Visakhapatnam District Latest News
-
వందేళ్ల రైల్వే విద్యుదీకరణ వేడుకలు
తాటిచెట్లపాలెం: భారతీయ రైల్వేలో విద్యుదీకరణ జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈస్ట్కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో వేడుకలు ఘనంగా జరిగాయి. డీఆర్ఎం మనోజ్కుమార్ సాహూ ఆధ్వర్యంలో దొండపర్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ మొదటి ఎలక్ట్రికల్ రైలు 1925 ఫిబ్రవరి 3న ప్లాట్ఫాం 2 పూర్వపు విక్టోరియా టెర్మినస్(ప్రస్తుత ఛత్రపతి శివాజీ టెర్మినస్) నుంచి కుర్లా స్టేషన్కు నడిచిందన్నారు. దీనికి గుర్తుగా భారతీయ రైల్వే పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందేళ్లలో జరిగిన ప్రగతిపై ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ట్రాక్షన్) బి.షణ్ముఖరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డివిజన్ పరిధి పలు విభాగాలకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
జీబీఎస్పై ఆందోళన వద్దు
కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ మహారాణిపేట: గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) అంటువ్యాధి కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ భరోసానిచ్చారు. ఆంధ్రా మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యుల ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. కేజీహెచ్లో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని. కేసులు పెరుగుతున్నా భయాందోళన చెందనక్కర్లేదన్నారు. కేజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.గోపి మాట్లాడుతూ జీబీఎస్ వ్యాధి గురించి సమగ్రంగా వివరించారు. క్లినికల్ ప్రైజేంటేషన్, డయాగ్నస్టిక్ విధానాలు, సమకాలీన చికిత్స వ్యూహాల్లో కీలక విషయాలను తెలిపారు. ఇది కరోనా వైరస్లా అంటువ్యాధి కాదని, ఇమ్యూన్ సిస్ట్ం వల్ల నాడీ వ్యవస్థ పైపొర దెబ్బ తినడం వల్ల వస్తుందన్నారు. -
నలభై ఏళ్ల కళావైభవం.. కూచిపూడి కళాక్షేత్రం
కళాభారతిలో ఘనంగా వార్షికోత్సవం మద్దిలపాలెం: ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల సీనియర్ నాట్య కళాకారులు వారి నాట్య విన్యాసాలతో కళా ప్రియుల హృదయాలను సమ్మోహనపరిచారు. కూచిపూడి కళాక్షేత్రం 40వ వార్షికోత్సవం శుక్రవారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్, జూనియర్ కళాకారులు వారి నాట్య సోయ గాలతో అందరి హృదయాలను రంజింపచేశారు. ఈ సందర్భంగా నటరాజ్ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకుడు బత్తిన విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ పద్మభూషణ్ డాక్టర్ వెంకటేశ్వర సత్యం 40 ఏళ్ల కిందట విశాఖలో స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రం ఎందరో కళాకారులను తయారు చేసిందన్నారు. కళాక్షేత్రంలో 1985 నుంచి 2025 వరకు నేర్చుకున్న పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కలిపి 100 మంది నృత్య ప్రదర్శనలు ఇవ్వడం అద్భుతమైన ఘట్టమన్నారు. కళాక్షేత్ర గురువు హరి రామమూర్తి దర్శకత్వంలో తారకాసుర సంహారం అను నృత్య రూప కం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ శ్యాం ప్రసాద్, కళాభారతి అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు, లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మధుసూదన రావు, కూచిపూడి కళాక్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ మిత్ర, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్, శైలజ పాల్గొన్నారు. -
భూ కుంభకోణ నివేదికను బయటపెట్టండి
● బురదజల్లడం కాదు.. ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ● గ్రూప్–2 అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● కూటమి ప్రభుత్వం తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీపై స్పష్టతే లేదు ● మీడియాతో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణసాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూ కుంభకోణాలకు సంబంధించి జరిపిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఊరికే బురదజల్లడం కాదు.. ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఇదే వేదికపై నుంచి అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి నచ్చినట్లే 2004 లేదా 2014 ఏ సంవత్సరం నుంచి అయినా విచారణ జరిపిన నివేదికను బయటపెట్టాలన్నారు. శుక్రవారం లాసన్స్బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక, దళారీ విధానంతో ఇబ్బందుల పడుతున్న రైతులను పరామర్శించడానికి మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళితే చట్ట వ్యతిరేక కార్యక్రమంటూ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్కు రక్షణ కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగానే చంద్రబాబు విజయవాడలో మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారని, కోడ్ ఉన్నప్పుడే యూనివర్సిటీలకు వీసీ నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు, మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు వెళ్లినట్లు అబద్దాలు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి లేరన్న విషయం ముందుగానే తెలియదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని.. చంద్రబాబు ఎప్పుడూ వ్యవసాయం, రైతుల గురించి ఆలోచించిన దాఖలాల్లేవన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా..? గ్రూప్–2 మెయిన్స్ రోస్టర్ పాయింట్ సమస్యలపై ఉన్న అభ్యంతరాలను సహేతుకంగా పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ పరిస్థితే వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే.. కూటమి పార్టీలు ఇచ్చిన హామీల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. -
రీ సర్వేకు ముందే రైతులకు సమాచారం
అధికారులకు కలెక్టర్ ఆదేశం తగరపువలస: రీ సర్వే చేపట్టే గ్రామాల్లో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, నిబంధనల మేరకు సంబంధిత నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. భీమిలి మండలం దాకమర్రిలో శుక్రవారం ఆయన పర్యటించారు. భూముల రీ సర్వే ప్రక్రియను అధికారులతో పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను గమనించారు. రైతులతో మాట్లాడి, రీ సర్వేపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూముల పరిరక్షణ, సరిహద్దుల గుర్తింపు, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చేపడుతున్న ఈ ప్రక్రియకు రైతులు సహకరించాలన్నారు. రైతులు దగ్గరుండి సర్వే చేయించుకోవాలని సూచించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం దాకమర్రి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు పరిశీలించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట భీమిలి తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
● రెండు, మూడు దశాబ్దాలుగా ఒకే చోట విధులు ● ఈపీడీసీఎల్నే శాసిస్తున్న ఎంఆర్టీ డివిజన్ టెస్టర్లు ● బదిలీ చేసిన 3 రోజుల్లోనే మళ్లీ యథాస్థానానికి.. ● వారిపై చర్యలకు యత్నించిన ఏఈలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ● కార్పొరేట్ కార్యాలయంలోనూ చక్రం తిప్పుతున్న ఆ ఐ
విజి‘లెన్స్’కూడా లేదు చేసేది చిన్న ఉద్యోగమైనా వీరంతా కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. తమ సెక్షన్ పరిధిలో ఏ పనికి వచ్చినా వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్టీ డివిజన్లో ఎల్టీ మీటర్, హెచ్టీ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ విభాగాలుంటాయి. ఎంఆర్టీ యూనియన్ రా‘రాజు’గా చెలామణి అవుతూ మూడు దశాబ్దాలుగా ఎల్టీ మీటర్ సెక్షన్లోనే పనిచేస్తున్నారు. ఎవరికై నా ఎక్కువ బిల్లు వస్తే మీటర్ టెస్టింగ్కు దరఖాస్తు చేసుకుంటారు. ఈ సమయంలోనే వీరంతా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తారు. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో మీటర్లో తప్పుందంటూ సర్టిఫై చేసి వినియోగదారుల దగ్గర నుంచి అందినకాడికి గుంజుకుంటారు. వీరిపై పలుమార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. వీరికి గోపాలపట్నం కార్యాలయంలోని కొందరు అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. పలుమార్లు ఎంఆర్టీ ఉద్యోగుల వ్యవహారశైలిపై ఈపీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందినా కనీసం స్పందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈ–శ్రమ్ నమోదుతో బీమా సౌకర్యం
మహారాణిపేట: మత్స్యకారులు, మత్స్య అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు తప్పనిసరిగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ఫ్లాట్ఫాం(ఎన్ఎఫ్డీపీ)లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) పి.లక్ష్మణరావు సూచించారు. శుక్రవారం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో పీఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన(పీఎంఎంకేఎస్ఎస్వై) పథకంపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. మత్స్యకారులను అసంఘటిత కార్మికులుగా గుర్తించేందుకు ఈ–శ్రమ్ నమోదు చేయించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ బీమా సౌకర్యం పొందవచ్చన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖ జోనల్ డైరెక్టర్ భామిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, అవకాశాలను వివరించారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు(ఎన్ఎఫ్డీబీ) హైదరాబాద్ అధికారి సుజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి, వాటిని పొందేందుకు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్డీపీ ఈ శ్రమ్ కార్డుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్ఐఎఫ్పీహెచ్ఏటీటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మీనా, సీఐఎఫ్ఎన్ఈటీ డిప్యూటీ డైరెక్టర్ బిష్ణోమ్, మత్స్యశాఖ ఎఫ్డివోలు ఆశాజ్యోతి, మురళి, డీపీఎం కృష్ణ, ఎంపెడా ప్రతినిధి హనుమంతరావు, రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, వివిధ సంఘాల నాయకులు సీహెచ్ వీర్రాజు, సీహెచ్ పొతురాజు, పరదేశి పాల్గొన్నారు. -
తెలుగు తల్లికి నీరాజనం
మద్దిలపాలెం: మాతృభాషా దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు దండు ఆధ్వర్యంలో తెలుగుతల్లి కీర్తనలతో సందడి చేశారు. జీవీఎంసీ స్కూల్, వండర్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొని.. పాటలు, పద్యాలతో తెలుగు తల్లిని కీర్తించారు. తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ యునెస్కో సూచన మేరకు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాభిమానులు జరిపే ఏకై క ‘విశ్వవేడుక‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని కొనియాడారు. మాతృభాష కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులకు నివాళులర్పించారు. ఆ స్ఫూర్తితో తెలుగు వారంతా అమ్మభాషను కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమాగాంధీ, కాశీవిశ్వేశ్వరం, చిన సూర్యనారాయణ, శ్రీధర్, కొచ్చెర్లకోట సత్యనారాయణమూర్తి, భాగవతుల విశ్వనాథం, మదరిండియా మాధవి, పంతుల లలిత, పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొని తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించారు. -
రోస్టర్ సరిచేసి గ్రూప్–2 నిర్వహించాలి
ఎంవీపీ కాలనీ: ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ రోస్టర్ తప్పిదాలు సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటూ ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ ఎదుట మూడో రోజు శుక్రవారం కూడా అభ్యర్థులు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో ఏపీపీఎస్సీ 904 ఖాళీలతో గ్రూప్–2 నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండగా రోస్టర్లో దాదాపు 50 శాతం వరకు పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. దీనిపై కోర్టులో వాదనలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇటీవల కోర్టు మెయిన్స్ పరీక్ష వాయిదా వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఈ ఆదివారం మెయిన్స్ జరగాల్సివున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వెలిగించి నిరసన తెలిపారు. ఏయూలో చదువున్నవారితోపాటు, వివిధ ప్రాంతాల్లో ఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేరుకుని నిరసనకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు నిరసన ఆపేదిలేదన్నారు. పలువురు అభ్యర్థులతో కూడిన మరో బృందం విశాఖలోని ప్రజాప్రతినిధులను కలిసి, పరీక్ష వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరుతూ వినతిపత్రాలు అందించింది. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 3వ రోజూ కొనసాగిన గ్రూప్–2 అభ్యర్థుల నిరసన -
రోస్టర్ సరిచేసి గ్రూప్–2 నిర్వహించాలి
ఎంవీపీ కాలనీ: ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ రోస్టర్ తప్పిదాలు సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటూ ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ ఎదుట మూడో రోజు శుక్రవారం కూడా అభ్యర్థులు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో ఏపీపీఎస్సీ 904 ఖాళీలతో గ్రూప్–2 నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండగా రోస్టర్లో దాదాపు 50 శాతం వరకు పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. దీనిపై కోర్టులో వాదనలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇటీవల కోర్టు మెయిన్స్ పరీక్ష వాయిదా వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఈ ఆదివారం మెయిన్స్ జరగాల్సివున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వెలిగించి నిరసన తెలిపారు. ఏయూలో చదువున్నవారితోపాటు, వివిధ ప్రాంతాల్లో ఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేరుకుని నిరసనకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు నిరసన ఆపేదిలేదన్నారు. పలువురు అభ్యర్థులతో కూడిన మరో బృందం విశాఖలోని ప్రజాప్రతినిధులను కలిసి, పరీక్ష వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరుతూ వినతిపత్రాలు అందించింది. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 3వ రోజూ కొనసాగిన గ్రూప్–2 అభ్యర్థుల నిరసన -
షాకే..!
