యం వినియోగించుకుంది. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలకు తరలించారు.’ అని పాల్ వివరించారు. అయితే 1971 నాటి పాకిస్తాన్తో యుద్ధ సమయంలో విశాఖపట్నంపై పెద్దగా ప్రభావం పడలేదని పాల్ అన్నారు. 1942 నాటి ఘటనతో విశాఖపట్నంనకు రెండు ప్రయోజనాలు చేకూరాయని పేర్కొన్నారు. నగరానికి వచ్చిన సైనిక బలగాల నీటి అవసరాలను తీర్చడానికి ఆర్మీ ఇంజినీర్లు గోస్తనీ తాగునీటి పథకాన్ని నిర్మించారు. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే ఈ పథకాన్ని యుద్ధానంతరం మున్సిపాలిటీ వినియోగించుకుంది. అలాగే మేహాద్రి గెడ్డపై ఒక వంతెనను కూడా నిర్మించారని పాల్ ఆనాటి సంగతులను పంచుకున్నారు. -
హింసను తిప్పికొట్టాల్సిందే.
పాకిస్తాన్ అనాగరిక హింసను ప్రేరేపిస్తూనే ఉంటుంది. బలం లేకున్నా.. దొంగదారుల్లో మన సైన్యం నైతికతను దెబ్బతీయాలనే కుటిల ప్రయత్నాలు చేయడం వారికి అలవాటు. వారికి సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత సైన్యానికి మనమంతా మద్దతుగా నిలవాల్సిన తరుణమిది. పాకిస్తాన్ను దీటుగా ఎదుర్కొనే సత్తా మనకు ఉంది. త్రివిధ దళాల వ్యూహరచనలో పాకిస్తాన్ చిత్తుకావడం తథ్యం. – మేజర్ జయ ప్రకాష్, సుబేదార్, ఏయూ ఆర్మీ వింగ్ -
విశాఖ డెయిరీ పాల ధరల పెంపు
అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(500 మి.లీ) రూ.25 నుంచి రూ.26కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(లీ) రూ.50 నుంచి రూ.52కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు(లీ) రూ.54 నుంచి రూ.56కు, టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, స్టాండర్డైజ్డ్ పాలు(500 మి.లీ) రూ.30 నుంచి రూ.31కు, ఫుల్ క్రీమ్ పాలు (500 మి.లీ) రూ.32 నుంచి రూ.33కు, ఫుల్ క్రీమ్ పాలు (లీ) రూ.63 నుంచి రూ.66కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు–గంగ (500 మి.లీ) రూ.28 నుంచి రూ.29కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు–గంగ(500 మి.లీ) రూ.26 నుంచి రూ.27కు, టోన్డ్ పెరుగు (180 గ్రా.) రూ.14 నుంచి రూ.15కు, టోన్డ్ పెరుగు (కిలో) రూ.64 నుంచి రూ.66కు, డబుల్ టోన్డ్ పెరుగు (900గ్రా.) రూ.54 నుంచి రూ.56కు పెరిగినట్లు యాజమాన్యం తెలిపింది. -
నా జీవితంలో మరిచిపోలేని సంఘటనలివి..
నేను 1939లో జన్మించాను. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖను ఒక ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చేశారని మా అమ్మానాన్నలు చెప్పేవారు. 1942 ఏప్రిల్ 6న జపాన్ విశాఖ హార్బర్పై బాంబులతో దాడి చేసింది. ఈ విషయాన్ని నేను పెద్దయిన తర్వాత నాన్న చెప్పారు. ఈ దాడిలో పోర్టులో ఒక కాంక్రీట్ పైప్ కొద్దిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఆ సమయంలో అందరినీ భీమిలి తీర ప్రాంతంలోని తలారి, పొట్నూరు, దాకమర్రి ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. 1971 ఇండో–పాక్ యుద్ధం నాటికి నేను పెద్దవాడినే. నేను ఎక్కువ చదువుకోలేదు కానీ.. ఆర్మీలోకి వెళ్లాలని చాలా ఆశపడ్డాను. అయితే మా అమ్మానాన్నలు నన్ను వెళ్లనివ్వలేదు. నేను హార్బర్లో పనిచేసేవాడిని. ఆర్మీపై ఉన్న మక్కువతోనే హార్బర్లో పనిచేస్తూనే హోంగార్డ్స్కి సెక్షన్ కమాండర్గా సేవలందించాను. 1971లో పాకిస్తాన్కు చెందిన ఘాజీ జలాంతర్గామిని మన సైన్యం సముద్ర మట్టం చేసింది. ఆ సమయంలో నేను పాతనగరం సెయింట్ అలోసిస్ స్కూల్కు ఎదురుగా ఒక చిన్న గుడారంలో ఉండేవాడిని. పెద్ద ఎత్తున ప్రజలు విశాఖను వదిలి వెళ్లిపోయారు. మేము మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఆ గుడ్డి దీపం వెలుగులోనే ఉండిపోయాం. నాకు ఇప్పుడు 87 ఏళ్లు. నేను పుట్టింది.. పెరిగింది.. చదువుకుంది..ఉద్యోగం చేసింది.. సమాజ సేవ చేస్తున్నది అంతా విశాఖలోనే. నెహ్రూ, గాంధీ అంటే నాకు చాలా అభిమానం. ఈ రెండు సంఘటనలు విశాఖ చరిత్రలో.. నా జీవితంలో మర్చిపోలేనివి. – కదిరి అప్పారావు, మాజీ కార్పొరేటర్, మత్స్యకార సంఘం నాయకుడు -
ఉద్దేశపూర్వకంగానే కూటమి దాడులు
సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు ప్రవేశించి సోదాలు చేయడం హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఎంత మాత్రం సరికావు. ప్రభుత్వ తీరు అవమానకరంగా ఉంది. కూటమి సర్కారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దాడులు చేయడం తగదు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగిస్తే ఆందోళనను ఉధృతం చేస్తాం. – ఆర్.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఒక్కటవుతున్న అంధులు
ప్రేమ సమాజం ముంగిట పెళ్లి సందడి నెలకొంది. ప్రేమ సమాజం కంచర్ల అన్నపూర్ణాదేవి వేదికగా, ప్రేమ సమాజం ఆశ్రిత శివజ్యోతి, అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన ఎనుముల గంగన్న, నారాయణమ్మల కనిష్ట పుత్రుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రల వివాహానికి సర్వం సిద్ధమైంది. వేద మంత్రాలు, పచ్చని తోరణాలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ, దాతల దీవెనలతో ఈ వేడుక కన్నుల పండుగగా జరగనుంది. విందు భోజనాలతో ప్రేమ సమాజం కళకళలాడనుం డగా, పెద్దల ఆశీస్సులతో ఈ అంధుల జంట ఒక్కటి కానుంది. గత నెల 11న పెద్దలు ఈ పెళ్లి తంతుకు శ్రీకారం చుట్టారు. ఇరువురూ అంధులే కావడం విశేషం. చూపులేని యువకుడు, తనలాంటి తోడు కోసం ఎదురుచూసి, ఆ కలను నిజం చేసుకుంటున్న శుభ తరుణమిది. ఈ అరుదైన వివాహం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. వివరాల్లోకి వెళితే, జన్మతః అంధుడైన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం కోయింబత్తూర్ పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. రాఘవేంద్ర తల్లిదండ్రులది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురం. వ్యవసాయ నేపథ్యం కలిగిన వారి కుటుంబంలో రాఘవేంద్ర తనలాంటి కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు, రాఘవేంద్ర సోదరుడు రమణ కొందరు అందించిన సమాచారం ద్వారా విశాఖలోని ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించారు. దీంతో ఈ వివాహానికి మార్గం సుగమమైంది.ప్రేమసమాజమే తల్లిగా..మరోవైపు, శివజ్యోతి పుట్టుకతోనే కంటి చూపును, తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. నగరంలోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సిఫార్సుతో ఆమెకు ప్రేమ సమాజం ఆశ్రయం కల్పించింది. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, నగరంలోని విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. ఇరువురి అంగీకారంతో, ప్రేమ సమాజం వేదికగా గత నెలలో తాంబూలాలు మార్చుకున్నారు. ఈ నెల 11న వివాహ ముహూర్తం ఖరారైంది. ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ద శివాజీ, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో శివజ్యోతి తరపున పెద్దలుగా వ్యవహరిస్తున్నారు.రేపు పెళ్లి రాటప్రేమ సమాజం ప్రాంగణంలో శనివారం పెళ్లి రాట కార్యక్రమం జరగనుండగా, శివజ్యోతిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేయనున్నారు. మే 11న రాత్రి 7.05 గంటలకు స్వాతి నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రాఘవేంద్ర, శివజ్యోతిలు ఒక్కటి కానున్నారు. ఈ శుభ సందర్భానికి విచ్చేసిన అతిథులు, వధూవరుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రేమ సమాజం వేదికగా జరుగుతున్న ఈ అపురూపమైన వేడుక అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికా రంగంలో ఈ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతోనే కక్ష సాధిస్తోంది. పోలీసులతో జర్నలిస్టులను భయపెట్టే ధోరణిని విరమించుకోవాలి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వ తీరును జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలి. – పి.నారాయణ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు -
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా సూర్యప్రకాష్ బాధ్యతలు
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.వి.సూర్యప్రకాష్ గురువారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఏపీఎస్ఈబీ కేటీపీఎస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన ఆయన పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో 2021లో పదవీ విరమణ పొందారు. ఆయన తాజాగా ఈపీడీసీఎల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు 24/7 3–ఫేజ్ విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యప్రకాష్ను సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ అభినందించారు. -
నెత్తుటి ధారలు
విశాఖపై నాలుగు నెలల్లో తొమ్మిది హత్యలు వీరిలో ఏడుగురు మహిళలే.. సిటీ ఆఫ్ డెస్టినీ కాస్తా.. సిటీ ఆఫ్ క్రైమ్గా రూపాంతరం? కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువుఈ ఏడాదిలో వరుస ఘటనలు ● మే 2న దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు. ● ఏప్రిల్ 26న దువ్వాడ పోలీస్స్టేషన్ పరిధిలో రాజీవ్నగర్కు చెందిన దంపతులు యోగేంద్రబాబు(65) లక్ష్మి(52)లను డబ్బు కోసం హత్య చేసిన దుండగుడు. ● ఏప్రిల్ 14న మధురవాడలో నిండు గర్భిణి అనూషను హత్య చేసిన భర్త జ్ఞానేశ్వర్. 24 గంటల్లో డెలివరీ అవ్వాల్సి ఉండగా చంపడంతో ఆమె గర్భంలో ఉన్న ఆడ శిశువు కూడా కన్నుమూసింది. ● ఏప్రిల్ 2న కొమ్మాదిలోని వికలాంగుల కాలనీలో ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు. తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. ● ఫిబ్రవరి 21న పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు అప్పన్నను ఆమె భర్త చిన్నారావు బోయపాలెం–కాపులుప్పాడ మార్గంలో కల్లివానిపాలెం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. మరుసటి రోజు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ● జనవరి 1న మల్కాపురంలో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కుమారుడు. విశాఖ సిటీ: ఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త.. వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి డబ్బు, మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన హంతకుడు.. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు.. ఇలా వరుస హత్యలతో విశాఖలో రుధిర ధారలు పారుతున్నాయి. నగరంలో నెత్తుటి మరకలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇప్పుడు సిటీ ఆఫ్ క్రైమ్గా మారిపోయింది. ఇందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న హత్యలే నిదర్శనం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 9 హత్యలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఏడుగురు మహిళలే బలవడం బాధాకరం. ప్రేమ.. పెళ్లి.. వివాహేతర సంబంధం.. డబ్బు.. ఇలా కారణమేదైనా అవి హత్యలకు దారితీస్తున్నాయి. ప్రశాంత విశాఖను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మహిళలకు రక్షణ కరువు ‘మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఆడ పిల్లల రక్షణపై వెనకడుగు వేసేది లేదు. మహిళల భద్రత తమ తొలి ప్రాధాన్యత’ అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ ప్రచార ఆర్బాటాలకే తప్ప, మహిళలపై అకృత్యాలను అడ్డుకోలేకపోతున్నారు. విశాఖలో పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. అకృత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో ఏడుగురు మహిళలే హత్యకు గురవడం కూటమి ప్రభుత్వంలో పరిస్థితికి అద్దం పడుతోంది. బాలికలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నగరంలో వరుస హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప.. వాటిని అరికట్టే చర్యలకు ఉపక్రమించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న భావన కలుగుతోంది.వరుస హత్యలతో కలవరం విశాఖకు ప్రశాంత నగరంగా పేరుంది. దేశంలో ఎక్కడ ఉద్యోగం, వ్యాపారం చేసినా.. చివరకు విశాఖలో స్థిరపడాలని కోరుకుంటారు. అలాంటి నగరంలో వరుస హత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఘటనలతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెదగదిలిలో ఐదు నెలల కుమార్తెను కన్న తల్లే హత్య చేసింది. అలాగే పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలిని.. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని.. పూజల పేరుతో వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడిని.. వివాహేతర సంబంధాన్ని వదిలించుకోవాలని ప్రియురాలిని.. ఇలా అనేక కారణాలతో విశాఖలో హత్యలు చోటుచేసుకున్నాయి. -
కమనీయం వెంకన్న కల్యాణం
గోవిందనామస్మరణతో మార్మోగిన బల్లిగిరిఅల్లిపురం: వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా బల్లిగిరిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణో త్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. పెళ్లి కుమార్తెలుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవిల నడుమ ముగ్ధ మనోహర రూపంలో వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకను తిలకించిన భక్తులు గోవిందనామ స్మరణతో పులకించిపోయారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ఉదయం అంకురార్పణ, గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయ డం, విశేష హోమాలు ఆలయ అర్చకుడు గొడవర్తి రఘునాథాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి తిరువీధి ఉత్సవం కన్నుల విందుగా సాగింది. దేవదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారిణి జీవీ రమాబాయి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు గొడవర్తి రఘునాథశర్మ పర్యవేక్షణలో ఆగమ పండితులు స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అధిక సంఖ్యలో జంటలు ఈ కళ్యాణోత్స వంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం దేవస్థానం వారు కల్యాణ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనాలు, గౌరవ సత్కారాలు అందజేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
చర్లపల్లి–బ్రహ్మపూర్ స్పెషల్స్ పొడిగింపు
తాటిచెట్లపాలెం : ప్రయాణికుల సౌకర్యార్ధం చర్లపల్లి–బ్రహ్మపూర్–చర్లపల్లి స్పెషల్ రైలు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. చర్లపల్లి –బ్రహ్మపూర్ (07027) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 9, 16, 23, 30 జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో (శుక్రవారం) రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు(శనివారం) ఉదయం 9.25 గంటలకు దువ్వాడకు, అదేరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపూర్–చర్లపల్లి (07028) స్పెషల్ ఈ నెల 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో (శనివారం) సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.43 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు (ఆదివారం) ఉదయం 11.35 గంలకు చర్లపల్లి చేరుకుంటుంది. -
రక్తదానం చేసి స్ఫూర్తి నింపిన కలెక్టర్
మహారాణిపేట: జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కలెక్టరేట్ పరిధిలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో, జిల్లా పరిషత్ కూడలిలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ రక్తదానం ఆవశ్యకతను తెలుపుతూ పిలుపునివ్వడంతో, జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కలెక్టరేట్ శిబిరంలో 143 మంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఆరుగురు మొత్తం 149 మంది దాతలు రక్తదానం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్తో కలిసి రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఆది లీల ఫౌండేషన్, కలెక్టరేట్ అధికారులతో కలిసి కలెక్టర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రవికుమార్, పీఆర్వో రావు, ఆది లీల ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ రాజు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, వైద్యాధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు. -
వాడపల్లికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్ : తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం 4 గంటలకు ద్వారకా బస్స్టేషన్ నుంచి బయలుదేరి వాడపల్లి చేరుకుంటుందని, భక్తుల ప్రదక్షిణలు, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు వాడపల్లిలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణ చార్జీ(ఒక్కొక్కరికి) సూపర్ లగ్జరీ రూ.1000గా నిర్ణయించామని, టికెట్లు కావల్సిన వారు https://www.apsrtconline.in లో రిజర్వ్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
గళమెత్తిన కలం
● సాక్షి ఎడిటర్ ఇంట్లో దాడులపై జర్నలిస్టు సంఘాల నిరసన ● కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ప్రదర్శన ● కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన జర్నలిస్టు నేతలు మహారాణిపేట : ఎలాంటి అనుమతులు, సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు చేయడంపై పలు జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తెస్తుండడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు జర్నలిస్టు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతి పత్రం సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేయడాన్ని నిరసిస్తూ పలు జర్నలిస్టు సంఘాల నేతలు గురువారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకుడు ఆర్.రామచంద్రరావు తదితరులు ఉన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన జర్నలిస్టు సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాక్షి విశాఖ బ్యూరో ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ రోజును పత్రికా రంగంలో బ్లాక్ డేగా పరిగణిస్తున్నామన్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్చార్జి బి.బి.సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు సరికావని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ పక్కి వేణుగోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని పేర్కొన్నారు. విశాఖ ఎడిషన్ ఇన్చార్జి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్నేహితుడి ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్టు
పెదగంట్యాడ: మండలంలోని దయాల్నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీ చేసిన నిందితుడు కాంబలి దిలీప్ను న్యూపోర్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హార్బర్ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు గురువారం న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాల్నగర్కు చెందిన బేర రాజు ఈ నెల 4న తన కుటుంబంతో కలిసి స్వగ్రామమైన పాడేరు మండలం సలుగు వెళ్లారు. రాజు కుటుంబం ఊరిలో లేని విషయాన్ని అతని స్నేహితుడైన కంచరపాలెం బర్మా క్యాంప్కు చెందిన దిలీప్ తెలుసుకున్నాడు. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో రాజు ఇంటికి చొరబడి, బీరువాలో ఉంచిన బంగారు పుస్తెలతాడు, రెండు చెయిన్లు, ఒక గొలుసు, ఒక బ్రేస్లెట్, ఒక చిన్న ఉంగరం, ఒక లాకెట్తో పాటు రూ. 20 వేల నగదును దొంగిలించాడు. ఈ నెల 6న తిరిగి వచ్చిన రాజు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం డీసీపీ పర్యవేక్షణలో క్రైం సీఐ జి. శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని సర్వీస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ లక్ష్మణరావు మాట్లాడుతూ, నిందితుడు చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, జల్సాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. నిందితుడిపై గతంలో అనకాపల్లి జిల్లా చీడికాడ, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లలో కూడా చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అప్పలరాజు చెప్పారు. -
వయసు పైబడినా తరగని విద్యా తృష్ణ