● తిష్ట వేసిన టెస్టర్లు..ముట్టుకుంటే ఈపీడీసీఎల్లో వారంతా సాధారణ ఉద్యోగులే. అయినప్పటికీ కార్పొరేట్ కార్యాలయాన్నే శాసిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఒకే చోట పాతుకుపోయారు. వారి ఆగడాలు శృతి మించుతుండటంతో, అక్కడి నుంచి బదిలీ చేయాలని ప్రయత్నించిన అధికారులకే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చి చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఎగిరిపోయారు. కానీ వారు మాత్రం లోకల్ అంటూ అక్కడే తిష్ట వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, బదిలీ చేసిన మూడు రోజుల్లోనే తిరిగి పాత గూటికి చేరుకున్నారంటే.. వారి రూటే సెప‘రేటు’అని అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్టీ డివిజన్లో టెస్టర్లుగా విధులు నిర్వహిస్తున్నా.. సీజీఎంల కంటే పవర్ ఫుల్గా వ్యవస్థను మేనేజ్ చేస్తున్న ఘనులు కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి. – సాక్షి, విశాఖపట్నం ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కొందరు ఉద్యోగులకు మాత్రమే కొమ్ముకాస్తున్న వ్యవస్థగా మారిపోయింది. రాజకీయ మద్దతు, ఉన్నతాధికారుల అండదండలు ఉంటే దశాబ్దాలుగా ఒకే చోట కాలు కదపకుండా పాతుకుపోవచ్చు. ఇందుకు గోపాలపట్నంలోని ఎంఆర్టీ డివిజన్ ఉద్యోగులే నిదర్శనం. ఆ డివిజన్లోని మీటర్స్ సెక్షన్లో ఐదుగురు ఉద్యోగులు దశాబ్దాలుగా ఈపీడీసీఎల్ను ఏలుతున్నారు. ఎల్టీ మీటర్ సెక్షన్లో జేఎల్ఎం నుంచి ఫోర్మన్ గ్రేడ్–2గా అక్కడే ఎదిగిన ఒక ఉద్యోగి ఏకంగా 32 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక హెచ్టీ సెక్షన్లో టెస్టర్ గ్రేడ్–1, 2 విభాగాలకు చెందిన ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు 29 ఏళ్లుగా, మరొకరు 25 ఏళ్లుగా, ఇంకొకరు 23 ఏళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నారు. సిటీ మీటర్ సెక్షన్లో టెస్టర్ గ్రేడ్–1 ఉద్యోగి 21 ఏళ్లుగా ఆ విభాగాన్ని ఏలుతున్నారంటే.. ఈపీడీసీఎల్లో వీరి పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు బదిలీ అయినా.. మళ్లీ అక్కడికే.! ఒక్కొక్క ఉద్యోగి 20 నుంచి 30 సంవత్సరాలకు పైగా ఒకే చోట తిష్ట వేసుకొని కూర్చోవడంతో... విధుల పట్ల వారు నిర్లక్ష్యం వహించినా ప్రశ్నించేవారు కరువయ్యారు. జూనియర్లుగా విధుల్లోకి వస్తున్న వారిపైనే విధుల భారం మొత్తం మోపుతున్నారు. వీరు చెప్పినట్టు వినకపోతే, జూనియర్లకు బదిలీ వేటు తప్పదు. అల్లూరి లేదా శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేయించేస్తారు. తమ సెక్షన్ పరిధిలో ఎవరికై నా బదిలీ కావాలంటే, ఈ ఉద్యోగుల సిఫారసు తప్పనిసరిగా మారింది. ఈపీడీసీఎల్ ఎంఆర్టీ డివిజన్లో ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలో వీరి కనుసన్నల్లోనే ఉన్నతాధికారులు చేస్తుంటారని విమర్శలూ ఉన్నాయి. వీరి ఆగడాలు భరించలేక.. ఏఈలు, డీఈలు ఎవరైనా సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. ఆ అధికారులకే ఎదురుదెబ్బ తగులుతుంది. ఫిర్యాదులు చేసిన వారందరూ గోపాలపట్నం కార్యాలయం నుంచి బదిలీ అయిపోయారే తప్ప.. వీరిని మాత్రం కదిలించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇటీవల జరిగిన బదిలీల్లో ఏడాది కాలం పనిచేసిన ఉద్యోగులను సైతం ఈపీడీసీఎల్ అధికారులు బదిలీ చేశారు. కానీ, ఈ ఉద్యోగుల జోలికి మాత్రం పోలేదు. ఈ వ్యవహారంపై కొందరు విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో హడావుడిగా ఈ ఐదుగురినీ అనకాపల్లి, విజయనగరం, అల్లూరి జిల్లాలకు బదిలీ చేశారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గోపాలపట్నం కార్యాలయానికి తిరిగి వచ్చేయడం గమనార్హం. గతంలో ఒకటి రెండుసార్లు బదిలీ చేసినా, నెల రోజుల్లోనే తిరిగి గోపాలపట్నంలో ప్రత్యక్షమయ్యారు. -
గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
పెందుర్తి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి నరవలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరవ సమీపంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా గ్రావెల్ తవ్వకాలు జరిగిన గొయ్యిలో హత్యకు గురైన వ్యక్తిని దహనం చేశారు. సగానికి పైగా కాలిపోయిన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నరవ సమీపంలోని ఓ క్వారీ గొయ్యిలో సుమారు 25–35 వయసు కలిగిన యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ కె.సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ మాట్లాడుతూ మృతుడు నీలం రంగు ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. పెందుర్తితో పాటు నగరం, ఇతర ప్రాంత పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులను పరిశీలించి మృతుని వివరాల కోసం ఆరా తీస్తామన్నారు. సమాచారం కోసం 94407 96039, 96767 97314 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. నరవ క్వారీలో దహనం చేసిన దుండగులు -
అన్ని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు
మహారాణిపేట: అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మాతా, శిశు ఆరోగ్యం అడ్వైజరీ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులను ముందుగానే గుర్తించి, వారికి సరైన వైద్య సేవలు దక్కేలా వైద్యులు సహకారం అందించాలన్నారు. రోగులకు అందించే వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు మాట్లాడుతూ మాతా, శిశు మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. కేజీహెచ్ గైనిక్ విభాగాధిపతి డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ కొన్ని మార్పులు చేయడం ద్వారా కేజీహెచ్లో మాతా, శిశు మరణాలు తగ్గాయన్నారు. సమావేశంలో కేజీహెచ్ చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ చక్రవర్తి, అగనంపూడి పీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, జనరల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ వి.సత్యప్రసాద్, కేజీహెచ్ అనస్తీషియా హెచ్వోడీ డాక్టర్ వి.రవి, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు డాక్టర్ లూసీ, డాక్టర్ బి.ఉమావతి, ఎస్.జయదేవి, డాక్టర్ గీతావందన, డాక్టర్ శ్రీదేవీ, ఐ.మనోరమ, బి.నాగేశ్వరరావు, బి.మురళీకృష్ణ, త్రినాథ్, షర్మిలాకుమారి తదితరులు పాల్గొన్నారు. మాతా, శిశు ఆరోగ్య సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
రైల్వే కార్మికుల ‘డిమాండ్ డే’ నిరసన
తాటిచెట్లపాలెం: ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్త పిలుపు మేరకు ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ డివిజనల్ కో ఆర్టినేటర్ పి.రామ్మోహనరావు ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ డే నిర్వహించారు. దొండపర్తిలోని డీఆర్ఎం కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు, యూనియన్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం వినతులు ఇస్తున్నా, రైల్వే శాఖ పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఓపీఎస్లో ఉన్న అన్ని అన్ని ప్రయోజనాలతో యూపీఎస్ను అమలు చేయాలన్నారు. పాయింట్స్ మెన్ కేటగిరీ ఉద్యోగులకు 4గ్రేడ్ పే అమలు, ఉద్యోగుల పిల్లలకు ఉన్నత చదువుకు ఎడ్యుకేషనల్ అలవెన్సులు తదితర 50 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఎం మనోజ్కుమర్ సాహూకు అందించారు. కార్యక్రమంలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు పీవీజే రాజు, కార్యదర్శి బి.దామోదరరావు, ఆర్వీఎస్ఎస్ రావు, వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు ఎం సన్యాసిరావు, గౌతం దేవ్, ఇతర కేంద్ర నాయకులు, బ్రాంచ్ కార్యదర్శులు పాల్గొన్నారు. -
యువ క్రీడాకారులకు ‘ఎఫ్సీఐ’ ప్రోత్సాహం
విశాఖ స్పోర్ట్స్: మీరు ఔత్సాహిక క్రీడాకారులా? అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో ఉన్నారా? అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు ఆర్థికంగా అండగా నిలవడానికి స్టైఫండ్ను అందిస్తోంది. ఫుట్బాల్, హాకీ, క్రికెట్లో రాణిస్తున్న బాలురు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వెయిట్లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తున్న బాలబాలికలు ఈ ప్రోత్సాహకాన్ని అందుకోవచ్చు. 15–18, 18–24 సంవత్సరాల వయసు గల వారు ఇందుకు అర్హులు. సిటీ లేదా గ్రామీణ ప్రాంతం అనే తేడా లేదు. మీరు అర్హులైతే వెంటనే www.fci.gov.in వెబ్సైట్ను సందర్శించి, మార్చి 6వ తేదీలోపు మీ పేరును నమోదు చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. -
భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తులు
సీతమ్మధార: యూఎల్సీ పరిధిలో ఆక్రమణదారులు భూ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ఎం.రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 150 చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణదారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.27ను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు. రేసపువానిపాలెం, మద్దిలపాలెం, పెదవాల్తేరు, దొండపర్తి తదితర ప్రాంతాల్లోని 39, 40 సర్వే నెంబర్ల పరిధిలో యూఎల్సీ భూములు ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఏళ్ల తరబడి ఆక్రమించి నివాసం ఉంటున్న వారు ముందుగా ల్యాండ్ సర్వే చేయించుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆక్రమణ విస్తీర్ణం, ఆధార్ కార్డు, స్కెచ్ కార్డు, భూమి రికార్డులు తదితర పత్రాలను జతపరచి, సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సిందిగా సూచించారు. -
యూసీసీ క్రికెట్ విజేత విజయనగరం