● సంస్కృతంలో సత్తా చాటిన వైద్యుడు ● 71 ఏళ్ల వయసులో విద్యార్జనపై దృష్టిమహారాణిపేట: రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ బి. జ్ఞానానంద (71) తన పట్టుదలతో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే చదువుపై ఆసక్తి పెంచుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సంస్కృత భారతి రెండేళ్ల కోర్సు ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన బందరు మోహనాంగరావు కుమారుడైన డాక్టర్ జ్ఞానానంద విశాఖలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసి, ఎన్ఏడీ, గాజువాక ప్రాంతాల్లో హోమియో వైద్య నిపుణుడిగా ప్రాక్టీస్ చేశారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా, విశాఖలోని హోమియో వైద్య విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్ఞానానంద మాట్లాడుతూ, చదువుకు వయసుతో సంబంధం లేదని, ఆసక్తి ఉంటే పరీక్షల్లో విజయం సాధించడం సులభమేనని అన్నారు. ప్రస్తుతం విజయనగరం, హైదరాబాద్, కవిటిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. -
ఓషన్ వ్యూ.. ఓ జ్ఞాపకం
భీమునిపట్నం: భీమిలిలో ఓషన్ వ్యూ బంగ్లాగా పేరుగాంచిన చారిత్రాత్మక భవనం నేలమట్టం కావడంతో, ఈ అరుదైన కట్టడాన్ని చూసే అవకాశం ఎవరికీ లేదు. బ్రిటిష్ పాలనలో భీమిలి కొండవాలు ప్రాంతంలో రోడ్డు పక్కన ఇంపీరియల్ బ్యాంకుగా ఇది నిర్మితమైంది. అప్పట్లో ఇక్కడ పోర్టు ఉండడం వల్ల వాణిజ్య లావాదేవీల కోసం ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు. అందుకే ఈ ప్రాంతానికి బ్యాంక్ రోడ్డు అనే పేరు వచ్చింది. స్వాతంత్య్రం అనంతరం, చిట్టివలస జూట్మిల్లు యాజమాన్యం ఈ భవనాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి విశాలమైన బంగ్లాగా మార్చింది. ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో ఇక్కడి నుంచి సముద్ర దృశ్యం అద్భుతంగా కనిపించేది. దీంతో ఈ బంగ్లాకు ‘ఓషన్ వ్యూ బంగ్లా’ అనే పేరు స్థిరపడింది. ఇది జూట్మిల్లు గెస్ట్హౌస్గా ఉపయోగపడేది. జూట్మిల్లు యజమానులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖులు భీమిలి వచ్చినప్పుడు ఇక్కడే బస చేసేవారు. జూట్మిల్లు మూతపడటంతో ఈ బంగ్లా కూడా గత 15 ఏళ్లుగా మూతబడి ఉంది. అయినప్పటికీ ప్రత్యేకమైన నిర్మాణ శైలి కారణంగా చాలా మంది దానిని చూసి ఆనందించేవారు. కొన్నేళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులు దీనిని కొనుగోలు చేయగా, ప్రస్తుతం వారు దానిని కూల్చివేశారు. ఇప్పటికే ఎన్నో అరుదైన చారిత్రక కట్టడాలు కనుమరుగవగా, ఇప్పుడు ఈ ‘ఓషన్ వ్యూ బంగ్లా’ కూడా చరిత్రలో కలిసిపోయింది. -
క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం
శాప్ చైర్మన్ రవి నాయుడు మహారాణిపేట: విశాఖలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, క్రీడా సంఘాల సమన్వయం ముఖ్యమన్నారు. వేసవి శిబిరాలు, క్రీడాభివృద్ధిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్లతో ఆయన సమావేశమయ్యారు. విశాఖను క్రీడా కేంద్రంగా మలిచేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 30 వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 17 వేలు క్రీడా సామాగ్రికి ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. ‘పి 4’ విధానంతో ప్రతిభావంతులైన క్రీడాకారులను దత్తత తీసుకుంటామని, ఉపాధి హామీ ద్వారా పాఠశాల మైదానాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ వేసవిలో శాప్ ద్వారా 50 వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే క్రీడాకారులను అరికట్టాలని కోరారు. క్రీడా అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. బక్కన్నపాలెంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూ. 200 కోట్లతో అత్యాధునిక స్టేడియం నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. కొమ్మాదిలో స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, అన్ని స్టేడియంలను క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్డీవో జూలియట్, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో విస్తృత తనిఖీలు
అల్లిపురం: పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, చావులమదుం, గొల్లలపాలెం ప్రాంతాల్లో టూటౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సుల్లో ప్రయాణికులు బ్యాగులు, సూట్కేసులు తనిఖీ చేశారు. గంజాయి, అనుమానాస్పద వెపన్స్, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారేమో అని తనిఖీలు చేపట్టారు. అదే విధంగా టూటౌన్ ఎస్ఐలు సింహాచలం, మన్మథరావు తమ సిబ్బందితో కలిసి గొల్లలపాలెం, చావులమదుం జంక్షన్లలో వాహనాలు తనిఖీ చేశారు. -
స్టేడియం పనులు క్లీన్బౌల్డ్
● రూ.40 కోట్ల మరమ్మతుల్లో డొల్లతనం ● నేమ్ బోర్డ్ వేలాడుతున్న వైనం ● ఏసీఏ మహా నిర్లక్ష్యం విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) పెద్దలు ఇటీవల విశాఖ క్రికెట్ స్టేడియంలో సుమారు రూ. 40 కోట్లు వెచ్చించి చేపట్టిన మరమ్మతుల నాణ్యతలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్ సగానికి పైగా ఊడి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు పనుల్లో నాసిరకాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ప్రపంచ క్రీడా పటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం పరువును ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ మరోసారి దిగజార్చింది. ప్రస్తుత ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ చేసిన నాసిరకం మరమ్మతులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన ద్వారంపై కొత్తగా ఏర్పాటు చేసిన నేమ్బోర్డు ఊడిన తీరే అందుకు ప్రధాన నిదర్శనం. అంతర్జాతీయ స్టేడియంపై నిర్లక్ష్యం అంతర్జాతీయ ఫార్మెట్లో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు ఒకే ఏడాదిలో నిర్వహించి చరిత్ర సృష్టించి ప్రపంచ క్రీడా పటంలో తనదైన ముద్ర వేసింది డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయిన ఆరేళ్లలో కేవలం రెండే వన్డే మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వగలిగింది. కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా జగన్మోహన్ దాల్మియా ఉండగా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ దూరదృష్టితో వేసిన అడుగు ఒక్కసారిగా స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లే కాకుండా ఐపీఎల్ మ్యాచ్లకు హోమ్ గ్రౌండ్గా నిలబెట్టింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగా మారిపోయింది. అలాంటి స్టేడియం నేటి ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ చర్యలతో డొల్లతనం బయటపడుతోంది. గత కార్యవర్గం నిర్మించిన పైలాన్కు రంగులు వేసి బీసీసీఐ కార్యదర్శి జై షా, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీసీసీఐ కార్యదర్శి వస్తానని చెప్పి రాకపోవడంతో పక్కన పెట్టిన దానికి ప్రస్తుత ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ హడావుడి చేసింది. ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ ఆడటానికి ఢిల్లీ క్యాపిటల్స్ వసతులు బాగోలేవని చెప్పి సొమ్ము చేసుకునేందుకు తెరలేపారు. అన్ని హంగులతో ఉన్న స్టేడియానికి మరమ్మతులంటూ రూ. 40 కోట్లు వెచ్చించి గొప్పలు చెప్పుకుని చేసింది ఏమిటనేది తేటతెల్లమవుతోంది. కేశినేని గొప్పలు విశాఖకు ఆర్థిక రాజధాని, క్రీడా హబ్గా ఎదగడానికి విశాఖ స్టేడియమే కారణమని.. కార్యవర్గం అప్పట్లో ప్రెస్మీట్ పెట్టి మరీ పేర్కొంది. 600–800 మంది సిబ్బందితో రూపురేఖలు మార్చేసామంటూ చెప్పుకొచ్చారు. జనవరి 20 నుంచి నెలరోజుల వ్యవధిలోనే అన్ని హంగులు సమకూర్చేసామన్నారు. కార్పొరేట్లు నడవక్కర్లేకుండా లిఫ్ట్ల్లోనే వారికి సదుపాయం కల్పించేశామన్నారు. ఆంధ్రలో అహ్మదాబాద్ను తలదన్నే స్టేడియం నిర్మాణం గురించి మాట్లాడుతూ ఎవరూ కట్టలేరంటూ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఊదరగొట్టారు. అమరావతి స్పోర్ట్స్ విలేజ్లో స్టేడియం కట్టడానికి అడిగారని, అదీ ప్రాథమిక దశలోనే ఉందంటూ, ఇంకా సైట్ అలాట్ చేయలేదని పేర్కొన్నారు. మంగళగిరి స్టేడియం స్టాండ్స్ తుప్పు పట్టేయడంతో కొన్నింటిని తొలగించాల్సి వచ్చిందని, నేడు అక్కడ రంజీ మ్యాచ్లకు, శిక్షణకు తప్ప పనికిరాదని సెలవిచ్చారు. ఏనాటికై నా టెస్ట్ హోదా ఉన్న వైఎస్సార్ స్టేడియమే దిక్కు అంటూనే ఇలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పనిలో పనిగా స్టేడియం ఇంత ఖ్యాతి నార్జించడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించి అభాసుపాలయ్యారు. -
వైభవ వేంకటేశ్వరుడి కల్యాణ వైభోగం
మురళీనగర్: కప్పరాడ ఎన్జీవోస్ కాలనీలో వెలసిన వైభవ వేంకటేశ్వర స్వామి 23వ వార్షిక కల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు స్వామి ఎదురు సన్నాహ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైదికపై వైభవుడిని కల్యాణమూర్తిగా ఆశీనులు గావించారు. భూదేవీ, శ్రీదేవీ సమేత వైభవుడి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలుగా 32 మంది దంపతులు వేదికపై ఆశీనులు కాగా.. ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు, శేషాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైభవ్ సిస్టర్స్ మాధురి, శిరీష అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైభవుడికి లక్షమల్లెలతో అర్చన నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. -
వీఐపీల రక్షణలో సమయస్ఫూర్తితో మెలగాలి
అల్లిపురం: పీఎస్వో (గన్ మెన్) విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమని, వీఐపీలను నూటికి నూరు శాతం రక్షించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. పీఎస్ఓలకు శారీరక సామర్థ్యంతో పాటుగా సమయస్ఫూర్తి కలిగి వుండాలని ఆయన సూచించారు. రెండు రోజులుగా పోలీస్ బ్యారెక్స్ సిటీ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న పీఎస్వోల క్యాప్సూల్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పీఎస్వోలను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ, నిత్యం వీఐపీల భద్రతలో ఉండే పీఎస్ఓలు వారి భద్రత విషయంలో అన్ని కోణాల్లో అంచనా వేస్తూ రక్షణ కల్పించాలన్నారు. రెండు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. వారికి శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్ఓ విధులు నిర్వహించడానికి అవసరమైన పీపీటీ రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్లు, రాత్రి వేళల్లో భద్రత, రోడ్డు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, నీటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, బాంబు డిటెక్షన్, డిస్పోజింగ్, ఆహార భద్రత, ఎఫ్ఐబీ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రీఫింగ్), డ్రోన్ల నిఘా, ప్రథమ చికిత్స, అత్యవసర సమయాల్లో వీఐపీ భద్రత వంటి అంశాలపై శిక్షణ అందించారు. -
రామజోగయ్య శాస్త్రికి ఆత్రేయ పురస్కారం
రామజోగయ్యశాస్త్రిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తదితరులు అల్లిపురం: ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రికి కవి కుల కిరీటి ఆత్రేయ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. ఆచార్య ఆత్రేయ 104వ జయంతి సందర్భంగా ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రామజోగయ్య శాస్త్రికి ఆత్రేయ పురస్కారాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గురువు సిరివెన్నెలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే గీతాలు రాస్తున్న మహోన్నత వ్యక్తి రామజోగయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో ఆత్రేయ కళాపీఠం కార్యదర్శి గంటి మురళి, పోర్ట్ ట్రస్ట్ కార్యదర్శి టి.వేణుగోపాల్, ప్రముఖ రచయితలు మా శర్మ, ఎర్రాప్రగడ రామకృష్ణ, బీజేపీ నాయకులు డాక్టర్ సుహాసినీ ఆనంద్, కొణతాల రాజు, చెన్నా తిరుమలరావుపాల్గొన్నారు. -
ఉచిత గ్యాస్.. రెండో విడతకే తుస్!
● గ్యాస్ వచ్చినా.. ఖాతాల్లో జమకాని నగదు ● మాట దాటేస్తున్న సివిల్ సప్లయ్ అధికారులుకూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా మొదలెట్టిన ఉచిత గ్యాస్ పథకం తుస్సుమంటోంది. రెండో విడతకే సబ్సిడీ చెల్లింపులపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టుంది. గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయిన 24 గంటల నుంచి 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో చేరతాయని చెప్పిన మాటలు.. గాల్లో కలిసిపోయాయి. రోజులు గడుస్తున్నా.. రాయితీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మహారాణిపేట: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రెండో విడత లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. తొలి విడత గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడతలో గ్యాస్ తీసుకున్న లబ్ధిదారులు రాయితీ డబ్బులు రాలేదని లబోదిబోమంటున్నారు. గ్యాస్ తీసుకుని రోజులు గడుస్తున్నా.. తమ ఖాతాల్లో సబ్సిడీ జమ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారుల్ని అడుగుతుంటే.. ఈ రోజు, రేపు అంటూ మాట దాటేస్తున్నారని వాపోతున్నారు. మెలికల మీద మెలికలు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మెలికల మీద మెలికలు పెడుతున్నారు. ఉచిత సిలిండర్లు రావాలంటే రైస్ కార్డు తప్పనిసరి అని మెలిక పెట్టారు. దీంతో మధ్య తరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎన్నికల ముందు ఒకలా.. ఇప్పుడు మరోలా కూటమి ప్రభుత్వం మాట మార్చిందని ఆక్షేపిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు మనుగడలో ఉంటేనే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు దక్కనున్నాయి. రేషన్ కార్డు పనిచేయకపోతే ఈ పథకానికి నోచుకోలేరు. అలాగే ఈకేవైసీ కూడా తప్పనిసరి. వీటిలో ఏ తేడా వచ్చినా గ్యాస్ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. మొదలైన రాయితీ తిప్పలు ఉచిత గ్యాస్ సిలెండర్లు పథకం అమల్లో భాగంగా మొదటి విడత పూర్తి అయ్యింది. రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైంది. గ్యాస్ బుకింగ్ ప్రారంభించి, డెలివరీ కూడా చేస్తున్నారు. ఇందుకు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఇవన్నీ ఉంటేనే ఈ పథకం అమలు చేస్తున్నారు. అలా గ్యాస్ సరఫరా అయిన వారికి కూడా చేస్తున్నా.. సబ్సిడీ డబ్బులు మాత్రం చాలా మంది ఖాతాలకు జమ కావడం లేదని మహిళలు వాపోతున్నారు. జిల్లాలో వివరాలు గ్యాస్ వచ్చింది, డబ్బులు రాలేదు బుకింగ్ చేసిన కొద్ది రోజులకు వంట గ్యాస్ అయితే వచ్చింది. కానీ డబ్బులు ఇంకా రాలేదు. అడిగితే గాబరా వద్దు.. వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయని అడిగితే మాత్రం ఈకేవైసీ అయిందా అని ఆరా తీస్తున్నారు. డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పి తప్పించుకుంటున్నారు. – వరలక్ష్మి, జాలారిపేట, పెదవాల్తేరు డెలివరీ చేసిన 48 గంటల్లో.. గతంలో మాదిరే గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒక ఎస్ఎంఎస్ లబ్ధిదారు ఫోన్కు వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో 24 గంట్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నాం. డెలివరీ చేసిన 48 గంటల్లో డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది. – వి.భాస్కర్, డీఎస్వో, విశాఖ -
సింహగిరికి చేరుకున్న లక్ష్మీకాంత్ నాయక్దాస్
మూడు నెలలపాటు అప్పన్నకు సేవలు సింహాచలం: ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్దాస్ బుధవారం తన పరివారంతో సింహగిరికి తరలివచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు తులసి ప్రసాదాన్ని అందించారు. తదుపరి సింహగిరిపై ఉన్న దాసుడి సత్రానికి బసచేసేందుకు తరలివెళ్లారు. మూడు నెలలపాటు సింహగిరిపై ఉండి స్వామికి సేవలందించనున్నారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా సింహాచలేశుడి సేవలో తరిస్తోంది. ఏటా సుమారు మూడు నెలలపాటు సింహగిరిపైనే ఉంటూ స్వామిని సేవించడం పరిపాటి. ఈ మూడు నెలల్లో వీరి ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు సింహగిరికి తరలివచ్చి అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. దాసుడి ఆధ్వర్యంలో స్వామికి ఆర్జిత సేవలు విశేషంగా జరిపిస్తారు. ఈ సేవల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ఒడిశా భక్తు లు ఆయా రోజుల్లో సింహగిరికి తరలివస్తారు. తన తండ్రి వనమాలిక్ నాయక్దాస్ మరణానంతరం 2008 నుంచి లక్ష్మీకాంత్ శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని సేవించే బాధ్యతలు స్వీకరించారు. -
‘ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా వృద్ధి సాధించాలి’
సీతంపేట: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ బుధవారం సీతమ్మధారలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( డీసీఐఎల్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డీసీఐఎల్ అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. పోర్టు అభివృద్ధికి మద్దతు, డ్రెడ్జింగ్ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా నావిగేషన్ చానళ్ల నిర్వహణలో సంస్థ కృషిని అభినందించారు. ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా అభివృద్ధిని ప్రోత్సహించాలని డీసీఐఎల్ను కోరుతూ, ఎంఎస్ఎంఈలు, స్థానిక విక్రేతలకు సాధికారత కల్పించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. డీసీఐఎల్ చైర్మన్ మధయ్యన్ అంగముత్తు మాట్లాడుతూ సంస్థ వ్యూహాత్మక కార్యక్రమాలు, మేజర్, మైనర్ పోర్టులలో డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాల బలోపేతంలో డీసీఐఎల్ పాత్రను విశదీకరించారు. సంస్థ సీఈవో దుర్గేష్ కుమార్ దూబే, కెప్టెన్ ఎస్.దివాకర్లు సంస్థ ఆర్థిక ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రి ఠాకూర్ను ఘనంగా సత్కరించారు. -
ముగిసిన అంతర హోటల్స్ క్రికెట్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: హోటల్స్, రెస్టారెంట్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర హోటల్స్, రెస్టారెంట్స్ క్రికెట్ టోర్నీ విజేతగా పామ్బీచ్ హోటల్ జట్టు, రన్నరప్గా నోవాటెల్ జట్టు నిలిచాయి. మున్సిపల్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పామ్బీచ్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 7వికెట్లకు 126 పరుగులు చేసింది. ప్రతిగా నోవాటెల్ భీమిలి రిసార్ట్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 85 పరుగులే చేయగలిగింది. 16 హోటల్స్, రెస్టారెంట్ల జట్లు టోర్నీలో పాల్గొన్నాయని సంఘం ఉపాధ్యక్షుడు పవన్కార్తీక్ తెలిపారు. -
ఉగ్రవాదులను నిర్మూలించాలి
ఏయూక్యాంపస్ : భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల జన జాగరణ సమితి సంతోషం వ్యక్తంచేసింది. బుధవారం ఉదయం బీచ్రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను పూర్తిస్థాయిలో నాశనం చేయడంలో భారత్ సఫలీకృతం అయిందన్నారు. భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత రక్షణదళాలకు సంపూర్ణ మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జన జాగరణ సమితి నాయకులు వాసు, దామోదర్ గుప్తా, తనూజ్, మునివర్ధన్, జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. -
కేటుగాళ్లు కొత్త ఎత్తులు
● ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అంటూ రెస్టారెంట్ ఓనర్లకు ఫోన్లు ● నోటీసు ఇవ్వాలా? గూగుల్ పే చేస్తావా అంటూ బెదిరింపులు ● రాణాచౌదరి పేరుతో నెంబర్ షేర్ చేస్తున్న మాయగాళ్లు ● విశాఖ, అరకు యజమానుల నుంచి వసూళ్లు? విశాఖ సిటీ : హలో.. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ రెస్టారెంట్పై ఫిర్యాదులు వచ్చాయి. రైడ్కు వస్తున్నాం. సీజ్ చేయమంటారా? లేదంటే గూగుల్ పే నెంబర్ ఇస్తా.. డబ్బులు పంపిస్తారా? అంటూ ఉమ్మడి విశాఖలో కేటుగాళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. రెస్టారెంట్ యజమానులకు ఫోన్లు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూగుల్ పే నెంబర్కు డబ్బులు పంపించాలని, లేదంటే తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విశాఖలోనే కాకుండా అరకు రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. రాణాచౌదరి పేరుతో ఫోన్లు విశాఖ, అరకుకు చెందిన హోటల్, రెస్టారెంట్ వ్యాపారులకు ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాణా చౌదరి అనే పేరుతో వరుసగా ఫోన్లు వస్తున్నాయి. లైసెన్సులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారని, రెస్టారెంట్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. తమ వద్ద ఫుడ్ లైసెన్సు ఉందని చెప్పినప్పటికీ.. ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందని, లేబర్ లైసెన్సు లేదని ఫోన్లో గదమాయించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారికి ఫుడ్ లైసెన్సు, ఆహార పదార్థాల నాణ్యత వంటి అంశాలపై మాత్రమే తనిఖీ చేసే అధికారముంది. కానీ సంబంధం లేని లైసెన్సులు అడుగుతుండడంతో పలువురు వ్యాపారులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి వారి నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారు. గూగుల్ పే చేయాలని డిమాండ్ తనిఖీలు, నోటీసుల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గూగుల్ పేకు రూ.20 వేలు పంపించాలని సదరు నకిలీ అధికారి డిమాండ్ చేస్తున్నారు. పలువురు వ్యాపారులు మాత్రం వారిని ఫుడ్ సేఫ్టీ అధికారిగా నమ్మి వారు ఇచ్చిన గూగుల్ పే నెంబర్కు డబ్బులు పంపించినట్లు తెలుస్తోంది. ఇలా పదుల సంఖ్యలో వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విషయం మాత్రం పలువురు వ్యాపారులు ఫుడ్ సెఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని, ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు వ్యాపారులకు సూచించారు. -
ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
అమర్నాథ్, నాగిరెడ్డిని కలిసిన కె.కె.రాజు మహారాణిపేట: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కె.కె.రాజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ మాజీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 9న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశం, అనంతరం పార్టీ అధ్యక్షుడిగా కె.కె.రాజు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, గుడివాడ లతీష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజాన వెంకటరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ గౌస్, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు సేనాపతి అప్పారావు, బోని శివరామకృష్ణ, పులగం కొండారెడ్డి, చిక్కాల సత్యనారాయణ, పార్టీ నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు, పల్లా పెంటారావు, మంత్రి శంకర నారాయణ, జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కేకే లైన్లో రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: ఆధునికీకరణ పనుల నిమిత్తం కేకే లైన్లో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్(58501) పా సింజర్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ బయల్దేరే కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. -
అభ్యాస్
నేడు ఆపరేషన్ ● సివిల్ మాక్ డ్రిల్కు సర్వం సిద్ధం ● అత్యవసర సమయాల్లో పౌరుల స్పందనపై అవగాహన విశాఖ సిటీ: ప్రశాంత విశాఖ యుద్ధ క్షేత్రంగా మారనుంది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ మోత మోగనుంది. శత్రు దేశ యుద్ధ విమానాలు.. క్షిపణులు.. డ్రోన్లు దూసుకొస్తున్న వేళ.. పౌరుల ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ జరగనుంది. రక్షణ దళాలు, పోలీసులు, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇతర శాఖల అధికారులు.. సంక్షోభ సమయాల్లో పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా అనుసరించాల్సిన విధానాలను వివరించనున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి తరువాత భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్ర హోం శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. సంక్షోభ సమయంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పౌరులు తమ ప్రాణా లు ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం వన్టౌన్ ప్రాంతం, సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఈ డ్రిల్ నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. క్వీన్మేరీస్ పాఠశాల, ఆక్సిజన్ టవర్స్ వద్ద డ్రిల్ దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కేంద్ర హోం శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో విశాఖ కేటగిరీ–2లో ఉంది. యుద్ధమే అనివార్యమైతే విశాఖను కూడా పాకిస్తాన్ టార్గెట్గా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సాయంత్రం 4 గంటలకు వన్టౌన్ ప్రాంతంలో ఉన్న క్వీన్మేరీస్ పాఠశాల వద్ద, రాత్రి 7.15 గంటలకు ఆక్సిజన్ టవర్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఆ సమయంలో నగరంలో సైరన్ మోత మోగుతుంది. వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, ఇతర స్థానిక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటా రు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కలిగిస్తారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. సైరన్ మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలి? విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందులపై ప్రజలకు వివరించనున్నారు. నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో... అలాగే నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వద్ద గల ఎస్బీఐ, కేజీహెచ్ వద్ద గల ఏఎంసీ మహిళా హాస్టల్, దొండపర్తి వద్ద గల డీఆర్ఎం ఆఫీస్, వన్టౌన్లోని రోజ్ హిల్స్, ఏయూ అవుట్ గేట్ వద్ద ఉన్న జేవీడీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఏయూ నార్త్ క్యాంపస్ వద్ద ఉదయం 10 గంటలకు ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించాలి మహారాణిపేట: మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మాక్ డ్రిల్ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. యుద్ధం జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. -
నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంవీపీకాలనీ: పీఎం అజాయ్ పథకంలో భాగంగా ఎస్సీ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సంయుక్తంగా ఈ శిక్షణ అందిస్తున్నాయి. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ పీడీ సత్యపద్మ, ఎన్ఏసీ డైరెక్టర్ రవికుమార్ మంగళవారం ఈ శిక్షణ కార్యాచరణపై కసరత్తు చేశారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు గల ఎస్సీ యువత ఈ ఉచిత నైపుణ్య శిక్షణకు అర్హులని పీడీ సత్యపద్మ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన వారు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పెదగంట్యాడలోని నాక్ శిక్షణా కేంద్రంలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 79810 22453, 90632 69849 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఉక్కు పీఎఫ్ ట్రస్ట్కు బకాయిల చెల్లింపు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టుకు యాజమాన్యం బకాయిలు చెల్లించిందని పీఎఫ్ ట్రస్టీలు చీకటి శ్రీనివాసరావు, రామచంద్రరాజు, సైనుబాబు తెలిపారు. ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేసే పీఎఫ్ అమౌంట్తోపాటు యాజమాన్యం వాటాను ప్రతీ నెలా ట్రస్ట్కు చెల్లించాలన్నారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపులు నిలిచి పోయాయన్నారు. దాంతో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు అప్డేట్ చేయలేక పోతున్నామన్నారు. ఈ అంశంపై పీఎఫ్ కమిషనర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారన్నారు. తాము పీఎఫ్ ట్రస్ట్ ప్రతినిధులుగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం మార్చి 31న మొదట విడతగా రూ. 429 కోట్లు, మంగళవారం రెండో విడతగా రూ. 244 కోట్లు వడ్డీతో సహా చెల్లించినట్టు వారు తెలిపారు. అదే విధంగా ఎస్బీఎఫ్ ట్రస్ట్కు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. దీంతో యాజమాన్యం పూర్తి బకాయిలు చెల్లించినట్లయిందని పేర్కొన్నారు. ట్రస్ట్కు చెల్లింపులు చేయడానికి సహకరించిన ట్రస్ట్ చైర్మన్ హేమంత్ కుమార్ ఝా, కార్యదర్శి ఎస్.రామప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. -
‘కుట్టు మిషన్ల శిక్షణ’లో అక్రమాలు
మహారాణిపేట: కుట్టు మిషన్ల శిక్షణలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పేడాడ రమణి కుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ మహిళా విభాగం ప్రతినిధులతో కలిసి మంగళవారం డీఆర్వో భవానీశంకర్కు వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కుట్టు మిషన్లతో పాటు శిక్షణకు ఉద్దేశించిన ఈ పథకంలో రూ.150 కోట్లకు పైగా స్కాం జరుగుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట చెప్పి 50 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదన్నారు. కుట్టు మిషన్ల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని రమణికుమారి ఆరోపించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లో కూడా అనుమానాలు ఉన్నాయని, ఎల్1కు కేవలం 5 శాతం పని మాత్రమే అప్పగించి.. ఎల్ 2, ఎల్ 3కి సుమారు 95 శాతం పనిని అప్పగించడంలో కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిపాలన్నారు. తక్కువ నాణ్యత కలిగిన మిషన్లను తీసుకొచ్చి రూ.4,300 విలువ చేస్తుందని చెప్పడం, ఒకరికి శిక్షణ కోసం అవుట్ సోర్సింగ్ సంస్థకు రూ.3,000 కేటాయించడంపై ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. లక్ష మందికి శిక్షణ ఇచ్చేందుకు రూ.7,300 చొప్పున రూ.73 కోట్లు ఖర్చు అవుతుందని.. కానీ ఈ పథకం బడ్జెట్ను రూ.257 కోట్లకు పెంచి భారీ అవినీతికి తెరతీశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని డీఆర్వోను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, శశికళ, మాజీ మహిళా జోనల్ ఇన్చార్జి పీలా వెంకట లక్ష్మి, దక్షిణ,ఉత్తర నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు బంగారమ్మ, పప్పల సునీత, జోత్స్న, శ్రీదేవి వర్మ, శ్రీదేవి, నాగమణి, సత్య, సుశీల, రామలక్ష్మి, నాగమణి, శిరీష తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం డిమాండ్ -
హోటళ్లలో పోలీసుల తనిఖీలు
● ఫైర్ ఎన్వోసీలు లేకుండా 30 హోటళ్ల నిర్వహణ ● ట్రేడ్ లైసెన్సులు లేకుండా 25, జీఎస్టీ లేకుండా 21 వ్యాపారాలు విశాఖ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న హోటళ్లు, లాడ్జిలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జోన్–1, 2 పరిధిలో ఉన్న 74 హోటళ్లలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హోటళ్లలో భద్రతా ప్రమాణాలు, అనుమతులు, రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఇందులో అనేక హోటళ్లు, లాడ్జిల్లో కనీస అనుమతులు లేనట్లు గుర్తించారు. ప్రధానంగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు లేకుండా 30 హోటళ్లు, ట్రేడ్ లైసెన్సు లేకుండా 25, ఫుడ్ లైసెన్సు లేకుండా 3, జీఎస్టీ లేకుండా 21 హోటళ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. అలాగే 16 హోటళ్లలో సీసీ కెమెరాలు, 32 హోటళ్లలో వీఎంఎస్లో సందర్శకుల సమాచారాన్ని అప్డేట్ చేయడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని వ్యాపార సముదాయాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. -
సింహాచలంలో సమన్వయలోపం!
ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. అయితే ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్ చేసి మంగళవారం గరుడ సేవ నిర్వహిస్తారా అని వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఆమె మంగళవారం ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్నారు. ఈ క్రమంలో పీఆర్వో కార్యాలయం వద్ద ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. సోమవారం ఫోన్ చేసి అడిగితే సేవలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు లేవని ఎలా అంటారని ప్రశ్నిస్తూ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆర్జిత సేవలు ఉండవన్న విషయాన్ని మీడియాకు కూడా తెలియజేయలేదు. -
ఏయూలో విద్యార్థులకు చోటేదీ..?
● పోటీ పరీక్షార్థులకు మొండిచేయి ● వసతి కోసం వేడుకున్నా పట్టని అధికారులు విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో వసతి కావాలని కోరినా.. యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వర్సిటీ వైస్ ఛాన్సలర్ను కలిసేందుకు వెళ్లిన విద్యార్థులను అనుమతించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్దే విద్యార్థులు పడిగాపులు కాశారు. డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో యూనివర్సిటీలో వసతి కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం వర్సిటీ వసతి గృహాలకు జీవీఎంసీ తాగునీరు రావటం లేదనే కారణంతో విద్యార్థులకు అవకాశం కల్పించకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్లు, చీఫ్ వార్డెనన్లు చుట్టూ తిప్పించుకొని చివరకు నిరాశ మిగిల్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడంలేదని, తాగునీరు లేదని కారణంతో వసతి కల్పించకపోవటంపై విద్యార్థులు ఆగ్రహం వక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలో నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులందరినీ ఏకం చేసి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఓ విద్యార్ధి సంఘం నాయకుడు తెలిపాడు. -
అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాళ్లపై కేసులు
రైల్వేస్టేషన్లో తూనికల కొలతల శాఖ తనిఖీలు తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లోని పలు స్టాళ్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కంట్రోలర్ కె.థామస్ రవికుమార్ నేతృత్వంలో ఒకటో నంబర్ ప్లాట్ఫాం నుంచి 8వ నంబర్ ప్లాట్ఫాం వరకు ఉన్న వివిధ స్టాళ్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు స్టాళ్ల నిర్వాహకులు బిస్కెట్లు, శీతల పానీయాలను ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన స్టాళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ప్యాకేజీ వస్తువులపై ముద్రించిన ధరకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని ప్రయాణికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో అసిస్టెంట్ కంట్రోలర్లు పి.డి.వి.అప్పలరాజు, ఎస్.ఎం.రాధాకృష్ణ, బి.రామచంద్రయ్య, పి.చిన్నమ్మలతో పాటు ఇన్స్పెక్టర్లు వి.రామారావు, ఎస్.ఉమా సుందరి, డి.అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం
అనకాపల్లి: నేరాల దర్యాప్తులో ఆధునిక శాసీ్త్రయ విధానాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం పోలీసు, వైద్యులు, న్యాయవాదులతో నేరచరిత్రపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరస్థలాల్లో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ, ’చైన్ ఆఫ్ కస్టడీ’ పాటించాల్సిన విధానాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్, వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్న్స్ మేనేజిమెంట్ శిక్షణ ద్వారా నిందితులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ వర్క్షాప్లో నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, విషపదార్థాలు (టాక్సికాలజీ), డిజిటల్ ఆధారాలు, సైబర్ నేరాల పరికరాలు, ఆడియో–వీడియో ఫుటేజ్, డీఎన్ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలు వంటి ఆధారాల సేకరణ, ప్యాకింగ్, భద్రపరచే విధానంపై దృష్టి సారించి, సంబంధిత ఆధారాలతో సకాలంలో కోర్టుకు ఇవ్వడం వల్ల నిందితులకు శిక్ష పడుతుందన్నారు. అంతకుముందు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.నాగరాజు, శాసీ్త్రయ సహాయకులు ఎం.రాంబాబు, పి.వి.ఎస్.బి.చలపతి, ఇ.కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు లక్ష్మణ్ మూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, విజయ, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు. -
అరుదైన నరాల వ్యాధికి విజయవంతంగా చికిత్స
ఆరిలోవ: అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు హెల్త్సిటీ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్న ఆమెకు మంగళవారం వైద్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం.జి.వి ఆదిత్య ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 35 ఏళ్ల రాధారాణి (ఫుడ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో అధ్యాపకురాలు) న్యూరోమైలటీస్ ఆప్టికా స్పెక్ట్రం డిసార్డర్ అనే అత్యంత అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యాధి సుమారు 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. గత ఏడాది అక్టోబరులో రాధారాణి ఆస్పత్రిని సంప్రదించగా.. వైద్య పరీక్షల అనంతరం ఆమె వెన్నుపూసలో ఎక్కువ భాగం వాపుతో పాటు కాళ్ల నరాలు పనిచేయడం లేదని గుర్తించినట్లు చెప్పారు. వెంటనే ఆమెకు ప్లాస్మా ఎక్సేంజ్ ట్రీట్మెంట్ను విజయవంతంగా అందించినట్లు వెల్లడించారు. దాదాపు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడటంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ చికిత్స విజయవంతంలో కేర్ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాము తదితరుల సహకారం ఎంతో ఉందని డాక్టర్ ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు రాధారాణి కృతజ్ఞతలు తెలిపారు. -
గెజిటెడ్ సంతకం లేదని పరీక్షకు అనుమతించలేదు
గాయత్రి కళాశాల వద్ద ఈసెట్ అభ్యర్థి ఆవేదన మధురవాడ: హాట్ టికెట్పైన గెజిటెడ్ సంతకం లేదని పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో పరీక్ష మిస్ అయ్యానని విద్యార్థి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సింహాచలంకి చెందిన తాతపూడి ఆదిత్య డిప్లమా చదువుకున్నాడు. ఈసెట్ పరీక్ష కోసం మధురవాడ గాయత్రీ విద్యాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్నాడు. హాట్ టికెట్ మీద గెజిటెడ్ సంతకం లేదని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో సంతకం చేయించుకొని వచ్చేసరికి టైం అయిపోయిందని సిబ్బంది లోపలకు పంపించలేదని విద్యార్థి, తల్లి సఽంధ్య వాపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాము గెజిటెడ్ సంతకం ఉండాలని ఎవరికీ చెప్పలేదని, సకాలంలో వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించామని నిర్వాహకులు చెబుతున్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కుతో యువతకు ఉపాధి
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పద్మనాభం: ఎంఎస్ఎంఈ పార్కుతో ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తామని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురంలో రూ.12.40 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో భీమునిపట్నం నియోజకవర్గం పద్మనాభం మండలం కృష్ణాపురంలో మొట్టమొదటగా ఎంఎస్ఎంఈ పార్కుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పరిశ్రమల పార్కు నిర్మాణానికి భూములిచ్చిన వారికి న్యాయం చేస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పరిశ్రమల పార్కుకు కేటాయించిన స్థలంలో మొదట 23 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ఇక్కడ పనులు మొదలు పెడతామని చెప్పారు. కృష్ణాపురం ఈనాం భూముల రైతులకు పట్టాదారుల పాస్ పుస్తకాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, ఆర్డీవో సంగీత్ మాధుర్, సర్పంచ్ మొకర లక్ష్మీభవాని, ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, తహసీల్దార్ కాకర ఆనందరావు, ఎంపీడీవో ఎం.విజయ్ కుమార్, నాయకులు కె.రమణ, కె.దామోదరావు, కె.నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సుల పోస్టులకు పైరవీలు!
● రంగంలో దిగిన దళారులు ● అభ్యర్థులకు ఫోన్ల మీద ఫోన్లు ● రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు డిమాండ్ ● అధికారులపై కూటమి నేతల ఒత్తిడి మహారాణిపేట: ‘హలో మేము విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు స్టాఫ్ నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి.’ అంటూ కొందరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో దళారుల బెడద ఎక్కువైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ఫైనల్ జాబితా విడుదల కాగా.. తుది ఎంపిక జాబితా వెలువడనున్న తరుణంలో కొందరు అభ్యర్థులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఒక ముఠా అభ్యర్థుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మబలుకుతోంది. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తూ బేరసారాలకు దిగుతోంది. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అటువంటి మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులపై ‘రాజకీయ’ ఒత్తిడి నర్సుల పోస్టుల భర్తీ చివరి దశకు చేరుకోవడంతో కొందరు కూటమి నేతలు ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు పెద్ద మొత్తంలో ధర నిర్ణయించి.. డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ పైరవీలకు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో సిఫార్సు లేఖలు వస్తున్నట్లు సమాచారం. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టుల భర్తీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ)పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సిఫార్సు లేఖలతో పాటు, వారి వ్యక్తిగత సహాయకుల నుంచి కూడా ఆర్డీకి నిరంతరం ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటంతో కొంతమంది బేరసారాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దళారులను నమ్మవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మెరిట్ ప్రాతిపదికన, పారదర్శకంగానే అంతా జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ వంటి కొన్ని అంశాలపై ప్రభుత్వ వివరణ కోసం లేఖ రాశాం. అనుమతి రాగానే పోస్టింగ్ ప్రక్రియ చేపతాం. దళారుల మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు. అర్హత, మెరిట్, రోస్టర్ ప్రకారమే మెరిట్ జాబితా తయారు చేస్తున్నాం. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ, విశాఖపట్నం వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంపెరిగిన పోస్టులు.. తీవ్రమైన పోటీ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో ఈసారి పోస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం గిరాకీకి కారణమైంది. ప్రారంభంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 నర్సు పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ తర్వాత మరో 264 పోస్టులు ఈ ప్రక్రియలో చేరాయి. దీంతో మొత్తం 370 పోస్టుల(ఒక సంవత్సరం ఒప్పంద ప్రతిపదికన) భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి మొత్తం 8,309 దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు పోటీ తీవ్రంగా నెలకొంది. -
ఏవోబీలో టెన్షన్ టెన్షన్
● మావోయిస్టుల సంచారంపై నిఘా వర్గాల హెచ్చరిక ● అప్రమత్తమైన పోలీసులుముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఇటీవల జిల్లాలోని కాకులమామిడి, కాంటవరం అటవీ ప్రాంతంలో రెండు సార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం తెలిసిందే. అప్పటినుంచి ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు తలదాచుకుంటున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఏవోబీ సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు కుణ్ణంగా పరిశీలించి, విడిచి పెట్టారు.మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ పోలీసులు, బలగాలు గస్తీ నిర్వహించాయి.అనుమానితులను ప్రశ్నించి, వివరాలు సేకరించి విడిచి పెడుతున్నాయి. ఒడిశా పోలీసు బలగాలు.. ఒడిశా పోలీసు బలగాలు సైతం మాచ్ఖండ్, ఒనకఢిల్లీ, పాడువ, జోలాపుట్టు గ్రామాల్లో అడుగడుగునా తనఖీలు చేస్తున్నాయి. ఏవోబీలోని గుర్రసేత్, రూడకోట, జోడం గ్రామాల్లో గ్రామాల్లోని అవుట్ పోస్టుల పరిధిలో పోలీసు బలగాలు సరిహద్దు గ్రామాల్లోని అటవీ ప్రాంతం వైపు కదులుతూ జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఏ సంఘటన జరుగుతుందో అంటూ మారుమూల గ్రామాల గిరిజనులు భయం భయంగా ఉంటూ గ్రామాలకే పరిమితం అయ్యారు. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. తనిఖీలతో పాటు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలకు పోలీసు అలెర్ట్ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఈ మద్య కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం నిషేధిత మావోయిస్టు సభ్యులు గ్రూపులుగా ఏర్పడ్డారు. వీరు ఏజెన్సీ ప్రాంతం మొత్తం విస్తరించి, ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలు చేయుటకు అవకాశం ఉంది. అందువల్ల మావోయిస్టు పార్టీ హిట్ లిస్టు ఉన్న లేదా పొలిటికల్ లీడర్ అయిన మీరు పోలీసు వారి అనుమతి లేకుండా లోపల ఉన్న గ్రామాలకు వెళ్లరాదు. మీరు సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని నోటీసు ద్వారా తెలియజేయడమైనదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. -
పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నిక
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నిక సోమ వారం ఆ శాఖ జిల్లా సంయుక్త సంచాలక కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని అసోసియేషన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏడీ డాక్టర్ ఆర్.సింహాద్రప్పడు(ఆండ్రాలజీ విభాగం, విశాఖ), కార్యదర్శిగా ఏడీ డాక్టర్ సీహెచ్ ఎం.ఎం.గంగాధర్(యలమంచిలి), కోశాధికారిగా ఏడీ డాక్టర్ బి.సౌజన్య(అనకాపల్లి), ఉపాధ్యక్షుడిగా ఏడీ డాక్టర్ పి.చంద్రశేఖర్(చింతపల్లి), సంయుక్త కార్యదర్శిగా ఏడీ డాక్టర్ పి.రాజగోపాల్ ఎన్నికయ్యారు. పశు సంవర్థక శాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పి.ఎస్.జి బాలకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నూతన కమిటీకి అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ విజేత వైజాగ్
చీరాల రూరల్: యువకులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరిచి సన్మార్గంలో నడవాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కావూరి పవన్కుమార్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనల్లో విశాఖ, హుబ్లీ జట్టు తలపడ్డాయి. మొదటి ఫస్ట్ హాఫ్లో విశాఖ జట్టు రెండు గోల్స్ చేసింది. సెకండాఫ్లో హుబ్లీ జట్టు పుంజుకొని రెండు గోల్స్ సాధించింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు పెనాల్టీ షూట్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇరుజట్లు సమంగా నిలిచాయి. మరోసారి అవకాశం ఇవ్వగా వైజాగ్ జట్టు అధిక గోల్స్ సాధించి విజేతగా నిలిచింది. రూ. 50 వేల నగదు బహుమతితో పాటు కప్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. -
కరాచీ బేకరీ పేరు తొలగించాలి
ఎంవీపీలో జన జాగరణ సమితి నిరసన ఎంవీపీకాలనీ : పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీ పేర్లను వెంటనే తొలగించాలని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు ఎంవీపీ కాలనీ సెక్టార్–2లోని కరాచీ బేకరీ వద్ద సోమవారం నిరసనకు దిగారు. బేకరీ బోర్డు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా భారతీయులను చంపేస్తుంటే దేశంలో పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీల వ్యాపారులు ప్రశాంతంగా ఎలా వ్యాపారాలు సాగిస్తారన్నారు. పాకిస్తాన్ మూలాలతో దేశంలో నడుస్తున్న వ్యాపార సంస్థల పేర్లు 10 రోజుల్లో మార్చకపోతే సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాపారులపై కేంద్రం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు, నగర కన్వీనర్ చింతపల్లి సునీల్కుమార్, అనిల్, రాజేష్, శీను, అన్వేష్ పాల్గొన్నారు. -
జీవీఎంసీకి 300 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 300 వినతులు అందాయి. అత్యధికంగా జోన్–8 నుంచి 227 వినతులు రావడం గమనార్హం. జోన్–2 నుంచి 17, జోన్–3 నుంచి 20, జోన్–4 నుంచి 15, జోన్–5 నుంచి 6, జోన్–6 నుంచి 9, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాదరాజు, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం
మహారాణిపేట: గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో అధికారిగా పనిచేసిన తాను 15 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశానని, నేటికీ జీసీసీ యాజమాన్యం తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని శేఖర మంత్రి ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో జీసీసీలో ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా పని చేసినప్పుడు ఆదాయ పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపు కోసం పలుసార్లు నోటీసులు వచ్చాయన్నారు. తాము కొన్న అటవీ ఉత్పత్తులను అమ్మే వ్యాపారుల వద్ద ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) వసూలు చేయలేదని, అందువల్ల అప్పుడు తమకు ఐటీ శాఖ రూ.1.35 కోట్లు ఫైన్ వేసిందన్నారు. అప్పుడు జీసీసీ ఫైనాన్స్ జీఎంగా ఉన్న తాను తమ ట్యాక్స్ కమిషనర్ సలహా మేరకు.. అన్ని మినహాయింపులు పోను మిగిలిన రూ.39 లక్షలను ఐటీ శాఖకు కట్టినట్లు వివరించారు. అయితే ఈ అంశాన్ని అప్పటి జీసీసీ పరిపాలన బోర్డుకు నివేదించినా వారు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 15 ఏళ్లుగా ఆపేశారని, సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆదినారాయణ కలెక్టర్తో పాటు జేసీ మయూర్ అశోక్ను కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు -
వేసవి క్రీడా శిబిరాలు ఆరంభం
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో 27 క్రీడాంశాల్లో వార్షిక వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో ఎంపిక చేసిన ఆయా ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేసవి క్రీడా శిబిరాల వాల్ పోస్టర్ను కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవాని శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ విడుదల చేశారు. -
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత
మహారాణిపేట : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సోమవారం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. అనంతరం పీజీఆర్ఎస్ నిర్వహణ, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన, పీ 4 సర్వే, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీ పునరావృతం అయ్యిందంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులు మళ్లీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించిన అర్జీదారుల వద్దకు వెళ్లి వారి ఫీడ్ బ్యాక్ను సేకరించి మొబైల్ యాప్ ఫీడ్ బ్యాక్ కలెక్షన్ రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 81, పోలీసు శాఖకు సంబంధించి 14, జీవీఎంసీకి సంబంధించి 79, ఇతర విభాగాలకు సంబంధించి 51 వినతులు ఉన్నాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ -
దేవస్థానం సొమ్మే..!
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత పరిహారం కూడా● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం, ఒకరికి గాయాలు ● మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు దేవస్థానం ఖజానా నుంచే బాధితులకు చెల్లింపులు 8లోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం మరోసారి తన బుద్ధి చూపించుకుంది. సింహాచలంలో జరిగిన విషాదానికి పరిహారాన్ని దేవస్థానంపై రుద్దేసింది. కొండపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు దేవస్థానం ఖజానా నుంచే రూ.1.78 కోట్లు చెల్లింపులు చేసింది. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాగా, ఒకరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు పరిహారంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు కూడా హామీలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు దేవాలయం నిధులు కేటాయించడం పట్ల ఆలయ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం ఖజానా నుంచే చెల్లింపులు చందనోత్సవం నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబాల కు అందించాలని సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా దేవస్థానం నిధుల నుంచే బాధితులకు చెల్లింపులు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో దేవస్థానం అధికారులు ఆగమేఘాల మీద బాధితుల కు చెక్కులు పంపిణీ చేసినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున రూ.1.75 కోట్లు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు చెల్లించారు. దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు వాస్తవానికి ఘటన జరిగిన రోజున మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే నేరుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి పరిహారం అందిస్తుందని అందరూ భావించారు. అయితే దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల నుంచి పరిహారం కింద బాధిత కుటుంబాలకు అందజేసింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు భక్తులు దేవాలయానికి సమర్పించిన కానుకల నుంచి ఇవ్వడాన్ని ఆలయ వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. దేవాలయం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇలా పరిహారాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు సింహాచలం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిహారం చెల్లింపులపై వామపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అసమర్థ పాలన కారణంగా జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు దేవస్థానం ఖజానా నుంచే పరిహారం అందించి ప్రభుత్వం తప్పించుకోడాన్ని తప్పుబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ హత్యలే అని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చందనోత్సవ నిర్వహణపై ఐదుగురు మంత్రుల కమిటీ నెల రోజుల పాటు విశాఖలోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేసిన వేడుకల్లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మంత్రులను కూడా బాధ్యులను చేయాలని పట్టుబడుతున్నారు. దేవదాయ శాఖ నుంచి వచ్చాయి దేవదాయ శాఖ నుంచి పరిహారం కింద నిధులు కలెక్టర్ నిధికి వచ్చాయి. వాటిని మాత్రమే బాధిత కుటుంబాలకు చెల్లించాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, జిల్లా కలెక్టర్ -
163 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖ తీరంలో దర్శనం
సాక్షి, విశాఖపట్నం: విభిన్న జీవరాశుల సమాహారమే సాగరగర్భం. విశాల సముద్రంలో మనకు సాధారణంగా కనిపించే జీవులతో పాటు.. ఎన్నో అరుదైన జీవజాతులు దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన జీవరాశుల్లో ఒకటి సీ స్లగ్స్(సముద్రపు నత్తలు). సుమారు 163 ఏళ్ల తర్వాత విశాఖ తీరంలో మళ్లీ దర్శనమిచ్చి సముద్ర జీవశాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. తూర్పు తీర పరిరక్షణ బృందం రూపొందిస్తున్న జీవ వైవిధ్య డాక్యుమెంటరీలో భాగంగా తెన్నేటిపార్క్ సమీపంలో ఇవి తారసపడ్డాయి.1862లో ఆవిష్కరణ.. ఆ తర్వాత అదృశ్యంసముద్ర జీవ వైవిధ్యంపై పరిశోధనల్లో భాగంగా 1862లో బ్రిటిష్ మైరెన్ శాస్త్రవేత్తలు జోష్వా ఆల్డర్, ఆల్బెనీ హ్యాన్కాక్ దక్షిణ భారతదేశం, శ్రీలంక తీరాల్లో పర్యటించారు. విశాఖపట్నం సందర్శనకు వచ్చినప్పుడు లాసన్స్ బే కాలనీ సమీపంలోని రాళ్ల మధ్యలో వారు గుల్ల(షెల్) లేని విభిన్న సముద్రపు నత్తలను అన్వేషించారు. ఆ సమయంలో వారు 19 రకాల నత్తలను గుర్తించారు. వాటిలో వారు అంతకుముందు ఎక్కడా చూడని.. అత్యంత అరుదైన ఒక జాతిని ఫిడియానా యునిలేనిటాగా వర్గీకరించారు. ఈ జాతి విశాఖ జలాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదని తమ పరిశోధన జర్నల్స్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. ఆల్డర్, హ్యాన్కాక్లు ఈ అరుదైన జీవిపై రాసిన జర్నల్స్ ప్రస్తుతం లండన్ మ్యూజియంలో భద్రపరిచి ఉంది. ఆ తర్వాత ఈ ఫిడియానా యునిలేనిటా జాతి సీ స్లగ్స్ మళ్లీ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. ఏ పుస్తకాల్లో.. ప్రచురణల్లో కూడా వాటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. అవి కనుమరుగు అయిపోయాయని చాలామంది భావించారు.163 ఏళ్ల తర్వాత..ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్(ఈసీసీటీ) ‘సిటీ నేచర్ ఛాలెంజ్’పేరుతో విశాఖలోని జీవవైవిధ్యంపై ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈసీసీటీ వ్యవస్థాపకుడు, మైరెన్ బయాలజిస్ట్ శ్రీ చక్ర ప్రణవ్, సభ్యులు డా.దీపు విశ్వేశ్వరరావు, చంద్రశేఖర్లతో కలిసి విశాఖ తీర ప్రాంతంలో అన్వేషించారు. ఈ క్రమంలో తెన్నేటి పార్క్ సమీపంలోని రాళ్ల మధ్యలో ఈ అరుదైన సీ స్లగ్స్ను గుర్తించారు. అవి గతంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు విశాఖలో గుర్తించిన ఫిడియానా యునిలేనిటా జాతికి చెందినవని నిర్ధారించుకున్నారు. సరిగ్గా 163 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జీవి మళ్లీ విశాఖ తీరంలో కనిపించడం వారిని ఆశ్చర్యపరిచింది. విశాఖపట్నం, శ్రీకాకుళం సముద్ర జలాల్లోని రాళ్ల మధ్య ఈ అరుదైన జీవజాలం కనిపిస్తున్నట్లు వారి పరిశోధనల్లో వెల్లడైంది.విషమే సీ స్లగ్స్ రక్షణ కవచంసాధారణంగా సముద్రపు నత్తలకు తమను తాము రక్షించుకోవడానికి గట్టి గుల్ల ఉంటుంది. అయితే అరుదైన ఫిడియానా యునిలేనిటా జాతి సీ స్లగ్స్కు గుల్ల ఉండదు. బదులుగా వాటి శరీరంపైనే విషపూరితమైన రక్షణ కవచం ఉంటుంది. నిజానికి ఫిడియానా యునిలేనిటా శరీరం మొత్తం విషమే కవచంలా పనిచేస్తుంది. ఏ జీవి వీటిని ఆహారంగా తీసుకున్నా వెంటనే మృతి చెందుతాయి. అందుకే ఇతర సముద్ర జీవులు వీటి జోలికి రావు. ఇవి ప్రధానంగా కొన్ని రకాల కోరల్స్, హైడ్రాయిడ్స్ను ఆహారంగా తీసుకుంటాయి. వీటి ఆహారమైన కోరల్స్లోని విషపూరిత పదార్థాలను ఇవి తమ శరీర కణజాలంలోకి గ్రహించి, నిల్వ చేసుకుంటాయి. ఈ విషాన్ని ఇవి తమ రక్షణ కోసం ఉపయోగిస్తాయి. ఆటుపోట్ల సమయంలో నీరు వెనక్కి వెళ్లిపోయినప్పుడు ఏర్పడే చిన్న నీటి గుంటల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఇవి పగటిపూట సూర్యరశ్మికి భయపడి రాళ్ల కింద దాక్కుని.. రాత్రి సమయంలో బయటకు వచ్చి ఆహారం సేకరిస్తాయి.జీవ వైవిధ్యంపై అవగాహనవిశాఖపట్నం తీరంలో గుర్తించిన సీ స్లగ్ జాతుల జాబితాను రూపొందిస్తూ.. వాటిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నాం. ‘సిటీ నేచర్ ఛాలెంజ్’వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించడంలో ఈ తరహా పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. సముద్ర పరిశోధకులకు సీ స్లగ్స్తో పాటు ఫ్లాట్వార్మ్లు వంటి అరుదైన జీవజాతులు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడం శుభపరిణామం.– శ్రీ చక్ర ప్రణవ్, ఈసీసీటీ వ్యవస్థాపకుడు, మైరెన్ బయాలజిస్ట్ సీస్లగ్స్ -
త్వరలో చీమలాపల్లి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
పెందుర్తి: జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లిలో నిర్మిస్తున్న అధునాతన కన్వెన్షన్ సెంటర్ను అతి త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.6.24 కోట్ల వీఎంఆర్డీఎ నిధులతో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను సోమవారం ఆయన పరిశీలించారు. 2022లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుది దశకు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఏపీ ఆయిల్ఫెడ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కార్పొరేటర్లు ముమ్మన దేముడు, అధికారులు పాల్గొన్నారు. -
కుట్టు మిషన్ల పథకంలో రూ.157 కోట్ల స్కాం?
మహారాణిపేట: కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి దాదాపు రూ.157 కోట్లను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి, కాపు మహిళలకు కుట్టు శిక్షణ పథకంలో మిషన్లు అందించేందుకు తొలుత రూ.100 కోట్లతో ప్రతిపాదించారన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని రూ.257 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు భరత్ ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట చెప్పి 50 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదన్నారు. కుట్టు మిషన్ల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని భరత్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లో పాల్గొన్న ఎల్1కు కేవలం 5 శాతం పని మాత్రమే అప్పగించి.. ఎల్ 2, ఎల్ 3కి సుమారు 95 శాతాన్ని పని అప్పగించడంతో వీరి అవినీతి ఏ రకంగా ఉందో తెలుస్తోందన్నారు. గుజరాత్లో తక్కువ నాణ్యత కలిగిన మిషన్లను రూ.4,300కు కొనుగోలు చేశారని, ఒకరి శిక్షణ కోసం అవుట్ సోర్సింగ్ సంస్థకు రూ.3,000 కేటాయించారన్నారు. ఒక లక్ష మందికి రూ.7,300 చొప్పున రూ.73 కోట్లు ఖర్చు అవుతుండగా.. టెండర్ విలువ మాత్రం రూ.257 కోట్లకు చూపించి భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారని భరత్ విమర్శించారు. బీసీ మహిళల పేరుతో జరుగుతున్న ఈ స్కాంను ప్రజలకు వివరించి, ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకుంటామని భరత్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ నేత భరత్ ఆరోపణలు -
చార్ధామ్ యాత్రలో అపశ్రుతి
ఆక్సిజన్ అందక గాజువాక వాసి పాలవెల్లి మృతి గాజువాక: చార్ధామ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందకపోవడంతో గాజువాకకు చెందిన ఒక జీవీఎంసీ ఉద్యోగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గాజువాక రాజీవ్నగర్లో నివాసముంటున్న పాలవెల్లి.. జీవీఎంసీ గాజువాక జోన్లో ట్యాక్స్ కలెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన తన మిత్ర బృందంతో కలిసి గత నెల 30న చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. ఆదివారం కేదార్నాథ్ వెళ్తుండగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన సహచరులు ఆయన్ని దగ్గరలోని రుద్రప్రయాగ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి విమానంలో గాజువాకకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
సంగతేంటి?