విశాఖ స్పోర్ట్స్: యూసీసీ టీ20 క్రికెట్ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. రైల్వే స్టేడియంలో జరిగిన ఫైనల్లో కావలీర్స్ జట్టుపై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయనగరం జట్టు 8 వికెట్లకు 209 పరుగులు చేయగా, కావలీర్స్ జట్టు 152 పరుగులకు ఆలౌటైంది. ఫైనల్స్లో బెస్ట్గా రవికిరణ్, టోర్నీ బెస్ట్ బ్యాట్స్మన్గా కేఎస్ఎన్ రాజు, బెస్ట్ బౌలర్గా క్రాంతి, టోర్నీ ఓవరాల్ బెస్ట్గా వాసు నిలిచారు. బహుమతి ప్రదానోత్సవంలో జీజేజే రాజు, కరణ్, సోనా దోనా, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నలుగురు చిన్నారులకు రూ.లక్ష సాయం అందించారు. -
వియత్నాంలో భారత నౌకలు
సింథియా: ఇండియన్ నేవీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్కు చెందిన ఐఎన్ఎస్ టిర్, ఐసీజీఎస్ వీరా నౌకలు వియత్నాంలోని కామ్ రాన్ బేకు చేరుకున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి. వియత్నాం నేవీ సిబ్బంది, అక్కడ భారత మిషన్ సభ్యులు ఈ నౌకలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని, సహకారాన్ని మరింతగా పెంచుతుందని నేవీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సందర్శనలో భాగంగా నేవీ బృందాలు వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. పోర్ట్ కాల్, వివిధ క్రాస్–ట్రైనింగ్ కార్యకలాపాలు, వియత్నాం నావల్ అకాడమీ సందర్శన తదితర కార్యక్రమాలు జరిగాయి. వియత్నాం నేవీ, కోస్ట్ గార్డ్లతో ద్వైపాక్షిక విన్యాసాలతో ఈ పర్యటన ముగుస్తుందని నేవీ అధికారులు వెల్లడించారు. -
తెలుగు తల్లికి నీరాజనం
మద్దిలపాలెం: మాతృభాషా దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు దండు ఆధ్వర్యంలో తెలుగుతల్లి కీర్తనలతో సందడి చేశారు. జీవీఎంసీ స్కూల్, వండర్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొని.. పాటలు, పద్యాలతో తెలుగు తల్లిని కీర్తించారు. తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ యునెస్కో సూచన మేరకు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాభిమానులు జరిపే ఏకై క ‘విశ్వవేడుక‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని కొనియాడారు. మాతృభాష కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులకు నివాళులర్పించారు. ఆ స్ఫూర్తితో తెలుగు వారంతా అమ్మభాషను కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమాగాంధీ, కాశీవిశ్వేశ్వరం, చిన సూర్యనారాయణ, శ్రీధర్, కొచ్చెర్లకోట సత్యనారాయణమూర్తి, భాగవతుల విశ్వనాథం, మదరిండియా మాధవి, పంతుల లలిత, పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొని తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించారు. -
దిల్ మ్యాంగో మోర్.!
● ఈసారి ఆశాజనకంగా మామిడి దిగుబడి ● మంచు లేకపోవడంతో కొమ్మల నిండా పూత ● గతేడాది ఎకరాకు 1.5 టన్నుల మామిడి దిగుబడి ● ఈ ఏడాది 3 టన్నుల వరకూ వచ్చే అవకాశం ● అదే బాటలో జీడిమామిడి దిగుబడి ● జిల్లాలో 3 వేల హెక్టార్లలో మామిడి, 1200 హెక్టార్లలో జీడిమామిడి సాగు జిల్లాలో మామిడి సాగు 3,000 హెక్టార్లు పద్మనాభం 2000 హెక్టార్లు భీమిలి 50 హెక్టార్లు ఆనందపురం 400 హెక్టార్లు పెందుర్తి 50 హెక్టార్లు సేంద్రియ సాగు 30 హెక్టార్లు(పద్మనాభం) గతేడాది ఎకరానికి దిగుబడి1.5 టన్నులు ఈ ఏడాది అంచనా 3 నుంచి 4 టన్నులు జిల్లాలో జీడిమామిడి సాగు 1200 హెక్టార్లు పద్మనాభం 400 హెక్టార్లు సింహాచలం 200 హెక్టార్లు ఆనందపురం 300 హెక్టార్లు భీమిలి 300 హెక్టార్లు గతేడాది ఎకరానికి దిగుబడి150 కిలోలు ఈ ఏడాది అంచనా 250 కిలోలు సాక్షి, విశాఖపట్నం: గతేడాది నామమాత్రపు దిగుబడులు అందించిన మామిడి ఈసారి రైతుల్ని ఊరిస్తోంది. మొదటి దశలోనే మామిడిపూత విరబూసి అందరిలోనూ ఆశలు నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు పూతలతో కళకళలాడుతున్నాయి. ముందుగానే పూతలు రావడం.. రెండో దశలోనూ నిలబడటంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి దిగుబడి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మామిడి మాదిరిగానే... జీడి మామిడి కూడా భారీగా పూతతో రైతుల మోముల్లో ఆనందం నింపుతోంది. కలిసొస్తున్న అనుకూల వాతావరణం వాతావరణంలో చలితీవ్రత తప్ప.. అకాల వర్షాలు ఇంతవరకూ పడలేదు. దాదాపు ఏప్రిల్ చివరి వరకూ వానలు కురిసే సూచనలు కనిపించడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొగమంచు తీవ్రత కూడా భయపడేంతగా లేదు. ఏటా పొగమంచు ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఉండేది. ఈసారి జనవరి చివరి నుంచే పొగమంచు దాదాపు తగ్గిపోయింది. ఇది మామిడి పూతకు ఎంతో అనుకూల వాతావరణమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మామిడి పూత నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కొంచెం ముందుగానే పూత వచ్చింది. నవంబర్లో వచ్చిన మొదటి పూతతో పాటు డిసెంబర్లో ప్రారంభమైన రెండో దశ పూత కూడా బాగానే ఉంది. గతేడాదితో పోలిస్తే.. ఈసారి పెద్ద మొత్తంలో మామిడి పూత పూయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూత నిలిస్తే మామిడి దిగుబడి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. ఆశాజనకంగా మామిడి, జీడిమామిడి దిగుబడి గతేడాది వాతావరణం అనుకూలించకపోవడం.. పొగమంచు, అకాల వర్షాల కారణంగా పూత నిలబడలేదు. ఈసారి పూత నిలబడటమే కాకుండా.. పలుచోట్ల పిందె స్థాయికి పంట చేరుకుంది. ఇదేరీతిలో వాతావరణం అనుకూలిస్తే.. దిగుబడి ఆశాజనకంగా ఉండనుంది. గతేడాది కంటే రెట్టింపు దిగుబడి వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఎకరానికి కేవలం ఒకటిన్నర టన్ను మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ సారి 3 టన్నుల వరకూ వస్తుందని ఉద్యానవన శాఖ అధికారుల అంచనా. అయితే.. తేనెమంచు(బంక తెగులు) పురుగు, నల్లిపురుగు, బూడిద తెగులు ఆశించకుండా జాగ్రత్తలు పాటిస్తే.. మరింత దిగుబడి రావచ్చని అధికారులు చెబుతున్నారు. జీడిమామిడిలో కూడా అద్భుతంగా పూత ఉందనీ.. దీని దిగుబడి గతేడాది కంటే పెరిగే సూచనలున్నాయని చెప్తున్నారు. గతేడాది ఎకరానికి 150 కిలోల దిగుబడి మాత్రమే ఉందనీ.. ఈసారి 250 కిలోలకు పైగా వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. కొమ్మల నిండా మామిడి పూత పిందెగా మారే సమయంలో జాగ్రత్తలు ప్రస్తుతానికి మామిడి, జీడిమామిడి పూత, పిందె దశలో అద్భుతంగా ఉన్నాయి. పూత పిందె కింద మారుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు పెట్టకూడదు. నీరు పెడితే పిందె రాలిపోతుంది. నిమ్మకాయ సైజు వరకూ పెరిగిన తర్వాత మాత్రమే నీరు పెట్టాలి. పెస్ట్ మేనేజ్మెంట్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో లీటరు నీటిలో ఇమిడా క్లోరోపిడ్ 0.5 మి.లీ. 3 గ్రాముల బ్లైటాక్స్తో కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ నెలాఖరులో లీటరు నీటిలో 2 మి.లీ. లామ్డా 10ఈసీ, 3 మి.లీ. కాంటాఫ్ కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. పూత, పిందె నిలబడి దిగుబడి బాగా వస్తుంది. మరో నెలరోజులు వాతావరణం ఇదే తరహాలో అనుకూలంగా ఉంటే మామిడి తోటల రైతులు లాభాల బాట పడతారు. బయ్యర్ సెల్లర్ మీటింగ్ మే నెలలో నిర్వహిస్తాం. – కె.సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
స్టీల్ప్లాంట్లో వీఆర్ఎస్పై వీడని ఉత్కంఠ
విడుదల కాని ఉన్నతాధికారుల జాబితా ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. కార్మికులు, కనిష్ట స్థాయి అధికారుల జాబితా విడుదలైనప్పటికీ ఈ5, ఆ పైస్థాయి అధికారుల జాబితాపై సస్పెన్స్ అలానే ఉంది. స్టీల్ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన వీఆర్ఎస్ స్కీమ్లో బుధవారం నుంచి అమలు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతగా నాన్ వర్క్స్కు చెందిన కార్మికులు, ఈ4 స్థాయి వరకు అధికారుల జాబితా విడుదల చేశారు. గురువారం వర్క్స్కు చెందిన కార్మికులు, ఈ4 స్థాయి అధికారులతో కూడిన 826 మంది జాబితా వెల్లడించారు. వారికి ఈపీఎస్ఎస్ పోర్టల్లో వీఆర్ఎస్ ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఆయా హెచ్ఆర్ జోనల్ కార్యాలయాల్లో అధికారిక పత్రాలు అందించారు. అయితే ఈ5, ఆ పైస్థాయి అధికారులకు చెందిన నాన్ వర్క్స్, వర్క్స్ జాబితాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఉన్నత యాజమాన్యం పరిధిలో ఉండే ఆ జాబితాకు ఆమోదం లభించక పోవడం వల్లే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీఆర్ఎస్ స్కీమ్ నిబంధనలకు విరుద్ధంగా అమోదం పొందిన కొంత మందిని ఉన్నత యాజమాన్యం గుర్తించి, వారిని పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే తిరస్కరణకు గురైన వారికి ఈ నెల 22 వరకు అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు. -
మాజీ సీఎం జగన్ భద్రతపై ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గుంటూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ సెక్యూరిటీని ఎందుకు తొలగించారని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఆయన కడుపు మంటను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కనీస సెక్యూరిటీ ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ జనం మనిషి అని, ఆయన్ని అడ్డుకోవడం మీ వల్ల కాదన్నారు. కనీస మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వెళ్లేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఆయన రైతులను పరామర్శిస్తే.. చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పైగా రైతులను పరామర్శించినందుకు వెళ్లిన జగన్పైనే కేసులు పెట్టి, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలు ఉన్నాయని కేసులు పెడితే.. మరి మీరు నిర్వహించిన మ్యూజికల్ నైట్కు ఎన్నికలు నిబంధనలు అడ్డురాలేదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, యథావిధిగా ఆయన భద్రత కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్ఎస్ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు. -
కమీషన్ల దందా!