మంత్రుల కమిటీ● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలు ● ఆలయ ఈవోతో సహా ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ● కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ● మంత్రుల కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యల్లేవు.. ● నిజాలను గోడ వెనకే సమాధి చేసేసిన త్రిసభ్య కమిషన్ సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తప్పంతా అధికారులు, దిగువస్థాయి సిబ్బందిదే అన్నట్లుగా వారిపైనే వేటు వేసింది. దాసుని తప్పు దండనతోనే సరి అన్నట్లుగా.. పనుల పర్యవేక్షణ అంటూ ప్రచార ఆర్భాటానికి పరిమితమై.. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడిన మంత్రుల కమిటీ మీద మాత్రం ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడింది. సాక్షి, విశాఖపట్నం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కే.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్లను సస్పెన్షన్కు ఆదేశించింది. అదేవిధంగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసమంటూ ఏర్పాటు చేసిన కమిటీలో ఉంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మంత్రులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మంత్రులూ ఘటనకు బాధ్యులేగా..? మూడు రోజుల పాటు విచారణ అంటూ హడావుడి చేసిన త్రిసభ్య కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గోడ ఎవరు కట్టారు?.. ఎందుకు కట్టారు.? దాని వెనక ఎవరు ఉన్నారు.. నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అనే కోణాల్లో కేవలం అధికారులకు సంబంధించే విచారణ చేపట్టారే తప్ప.. మంత్రుల కోణం నుంచి కించిత్తు దర్యాప్తు చెయ్యలేదు. వాస్తవానికి చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏప్రిల్ 7వ తేదీన నలుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్తో పాటు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులున్నారు. కమిటీ నియమించిన తర్వాత నుంచి మంత్రుల బృందం కొండపైనే నిరంతర పర్యటన, సమీక్షలంటూ హడావుడి చేసింది. మీడియా సమక్షంలో ప్రచారం కోసం నానాయాగీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి.? ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకుంటున్నారు.. క్యూలైన్లు బాధ్యత ఎవరిది? లైన్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై కేవలం అడిగి తెలుసుకున్నారే తప్ప.. ఏమాత్రం పరిశీలించలేదు. వీరి బాధ్యతారాహిత్యమే ప్రమాదానికి ప్రధాన కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. -
నమ్మివానిపేటలో హైడ్రామా
ఆత్మహత్య చేసుకుంటానని దత్తిరాజేరు వాసి హల్చల్ తగరపువలస: జీవీఎంసీ రెండో వార్డు నమ్మివానిపేటలో ఓ ఇంటి మేడపైకి సోమవారం ఉదయం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాదకు చెందిన ఆవాల ఎర్రయ్య ఎక్కి హల్చల్ చేశాడు. ఆ ఇంటిని ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభంనకు వేలాడుతున్న వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికులు, ఎర్రయ్య భార్య నరసయ్యమ్మ తెలిపిన వివరాలివి. ఎర్రయ్య ఫూల్బాగ్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల అతని కుమారుడు మణికంఠకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేర్పించారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ బాధపడుతున్న మణికంఠకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కుమారుని ఆరోగ్యం బాగాలేదన్న మనస్థాపంతో ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఎర్రయ్య కిందకు దిగాడు. పక్కనే ఉన్న నమ్మివానిపేట గ్రామానికి చేరుకుని ఓ ఇంటి మేడపైకి చేరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటికే స్థానికులు మేల్కొని ఉండటంతో.. గ్రామస్తులందరికీ సమాచారమిచ్చారు. కుమారుడి ఆరోగ్యం బాగా లేదని, ఎవరో తనను చంపడానికి వస్తున్నట్టు రకరకాలుగా స్థానికులకు చెప్పాడు. దీంతో వారు ఎర్రయ్యకు నచ్చజెప్పి ఉదయం 6.15 గంటల సమయంలో కిందకు దించారు. తర్వాత ఆసుపత్రిలో ఉన్న భార్యకు సమాచారం అందించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులు ఎర్రయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. -
తాత్కాలిక కట్టలు.. రూ.లక్షలు వృథా
గోస్తనీ నదిపై చెక్డ్యామ్లు నిర్మిస్తే నీటిని నిల్వ చేసుకోవచ్చని మేధావులు సూచిస్తున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో మునివానిపేట నుంచి తగరపువలస వరకు ఒక్క చెక్డ్యామ్ కూడా లేదు. గతంలో తాటితూరు వద్ద నిర్మించిన చెక్డ్యామ్ను కొందరు ధ్వంసం చేయడంతో నీరు నిలవడం లేదు. దీంతో భీమిలి జోనల్ అధికారులు ఏటా సామియ్యవలస వద్ద ఇసుక బస్తాలు, మట్టి కట్టల పేరుతో రూ.లక్షలు నదిలో కుమ్మరిస్తున్నారు. ఏప్రిల్లో ఏర్పాటు చేసే ఈ తాత్కాలిక కట్టలు.. జూన్లో వచ్చే వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్ మధురవాడ: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే చందనోత్సవం రోజు సింహాచలంలో గోడ కూలిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఘోర ప్రమాదాన్ని వర్షం కారణంగా చూపడం వెనుక.. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు. గోడ కూలి మృతి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను ఆదివారం వారి స్వగృహంలో పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనీసం పిల్లర్లు, కాంక్రీట్ బెల్టులు లేకుండా గోడ ఎలా కట్టారని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, వారి కుటుంబాలకు కనీసం కోటి రూపాయలైనా పరిహారం ఇవ్వాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు, ప్రజలకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వెంట సీపీఎం నాయకులు కృష్ణారావు, డి.అప్పలరాజు, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
పీతల మూర్తి యాదవ్పై చర్యలకు డిమాండ్
బీచ్రోడ్డు: పిఠాపురం కాలనీలోని వాంబే గృహ గోడ కూల్చడంపై రజకుల సేవా సంఘం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నిరసన చేపట్టారు. గోడ కూల్చివేతకు సంబంధించి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పంపించాడని ఆరోపిస్తూ.. జనసేన పార్టీ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై మూర్తి యాదవ్ దౌర్జన్యం చేస్తున్నాడని మండిపడ్డారు. పిఠాపురంకాలనీలో ప్రభుత్వం ఇచ్చిన వాంబే గృహాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామన్నారు. పీతల మూర్తిని స్థానికులు పట్టించుకోకపోవడంతో వార్డు ప్రజలపై దౌర్జన్యం మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ప్రహరీని విరగొట్టించాడని దుమ్మెత్తి పోశారు. అతని దగ్గర నాలుగేళ్లుగా లంచం తీసుకుని పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్రటరీ జ్యోతిని పంపి.. ఈ పని పూర్తి చేయించాడని ఆరోపించారు. వార్డు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పీతల మూర్తిపై పవన్ కల్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అతని నుంచి 22వ వార్డు ప్రజలను కాపాడాలని కోరారు. -
గోస్తనీ
గొంతెండుతోందిచెక్డ్యామ్ల నిర్మాణంతోనే మేలు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు జీవనాధారమైన గోస్తనీ నది నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీవీఎంసీతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, విజయనగరం జిల్లాలోని పలు పంచాయతీల తాగునీటి అవసరాలను తీర్చే ఈ నది.. ఇసుకాసురుల దాటికి, సరైన ప్రణాళిక లోపంతో ప్రజల దాహార్తిని తీర్చలేని స్థితికి చేరుకుంది. వేసవి వచ్చిందంటే చాలు నది ఎండిపోవడం, ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు, అధికారులు కేవలం తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. – తగరపువలస నీరు లేని ప్రాంతంలో ఊటబావితాత్కాలిక పరిష్కారాలతో ప్రజాధనం వృథాఇసుకాసురుల దాటికి బలైన నది బోరు నీళ్లే దిక్కు? భీమిలి మున్సిపాలిటీ గతంలో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొనేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘నగరబాట’ కార్యక్రమంలో ఇక్కడ ప్రజల కష్టాలు చూసి.. రూ.12 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు. సామియ్యవలస వద్ద పంప్హౌస్, ఆరు ఊటబావులు నిర్మించి నిరంతర నీటి సరఫరాకు మార్గం వేశారు. అయితే పాండ్రంగి, మజ్జివలస, తాటితూరు, టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రభావంతో సామియ్యవలస వద్ద కూడా ఏప్రిల్, మేలో నీటి లభ్యత తగ్గిపోతోంది. ప్రస్తుతం రెండు ఊటబావులు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా రెండు బోర్లు తవ్వి నీటిని భీమిలి జోన్ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ బోర్ల నీరు తాగడానికి అనుకూలంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భీమిలిలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు నదిని ఆనుకుని బోర్ల ద్వారా రోజూ వందలాది ట్యాంకర్లతో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమ నీటి రవాణా పలువురికి కాసులు కురిపిస్తోంది. గోస్తనీ నది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సుమారు 5 నుంచి 6 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఆనందపురం మండలం బోని వద్ద నుంచి జీవీఎంసీకి, పద్మనాభం మండలం పాండ్రంగి సమీపంలోని సామియ్యవలస వద్ద నిర్మించిన ఊట బావులు, పంప్హౌస్ల ద్వారా భీమిలి జోన్కు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం నదీ తీరంలో బోర్లు వేసి.. ఆ నీటిని రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులకు తరలించి ప్రజలకు అందిస్తోంది. వేసవి కష్టం.. తాటిపూడిపైనే భారం ప్రతి ఏటా ఏప్రిల్, మేలో గోస్తనీ నది చాలా చోట్ల ఎండిపోతుంది. దీంతో జీవీఎంసీ సహా అనేక పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ఆ సమయంలో వర్షాలు పడితే కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే నీరే దిక్కు. ప్రస్తుతం రెండు వారాల కిందట విడుదల చేసిన నీరు నదిలో చేరినా.. అది కేవలం మరో పది రోజులకు మాత్రమే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోమారు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కావడం లేదా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం జరిగితేనే తాగునీటి సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాలతోనే ఈ పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వ(2014–2019) హయాంలో గోస్తనీ నదిలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక తవ్వకాలు నది సహజ స్వరూపాన్ని దెబ్బతీశాయి. పద్మనాభం మండలం పొట్నూరు నుంచి తగరపువలస వరకు ఇసుకాసురులు నది గర్భాన్ని తోడేశారు. కోట్ల విలువైన ఇసుకను తరలించడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా నేడు నదీ పరీవాహక ప్రాంతం ముళ్ల చెట్లు, గోతులతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. నీటి జాడ కనిపించడమే గగనమైపోయింది. -
ప్రైవేటులో ‘ఉచితం’ అందేనా..!
● వైఎస్సార్ సీపీ హయాంలో 25 శాతం సీట్లు పక్కాగా అమలు ● గతేడాది 2,989 మంది పేద విద్యార్థులకు ప్రయోజనం ● జిల్లాలో 621 ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పొందే అవకాశం ● ఈ నెల 19 వరకు దరఖాస్తు గడువు షెడ్యూల్ ● ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ● ఈ నెల 20 నుంచి 24 మధ్య అర్హులైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. ● ఈనెల 29న మొదటి రౌండ్ లాటరీ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ● జూన్ 8న ఎంపికై న విద్యార్థులు స్కూళ్లలో చేరాలి. ● జూన్ 11న రెండో రౌండ్ లాటరీ నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తారు. ● జూన్ 18న విద్యార్థులు స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. విశాఖ విద్య : ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర సిలబస్తో పాటు ఐబీ/ఐసీఎస్ఈ/సీబీఎస్ఈ బోధన అందిస్తున్న జిల్లాలోని 621 ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా లేదా సమీపంలోని సచివాలయాల్లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొండికేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఇచ్చే క్రమంలో గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లు పూర్తి వివరాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో పొందుపరచాలి. అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేటు స్కూళ్ల వివరాలు వెబ్సైట్లో నమోదు కాలేనట్లుగా తెలుస్తోంది. గతంలో ఫీజులు పెండింగ్ ఉన్నాయంటూ కొన్ని యాజమాన్యాలు కో ర్టును సైతం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. నగరంలో క్రేజ్ ఉన్న స్కూళ్ల యాజమాన్యాలు విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పకడ్బందీగా అమలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను పకడ్బందీగా అమలు చేశారు. 2022–23లో 86 మంది, 2023–24లో 1,227 మంది, 2024–25లో 2,989 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత సీట్లు కేటాయించిన పాఠశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులను పాఠశాల యాజమాన్యాలకు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కూటమి ప్రభుత్వం గత ఏడాది, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో జిల్లాలోని చాలా పాఠశాలల యాజమాన్యాలు ఉచిత సీట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఎంత మంది ఉచిత విద్యను పొందుతారనేది వేచి చూడాల్సి ఉంది. సద్వినియోగం చేసుకోవాలి విద్యాహక్కు చట్టం మేరకు గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. దీన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత విద్య ప్రవేశాలపై ప్రతీ రోజూ డీఈవోల పర్యవేక్షణలో మండలాల వారీగా సమీక్షిస్తున్నాం. – బి.విజయ్ భాస్కర్, ఆర్జేడీసచివాలయాల వారీగా సమీక్ష పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో గుర్తింపు గల స్కూళ్లు కచ్చితంగా వెబ్సైట్లో నమోదయ్యేలా దృష్టి పెట్టాం. సచివాలయాల వారీగా దీనిపై సమీక్షిస్తున్నాం. అర్హులంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ జె.చంద్రశేఖర్ రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా -
● వానమ్మ.. వాన!
● వర్షాలతో ఉపశమనం ● మొన్నటి వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలతో విలవిల ● మరో రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడా వానలు సాక్షి, విశాఖపట్నం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కొంత కాలంగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే నెల అంటే.. భానుడి భగభగలు.. సెగలు కక్కించే ఉక్కపోత.. ఊపిరి సలపని వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ.. ఈసారి మాత్రం కొద్ది రోజుల పాటు చల్లని వాతావరణం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా.. వాతావరణం ఎండలతో మొదలై.. మధ్యలో వర్షాలు పడి మళ్లీ.. ఎండలు పెరిగి.. సాయంత్రం నాటికి మబ్బుల వాతావరణంతో చల్లబడుతోంది. ప్రతి రోజూ సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు నగరానికి గొడుగులు పడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకూ జిల్లాలో సగటు వర్షపాతం కంటే మూడు రెట్లకు పైగా అధికంగా నమోదవ్వడం విశేషం. దశాబ్ద కాలంలో మే నెలలో మొదటి 4 రోజులు ఈ తరహా వర్షపాతం నమోదుకావడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 1 నుంచి 4 వరకూ సగటు వర్షపాతం 5.1 మి.మీ కాగా.. ఈసారి 17 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రీమాన్సూన్ సీజన్లో వర్షాలు కురవడం సర్వసాధారణమే అయినా.. ఈసారి మాత్రం అకాల వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం(సీడబ్ల్యూసీ) అధికారులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. నగర పరిధిలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతుంటుందనీ.. ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని మృతికి సంతాపం
మహారాణిపేట/డాబాగార్డెన్స్ : తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, విశాఖ వాసి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (54) హైదరాబాద్లో ఆకస్మిక మృతి పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన జస్టిస్ ప్రియదర్శిని ఎంబీఎం లా కళాశాల నుంచి 1995లో న్యాయపట్టా అందుకున్నారు. 1995లోనే విశాఖ బార్ అసోసియేషన్లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాదులు ఉమాబాలాజీ, ఎన్.బద్రీనాథ్ దగ్గర న్యాయవాదిగా శిక్షణ పొందారు. 2008లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఇందిరా ప్రియదర్శిని సహచరులు లక్ష్మీ రాంబాబు, మంజులత, అరుణ కుమారి హేమలత తదితరులు తమ సంతాప సందేశాన్ని తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీఏకే చాంబర్స్లో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్కుమార్ ఆమె చిత్రపటాని కి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయవాదులు వాగుపల్లి చిన్నారావు, డాక్టర్ టి.బోసుబాబు, పాకా సత్యనారాయణ, లాయర్స్ ఫోరమ్ ఫర్ జస్టిస్ గుడిపల్లి సుబ్బారావు, నిమ్మకాయల ఈశ్వరరావు, సి.రవి, పడమట సురేష్, కోమల కిరణ్ పాల్గొన్నారు. -
బాధితులకు పరిహారం అందజేత
మధురవాడ/మద్దిలపాలెం/సింహాచలం/ఆరిలోవ: సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు మృతి చెందగా, ఒక్కరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఆదివారం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. జీవీఎంసీ 7వ వార్డు చంద్రంపాలేనికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ దంపతుల కుటుంబానికి రూ.50 లక్షలు(ఒక్కొక్కరికి రూ.25 లక్షలు), పాత అడవివరం నివాసి ఎడ్ల వెంకటరావు కుటుంబ సభ్యులకు 25 లక్షల చొప్పున జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నష్టపరిహారం చెక్కులు అందజేశారు. జీవీఎంసీ 15వ వార్డు పాత వెంకోజీపాలెం ఉమానగర్కు చెందిన పైలా వెంకటరత్నం, ఆమె ఆడపడుచు గుజ్జరి మహాలక్ష్మి కుటుంబ సభ్యులకు చెరో రూ.25 లక్షలు, గాయాలు పాలైన జీవీఎంసీ 11వ వార్డు పరిధి ఆరిలోవ బాలాజీనగర్కు చెందిన పైలా ప్రవీణ్కు రూ.3లక్షలు చొప్పున జేసీతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరిహారం చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై విచారణ జరుగుతోందని జేసీ తెలిపారు. కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం కల్పించాలని పలువురు బాధితులు కోరగా.. త్వరలోనే ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగం తన మరిది భార్యకి ఇవ్వాల్సిందిగా వెంకటరావు భార్య కోరడంతో.. ఈ విషయంపై కుటుంబ సభ్యులంతా అంగీరపత్రాన్ని ఇవ్వాలని జేసీ సూచించారు. ఆర్డీవో సంగీత్ మాథూర్, విశాఖ రూరల్ తహసీల్దార్లు రమేష్, పాల్ కిరణ్ పాల్గొన్నారు. -
‘నీట్’గా.. ప్రశాంతంగా..
సాక్షి, విశాఖపట్నం/మురళీనగర్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నీట్ యూజీ–2025 పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 16 కేంద్రాల్లో 7 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 474 మంది పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు చెప్పారు. గైస్లోని పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 471 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్, కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకటరమణ తెలిపారు. రెండు సెషన్స్లో జరిగిన ఈ పరీక్షను ఎన్టీఏ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఈసారి సమగ్ర విధానాన్ని అనుసరించింది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. అయితే చెవిదిద్దులు, కాలి మెట్టెలు, చైన్లు వంటివి తొలగించిన తర్వా తే పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టేలా కఠినంగా వ్యవహరించడంతో అమ్మాయిలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష పత్రం కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్ చాలా కష్టతరంగా.. కెమిస్ట్రీ మధ్యస్థంగా.. బయాలజీ చాలా సులభంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. ● జిల్లాలో 16 కేంద్రాల్లో నీట్ పరీక్ష -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మోసాలు, అబద్ధపు హామీలను ప్రజల ముందు ఎండగట్టి.. వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టిగా పనిచేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 9న పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కె.కె.రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో నూతన జిల్లా కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులతో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించారని, ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వ 11 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖ నగరానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి? కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలనే అంశాలపై చర్చించారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జరగనున్న జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బానాల శ్రీనివాసరావు, చెన్నా జానకీరామ్, బోని బంగారు నాయుడు, రాజన్న వెంకట్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపు 9న బాధ్యతల స్వీకరణ -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
● జనవరిలో దక్షిణ కోస్తా రైల్వేజోన్కు ప్రధాన మోదీ శంకుస్థాపన ● ఇంతవరకూ భూమి చదునుకు మాత్రమే పరిమితమైన పనులు ● భవన నిర్మాణాలకు మరో రెండేళ్లుపట్టే అవకాశం ● తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలున్నా స్పందించని రైల్వే శాఖ ● ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ఉండవంటున్న వాల్తేరు అధికారులురాజకీయాలకు రైల్వే జోన్ బలి! కూటమి నేతల నిర్లక్ష్యం, ఒడిశా రాజకీయాలకు ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కనీసం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ కూటమి ఎంపీలు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైల్వే మంత్రికి, బోర్డును కానీ కోరడం లేదు. శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా దీనిపై ఏ ఒక్క కూటమి ఎంపీ నోరు మెదపకపోవడం జోన్ పాలిట శాపంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒడిశా పావులు కదుపుతోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడ రాజకీయ నేతలు కూడా వీరికి సహకరించడంతో.. రైల్వే బోర్డు ఒడిశా ఏం చెబితే అదే చేస్తోంది. ఫలితంగా విశాఖ జోన్ బలవుతూ వస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును చేసే పనులకే పరిమితమైంది. భవనాలు నిర్మించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలు సిద్ధంగా ఉన్నా రైల్వే శాఖ మాత్రం ముందుకు రావడంలేదు. గతంలోనే ఇక్కడ ఉన్న భవనాల జాబితాను వాల్తేరు అధికారులు పంపించినా.. స్పందించకపోవడం చూస్తుంటే మరో రెండేళ్ల పాటు జోన్ కార్యకలాపాలు మొదలవ్వవేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్కు సంబంధించిన డీపీఆర్ని అదే ఏడాది చివర్లో ఇచ్చేసినా రాజకీయ కక్షతో ముందడుగు వేయలేదు. 2024 ఎన్నికల అనంతరం నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. జనవరిలో ప్రధాని చేతుల మీదుగా జోన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయినా ముడసర్లోవలో భూమి చదును చేసే పనుల్లోనే ఇంకా రైల్వే శాఖ నడిపిస్తోంది. ఈ భూములను తాము సాగుచేసుకుంటున్నామని స్థానికులు ఆందోళన చేయగా.. కూటమి నేతలు రంగంలోకి దిగి జోన్ భవనం వచ్చిన తర్వాత.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని శాంతింపజేశారు. అయినా.. ఇంకా చదును పనులే సా..గుతున్నాయి. తాత్కాలికానికి భవనాలు సిద్ధంగా ఉన్నా..! బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తాను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందుపరిచారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. తాత్కాలిక కార్యకలాపాలు చేపట్టేందుకు గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే తాత్కాలిక భవనాల జాబితా పంపించామని, ఇప్పటికీ అతీగతి లేకపోవడం చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. కూటమి ఎంపీలు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖవాసులు కోరుతున్నారు. జీఎం నియామకం ఎప్పుడో..? రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా.. ఈ తరహా పరిస్థితులు కనిపించలేదు. జోన్ ప్రకటించిన తరువాత కార్యకలాపాల్ని తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి.. కొత్త భవనాల నిర్మాణం అనంతరం అక్కడికి మార్చేవారు. కానీ విశాఖ జోన్ విషయంలో మాత్రం ఆది నుంచీ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. కొత్త భవన నిర్మాణాలు చేపట్టిన తర్వాతే ఆపరేషన్లు ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉండటంతో రాష్ట్రమంతటికీ సేవలందనున్నాయి. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. ఇది జరగాలంటే జోన్కు తొలుత జనరల్ మేనేజర్(జీఎం) నియామకం చేపట్టాలి. ఈ విషయంలోనూ బోర్డు స్పందించడం లేదు. -
ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం టికెట్ల విక్రయాలు, దర్శనాల నిర్వహణకు సంబంధించి దేవస్థానం విడుదల చేసిన జాబితాలో పలు వ్యత్యాసాలు, అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల సంఖ్య, తెల్లవారుజామున కల్పించిన అంతరాలయ దర్శనాల విషయంలో అధికారుల లెక్కలపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు పేరిట ఆదివారం విడుదలైన జాబితా ప్రకారం.. ఈ ఏడాది చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్లు ఆఫ్లైన్లో 15,495, ఆన్లైన్లో 7,591 కలిపి మొత్తం 23,086 విక్రయించారు. అలాగే రూ.1000 టికెట్లు ఆఫ్లైన్లో 13,803, ఆన్లైన్లో 3,999 కలిపి మొత్తం 17,802 జారీ చేశారు. రూ.1500 టికెట్లు కేవలం ఆఫ్లైన్లో 3,000 విక్రయించినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా 496 అంతరాలయ టికెట్లుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం మొత్తంగా 44,384 టికెట్లు విక్రయించినట్లు జాబితాలో ఉంది. అయితే గత నెల 24 నుంచి 29 వరకు రోజువారీగా టికెట్ల విక్రయాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 41,519 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొన్నారు. దీంతో దేవస్థానం విడుదల చేసిన మొత్తం లెక్కకు, రోజువారీ లెక్కలకు మధ్య 2,865 టికెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. తెల్లవారుజామున అంతరాలయ దర్శనం కేవలం 496 మందికి మాత్రమే కల్పించినట్లు అధికారులు చూపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం రోజు ఉదయం చాలా మందిని అంతరాలయ దర్శనానికి అనుమతించినట్లు భక్తులు, స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వారి అంచనా ప్రకారం అంతరాలయ దర్శనం పొందిన వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంటున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ప్రకటించారు. తీరా ఈవో ప్రకటనకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే టికెట్ల విక్రయాలు పెరిగినట్లు దేవస్థానం పేర్కొంది. 2024లో మొత్తం 32,461 టికెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 44,384 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. రూ.300, రూ.1000 టికెట్లలో గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 12,889 టికెట్లు విక్రయించామని పేర్కొంది. గత ఏడాది ఆన్లైన్లో రూ.300, రూ.1000 టికెట్లు కలిపి 8,216 విక్రయించగా, ఈ ఏడాది 11,590 అమ్ముడైనట్లు నివేదించారు. అంటే ఆన్లైన్లో 3,374 టికెట్లు అదనంగా విక్రయించామని చెబుతున్నారు. అయితే రూ.1000 టికెట్లు తొలిరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, మిగతా ఏ రోజుల్లోనూ ఆ టికెట్లు లభించలేదని భక్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత కొరవడిందని విమర్శిస్తున్నారు. -
ఆ.. నర్సులకు నైట్ డ్యూటీలు
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో కొన్నేళ్లుగా రాత్రి విధుల నుంచి తప్పించుకుంటున్న నర్సులకు ఎట్టకేలకు నైట్ డ్యూటీలు కేటాయించారు. ‘కొందరికే నైట్ డ్యూటీ ఎందుకు?’ శీర్షికతో గత నెల 23న ‘సాక్షి’ఓ కథనం ప్రచురించింది. కొన్నేళ్లుగా హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవి రాత్రి విధుల నుంచి ఏవేవో కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు. ఈ కథనానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఆ మరుసటి రోజే నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, రొటేషన్ ప్రకారం నైట్ డ్యూటీలు చేయాలని ఆ సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల కేజీహెచ్ను సందర్శించిన అదనపు డీఎంఈ కూడా పలు ఆదేశాలిచ్చారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా హెడ్ నర్సులదే బాధ్యత అని, బ్లాకుకు ఒక హెడ్ నర్సు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవికి ప్రస్తుతం నైట్ డ్యూటీలు కేటాయించారు. డీఎంఈ ఆదేశాల మేరకు బ్లాకుకు ఒక హెడ్ నర్స్ను నియమించారు. -
పుష్పయాగానికి పూలు తరలింపు
ఎంవీపీ కాలనీ: తిరుపతిలోని శ్రీ కొండండరామస్వామి వారి పుష్పయాగం కోసం విశాఖ నుంచి వివిధ రకాల పూలను తరలించారు. కార్తీక దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పుష్పాలను శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్ద భక్తుల సందర్శన కోసం ఉంచారు. మహిళా భక్తులు ముందుగా పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్ చేశారు. అనంతరం సంకల్పం చేసి, శాస్త్రోక్తంగా ఈ పూలను తిరుమలకు పంపించారు. కలువలు, తామరలతో పాటు పలు రకాల పూలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్త హిమాన్షు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు. -
గ్రిల్స్ దాటే ప్రయత్నంలో..