పేదల ఇళ్లపైవిశాఖలోనే రూ.5 కోట్లకుపైగా కలెక్షన్ ● ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున వసూలు ● కాంట్రాక్టర్లకు గృహ నిర్మాణ శాఖ అధికారుల హుకుం ● లేదంటే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులు ● దుకాణం తెరిచిన నామినేటెడ్ పోస్టులోని కూటమి నేత ● కాంట్రాక్టర్లతో నేరుగా డీలింగ్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేదల ఇళ్ల నిర్మాణాలపై కూటమి నేతలే కాదు అధికారులు కూడా గెద్దల్లా వాలిపోతున్నారు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున ఇస్తేనే బిల్లులు చేస్తామంటూ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు తెగబడుతున్నారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఓ అధికారి కాంట్రాక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. ఒకవేళ అడిగిన మొత్తం ఇవ్వకపోతే బిల్లులు చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. తమకు వారం వారం బిల్లులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో కాంట్రాక్టర్లు కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కావాల్సిన ఇళ్ల నుంచి సదరు అధికారి ఏకంగా రూ.5 కోట్లకుపైగా వసూలు చేసేందుకు సిద్ధపడటం గమనార్హం. మరోవైపు నామినేటెడ్ పోస్టులోని కూటమి నేత ఒకరు కూడా వసూళ్ల దుకాణం తెరిచినట్టు తెలుస్తోంది. నేరుగా కాంట్రాక్టర్లతో డీలింగ్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు తెలియకుండా ఏ ఒక్కరి బిల్లు కూడా జారీ కాకూడదంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఒక వైపు అధికారులు, మరో వైపు కూటమి నేత వసూళ్లతో పేదల ఇళ్ల నిర్మాణం నాసిరకంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మీరు ఎలా ఇళ్లు నిర్మించి ఇచ్చినా.. ఎటువంటి విచారణ లేకుండా బిల్లులు మంజూరు చేస్తామంటూ హామీ లభిస్తుండటంతో కాంట్రాక్టర్లు కూడా అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కమీషన్లు రూ. కోట్లలోనే.. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఇళ్లను గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ నగర పరిధిలో ఇళ్లు మంజూరు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు కేసులు వేసి స్థలాలు ఇవ్వకుండా తాత్సారం చేశారు. చివరకు కోర్టులో కేసులు తేలిన తర్వాత జగనన్న కాలనీల్లో 2023 చివర్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా విశాఖ పరిధిలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇంకా నిర్మాణంలో ఉన్నవి, ప్రారంభించాల్సిన ఇళ్ల సంఖ్య లక్షకు పైగానే ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు కలిసొచ్చింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాలతో కాంట్రాక్టర్లు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున ఇవ్వాలంటూ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారి ఒకరు టార్గెట్ విధించారు. ఇది చిన్న మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ.. మొత్తం లెక్కిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్క విశాఖ జిల్లాలోనే నిర్మాణంలో ఉన్నవి, ప్రారంభం కావాల్సిన ఇళ్ల సంఖ్య 1,06,303 ఉన్నాయి. అంటే ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లెక్కిస్తే సదరు అధికారి వసూళ్ల లక్ష్యం రూ.5.31 కోట్లకు పైమాటే. అనకాపల్లి, అల్లూరి జిల్లాలను కూడా కలిపి లెక్కిస్తే గృహ నిర్మాణ శాఖ అధికారుల వసూళ్ల మొత్తం సుమారు రూ.10 కోట్లకు చేరుతుంది. అంతేకాకుండా కింది స్థాయి లోని అధికారులతో పాటు నామినేటెడ్ పోస్టులోని మరో కూటమి నేత కూడా ఇంటికి ఇంత చొప్పున వసూళ్లకు తెగబడినట్టు సమాచారం. ఈ మొత్తం కలుపుకుంటే రూ.15 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పేదల ఇళ్ల నిర్మాణాలువిశాఖ జిల్లాలో... మంజూరైన ఇళ్లు 1,14,795 పూర్తయిన ఇళ్లు 8,492 నిర్మాణ పనులు మొదలైన ఇళ్లు 91,219 ప్రారంభం కావల్సినవి 15,084అనకాపల్లి జిల్లాలో.. మంజూరైన ఇళ్లు 65,800 పూర్తయిన ఇళ్లు 28,910 వివిధ దశల్లో నిర్మాణంలోని ఇళ్లు 19,278 ప్రారంభం కావల్సినవి 17,627 ఇళ్ల నాణ్యతపై నీలినీడలు? కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలపై కినుక వహించింది. గృహ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ నానా యాగీ చేసింది. దీనిపై విచారణ చేపట్టాలంటూ హడావుడి చేసింది. గృహ నిర్మాణ లబ్ధిదారులందరూ అసలైన అర్హులు కావడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. విచారణ పేరుతో పుణ్యకాలం కాస్తా గడిపింది. గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయక పోతే రాయితీ మొత్తాన్ని ఇవ్వబోమని కేంద్రం నుంచి గట్టిగా వార్నింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇదే అదనుగా కట్టే ప్రతీ ఇంటికీ తమ వాటాగా రూ.500 ఇవ్వాలంటూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు నామినేటెడ్ పోస్టులోని కూటమి నేతతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతు వాటా ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఒకవైపు.. వసూళ్ల డిమాండ్ మరోవైపు ఉండటంతో పేదల ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అల్లూరి జిల్లాలో.. మంజూరైన ఇళ్లు 56,852 పూర్తయిన ఇళ్లు 3,350 వివిధ దశల్లో నిర్మాణంలోనివి 49,798 ప్రారంభం కావాల్సినవి 3,527 -
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ గురువారం సమీక్షించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమైన, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం(10–12.30) మధ్యాహ్నం (3–5.30) రెండు పూటలా జరిగే పరీక్షకు 15 నిముషాలు గ్రేస్ పీరియడ్ దాటాక వచ్చేవారిని అనుమతించేది లేదన్నారు. దివ్యాంగులకు, గర్భిణులకు సాధ్యమైనంత మేరకు మొదటి అంతస్తులోనే పరీక్ష గదుల్ని కేటాయించాలని చెప్పారు. ఇన్విజలేటర్లు నిబంధనలు పాటించాలని, పరీక్షకు 5 నిముషాల ముందు మాత్రమే సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్నా పత్రాలను తెరవాలన్నారు. మాస్ కాపీయింగ్, ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు. -
నిలకడగా విద్యార్థినుల ఆరోగ్యం
పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ప్రారంభం పెదగంట్యాడ: పోలీసుల సంక్షేమానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. మండలంలోని బీసీ రోడ్డు దయాల్ నగర్ ఎదురుగా పోలీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విశాఖలో తొలిసారిగా పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెట్రోల్ బంక్ నిర్వహణ విషయంలో రాజీ పడవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో విధిగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఉచితంగా గాలి అందించాలని, మరుగు దొడ్ల సదుపాయం కల్పించాలని తెలిపారు. బంక్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. బీపీసీఎల్ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ–2 మేరీ ప్రశాంతి, డీసీపీ అడ్మిన్ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్కమల్, ఏసీపీ–1 ఎస్వి అప్పారావు, హార్బర్ ఏసీపీ కాళిదాస్, గాజువాక ఏసీపీ త్రినాథ్, న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, ఎస్ఐలు గణపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
మాతా, శిశు మరణాలు అరికట్టాలి
మహారాణిపేట: మాతా, శిశు మరణాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాతా, శిశు మరణాలకు అవకాశం లేకుండా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అతిసార వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయాలన్నారు. టీబీ, కుష్టు, హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రుల పనితీరుపై తరచూ సమీక్ష నిర్వహించి, తగు సూచనలివ్వాలని పేర్కొన్నారు. 108, 104 పనితీరుపై సమీక్ష జరపాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, జిల్లా ప్రొగ్రాం అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చికెన్ ధరలుచికెన్ (కిలో) (వెన్కాబ్) బ్రాయిలర్ (లైవ్) : రూ.95 స్కిన్ : రూ.160 స్కిన్లెస్ : రూ.170 -
వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
విశాఖ సిటీ : వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. రైతు విభాగం అధ్యక్షుడిగా బోని అప్పలనాయుడు(భీమిలి), పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా మామిడి శివరామకృష్ణ(భీమిలి), గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా కర్రి రామరెడ్డి(విశాఖ ఉత్తర), ఆర్టీఐ విభాగం అధ్యక్షుడిగా వడ్డాది దిలీప్కుమార్(విశాఖ దక్షిణ), అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా సర్వసిద్ధి సాయి లత(విశాఖ పశ్చిమ)లను నియమించారు. అలాగే సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా వంకాయల మారుతీప్రసాద్(భీమిలి), ఐటీ విభాగం అధ్యక్షులుగా లావణ్య చిమట(భీమిలి), డాక్టర్స్ విభాగం అధ్యక్షులుగా కె.వి.ఎస్.కల్యాణ్(గాజువాక), పబ్లిసిటీ విభాగం అధ్యక్షులుగా బగతి విజయ(విశాఖ ఉత్తర) నియమితులయ్యారు. ముగ్గురి డిశ్చార్జ్.. ముగ్గురి చేరిక మహారాణిపేట: గులియన్ బారే సిండ్రోమ్తో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో గురువారం ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇదే వ్యాధి లక్షణాలతో మరో ముగ్గురు కేజీహెచ్లో చేరారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన ఒక మహిళ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తం ఏడుగురు కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోరుతూ 23న సదస్సు
విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 23న జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ నూతన కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన న్యాయవాదులతో సదస్సు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు డిమాండ్ 1993 నుంచి ఉందని, ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో 43 శాతం ఈ ప్రాంతానికి చెందినవేనని పేర్కొన్నారు. విశాఖలో హైకోర్టు బెంచ్తోపాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం జస్టిస్ ఎట్ డోర్ స్టెప్స్ నినాదంతో జరిగే ఈ సదస్సులో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. తొలి దశలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. మలిదశలో ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. -
స్టీల్ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీసు
మార్చి 7 తర్వాత సమ్మె ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మార్చి 7 తర్వాత సమ్మె చేయనున్నట్లు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో కార్మిక సంఘాలు గురువారం సెంట్రల్ స్టోర్స్ కూడలి నుంచి ఉక్కు అడ్మిన్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. అక్కడ జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను దొడ్డిదారిన తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సుమారు 300 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏను తొలగించాలని చూస్తున్నారన్నారు. పాత పద్ధతిలో గేటు పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల్లో నిర్వాసిత ఖాళీలను నిర్వాసితులతోనే భర్తీ చేయాలన్నారు. అనంతరం ప్లాంట్ యాజమాన్య ప్రతినిధులకు సమ్మె నోటీసు అందించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, మంత్రి రవి, వంశీ, కోన అప్పారావు, ఉమ్మిడి అప్పారావు, వి.వి.రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్కు ఘన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం విశాఖ ఎయిర్పోర్టులో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్పోర్టుకు మధ్యాహ్నం 12.42 గంటలకు చేరుకున్నారు. ఎయిర్పోర్టు వీఐపీ లాంజ్లో వైఎస్సార్ సీపీ నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం 1.19 గంటలకు హెలికాప్టర్లో పార్వతీ పురం మన్యం జిల్లా పాలకొండకు బయలుదేరారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించి తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు 4.13 గంటలకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి 6.20 గంటలకు విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికినవారిలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, మాజీఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, కన్నబాబురాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్తలు కె.కె.రాజు, తిప్పల దేవన్రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కె.సతీష్, ముఖ్యనేతలు జి.వెంకటేశ్వరావు, బొడ్డేడ ప్రసాద్, గొలగాని శ్రీనివాస్, ఈర్లె అనురాధ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, రెయ్యి వెంకటరమణ, సాడి పద్మారెడ్డి, వంశీరెడ్డి, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు జాన్వెస్లీ, పేడాడ రమణకుమారి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, పీలా వెంకటలక్ష్మి, పైలా శ్రీనివాసరావు, దొడ్డి కిరణ్, జీలకర్ర నాగేంద్ర ఉన్నారు. జగన్తో పాటు పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కృష్ణమోహన్రెడ్డి ఉన్నారు. -
జ్యోతిష్యుడిది హత్యే
● ‘అస్థి పంజరం’ కేసులో వీడిన మిస్టరీ ● పూజ చేసేందుకు వెళ్లి మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం ● అప్పన్నను హత్య చేసిన ఆమె భర్త ● భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు కొమ్మాది: పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి.. పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు. పథకం ప్రకారం.. కత్తితో పొడిచి కాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్లో చికిత్స తీసుకున్నాడు. ఒక రోజు ఆగి.. ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. -
ఆవు కడుపులో 50 కిలోల పాలిథిన్
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలసలో ఓ ఆవు పొట్ట నుంచి గురువారం 50 కిలోల పాలిథిన్ను పశువైద్యుడు బయటకు తీశారు. పాడి రైతు కోరాడ నాయుడుబాబుకు చెందిన ఈ ఆవు ఐదు రోజులుగా కడుపులో నొప్పి, మేత తినలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది. ఇది గమనించిన రైతు ఆనందపురం పశువైద్యాధికారి అనిల్కుమార్ను సంప్రదించారు. ఆవును పరీక్షించి, రుమేనటమీ శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం డాక్టర్, అతని బృందం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆవు కడుపు నుంచి దాదాపు 50 కిలోల పాలిథిన్ కవర్లు, తాళ్లను వెలికితీశారు. పాలిథిన్ వ్యర్థాలు పశువులకు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తుందని డాక్టర్ అన్నారు. పాలిథిన్ కారణంగా మూగజీవాలు మృత్యువాత పడకుండా ఉండాలంటే.. ప్రజలు పాలిథిన్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. పశువైద్య సిబ్బంది సుజాత, దుర్గ, లక్ష్మి, రమణ, సంతోష్, సాగర్, సుబ్రహ్మణ్యం, నర్సింగ్ డాక్టర్ అనిల్కుమార్కు సహకరించారు. శస్త్రచికిత్స చేసి, బయటకు తీసిన పశు వైద్యుడు -
‘సాల్ట్’ రద్దుతోనే విద్యా రంగానికి రక్షణ
విశాఖ విద్య: రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని సాల్ట్ పథకం విచ్ఛిన్న దశకు తీసుకెళుతోందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్ కుమార్ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన యూటీఎఫ్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాల్ట్ పథకం వల్ల ఒకటి, రెండు తరగతులు మారినటువంటి పాఠశాలల సంఖ్య 12 వేలకు పైగా ఉన్నాయని, అక్కడ చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టంగా ఉందన్నారు. జీవో నంబర్ 117 రద్దు చేసి నూతన జీవో కోసం చేస్తున్న కసరత్తుతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మూసివేత గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సాల్ట్ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.మోహన్ రావు మాట్లాడుతూ సాల్ట్ పథకం వల్ల ప్రాథమిక పాఠశాలలు బలహీనపడితే భవిష్యత్లో ఉన్నత పాఠశాలలు కూడా బలహీనమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పథకం వల్ల రోజు వారి గణాంకాలు సేకరించాల్సి ఉందని, దీని వల్ల బోధనకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, టి.ఆర్.అంబేడ్కర్, కోశాధికారి రాంబాబు, సహాధ్యక్షుడు ఎన్.ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నేలను నమ్మి రైతులు వ్యవసాయం చేస్తే, నీటిని నమ్మి చేపల వేట చేస్తారు మత్స్యకారులు. వీరి జీవితం ఎన్నో సవాళ్ల ప్రయాణం. సముద్రంలోకి వెళ్లకపోతే భవిష్యత్ ఏమిటనేది సవాలు.. వల వేసి, చేపలు పట్టడం, ఒడ్డుకి తెచ్చాక, సరైన ధరకు అమ్ముకోవడం ఓ సవాలు.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు జీవన పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పడవలపై వేటకు వెళ్లిన మత్స్యకారులు గురువారం ఆర్.కె.బీచ్ వద్ద ఎదురురెదురుగా తారసపడ్డారు. ఈ క్రమంలో ముచ్చటించుకుంటుండగా‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – ఏయూక్యాంపస్/ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నంచర్లపల్లి–దానాపూర్స్పెషల్ ఎక్స్ప్రెస్ రద్దు తాటిచెట్లపాలెం: చర్లపల్లి–దానాపూర్–చర్లపల్లి(07791/07792) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 20 తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇరువైపులా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. సంద్రంలో ముచ్చట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ కుమార్ -
లోకో రన్నింగ్ సిబ్బంది 36 గంటల దీక్ష
తాటిచెట్లపాలెం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో దొండపర్తిలో గల డీఆర్ఎం కార్యాలయం వద్ద 36 గంటల నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలో గల లోకో రన్నింగ్ సిబ్బంది గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఈ దీక్షను శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్సీ పాణిగ్రాహి, భోలానాఽథ్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు 6 గంటలు, గూడ్స్ రైళ్లకు 8 గంటలు డ్యూటీ పరిమితి అమలుచేయాలని కోరారు. రైల్వేలో మిగతా ఉద్యోగులంతా 8 గంటలు డ్యూటీ చేస్తే లోకోపైలట్లకు మాత్రం సుమారు 11 గంటల వరకు డ్యూటీ ఉంటుందన్నారు. రైళ్ల నిర్వహణలో భద్రతను నిర్ధారించడానికి డ్యూటీ గంటలను తగ్గించాలని వివిధ హైపవర్ కమిటీలు సిఫార్సు చేసినా.. రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. లోకో పైలట్స్ డ్యూటీ వేళలను 8 గంటలకు తగ్గించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ గాలికొదిలేసిందన్నారు. ముఖ్యంగా గూడ్స్ రైళ్లలో లోకో పైలట్లు 12 నుంచి 20 గంటల వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందని, దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, అనారోగ్యం పాలవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ దీక్షలో బివిఎస్వి రాజు, ఎస్కే చౌదరి, ఎం.చిన్న పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్ ఉద్యోగులకుమీల్ కార్డు నగదు జమ