పీఎంపాలెం: పీఎంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటికి మరో పది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా.. చిన్న పొరపాటు వల్ల ఓ పెయింటర్ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. దుడ్డు కృష్ణ కుమార్(38) కొమ్మాది వైఎస్సార్ కాలనీలోని బ్లాక్ నంబరు 31 జీఎఫ్8లో తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. పెయింటింగ్ పనులే అతని జీవనాధారం. గురువారం ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన కృష్ణ కుమార్.. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కొమ్మాది కూడలి వద్ద ఆటో దిగాడు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 9.45 గంటల సమయంలో టీఎఫ్సీ బేకరీకి ఎదురుగా జాతీయ రహదారి మధ్యలో ఉన్న గ్రిల్స్ను దాటే ప్రయత్నంలో.. అక్కడ సెంటర్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. గ్రిల్స్ ఎక్కే క్రమంలో స్తంభానికి ఉన్న విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లు తాకడంతో.. షాక్కు గురై కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కృష్ణ కుమార్ను గమనించిన స్థానికులు అతని భార్య సునీతకు సమాచారం అందించారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని.. భర్తను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
అక్కిరెడ్డిపాలెం: గాజువాక మండలం చినగంట్యాడ గ్రామం అమరావతి పార్కు వద్ద గల కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి శుక్రవారం మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాక మండలం, పాతకర్ణవానిపాలేనికి చెందిన పి.వెంకటరమణమూర్తి (60) ఆఫ్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాలుగు నెలలుగా అతను డ్రైవింగ్కు వెళ్లడం లేదు. నాలుగేళ్ల కిందటఅతని భార్య చనిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మాదిరిగానే గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా కాలువలో పడి మృతి చెందినట్టు గుర్తించారు. అతనికి ముగ్గురు పి ల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీవీఎంసీ టౌన్ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 23 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 23 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఎ ప్రభాకరరావు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర రావు మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టౌన్ ప్లానింగ్ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున, వాటిని ప్రత్యేకంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారం అందిన 23 వినతుల్లో జోన్–2 నుంచి ఐదు, జోన్–3 నుంచి తొమ్మిది, జోన్–4 నుంచి ఒకటి, జోన్–5 నుంచి మూడు, జోన్–6 నుంచి నాలుగు, జోన్–8 నుంచి ఒకటి చొప్పున ఉన్నాయని ఆయన వివరించారు. అందిన వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. -
బాబూ.. ‘గ్యాస్’ డబ్బులేవీ?
డాబాగార్డెన్స్: ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలకు రూ.1500 నగదు బదిలీ, తల్లికి వందనం తదితర సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ మహిళలు శుక్రవారం నిరసనకు దిగారు. ‘బాబు గారూ.. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు?’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ 31వ వార్డు కృష్ణాగార్డెన్స్ రామాలయం వద్ద ఐద్వా, సిటు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్కు సంబంధించి వంద మందిలో కేవలం 30 మందికి మాత్రమే నగదు అందిందని.. మిగిలిన వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము సిలిండర్కు చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళా ఖాతాలో జమ చేస్తామని చెప్పిన హామీ కేవలం నీటి మూటగానే మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం ఊసే లేదని, ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు కావడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం పెంచుతోందని, తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.811 నుంచి రూ.861కి పెంచడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలపై ఎందుకు నోరు మెదపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ తీరుతో బయటకు కక్కలేక.. లోలోన మదన పడతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎలా మంచి ప్రభుత్వం అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిటు నాయకులు కర్రి గణేష్, ఎం.సుబ్బారావు, లెనిన్, అమ్మాజీ, అరుణ, లక్ష్మి, సరోజిని, వెంకటలక్ష్మి, పార్వతి, కాంతం, రామయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళలు జీవీఎంసీ 31వ వార్డులో నిరసన -
ప్రత్యేక తరగతులు పరిశీలించిన డీఈవో
గోపాలపట్నం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను ఆయన పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సదుపాయాలు, తరగతుల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, చదివే విధానం గురించి వివరించారు. పరీక్షలు రాసే మెలకువలను తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును పెంచాలని సూచించారు. -
మంత్రుల కమిటీ నిర్లక్ష్యమే కారణం
● త్రిసభ్య కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి ● సింహాచలం సంఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● కాంక్రీట్ పునాది, పిల్లర్లు లేకుండా గోడ నిర్మాణంలో అవినీతి జరిగింది ● మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.10 లక్షలు ఇవ్వాలి ● త్రీ మెన్ కమిషన్కు వినతి పత్రం అందజేసిన సీపీఎం సాక్షి, విశాఖపట్నం : చందనోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతా రాహిత్యం వల్లే సింహాచలం ఘోర దుర్ఘటన జరిగిందని సీపీఎం విశాఖ జిల్లా బృందం ఆరోపించింది. చందనోత్సవ విషాద ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ సర్క్యూట్ హౌస్లో రెండో రోజు విచారణ చేపడతున్న నేపథ్యంలో సిపిఎం విశాఖ జిల్లా బృందం కలిసి కమిషన్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, కార్పొరేటర్ గంగారావు కమిషన్తో మాట్లాడుతూ చందనోత్సవ నిర్వహణ, ఏర్పాట్లు పరిశీలనకు నియమించిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ పెను విషాదం సంభవించిందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నిస్పక్షపాతంగా విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీపీఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ మంత్రుల కమిటీ తగిన పర్యవేక్షణ, నూతన నిర్మాణాల తనిఖీలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదని అభిప్రాయపడ్డారు. చందనోత్సవానికి కేవలం కొన్ని రోజులకు ముందు అతిపెద్ద గోడ నిర్మాణం చేయడం, అదికూడా తగిన ప్లాన్, కాంక్రీట్ పునాది, పిల్లర్లు లేకుండా నాసిరకం మెటీరియల్తో నిర్మించడం కారణంగా ప్రమాదం సంభవించిందన్నారు. ఇందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోందన్న విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాంట్రాక్టర్ తోపాటు పనిని పర్యవేక్షించాల్సిన ఇంజనీర్లు, దేవాలయ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్లనే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర ఘటన జరిగిందని, వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చందనోత్సవం ఏర్పాట్లు పై ఎప్పటి కప్పుడు సమీక్షలు చేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. దుర్ఘటనలో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం న్యాయ సమ్మతం కాదని, ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం అందించాలని, కాంట్రాక్టు ఉద్యోగం కాకుండా పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు జగ్గునాయుడు, గంగారావు అన్నారు. కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన వారిలో పార్టీ నేతలు ఆర్కే, ఎస్వీ కుమార్, పి.మణి, జగన్, జ్యోతీశ్వరరావు ఉన్నారు. -
విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం: విద్యుత్ షాక్కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్లోని అయ్యప్పనగర్లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్తో కలిసి అయ్యప్పనగర్లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. -
హడావుడి
అతిథి గృహంలో● సర్క్యూట్ హౌస్లో రెండోరోజు విచారణ ● సింహాచలం విషాద ఘటనపై త్రిసభ్య కమిషన్ ● అర్చకుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ విచారించిన కమిషన్ ● మృతదేహాలు వెలికి తీసిన వారంతా సంప్రోక్షణ చేసుకోకుండానే విధుల్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అర్చకులు ● నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, విశాఖపట్నం : ఊహకందని దారుణం.. సింహగిరి చరిత్రలో విషాద పేజీగా నిలిచిపోయిన చందనోత్సవం దుర్ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. తొలిరోజున సింహాచలంపై సాగగా.. మలిరోజున ప్రభుత్వ అతిథి గృహం వద్ద హడావుడి కనిపించింది. అర్చకులు, వేదపండితులతో పాటు రెవెన్యూ, దేవదయ ధర్మాదాయ.. విభిన్న శాఖల అధికారులు, సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సుదీర్ఘ విచారణ సాగింది. దుర్ఘటనపై అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించిన త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి శనివారం నివేదిక సమర్పించనుంది. సింహాచలంలో ఏటా ఒక రోజు జరిగే పవిత్ర పర్వదినం అప్పన్న నిజరూపదర్శనం.. చందనోత్సవం విషాదోత్సవంగా మారిపోయిన ఘటన నుంచి విశాఖవాసులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. దేవాలయ చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో.. భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలిగొన్న తర్వాత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హడావుడిగా నియమించిన త్రిసభ్య కమిషన్ రెండు రోజుల విచారణ పూర్తి చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి సమగ్ర వివరాలు సేకరించింది. ఆది నుంచీ గోడ కట్టకూడదని చెప్పినా వినిపించుకోకుండా.. కట్టడం వల్లనే విషాదం చోటు చేసుకుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. త్రిసభ్య కమిషన్ దేవస్థాన అర్చకులను కూడా విచారించింది. మాడవీధిని ఆనుకొని రక్షణ గోడ ఉన్నప్పుడు దాని పక్కన కొత్తగా మరో గోడ కట్టడం సరికాదంటూ వైదికులు చెప్పినా పట్టించుకోలేదని కమిషన్కు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మహాపచారం చెయ్యడం వల్లే పెను విషాదం సంభవించిందని కూడా కమిషన్ ముందు తమ స్పందన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహాల వెలికితీత, శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బందిని పుణ్యస్నానాలు ఆచరింపజేయకుండా, సంప్రోక్షణ చేసుకోనివ్వకుండా.. విధుల్లోకి తిరిగి చేర్చడంపైనా అర్చకులు కమిషన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలోనూ ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగాయని కమిషన్కు అర్చకులు వెల్లడించారు. వరదనీటి వ్యవస్థ లేదా..? సింహాచలంలో వరద నీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2018లో రూపొందించిన దేవస్థానం మాస్టర్ప్లాన్లోనూ ఈ అంశాన్ని పొందుపరచకపోవడంపై దేవస్థానం అధికారులు, వీఎంఆర్డీఏ అధికారులపైనా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా సింహగిరిపై పడుతున్న సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. దానికనుగుణంగా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం సరికాదని సూచించింది. కనీసం వరద నీటి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపైనా విస్మయం చెందారు. మాస్టర్ప్లాన్లో ఉల్లంఘనలు ఉన్నట్లు కూడా ఉన్నాయని గుర్తించిన త్రిసభ్య కమిషన్... ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించలేదని ఆయా శాఖల అధికారుల్ని ప్రశ్నించింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాల్ని సేకరించిన కమిషన్.. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కేవలం చిన్న స్థాయి అధికారులపైనే ప్రతాపం చూపించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులపై కనీస చర్యలు ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే అసలు దోషి.! ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప.. ఇంకోటి లేదన్నది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతోంది. భారీస్థాయిలో భక్తులు వస్తారని, ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినా.. ఏర్పాట్లు విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం ఏడుగుర్ని పొట్టనపెట్టుకుందనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తోంది. కేవలం.. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిని బలి చెయ్యకుండా.. ఈ ప్రమాదం వెనుక ఉన్న మంత్రులపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు శాఖల వారీగా విచారణ కొనసాగింది. దేవస్థాన అధికారులు, ఇంజినీర్లను తొలుత విచారించారు. గోడ నిర్మాణం, ప్రసాద్ పనుల ఆలస్యం.. మొదలైన విషయాలపై ఆరా తీశారు. అదే సమయంలో టూరిజం ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారణకు హాజరవ్వమని ఆదేశించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు విభాగాల్ని ఒకేసారి విచారించిన కమిటీ ముందు.. గోడ నిర్మాణం, పనుల ఆలస్యం మొదలైన అంశాల్లో తప్పు మా శాఖది కాదు.. టూరిజం వాళ్లదేనని దేవస్థానం అధికారులు.. తమది కాదు.. వాళ్లదేనని టూరిజం ఇంజినీర్లు వాదించుకొని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దేవస్థాన ఇంజినీర్లతో పాటు టూరిజం ఇంజినీర్లది కూడా బాధ్యత ఉందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు కమిషన్కు నివేదించినట్లు సమాచారం. -
ఆరిలోవ ఏఎస్ఐ మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రమణ మరణించారు. అప్పుఘర్లో నివాసం ఉంటున్న ఆయన గత నెల 30న జరిగిన చందనోత్సవంలో విధులు నిర్వర్తించారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆయన సెలవు తీసుకున్నారు. శుక్రవారం ఇంటి వద్ద అతని బైక్ స్టాండ్ వేస్తుండగా అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు తెలిపారు. రమణ గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. రెండేళ్లుగా చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పీఎంపాలెం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్లో పని చేసి నాలుగేళ్ల కిందట బదిలీపై ఆరిలోవ వచ్చారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. -
అపోలోలో గుండె, పేస్మేకర్ పరీక్షలు ఉచితం
బీచ్రోడ్డు: నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి, ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అపోలో ఆసుపత్రి కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వినీషా సూచించారు. రామ్నగర్లోని అపోలో ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించిన సమస్యనా లేదా గ్యాస్ట్రిక్ సమస్యనా అనే ఆలోచన వస్తుందని, ఇకపై ఎలాంటి ఆలోచన లేకుండా నేరుగా అపోలో ఆసుపత్రికి వస్తే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్త పరీక్షలు నిర్వహించి సమస్యను నిర్ధారిస్తామని, ఒకవేళ గుండెకు సంబంధించిన సమస్య అయితే ఉచితంగా కార్డియాలజీ నిపుణులతో వైద్య సలహాలు అందిస్తామని వివరించారు. ఇప్పటి వరకు 800 మందికిపైగా ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే డివైస్ క్లినిక్ ఏర్పాటు చేశామని, ఈ క్లినిక్లో పేస్మేకర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేవలం రూ.999లకే జనరల్ హెల్త్ చెకప్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రవికాంత్, అడ్మినిస్ట్రేటర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అశోక్ గజపతికి బాధ్యత లేదా?
● ప్రమాద సమయంలో సింహగిరిపైనే అశోక్ ● మృతుల కుటుంబాల ను పరామర్శించలేదు ● కనీసం సంఘటనా స్థలానికి రాని వైనం సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన చోటుచేసుకుంది. చందనోత్సవం రోజున షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు మాత్రం ఇంతవరకు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. చందనోత్సవం రోజున స్వామివారి తొలి దర్శనం చేసుకునేది వంశపార ధర్మకర్తలే. ఆనవాయితీ ప్రకారం.. అశోక్గజపతిరాజు మే 29న రాత్రి సింహగిరిపై బస చేసి, 30న తెల్లవారుజామున కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న సమయంలో గోడ కూలి ప్రమాదం జరిగింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు మారుమోగినా అశోక్గజపతిరాజు ప్రమాద స్థలానికి రాలేదు. మూడు రోజులు గడిచినా ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవ డంతో భక్తులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై సైతం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన అశోక్గజపతిరాజు, ఇప్పు డు ఇంతటి ఘోర ప్రమా దం జరిగినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని నీతులు చెప్పే ఆయన, వారి మరణం పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అంటున్నారు. మృతుల కుటుంబాలకు దేవస్థానం తరఫున నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీదీ అదే దారి.. సింహగిరిపై చందనోత్సవంరోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘోర ప్రమాదంలో ఎంపీ భరత్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
అప్పన్న ఆలయంలో ఘనంగా తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ తిరునక్షత్రం పూజలు గత నెల 28న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం జయంతి సందర్భంగా ఆలయ బేడామండపంలోని హంసమూలన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, భగవత్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వారులను వేంజింపజేశారు. అనంతరం షోడశోపచార పూజలు, విశేష హారతులు, పారాయణాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. -
కార్మిక హక్కుల సాధనకు ఉద్యమం
● మే 20 అఖిల భారత సమ్మెను విజయవంతం చేయండి ● మేడే సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపుసీతమ్మధార: మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, మే 20న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గురువారం దొండపర్తి రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆశీలమెట్ట వరకు సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 29 కార్మి క చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వంటి చర్యలను ఆయన తప్పుబట్టారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ విమర్శించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వీవోఆర్పీలకు పనిభారం పెంచి వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా కనీస వేతనాల జీవోలు సవరించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని, కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఉండేలా జీవోలు ఇవ్వాలని కోరారు. ఆప్కాస్ రద్దు చేసి పాత కాంట్రాక్ట్ విధానం తీసుకురావడం దుర్మార్గమని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.మణి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పి.వెంకటరెడ్డి, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, పి.కృష్ణారావు, జి.అప్పలరాజు, కె.కుమారి, టి.నూకరాజు, టి.నాయుడు, ఆర్.నాయుడు, వై.రాజు, అప్పలనాయుడు, కె.శేఖర్, ఎ.సీతాలక్ష్మి, ఎంసీహెచ్. అప్పడు, కె.జె.అప్పారావు,శ్రీనివాస్, ఝాన్సీ , మల్లీశ్వరి సీతారత్నం, నరేంద్రకుమార్, పెద్ద సంఖ్యలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. -
ఫిరాయింపు కార్పొరేటర్లకు నిరసన సెగ చూపండి
గోపాలపట్నం: జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేటర్లు, నాయకులకు కార్యకర్తల నిరసన సెగ ఎలా ఉంటుందో చవిచూపించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కృష్ణా కళాశాల దరి పార్టీ కార్యాలయంలో గురువారం పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లు అమ్ముడుపోవడం దారుణమన్నారు. ఇలాంటి వారిని ప్రజల్లో తిరగనీయవద్దని సూచించారు. వీరి గురించి ప్రజలకు తెలిసేలా నల్లజెండాలతో శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా లొగకుండా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న నియోజకవర్గ పరిధి కార్పొరేటర్లు పీవీ సురేష్, గుండపు నాగేశ్వరరావు, గులిగిందల లావణ్య, బల్ల లక్ష్మణరావులను ఘనంగా సత్కరించారు. తొలుత మేడే సందర్భంగా వైఎస్సార్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి బీఎస్ కృష్ణ, దొడ్డి కిరణ్, బాకి శ్యామ్ కుమార్రెడ్డి, ఆళ్ల పైడిరాజు, పలు వార్డుల అధ్యక్షులు, ఇన్చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ ప్రసాద్ -
కొంపముంచింది
కూటమి నేతల కక్కుర్తేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుణ్యక్షేత్రాల్లో ఎన్నడూలేని ఘోరాలు, విషాదాలు సంభవిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే.. ఉత్సవ సమయంలో ఎంత ఎక్కువగా సొమ్ము చేసుకోవచ్చనే దానిపై కూటమి నేతల ఆత్రమే వీటికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి దగ్గర నుంచి.. భీమిలి ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ తమ అనుచరులకు కాంట్రాక్టులు, అనుయాయులకు వీఐపీ టికెట్లు ఇప్పించుకోవడంలోనే నిమగ్నమయ్యారు. ఎంత మంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై దృష్టిసారించలేదు. కూటమి నేతల కాసుల కక్కుర్తి ఈ దుర్ఘటనతో మరోసారి స్పష్టమైంది. సాక్షి, విశాఖపట్నం: ఊహకందని విషాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏడుగురి ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు.. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకూ వంత పాడుతున్నారు. కానీ.. కూటమి నేతల కక్కుర్తి కారణంగానే విషాదం నెలకొందని తెలుస్తోంది. కేవలం తమకు చందనోత్సవం వల్ల ఏం లాభం ఒనగూరుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు తప్ప... సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చందనోత్సవాన్ని ఎలా నిర్వహించాలనేదానికి ప్రాధాన్యమివ్వలేదు. ఏర్పాట్లు చేసేందుకు వివిధ రకాల పనుల్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ... తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అప్పగించారు. ఏర్పాట్లన్నీ గంటా అనుచరులకే.. అదే విధంగా.. ఏర్పాట్ల టెండర్ల వ్యవహారమంతా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిపించినట్లు సమాచారం. టెంట్లు, లైటింగ్, ఇతర పనులకు సంబంధించిన మొత్తం టెండర్లన్నీ గంటా దగ్గరుండి మరీ అనుచరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా కాంట్రాక్టుల ద్వారా అనుచరులకు లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారే తప్ప.. భక్తుల గురించి కనీసం పట్టించుకోలేదు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేపట్టారా అంటే.. దానికి కూడా అతీగతీ లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత.. బస్సులు కొండపైన నిలిపేయడంతో భక్తులు దిగువనే ఉండిపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు అందక నరక యాతన అనుభవించారు. ఇలా.. సింహాచలంలో జరిగిన దారుణానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అయినా.. వరుణుడిపై నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ బాటిళ్ల మాయాజాలం! ప్రతి చందనోత్సవానికి జీవీఎంసీ నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తుంది. దీనికి తోడుగా.. సింహాచలం దేవస్థానానికి మంచినీటి బాటిళ్లని అందించే రెగ్యులర్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి ఉత్సవానికి వీఐపీలకు 500 మిలీ బాటిల్స్ సరఫరా చేస్తుంటారు. ఈ చందనోత్సవానికి కూడా సదరు కాంట్రాక్టర్ 500 మిలీ బాటిల్స్ని లక్ష సరఫరా చేసే టెండరు అప్పగించారు. జీవీఎంసీ 20 లీటర్ల క్యాన్లు, పేపర్ గ్లాసుల్ని భారీ స్థాయిలో భక్తుల కోసం క్యూలైన్లలో, బస్ పాయింట్స్ దగ్గర, తొలి పావంచా దగ్గర ఏర్పాటు చేసింది. అయినా.. నీటి బాటిళ్లలో హోంమంత్రి మాయాజాలం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా.. 250 మిలీ నీటి బాటిల్స్ కచ్చితంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. భక్తులు లక్షన్నర వరకూ వస్తారని అంచనా వేశారు. అయినా.. 3 లక్షల బాటిల్స్ అవసరమంటూ హోంమంత్రి చెప్పడంతో దీనికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ని హోంమంత్రి ముఖ్య అనుచరుడికి అప్పగించారు. వాస్తవానికి ఈ బాటిల్స్ని 3 లక్షల వరకూ సరఫరా చేస్తామని చెప్పి టెండరు దక్కించుకున్న హోం మంత్రి అనుచరుడు.. కేవలం లక్షన్నర బాటిల్స్ మాత్రమే ఇచ్చి.. లెక్క మాత్రం 3 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది. -
బాల్యం విద్యా కేంద్రాల పటిష్టతకు చర్యలు
డాబాగార్డెన్స్: ప్రాథమిక విద్యకు జీవీఎంసీ బాల్యం పాఠశాలలు పునాది కావాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో బాల్యం విద్యా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బాల్యం విద్యా కేంద్రాల పటిష్టత, నమోదు శాతాన్ని పెంచేలా, ఈ వేసవి సెలవుల్లో ప్రణాళికలు చేపట్టాలన్నారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఉత్తమ పూర్వ ప్రాథమిక విద్యనందించేలా బాల్యం కేంద్రాలు పని చేయాలన్నారు. అనంతరం బాల్యం విద్యా కేంద్రాల్లో నమోదు శాతం పెంచేందుకు, అక్కడ అందించే విద్య, ఇతర సౌకర్యాల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వర్మ, బాల్యం విద్యా పథకం ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మోహన్కుమార్ ఆవులపాటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలను బలిగొందా...
● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంసింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్లలో వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్ స్కీమ్ కింద పాత షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నేడు కూడా విచారణ సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రీ మెన్ కమిటీ శుక్రవారం కూడా విచారణ చేయనుంది. దేవస్థానం అధికారులను కూడా విచారించనుంది. గురువారం సంబంధిత ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా... ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది.గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న త్రీమెన్ కమిటీ సభ్యులు -
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సీపీ సన్మానం
విశాఖ సిటీ: విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఏడుగురు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గురువారం సన్మానించారు. హోంగార్డు కమాండెంట్ కె.వి.ప్రేమ్జిత్, ఎస్ఐ ఐ.నాగరాజు, ఏఆర్ఎస్ఐ కె.అప్పారావు, ఏఎస్ఐ కె.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏఎస్ఐ వై.ఈశ్వరరావు, హెచ్సీ టి.రాము, హోంగార్డు పి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో వీరిని కుటుంబ సభ్యులతో కలిపి గురువారం పోలీస్ సమావేశ మందిరానికి ఆహ్వానించారు. పోలీస్ అధికారుల సమక్షంలో వారిని సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. -
కిశోర బాలికల వికాసానికి ప్రత్యేక శిక్షణ
ఎంవీపీ కాలనీ: కిశోర బాలికల వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ఆర్పీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు స్థానిక జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో గురువారం ప్రత్యేక శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో ఎంవీఆర్ కుమారి పాల్గొని, మాట్లాడారు. కిశోర బాలికల్లో పోషక విలువలు, వికాసానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో కిశోర బాలికలను గుర్తించి, వారితో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలుగా ఏర్పాటు చేసి, సమావేశాలు పెట్టాలన్నారు. వీటి ద్వారా బాలికలకు ఆరోగ్యం, విద్యతో పాటు లైఫ్ స్కిల్స్పై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా ఆర్పీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.వినీష తదితరులు పాల్గొన్నారు. -
సింహాచలం ఘటనపై ‘పచ్చ’పాతం
విశాఖ సిటీ: పచ్చ పత్రికలు మరోసారి కళ్లున్న కబోదిలా వ్యవహరించాయి. సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు నిర్జీవులుగా మారితే.. వాస్తవాలను సమాధి చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తూ తప్పుడు కథనాలు వండి వార్చాయి. చందనోత్సవం ఘటనలో కూటమి ప్రభుత్వం తప్పేమీ లేదనట్లు సాదాసీదా కథనాలతో సరిపెట్టేశాయి. ప్రముఖ దేవాలయాలన్నింట్లోనూ వరుస ప్రమాదాలు సంభవిస్తూ.. భక్తులు ప్రాణాలు కోల్పోతుంటే.. దాన్ని కూడా గత ప్రభుత్వాలు, లేదా అధికారులపైన నిస్సిగ్గుగా నెట్టేస్తూ రోత రాతలు రాస్తున్నాయి. ఇందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన చందనోత్సవ సమయంలోను, తాజా ఘటనలో రాసిన కథనాలే నిదర్శనం నేడు అధికారులపై నెపం.. వైఎస్సార్సీపీ హయాంలో ఒకరు డీ హైడ్రేషన్కు గురైతేనే ప్రభుత్వ వైఫల్యమని తేల్చేసిన పచ్చ పత్రికలు.. నేడు ఏడుగురు సమాధి అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం తప్పులేదన్నట్లు బాకాలు ఊదుతున్నాయి. చందనోత్సవం ఏర్పాట్లపై నెల రోజులుగా ఐదుగురు మంత్రుల కమిటీ సింహాచలంలోనే తిష్ట వేసింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ మంత్రులు ఊదరగొట్టారు. అయితే వీరు చందనోత్సవ ఏర్పాట్లను పక్కనపెట్టి పలు కాంట్రాక్టులను పంచుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్యూలైన్లో భక్తులకు మజ్జిగే కాదు.. మంచి నీటిని కూడా అందించలేదు. కానీ మంచి నీటి బాటిళ్ల విక్రయ కాంట్రాక్టును ఒక మంత్రి అనుచరుడికి అప్పగించడం చర్చనీయాంశమవుతోంది. ఇవన్నీ బహిరంగ రహస్యాలే అయినప్పటికీ పచ్చ పత్రికలకు కనిపించలేదు. కానీ అవసరం లేకపోయినప్పటికీ.. తాత్కాలికంగా గోడను నిర్మించి భక్తుల ప్రాణాలను హరిస్తే.. ఆ నెపాన్ని అధికారులపై నెట్టేస్తూ వార్తా కథనాలను ప్రచురించాయి. భక్తుల నెత్తుటి మరకలు కూటమి ప్రభుత్వానికి అంటుకోకుండా తెగ తాపత్రయ పడుతున్నాయి. ఒకవైపు మృతుల కుటుంబ సభ్యులు సైతం ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని విలపిస్తున్నా.. పచ్చ పత్రికలకు అవేవీ పట్టలేదు. వారి రోదనలు కనిపించలేదు. రాజకీయ పక్షాల నుంచి ప్రజా సంఘాల వరకు సింహాచలం ఘటనలో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని కూటమి ప్రభుత్వ తీరును తూర్పారబడుతుంటే వాటికి వినిపించలేదు. దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్దే తప్పు అంటూ వక్రభాష్యాలకు తెరతీశాయి. ప్రమాదం జరిగినే వెంటనే ప్రభుత్వం స్పందన అద్భుతమంటూ, బాధితులకు పరిహారం, ఉద్యోగం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ మరోసారి తమ ‘పచ్చ’పాత ధోరణిని బయటపెట్టుకున్నాయి. ఏడుగురు భక్తుల మరణాల్లో వాస్తవాలను ‘సమాధి’చేసిన పచ్చ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తూ తప్పుడు కథనాలు చందనోత్సవంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటున్న అన్ని వర్గాలు గతంలో ట్రాఫిక్ రద్దీపైనే నాలుగు పేజీల్లో వక్రభాష్యాలు నేడు కూటమి ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించని అవే పత్రికలు నాడు వైఎస్సార్సీపీపై విషం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2023, ఏప్రిల్ 23న చందనోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. సింహాచలం వరాహ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చారు. దీంతో సింహాచలం కొండపై ట్రాఫిక్ పెరిగింది. స్వామి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. భారీగా భక్తులు రావడంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీపైనే పచ్చ పత్రికలు విషం కక్కాయి. పతాక శీర్షికతో పాటు నాలుగు పేజీల్లో ‘భక్తులు విల విల’అంటూ తప్పుడు కథనాలు వండి వార్చాయి. ఒకవైపు దేవదాయ శాఖ అధికారులు భక్తులకు మంచినీరు, మజ్జిగ సరఫరా చేసినప్పటికీ.. అవేమీ చేయలేదంటూ అబద్ధపు రాతలు రాశాయి. ఆ సమయంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడంతో ఎండ వేడిని తట్టుకోలేక ఒక మహిళ స్వల్ప అస్వస్థత కలిగితే.. తాటికాయంత అక్షరాలతో అచ్చేశాయి. -
అమోఘం రిషిక నాట్యం
● ఢిల్లీకి విశాఖ కీర్తి ● అంతరంగ ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం ● ప్రధాని మెచ్చిన కళాకారిణి 8లోవిషాదంతో ఉలిక్కిపడ్డ వ్యాపారులు కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించి నాలుగు రోజులు కూడా గడవకముందే, తమ ప్రాంగణంలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడంతో సింహగిరి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో తాత్కాలిక దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వర్తకులను, చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందు హడావుడిగా, ఇంకా పూర్తిగా సిద్ధం కాని కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి తరలించారు. చందనోత్సవ సమయంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం అవసరమని చెప్పడంతో వ్యాపారులు అయిష్టంగానే కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి మారారు. తరలి వెళ్లిన కొద్ది రోజులకే తమ షాపింగ్ కాంప్లెక్స్ వద్దే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆందోళన చెందారు. సింహగిరి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, అయ్యో పాపం భక్తులంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
ప్రేమ పెళ్లి కాదన్నారని బలవనర్మణం
సీతమ్మధార: ప్రేమ వివాహానికి ఆంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అమోఘం రిషిక నాట్యం
అంతరంగ ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం 5వ తరగతి నుంచే అవార్డులు తల్లి ప్రోత్సాహంతో రిషిక ఎన్నో నృత్య పోటీలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 5వ తరగతిలో ప్రతిష్ఠాత్మకమైన ‘రూట్స్ టు రూట్స్ ఎక్స్ంప్లరి’ అవార్డును అందుకుంది. 6వ తరగతిలో రీజినల్ స్థాయికి చేరుకుని తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అదే స్ఫూర్తితో గత సంవత్సరం రీజినల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 2 వేల మంది పోటీదారులను అధిగమించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.తాటిచెట్లపాలెం: నగరానికి చెందిన జి. రిషిక తన అకుంఠిత దీక్షతో, అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా విశాఖ కీర్తిని చాటిచెబుతోంది. ఇటీవల ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ లతా మంగేష్కర్ నాట్యగృహ ఆడిటోరియంలో జరిగిన అంతరంగ ఉత్సవ్–2025లో కూచిపూడి నృత్య ప్రదర్శనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది మాత్రమే కాదు, 2023–24 సంవత్సరంలో న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా నిర్వహించిన కళా ఉత్సవ్లోనూ రిషిక తన కూచిపూడి నాట్యంతో క్లాసికల్ డ్యాన్స్ బాలికల విభాగంలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించింది. తద్వారా కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు సైతం దేశ రాజధానిలో విశేషమైన గుర్తింపు లభించింది. రిషికలోని అసాధారణ ప్రతిభను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించడం విశేషం. గత ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవం, అలాగే విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పె చర్చా’ కార్యక్రమానికి ఆమెను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఇటీవల ముంబయిలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన రిషికను కేవీ స్కూల్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. సాధారణ కుటుంబం.. అసాధారణ ప్రతిభ రిషిక తండ్రి ఒక ప్రైవేటు కళాశాలలో గుమస్తాగా పనిచేస్తుండగా, తల్లి బి.రామలక్ష్మి మల్లునాయుడుపాలెంలోని జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్/క్రాఫ్ట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. రిషిక చెల్లి ప్రస్తుతం కేవీ వాల్తేర్లో 9వ తరగతి చదువుతోంది. వీరి కుటుంబంలో సంగీతం, నాట్యం వంటి కళలకు సంబంధించి ఎలాంటి నేపథ్యం లేకపోయినా, చిన్ననాటి నుంచే రిషికకు నృత్యంపై ఉన్న అమితమైన ఆసక్తిని తల్లి గుర్తించారు. సినిమా పాటలకు అనుగుణంగా రిషిక చేసే నాట్యాన్ని చూసి మురిసిపోయేది. తల్లి ప్రోత్సాహంతో రిషిక క్లాసికల్ డ్యాన్స్లో చేరింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక ఆహ్వానం రిషిక ప్రతిభకు ముగ్ధులైన న్యూ ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించింది. ఎన్సీఈఆర్టీ కళాఉత్సవ్ 2023–24 విజేతలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వారు రాణిస్తున్న కళారూపాల్లో మరిన్ని మెళకువలు నేర్పించి, వారి ప్రతిభను మరింతగా మెరుగుపరచడమే ఈ ప్రతిభా సంవర్ధన్ – 2025 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు రిషిక మరోసారి ఢిల్లీకి వెళ్లనుంది. రిషిక సాధించిన విజయాలు కేవలం ఆమె కుటుంబానికే కాకుండా, విశాఖ నగరానికి, కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు గర్వకారణం. చిన్న వయస్సులోనే ఆమె కనబరుస్తున్న అకుంఠిత దీక్ష, అద్భుతమైన నృత్య ప్రతిభ ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, విశాఖ కీర్తిని వినువీధిన ఎగురవేయాలని ఆశిద్దాం. -
కారు ఢీకొని జింకకు గాయాలు
కొమ్మాది: బీచ్రోడ్డులో ఇందిరాగాంధీ జూపార్కు సమీపంలో నగరం నుంచి భీమిలి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న జింకను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ యువకుడు గమనించి, గాయపడిన జింకను రోడ్డు పక్కకు చేర్చి నీరు తాగించాడు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. అయితే, ఇటీవల కాలంలో జింకలు తరచూ జనావాసాల్లోకి రావడం, ప్రమాదాలకు గురికావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదాల బారిన పడి మరికొన్ని జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
మురళీనగర్: జిల్లాలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్, పెందుర్తి పాలిటెక్నిక్, భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కో ఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో ఏర్పాటుచేసిన 33 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13,188 మంది విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేయగా.. 12,363 మంది పరీక్షకు హాజరైనట్లు విశాఖ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. 94 శాతం మంది పరీక్ష రాయగా.. వీరిలో 7,422 మంది బాలురు, 4,941 మంది బాలికలు ఉన్నారు. విశాఖపట్నం కో–ఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 9,405 మందికి 8,746 మంది, పెందుర్తి కేంద్రం పరిధిలో 2,635 మందికి 2,531 మంది, భీమిలి కేంద్రం పరిధిలో 1,148 మందికి 1,086 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిశీలకుడు విజయభాస్కర్, నగర పరిశీలకుడు జి.దామోదరరావు, సహాయ కో–ఆర్డినేటింగ్ అధికారి కేడీవీ నరసింహారావు తదితరులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 94 శాతం మంది హాజరు -
విమ్స్లో క్షతగాత్రుడికి పరామర్శ
ఆరిలోవ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో గాయపడిన ఆరిలోవ ప్రాంతం బాలాజీనగర్కు చెందిన పి.ప్రవీణ్కుమార్కు విమ్స్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పలువురు నాయకులతో కలసి బుధవారం పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్కు మెరుగైన వైద్యం అందించాలని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబును కోరారు. పరామర్శలో వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి, శ్రీవాత్సవ్, కొండా రాజీవ్ తదితరులున్నారు. -
ఉద్యోగ విరమణ శేష జీవితానికి పునాది
అల్లిపురం: జీవీఎంసీలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం ప్రతి ఉద్యోగికి తప్పనిసరని, ఇది శేష జీవితానికి పునాది లాంటిదని జీవీఎంసీ అదనపు కమిషనర్ బి.వి.రమణమూర్తి అన్నారు. జీవీఎంసీలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులను అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, డీపీవో ఫణిరామ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజతో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు. ఆరోగ్యం కోసం ఏదో పని కల్పించుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.65,47,310 ప్రావిడెంట్ ఫండ్ను అందజేశారు. ఏపీడబ్ల్యూఈఎంఎస్, జేమ్స్ జనరల్ సెక్రటరీ ఎ.అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకు..
ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా స్కూబా డైవర్లు.. సముద్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. వీరికి బయో వ్యర్థాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బాధ్యతను ఇటీవల కాలంలో ప్లాటిపస్ వంటి స్కూబా డైవింగ్ సంస్థలు స్వచ్ఛందంగా చేపడుతున్నాయి. సముద్ర గర్భంలో వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. ఇందులో కనీసం 10 నుంచి 20 కిలోల వరకూ బయో వ్యర్థాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకూ స్కూబా డైవర్లు మెడీవేస్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాలు సముద్ర జీవరాశులతో పాటు.. పర్యాటకులకు ప్రాణహానిని కలిగిస్తుందని, అధికారులు తక్షణమే బయో వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రోడ్లపైనే కాలం చెల్లిన మందులు
నగరంలో పలు చోట్ల రోడ్ల పక్కన చెత్తకుప్పల్లో కాలం చెల్లిన మందులు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా వీటిని ఇన్సినరేటర్లో వేసి బూడిద చేయాల్సి ఉంది. కానీ సుమారు టన్నుల కొద్ది వచ్చే ఈ వ్యర్థాలను సకాలంలో కాల్చకుండా .. ఇలా ఖాళీ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిబంధనలను ఏమాత్రం లెక్కచేయక ఈ ఆస్పత్రులు, మెడికల్ షాపులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. బయో వ్యర్థాలను తరలించేందుకు సంబంధిత యాజమాన్యాలు కొంత మొత్తం ఏపీపీసీబీ సూచించే వ్యర్థాల నియంత్రణ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆస్పత్రి స్థాయికి తగ్గట్టు డబ్బులు చెల్లించాలి. పలుచోట్ల ఆయా సంస్థలు సక్రమంగా వచ్చి వ్యర్థాలను తీసుకెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నగరంలోనే దాదాపు 600కు పైగా ఆస్పత్రులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలు దాదాపు బయట ప్రాంతాల్లో పోస్తున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో పది శాతానికి మించి నిబంధనలు పాటించడంలేదు. కాలం చెల్లిన మందులు, ఇతర వ్యర్థాల్ని ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నెలకు రూ.1,100 చెల్లిస్తే చాలు ప్రతీ ఆస్పత్రి వద్దకు వచ్చి నిర్వహణ సంస్థలు స్వయంగా తీసుకువెళ్తాయి. కానీ ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. కాల పరిమితి ముగియడానికి 90 రోజులే గడువున్న మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో పంపిణీ చేయకూడదని నిబంధనలున్నాయి. అలాంటి మందులను సరఫరా చేసిన కంపెనీలకే తిప్పి పంపాల్సిందే. ఎందుకంటే ఒక ఔషధం దాని కాలపరిమితి తేదీకి 3 నెలల ముందు నుంచి అందులోని మందు శక్తిని కోల్పోతూ ఉంటుందని, అలాంటి మందులు వాడినా ప్రభావశీలంగా పనిచేసే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టేసి ఆస్పత్రులు ఇలా పడేస్తుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరవకపోతే.. నగరం బయోవ్యర్థాలమయంగా మారిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
సాగర గర్భంలో భయో వ్యర్థాలు!
● ప్లాస్టిక్ వేస్ట్తో సమానంగా మెడికల్ వ్యర్థాలు లభ్యం ● బయో వేస్ట్ వెలికితీస్తున్న స్కూబా డైవర్లు ● జాలరిపేట, రుషికొండ తీరాల్లో ఎక్కువగా లభ్యం ● జలచరాలకు హానికరమంటున్న పర్యావరణవేత్తలు సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన్ని బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. ప్రాణాంతకమైన మెడికల్ వేస్ట్ను అత్యంత భద్రంగా నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని ఆస్పత్రులు సముద్రాన్నే డస్ట్బిన్గా మార్చేసుకున్నాయి. దీంతో ప్రమాదకరమైన వైద్య వ్యర్థాలు సముద్రాన్ని ముంచెత్తుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఏటా విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 10 టన్నుల వరకు మెడికల్ వ్యర్థాలు సముద్రగర్భంలో కలుస్తున్నాయి. సాగర గర్భంలోకి చొచ్చుకుపోతున్న ఈ వ్యర్థాలు.. జీవ వైవిధ్యానికి చేటు తెస్తున్నాయి.. ఫలితంగా జలచరాలు నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా నడుంబిగించిన కొంతమంది స్కూబా డైవర్లు.. సముద్రం నుంచి బయో వ్యర్థాలు బయటపడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడీవేస్ట్ ‘సీ’గా మార్చేస్తున్నారు అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులకు మెడీ వేస్ట్ దర్శనమిస్తోంది. ఈ వ్యర్థాలను నిర్వహణ సంస్థలకు ఇవ్వాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బీచ్కు సమీపంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఇంజిక్షన్లు, సిరంజీలు, కాలం చెల్లిన మందులు, ఇంజక్షన్ సీసాలు, సైలెన్ బాటిల్స్ సాగరంలో కలిపేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇలా బయో వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారు. కేవలం రూ.1000 నుంచి రూ.2 వేలకు కక్కుర్తి పడుతున్న చిన్న చిన్న ఆస్పత్రుల నిర్వాహకులు.. సముద్రాన్ని మెడీవేస్ట్ సీగా మార్చేస్తూ పర్యావరణానికి హానితలపెడుతున్నారు. -
ఓవరాల్ చాంప్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ జట్టు
విశాఖ స్పోర్ట్స్: తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం(ఈకోర్సా) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన వాల్తేర్ డివిజన్ అంతర విభాగాల క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. కార్మిక శక్తిలో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో 14 విభాగాల నుంచి పురుషులు, మహిళలు 12 క్రీడాంశాల్లో వేర్వేరుగా తలపడ్డారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఆపరేషన్స్) జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా, ఆర్పీఎఫ్ జట్టు రన్నరప్గా నిలిచింది. బాల్ బ్యాడ్మింటన్లో ఈఎల్ఈసీ జట్టు, క్యారమ్స్లో ఈఎల్ఎస్, చెస్లో ఎలక్ట్రికల్(ఓ), టీటీలో కమర్షియల్, వాలీబాల్, బ్యాడ్మింటన్లలో ఈఎల్ఈసీ, అథ్లెటిక్స్లో ఆర్పీఎఫ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్లలో సీడబ్ల్యూ, ఫుట్బాల్లో ఆపరేటింగ్, క్రికెట్లో సంయుక్తంగా ఈఎల్ఈసీ–ఆర్పీఎఫ్ జట్లు, టెన్నిస్లో ఎస్అండ్టీ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఆర్ఎం లలిత్ బోహ్రా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల్లో స్నేహం, పరస్పర సహకారం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. అకౌంట్స్, మెడికల్, ఇంజినీరింగ్, కమర్షియల్, ఎలక్ట్రికల్(జనరల్), మెకానికల్, పర్సనల్, కన్స్ట్రక్షన్, సిగ్నల్ టెలికాం, మెకానికల్ (డీఎల్ఎస్), ఎలక్ట్రికల్(ఆపరేషన్స్), ఎలక్ట్రికల్(టీఆర్ఎస్), ఎలక్ట్రికల్(టీఆర్డి), ఆర్పీఎఫ్, సేఫ్టీ, స్పోర్ట్స్ విభాగాల జట్లు పోటీపడినట్లు తెలిపారు. అనంతరం డీఆర్ఎం విజేతలకు ట్రోఫీలు అందించగా, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్ సాహు, ఇ.శాంతారామ్, క్రీడాధికారి ఎం.హరనాథ్, సంయుక్త క్రీడాధికారి ఎ.అవినాష్, కోశాధికారి కబీర్ అన్సారి, సహాయ క్రీడాధికారి పాటిల్, కార్యదర్శి ఉష తదితర అధికారులు పాల్గొన్నారు. ముగిసిన రైల్వే అంతర విభాగాల స్పోర్ట్స్ మీట్ -
బాధిత కుటుంబాలకు మేయర్ పరామర్శ
అల్లిపురం: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ గంగారావు బుధవారం పరామర్శించారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే స్పందించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేశారని మేయర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యో గం ప్రకటించారని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. -
అడవివరంలో విషాదఛాయలు
సింహాచలం: సింహగిరిపై రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో స్టీల్ప్లాంట్ జనరల్ ఫోర్మెన్ ఎడ్ల వెంకటరావు(56) మృతితో అడవివరంలో విషాదం నెలకొంది. పాతికేళ్లుగా ఈయన ఇక్కడి బీసీ గురుకుల పాఠశాల సమీపంలో నివసిస్తున్నారు. ఆయన భార్య రామలక్ష్మి గురుకుల పాఠశాలలోనే స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్కు నెల రోజుల క్రితం వివాహం కావడంతో భార్యతో కలిసి బెంగళూరులో, చిన్నకుమారుడు పృధ్వీ చైన్నెలో ఉంటున్నారు. చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటి నుంచి కొండపైకి వెళ్లారు. వెళ్లిన గంటలోగానే మరణించారు. కేజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చి, పాత అడవివరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. స్టీల్ప్లాంట్ ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్ నాయకుడు పాశర్ల పైడిరాజు, స్టీల్ప్లాంట్ సిటు నాయకుడు అప్పారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చి వెంకటరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లో గ్యాస్ లీకేజీ
నలుగురు ఉద్యోగుల అస్వస్థతఉక్కునగరం: స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో బుధవారం గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. ఒకటో బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో ఉద్యోగులు విధి నిర్వహణలో ట్యూయర్ ప్లాట్ఫారంపై హోస్పైపు మార్చే క్రమంలో పైపు నుంచి గ్యాస్ లీకయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న యాదవ్ (సీనియర్ మేనేజర్), ఎ.వెంకటేశ్వరరావు(ఫోర్మెన్), రామరాజు (ఫోర్మెన్), అప్పలరాజు (కాంట్రాక్ట్ కార్మికుడు) గ్యాస్ ఉధృతికి అస్వస్థతకు లోనయ్యారు. గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎ.వెంకటేశ్వరరావును మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ప్లాంట్ ఉత్పత్తి పెంచే క్రమంలో యాజమాన్యం భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని, దీని వల్లే ప్రమాదం జరిగిందని స్టీల్ సీఐటీయూ నాయకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన ఉద్యోగులను తరలించిన అంబులెన్స్లో ఆక్సిజన్ సదుపాయం కూడా లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు -
హా.. నరహరీ
ఆర్తనాదాలతో మార్మోగిన సింహగిరి● పాలకుల నిర్లక్ష్యానికి ఏడు ప్రాణాలు బలి ● సింహాచలం చరిత్రలోనే తొలిసారి విషాదం ● మృత్యుఘోష వినకుండా.. దర్శనాలపైనే వీవీఐపీల దృష్టి ● వీఐపీ దర్శనాల కోసమే పనిచేసిన మంత్రుల కమిటీ చీకటిలో మృత్యు ఘోష బుధవారం వేకువజామున 2.22 గంటలకు ఈదురుగాలులు మొదలయ్యాయి. 2.25 గంటలకు గాలుల తీవ్రత పెరిగింది.. అప్పటికే వేలాది మంది భక్తులు క్యూల్లో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 2.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. 2.45 గంటలకు ఈదురుగాలులతో భారీ వర్షంగా మారింది. క్యూల్లో వేల మంది భక్తులు తలదాచుకునేందుకు సరైన వసతి లేదు. రూ.300 టికెట్ క్యూల్లోని భక్తులు వర్షపు నీరు రాని చోట ఆగారు. మరికొందరు తడిసి ముద్దవుతూనే స్వామి దర్శనం కోసం ముందుకు కదిలారు. సరిగ్గా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పైభాగం నుంచి ఇంకో 100 మీటర్లు ముందుకు వెళ్తే స్వామి దర్శనం కలుగుతుంది. ఇంతలో ఊహించని విపత్తు.. సరిగ్గా 3.05 గంటలకు కొత్తగా నిర్మించిన గోడపైకి వరదనీరు వచ్చింది. దీంతో గోడ బీటలు వారింది. టెంట్ గోడపైనే ఏర్పాటు చేయడంతో ఈదురుగాలులకు కూలిపోయింది. అదే సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి భక్తులపై పడింది. గోడ శిథిలాల కింద ఏడుగురు భక్తులు చిక్కుకొని మృత్యు ఒడికి చేరారు. సాక్షి, విశాఖపట్నం : నిత్యం నృసింహుని నామస్మరణతో పులకించే పవిత్ర సింహగిరి.. భక్తుల ఆర్తనాదాలతో కన్నీటి సంద్రమైంది. గోవిందా.. గోవిందా.. సింహాద్రి అప్పన్నా.. కాపాడు అని ఆ దేవ దేవుడిని వేడుకునే భక్తకోటి గొంతులే.. ప్రాణభయంతో రక్షించండి.. చచ్చిపోతున్నాం అంటూ హాహాకారాలు పెట్టాయి. సింహాద్రినాథుని నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల ఆశలు అక్కడికక్కడే సమాధి అయ్యాయి. స్వామి దర్శనానికి అడుగుల దూరంలో ఉండగానే.. కొందరు అనంతలోకాలకు చేరుకున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఈ మహా విషాదం.. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కనులపండువగా జరగాల్సిన చందనోత్సవం.. ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, మంత్రుల ప్రచార యావ, ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారుల చేతకానితనంతో తీరని దుఃఖాన్ని, అంతులేని వేదనను మిగిల్చింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘోర వైఫల్యోత్సవంగా.. ఈ చందనోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. భక్తుల ప్రాణాలకు విలువేదీ? రెండు వారాలుగా ఐదుగురు మంత్రుల కమిటీ పేరుతో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. సమీక్షల మీద సమీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లంటూ ప్రగల్భాలు పలికారు. కానీ.. క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం. ఏటా చందనోత్సవం రోజు వర్షం కురవడం ఆనవాయితీ. ఈ చిన్నపాటి ముందుచూపు కూడా లేకుండా.. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు, మంత్రులు ఏం చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వారి దృష్టి అంతా వీఐపీ టికెట్ల పంపకాలు, ప్రచార ఆర్భాటంపైనే కేంద్రీకృతమైంది తప్ప.. సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రత పట్టలేదు. ఫలితం ఈ ఘోర విషాదం. -
సింహాచలం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే..
● కుటుంబాలకు రూ.కోటి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ● మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ డాబాగార్డెన్స్/ఆరిలోవ: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారంతో పాటు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, రవిరెడ్డి, జియ్యాని శ్రీధర్, పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమో.. సింహాచలానికి చందనోత్సవం అంత పవిత్రమని చెప్పారు. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని తెలిసీ కూడా అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కొండవాలులో ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన రక్షణ గోడను ఫ్లైయాస్ ఇటుకలతో నిర్మించడమే గాక పెండాల్స్ను గోడకు కట్టడం.. ఫలితంగా ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం.. చేతగానితనం తేటతెల్లమైందన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాల రోదన అంతా ఇంతా కాదన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి పరిహారం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ‘కూటమి’ వైఫల్యమే.. చందనోత్సవంలో ఇంతటి ఘోరం జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుత ఘటన నిస్సందేహంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. -
భక్తులకు అష్టకష్టాలు
ఘాట్రోడ్డు వరకు బారులు తీరిన భక్తులుసింహచలం/పెందుర్తి: సింహాచలేశుడి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు అష్టకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. సామాన్య భక్తులకు సరిపడా బస్సుల్ని నడపంలో నిర్లక్ష్యం చూపిన అధికార యంత్రాంగం, తమ వారికి మాత్రం విచ్చలవిడిగా కారు పాసులు మంజూరు చేసింది. పోలీసులు కూడా తమ బంధువుల్ని ఇష్టారీతిన నేరుగా దర్శనానికి తీసుకెళ్లి సామాన్య భక్తులకు నరకం చూపడంలో తమను మించినవారు లేరని నిరూపించుకున్నారు. అడుగు అడుగునా నరకం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ దిగువ నుంచి సింహగిరికి చేరుకునే క్రమంలో వేలాది మంది భక్తులు నరకాన్ని చవిచూశారు. భక్తులకు సరిపడా బస్సులు నడపడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. సాధారణ సమయంలో కొండ దిగువ నుంచి 15–20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ చందనోత్సవాన భక్తులు కింద నుంచి సింహగిరికి చేరుకోవడానికి సగటున నాలుగైదు గంటల సుదీర్ఘ సమయం పట్టింది. కొండ దిగువన ఇటు గోశాల వద్ద, అటు అడవివరం కూడలి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. బస్ ఎక్కేందుకు దాదాపు 2 గంటలు, సింహగిరి పైకి చేరుకునేందుకు మరో రెండు మూడు గంటల సమయం పట్టిందని వేలాది భక్తులు వాపోయారు. కిక్కిరిసిన బస్సుల వెంట జనం పరుగులు పెట్టారు. కింద నుంచి కొండ మీద వరకు మహిళలు సైతం వేలాడుతూ ప్రయాణించారు. దర్శనం తర్వాత ఇంటి ముఖం పట్టేందుకూ ఇదే నరకాన్ని ప్రభుత్వం చూపింది. ఘాట్ రోడ్లో కిలోమీటర్ పైగా క్యూ ఉదయం 11 తరువాత భక్తుల తాకిడి అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు లోవతోట వైపు ఉన్న ఉచిత క్యూలో మాత్రమే భక్తులు ఉండగా.. ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు క్యూను ఘాట్ రోడ్కు మళ్లించారు. దీంతో ఘాట్ రోడ్లో నిమిషాల్లో క్యూ కిలోమీటరు దాటిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన చాలామంది భక్తులు సింహగిరి బస్టాండ్ వద్ద దిగి, తిరిగి ఘాట్ రోడ్డు క్యూకి చేరుకోవడానికి కిలో మీటర్పైగా వెనక్కి నడవాల్సి వచ్చింది. క్యూ లైన్లో చేరిన నుంచి స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టేందుకు 5 నుంచి 8 గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి వెంకన్న దర్శనానికి కూడా ఇంత సమయం పట్టింది లేదని కొందరు భక్తులు ఆవేదన వెళ్లగక్కారు. కూటమి నేతలు, అధికారులు, పోలీసుల కుటుంబాలు మాత్రం నిమిషాల వ్యవధిలోనే తమ కళ్లముందే దర్జాగా దర్శనం చేసుకుని వెళ్లిపోయారని ఆక్షేపించారు. కొండ పైకి వెళ్లే బస్సు ఎక్కేందుకే గంటల తరబడి పడిగాపులు దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూల్లో నరకయాతన కొండపైకి విచ్చలవిడిగా కారు పాసులు భక్తులను గాలికి వదిలేశారు బస్ ఎక్కడానికి క్యూ పద్ధతి పాటించాలన్నారు. దర్శనం అయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్ ఎక్కడానికి దాదాపు 2 గంటలకు పైగా వేచి వుండాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం దారుణం. – కల్యాణి, సోంపేట, శ్రీకాకుళం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం కొండపైకి ప్రైవేటు వాహనాలు అనుమతించలేదు. దీంతో దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సును ఆశ్రయించాం. గంటన్నర పాటు బస్సు కోసం ఉన్న తరువాత.. కొండపైకి చేరడానికి మరో మూడు గంటలు పట్టింది. – నారాయణరావు, నర్సారావుపేట -
బాధిత కుటుంబాలకు భరోసా
విశాఖ సిటీ: సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న వార్త కూటమి ప్రజా ప్రతినిధుల్లో వణుకు పుట్టించింది. జగన్ నేరుగా కేజీహెచ్కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతారని ముందు షెడ్యూల్ రావడంతో వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు అలెర్ట్ అయిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద హడావుడి చేశారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని వైద్యాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పోస్టుమార్టం చేసి తరువాత ఆ తతంగాన్ని పూర్తి చేశారు. మృతదేహాలను కేజీహెచ్ నుంచి వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.50 గంటలకు విశాఖకు వచ్చారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా చంద్రంపాలెంలో ఉన్న మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి ఽధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకొని 7.15 గంటలకు విజయవాడకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. సాయంత్రం విశాఖకు వచ్చిన మాజీ సీఎం జగన్ నేరుగా చంద్రంపాలెంలో బాధిత కుటుంబం ఇంటికి పయనం ఆయనను విశాఖకు రానీయకుండా చేసేందుకు కూటమి విశ్వప్రయత్నాలు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహణ అయినప్పటికీ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్