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు గురువారం మీల్ కార్డు నగదు జమ చేశారు. నాలుగు నెలలు పెండింగ్లో ఉండగా ఒక నెల నగదు మాత్రమే జమ అయింది. స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెలా మీల్ కార్డు కోసం.. రోజుకు రూ.100 చొప్పున పని దినాల ఆధారంగా జీతం నుంచి కోత విధించి మీల్ కార్డులో జమ చేస్తారు. అయితే నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించడం తప్ప మీల్ కార్డుకు జమ కావడం లేదు. దీంతో ప్రతీ ఉద్యోగికి రూ.10 వేల వరకు బకాయి పేరుకుపోయింది. ఉక్కు యాజమాన్యం మీల్ కార్డు సంస్థకు దాదాపు రూ.14 కోట్లు బకాయి పడటంతో, వారు నాలుగు నెలలుగా నగదు జమ చేయడంలో విముఖత చూపినట్లు తెలుస్తోంది. చివరికి ఉక్కు అధికారులు మీల్ కార్డు సంస్థ అధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతో, ఒక నెలకు సంబంధించిన నగదును ఇప్పుడు జమ చేశారు. అయితే మిగిలిన మూడు నెలల బకాయిల సంగతేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్
అల్లిపురం: గాజువాకకు చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుడిని క్రికెట్ బెట్టింగ్ ఊబిలో దింపి, అతని దగ్గర నుంచి డబ్బులు కాజేసిన విజయనగరానికి చెందిన ముఠాలోని ఇద్దరు క్రికెట్ బుకీలను సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నిందితుల ద్వారా త్వరలోనే మరింత మందిని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలకు ఆశ చూపించి లక్షలు కొల్లగొడుతున్నారని, అటువంటి వాటి జోలికి ప్రజలు వెళ్లకూడదని సూచించారు. -
సాగరతీరంలో శోభాయాత్ర
● వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ ఏయూక్యాంపస్: విశాఖ సాగర తీరం హరినామ సంకీర్తనలతో పులకించింది. హరే కృష్ణ హరే కృష్ణ...హరే రామ హరే రామ అంటూ భక్తజనం నృత్యాలు చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో.. విశ్వశాంతిని కాంక్షిస్తూ బీచ్రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి గోకుల్ పార్క్ వరకు గురువారం నిర్వహించిన శోభాయాత్ర నగరంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, రాధా మదన మోహన స్వామి, నితాయి గౌరాంగాల విగ్రహాలను ఊరేగించారు. భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. హరేకృష్ణ మూవ్మెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకుడు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు మహా కుంభమేళాలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ‘విశ్వగురు’ బిరుదు ప్రదానం చేసిన సందర్భం, 52 సంవత్సరాల కిందట విశాఖలో జరిపిన పాదయాత్రను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా వాయిద్యాలు, కోలాటం, సంకీర్తనలతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. సందర్శకులకు దారిపొడవునా ప్రసాదం పంపిణీ చేశారు. హవా మహల్లో రాధా మదన్ మోహన్ స్వామి, నితాయి గౌరాంగ, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలకు హారతి ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దారిపొడవునా భక్తి గీతాలు ఆలపిస్తూ, కోలాటం ఆడారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, తూర్పు ఎమ్మెల్యే వి.రామకృష్ణబాబు, హరేకృష్ణ మూవ్మెంట్–అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు అమితాసన దాస స్వామీజీ, విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్త దాస తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో నకిలీ ఎస్ఐ
గోపాలపట్నం: ఎయిర్పోర్టు పోలీసులు నకిలీ ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. శాంతినగర్లో గురువారం సాయంత్రం బోను దుర్గారావు అనే వ్యక్తి ఎస్ఐ ఐడీ కార్డుతో తిరుగుతూ కనిపించాడు. పాఠశాల విడిచిపెట్టడంతో విద్యార్థులు బయటకు వస్తుండగా, వారిని బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ‘మీ మీద 100 డయల్కు ఫిర్యాదు వచ్చింది. నేను స్పెషల్ టీమ్ ఎస్ఐ’ని అంటూ భయపెట్టాడు. ఇది గమనించిన శాంతినగర్ యువకులు అతన్ని నిలదీశారు. తాను ఎస్ఐనని, సీసీఎస్కు చెందిన వాడినని బుకాయించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ యువకులు ఐడీ కార్డు చూపించాలని పట్టుబట్టడంతో చూపించాడు. అది నకిలీ ఐడీ అని గుర్తించిన యువకులు, దుర్గారావును ఎయిర్పోర్టు కానిస్టేబుల్కు అప్పగించారు. దుర్గారావుది విజయనగరం జిల్లా మక్కువ మండలంగా పోలీసులు గుర్తించారు. అతను కంచరపాలెంలో స్నేహితుడి ఇంటి వద్ద ఉంటూ, కూలీ పనులు చేస్తుంటాడు. శాంతినగర్లో తెలిసిన వారి ఇంటికి వచ్చానని, విద్యార్థులు అల్లరి చేస్తుంటే ఆపడానికి మాత్రమే అలా బెదిరించానని, వేరే ఉద్దేశం లేదని దుర్గారావు చెబుతున్నాడు. ప్రస్తుతం ఎయిర్పోర్టు పోలీసులు దుర్గారావును విచారిస్తున్నారు. కళాభారతిలో నృత్యోత్సవం నేడు విద్యార్థులను బెదిరిస్తూ శాంతినగర్లో హల్ చల్ -
‘జ్ఞానజ్యోతి’ వెలుగులు
జ్ఞానజ్యోతి లక్ష్యమిదే.. ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్(పూర్వ ప్రాథమిక విద్య), పునాది అభ్యసన కొనసాగింపు కోసం రోడ్ మ్యాపు అభివృద్ధి చేయడం.. ● అంగన్వాడీ కార్యకర్తలతో పాటు, 1–2 తరగతుల ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడంలో భాగంగా వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం.. ● జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలతో పాటు, వాటికి అనుసంధానంగా ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడం.. విశాఖ విద్య: అంగన్వాడీ కేంద్రాల్లో చదువులు కొత్తరూపు సంతరించుకోబోతున్నాయి. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్నాయి. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు లు అందించేలా ‘జ్ఞాన జ్యోతి’పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ కేంద్రా లకు వచ్చే పిల్లలకు విజ్ఞానంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలన్న లక్ష్యంతో ‘పోషణ్ భీ– పడాయి భీ’పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకనుగుణంగానే కేంద్రాల్లో సరికొత్త చదువులకు విద్యాశాఖాధికారులు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనేపటిష్టమైన పునాదులు పిల్లల అభివృద్ధికి మొదటి ఆరేళ్ల వయసు చాలా కీలకం. దీనిని దృష్టిలో ఉంచుకుని, మానసిక నిపుణుల సూచనల మేరకు ఎన్ఈపీలో ఈ వయసు వారికి ప్రాధాన్యమిచ్చారు. 0–6 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించే అంగన్వాడీ కేంద్రాలే వారి భవిష్యత్కు దిక్సూచిగా నిలువాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే బలమైన పునాదులు వేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సైతం మౌలిక వసతులు పెంపొందించడంతో పాటు, ప్రతీ కేంద్రానికి ఆట వస్తువుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నెల 18 నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రీ ప్రైమరీ, 1, 2 తరగతులను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వీరికి మెళకువలు నేర్పిస్తున్నారు. జిల్లాలోని 776 మంది అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణలో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణ గురువారంతో మొదటి దశ ముగిసింది. తిరిగి ఈ నెల 22 నుంచి 25 వరకు రెండో దశ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల్లో బోధన నైపుణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా సర్టిఫికెట్ కోర్సులో భాగంగా120 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. మారనున్న అంగన్వాడీ చదువులు కార్యకర్తలకు ముగిసిన మొదటి విడత శిక్షణ పకడ్బందీగా శిక్షణ తరగతులు జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లపై ఫోకస్ పెట్టాం. ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ ప్రొగ్రాంలో భాగంగా ఇప్పటికే 1, 2వ తరగతులు బోధించే జిల్లాలోని 560 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. – డాక్టర్ జె.చంద్రశేఖరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ, విశాఖ జిల్లా బలీయంగా తొలి అడుగులు పిల్లల చదువులకు తొలి అడుగులు అంగన్వాడీ కేంద్రాల్లోనే పడతాయి. అక్కడ నుంచే స్కూళ్లకు వస్తారు. అందుకనే ప్రీ ప్రైమరీ స్థాయిలోనే నైపుణ్యతతో కూడిన చదువులు అందించేందుకు ఇటువంటి శిక్షణ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం ఐసీడీఎస్, విద్యా శాఖ సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం. – దివాకర్, ఎంఈవో, గోపాలపట్నం మండలం -
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సీతమ్మధార: ఆప్కాస్ను రద్దు చేస్తే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రైవేట్ ఏజన్సీలకు, కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, వినతి పత్రం అందించింది. యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా డెత్, రిటైర్మెంట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎంప్లాయి పదాన్ని ఆప్కాస్ నుంచి తొలగించి, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరారు. 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు, గత సమ్మె ఒప్పందం ప్రకారం ప్రమాద మరణానికి రూ.7 లక్షల పరిహారం, పెరిగిన జనాభా ఆధారంగా సిబ్బంది పెంపు తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో గొలగాని అప్పారావు, ముద్దాడ ప్రసాద్, జేఅర్ నాయుడు, శీర రమణ, ఇ.అదినారాయణ, గణేష్, ఈశ్వరరావు, శ్రీను, బాలు, వరలక్ష్మి, పద్మ, లలిత, రాజశేఖర్, వెంకటరావు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయఫలాలకు మధ్యవర్తిత్వం మేలు
విశాఖ లీగల్ : కక్షిదారులకు సత్వర న్యాయఫలాలు అందించే ప్రక్రియలో మధ్యవర్తిత్వాన్ని అనుసరించడం ఎంతో మేలు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. మధ్యవర్తిత్వ శిక్షణా శిబిరం ముగింపు, మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్కి సంబంధించి సమన్వయ కమిటీల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్అదాలత్లో అత్యధిక శాతం కేసులు రాజీ చేయాలని కమిటీ సభ్యులను, న్యాయవాదులను, వివిధ కంపెనీల ప్రతినిధులను కోరారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ మధ్వవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడం ఉభయులకు లాభదాయకమన్నారు. కేసుల రాజీకి న్యాయవాదులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి రాధా రాణి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, విశాఖ న్యాయవాదుల సంఘం కార్యదర్శి తాళ్లూరు రవికుమార్ పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట
● కలెక్టర్ హరేందిరప్రసాద్ మహారాణిపేట ఎన్టీఆర్ కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. లేఅవుట్ల వారీగా సమీక్షించిన కలెక్టర్ అక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల ప్రత్యేక అధికారులు, లేఅవుట్ ఇన్చార్జి అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ఇళ్లను పూర్తి చేసే విధంగా తగిన కార్యాచరణ రూపొందించుకొని పనులను సాగించాలని చెప్పారు. అనకాపల్లి జిల్లా కుంచంగి, సబ్బవరం మండలం పెదముషిడివాడలో స్థానికుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, పనులు ముందుకు సాగటం లేదని హౌసింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేఅవుట్ పరిధిలో ఉన్న గ్రావెల్ను తవ్వుకొని అక్కడి పనులకు వాడుకుంటున్నప్పటికీ స్థానిక అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని వివరించగా మైన్స్ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, డీఈలు సూర్యారావు, నారాయణ ప్రసాద్, లేఅవుట్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఏడీసీ రమణమూర్తి, యూసీడీ పీడీ సత్యవేణి, డీసీవో ప్రవీణ, ఎస్డీసీలు శేష శైలజ, సునీత పాల్గొన్నారు. -
వైఎస్ జగన్తో కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో 13 పోలింగ్ స్టేషన్లు మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో 13 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో మొత్తం 21,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విశాఖలో 5,277 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 2,403 మంది, సీ్త్రలు 2,874 మంది ఉన్నారు. వీరి కోసం అన్ని మౌలిక సదుపాయాలతో మండలాల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. -
హోం మంత్రి పీఎస్గా ‘భూ’చోడు?
● విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారి ● అందుకు మంత్రి అనిత గ్రీన్ సిగ్నల్ ● గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తహసీల్దార్గా పనిచేసిన అధికారి ● ఎస్.రాయవరంలో భూరికార్డుల తారుమారు విషయంలో ఆరోపణలు ● మళ్లీ అనిత వద్దే పీఎస్గా ప్రయత్నాలపై అనేక అనుమానాలు విశాఖ సిటీ: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) నియామకం చర్చనీయాంశమవుతోంది. రెవెన్యూలో చక్రం తిప్పే ఒక తహశీల్దార్ పీఎస్గా వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భూ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని తన పీఎస్గా తెచ్చుకునేందుకు హోంమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో భారీ ప్రాజెక్టులకు భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో అతని చాతుర్యం అవసరమని అనిత భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో అనిత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్.రాయవరం మండలంలో భూ రికార్డుల మార్పుల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారినే మళ్లీ తన పీఎస్గా నియమించాలనుకోవడం గమనార్హం. ప్రభుత్వమేదైనా కీలక పోస్టింగ్లే..! ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సదరు తహసీల్దార్ మాత్రం నచ్చిన పోస్టింగ్ తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడు అన్న టాక్ రెవెన్యూ విభాగంలో ఉంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకొని కీలక మండలాల్లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ(వీఎంఆర్డీఏ)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి హోం మంత్రి పీఎస్గా వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి మంత్రి అనితే సదరు అధికారిని తన పీఎస్గా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అప్పట్లోనే ఆరోపణలు సదరు అధికారి ఎస్.రాయవరం మండలం తహసీల్దార్గా పనిచేసిన సమయంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత ఉన్నారు. ఒక భూ వ్యవహారంలో రికార్డులు మార్చడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై తలారీ స్వయంగా ఆరోపణలు చేస్తున్న వీడియో సైతం వైరల్ అయింది. మళ్లీ ఇపుడు అనిత సదరు అధికారినే వ్యక్తిగత కార్యదర్శిగా తీసుకోవాలనుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. భూ వ్యవహారాలు చక్కబెట్టేందుకేనా..? అనకాపల్లి జిల్లాలో కీలక భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ప్రధానంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్ప్లాంట్తో పాటు అదే మండలంలో బల్క్ డ్రగ్ పార్కు రానుంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున భూ సమీకరణ ప్రక్రియను చేపట్టారు. ఇంకా భారీగా భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో హోం మంత్రి అనిత సదరు తహసీల్దార్ను తన పీఎస్గా నియమించుకోడానికి వెనుక భూ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే అన్న వాదనలు ఉన్నాయి. గతంలో సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. మళ్లీ అతడినే ఏరికోరి తెచ్చుకోవాలని చూస్తుండడం వెనుక గల కారణాలపై సొంత పార్టీలోనే నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. -
బాబోయ్!
డీఆర్ఎంగా వచ్చేందుకు అధికారుల వెనకడుగు● డీఆర్ఎం సౌరభ్పై సీబీఐ దాడుల తర్వాత అధికారుల గుండెల్లో దడ ● గతేడాది డిసెంబర్లో డీఆర్ఎంగా లలిత్బోరా నియామకం ● బాధ్యతలు చేపట్టకుండా వేరే ప్రాంతానికి వెళ్తేందుకు ప్రయత్నాలు ● ఇన్చార్జి డీఆర్ఎం పాలనలోనే కార్యకలాపాలుసాక్షి, విశాఖపట్నం: వాల్తేరు రైల్వే డివిజన్లో పనిచేసేందుకు ఉన్నతాధికారులు ఉలిక్కి పడుతున్నారు. సీబీఐ దాడుల్లో డీఆర్ఎం దొరికిన తర్వాత ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపించడం లేదు. గతేడాది డిసెంబర్లో డీఆర్ఎంని నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసినా ఆయన ఇంతవరకు బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు ఆయన వేరే చోటికి బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఇన్చార్జ్ నీడలోనే డివిజన్ వ్యవహారాలు నడుస్తుండటంతో రూ.వందల కోట్ల పనులకు చెందిన టెండర్లు స్తంభించిపోయాయి. ఇన్చార్జి పాలనలో.. వాల్తేరు రైల్వే డివిజన్కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ జోన్లో సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ వాల్తేరు డివిజన్ నంబర్వన్గా నిలిచింది. అలాంటి డివిజన్ ఇప్పుడు ఇన్చార్జి హయాంలో నడుస్తోంది. వాల్తేరు చరిత్రలో ఇన్ని నెలల పాటు ఇన్చార్జి డీఆర్ఎం పాలనలో నడవడం ఇదే ప్రథమమని ఉద్యోగులు చెబుతున్నారు. సీబీఐ దాడుల్లో పట్టుబడిన సౌరభ్కుమార్ స్థానంలో నవంబర్ 20న ఇన్చార్జి డీఆర్ఎంగా వాల్తేరు ఏడీఆర్ఎం మనోజ్కుమార్ సాహూని నియమించారు. ఆ తర్వాత డిసెంబర్ 26న లలిత్బోరాని డీఆర్ఎంగా నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఇప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. వాల్తేరు డివిజన్కు వస్తే తన పరిస్థితి ఏంటోనన్న భయం ఆయనలో పట్టుకుందని డివిజన్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయన ముంబై లేదా ఇతర చోటుకి బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డు కొత్తవారిని నియమించేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల్లో భయాందోళనలు ముంబైలో గతేడాది నవంబర్ 16న వాల్తేరు డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డివిజన్లోని ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఉద్యోగుల్లో ఒకరిని విజయనగరం బదిలీ చేసేశారు. మిగిలిన వారిని పలుమార్లు సీబీఐ అధికారులు విచారించి.. అనేక విషయాలపై ఆరా తీశారు. దీంతో ఉన్నతాధికారులు ఏ వ్యవహారంలో తలదూర్చితే ఏం జరుగుతుందో.. ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. రూ.వందల కోట్ల పనులకు బ్రేక్ ఘన చరిత్ర ఉన్న వాల్తేరు పరువుని లంచావతారం ఎత్తిన డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ పట్టాలు తప్పించేశారు. సొంత అజెండాపైనే దృష్టిసారించిన ఆయన డివిజన్ అబివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ.. గత డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి చేసిన ప్రతిపాదనలే తప్ప.. తన మార్కు అంటూ ఎక్కడా మచ్చుకు కూడా చూపించలేకపోయారు. అనూప్కుమార్ సత్పతి హయాంలో డివిజన్ ఆదాయంలోనూ, రైళ్ల రాకపోకల్లోనూ వెలుగొందింది. తర్వాత ప్రాభవం కనుమరుగైంది. పాతాళానికి పడిపోయిన డివిజన్లో డీఆర్ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నదానిపై అంతటా సందిగ్థత నెలకొంది. దీంతో పాటు ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో పెద్ద టెండర్లకు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. గత డీఆర్ఎం లంచాల మేత కారణంగా డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడు శాశ్వత డీఆర్ఎం లేకపోవడంతో రూ.వందల కోట్ల పనులకు ఆగిపోయాయి. వీలైనంత త్వరగా డీఆర్ఎంని నియమించాలని రైల్వే యూనియన్లు కోరుతున్నాయి. -
స్టేషన్లలో వదిలేసిన 152 వాహనాల అప్పగింత
విశాఖ సిటీ : ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ దీర్ఘకాలంగా పోలీస్స్టేషన్లలో వదిలేసిన వాహనాలను గుర్తించి వాటిని సంబంధిత యజమానులకు అప్పగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా వెహికల్ రిటర్న్ మేళాను బుధవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలీస్స్టేషన్లను సందర్శించిన సమయంలో అక్కడ అనేక బైక్లు ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. చాలా కాలంగా వాటి యజమానులు స్టేషన్లలో వదిలివేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. పీఎం పాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డ్లో కూడా అనేక వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిని సంబంధిత యజమానులకు అప్పగించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యజమానులు లేని వాహనాల తొలగింపుతో పాటు వేలం ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 1,149 వాహనాల గుర్తింపు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లలో మొత్తంగా 1,149 వాహనాలను గుర్తించినట్లు చెప్పారు. పోలీస్ థర్డ్ ఐ, ఆర్టీవో ద్వారా 559 వాహనాల యజమానుల చిరునామా సేకరించామన్నారు. అందులో 272 మంది యజమానులను గుర్తించగా తొలి దశలో 152 వాహనాలను వాటి యజమానులకు అందజేశారు. మరోసారి ఈ మేళా నిర్వహిస్తామన్నారు. యజమానులు లేని వాహనాల వేలం కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వెహికల్ రిటర్న్ మేళా నిర్వహణ -
లైంగిక దాడుల కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
● ఆదేశించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ సాక్షి, విశాఖపట్నం: మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. వీటిపై ఎస్పీలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, నిందితులపై కేసులు నమోదు చేసి త్వరితగతిన శిక్షలు పడేలా సీఐ, ఎస్ఐలు పనిచేయాలని ఆదేశించా రు. అలాగే, నేరాల నియంత్రణ, బాధితులకు న్యా యం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. బుధవారం విశాఖ రేంజ్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పొక్సో కేసు లు, హేయమైన నేరాలు సంబంధించిన కేసుల పై సమీక్ష నిర్వహించారు. గంజాయి నిందితుల ఆస్తుల స్వాధీనానికి, పీడీ యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చర్య లు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
పెందుర్తి : ఫుడ్ పాయిజన్ కారణంగా పెందుర్తిలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వివరాలివి.. పెందుర్తి వెలంపేట సమీపంలో ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కళాశాల ఆధ్వర్యంలో ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్నాక్స్, బిర్యానీ తిన్నారు. బుధవారం ఉదయం నుంచి వెన్నెల దివ్య, లలిత కుమారి, సంధ్య, వణుకుల మాధవి సహా ఆరుగురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారిని 108లో పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో పెందుర్తి సీహెచ్సీకి వచ్చి విద్యార్థినులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షించారు. మాధవి అనే విద్యార్థిని పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) డాక్టర్ పి.శంకర్ప్రసాద్, సీహెచ్సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.అవంతి, వైద్యాధికారులు డాక్టర్ బి.బాబాసాహెబ్, డాక్టర్ దివ్య సౌజన్య, డాక్టర్ హరిత, హెడ్ నర్స్ లిల్లీ గ్రేస్, వైద్య సిబ్బంది విద్యార్థినుల ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. కళాశాల వసతులపై డీఎంహెచ్వో సీరియస్ ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ పరిసరాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థినుల హాస్టల్, మరుగుదొడ్లు, ఇతర పరిసరాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. తాగునీటి సదుపాయం కూడా పూర్తిస్థాయిలో లేదు. విద్యార్థినులకు కలుషిత నీరు అందుతున్నట్లు డీఎంహెచ్వో జగదీశ్వరరావు గుర్తించారు. కళాశాల నిర్వాహకులపై మండిపడ్డారు. ఇలాంటి పరిసరాల్లో కళాశాల, హాస్టల్ నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకరి పరిస్థితి విషమం, ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు పెందుర్తిలోని ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఫుడ్ పాయిజన్ -
● ఇందిరాగాంధీ జూపార్క్లో సరికొత్త ఆకర్షణ
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో లవ్ బర్డ్స్ జోన్ కొత్త సొబగులు సంతరించుకుంది. జూ పార్కు ఏర్పాటు చేసిన సమయంలో పక్షుల కోసం ప్రత్యేకంగా జోన్ నిర్మించారు. అందులో వివిధ గూళ్లలో రకరకాల లవ్ బర్డ్స్ను పెట్టారు. ఆ గూళ్ల చుట్టూ రెండు వరుసల్లో ఇనుప మెష్లు ఉండటంతో సందర్శకులకు వాటి అరుపులు తప్ప పక్షులు సరిగా కనిపించేవి కాదు. దీంతో జూ అధికారులు ఇటీవల ఈ జోన్ను ఆధునికీకరించారు. ఇనుప మెష్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్తగా అద్దాలతో గూళ్లు నిర్మించారు. వాటికి గాలి, వెలుతురు తగిలేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అద్దాల లోపల పక్షులు సందర్శకులకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అద్దాల గూళ్లలో లవ్ బర్డ్స్ -
బయోడైవర్సిటీ పార్క్ సందర్శన
స్టీల్ప్లాంట్లో వీఆర్ఎస్ ప్రక్రియ ఆరంభం ఉక్కునగరం : విశాఖ స్టీల్ప్లాంట్లో బుధవారం వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) అమలు ప్రక్రియ ప్రారంభమైంది. కొంతమందికి సంబంధించి వీఆర్ఎస్ ఆమోదం, తిరస్కరణ నోటీసులు విడుదలయ్యాయి. స్టీల్ప్లాంట్ ఉద్యోగుల తగ్గింపు కార్యక్రమంలో భాగంగా గత నెల 15న యాజమాన్యం వీఆర్ఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 31వ తేదీ నాటికి 1,613 మంది ఉద్యోగులు (అధికారులు, కార్మికులు కలిపి) వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. సుమారు 145 మంది దరఖాస్తుల ఉపసంహరణకు వినతులు అందజేశారు. అప్పటి నుంచి యాజమాన్యం వడపోత కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నాన్ వర్క్స్ విభాగాలకు చెందిన కార్మికులు, ఈ–4 గ్రేడ్ స్థాయి వరకు అధికారులకు సంబంధించి 18 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు అంగీకరించినట్టు ఈపీఎస్ఎస్ పోర్టల్లో పొందుపరిచారు. ఇక ఈ–5, ఆపై అధికారుల జాబితా విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా వర్క్స్కు సంబంధించిన విభాగాల కార్మికులు, అధికారుల జాబితా గురువారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. నోటీసులు ఉద్యోగులకు అందిన నాటి నుంచి నోటీసు పిరియడ్గా పరిగణిస్తామని పేర్కొన్నారు. క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలిడేలు నిష్పత్తి ప్రాతిపదికన మాత్రమే వినియోగించుకోవాలని, నోటీసు పీరియడ్లో అర్జిత సెలవులు (ఈఎల్), సగం అర్జిత సెలవులు (హెచ్పీఎల్)లు వినియోగించుకోరాదని తెలిపారు. -
బాల్బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు ప్రశంసలు
విశాఖ స్పోర్ట్స్: సీనియర్ నేషనల్ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించడంలో ప్రతిభ చూపిన ఈకో రైల్వేకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను డీఆర్ఎం మనోజ్కుమార్ సాహూ అభినందించారు. ఈ టోర్నీలో సీహెచ్ వెంగళరావు చక్కటి ప్రతిభ కనబరిచి స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్నారు. డి.వి.గణేష్, పి.కార్తీక్ సత్తా చాటారు. వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వాల్తేర్ ఈకో రైల్వే స్పోర్ట్స్ ఆఫీసర్ ప్రవీణ్ బాఠి, సంయుక్త స్పోర్ట్స్ ఆఫీసర్ బి.అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా
● వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న డ్రైవ్ ప్రారంభం కాగా.. ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పరిశీలన, టికెట్ తనిఖీలు చేపడుతున్నారు. సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్, దివ్యాంగ, మహిళల బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 18 వరకు కమర్షియల్ సిబ్బంది 9,300 కేసులు నమోదు చేసి, రూ.46 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ నెల 28వ వరకు తనిఖీలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. -
ఆరుగురు జైలు అధికారులకు మెమోలు
ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారంలో ప్రక్షాళన చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు ఆరుగురికి మెమోలు జారీ చేశారు. బుధవారం ఇద్దరికి, మంగళవారం నలుగురికి మెమోలు జారీ చేశారు. ఇటీవల ఇక్కడ పాలన విభాగం అస్తవ్యస్తంగా మారి వార్తలకెక్కిన విషయం తెలిసిందే. జైలు లోపలకు గంజాయి తరలించడం, ఖైదీల బేరక్ వద్ద సెల్ఫోన్లు లభించడం, ఓ రిమాండ్ ఖైదీని క్వారెంటైన్లో ఉంచకుండా నేరుగా బేరక్లోకి తరలించడంతో ఆత్మహత్య చేసుకోవడం తదితర పరిణామాలు జరిగాయి. ఆయా వ్యవహారాల్లో పలువురు అధికారులకు బదిలీలు కూడా జరిగాయి. పరిపాలన యంత్రాంగాన్ని గాడిన పెట్టడానికి రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలు సక్రమంగా అమలు చేయకపోవడం తదితర విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. దీంతో అధికారులపై చర్యలు చేపట్టారు. బుధవారం జైలర్లు పి.కుసుకుమార్, ఆర్.చిన్నారావుకు మెమోలు జారీ చేయగా.. మంగళవారం గతంలో ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్ ఎస్.కిశోర్కుమార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ జవహర్బాబు, జైలర్ సీహెచ్ శ్రీనివాస్కు రాష్ట్ర జైళ్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ మెమోలు జారీ చేశారు. ఇంకొందరికి మెమోలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఒడిశాలో హత్య.. ఇక్కడ నిందితుల అరెస్ట్
పీఎంపాలెం: ఒడిశా రాష్ట్రంలోని సుందర్గఢ్ జిల్లా రాజ్గంగ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని బుధవారం పీఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. ఒడిశాకు చెందిన సుజిత్ బెంగ్రా, మున్నా సన్యాసి ఓ హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులు. పీఎంపాలెం బాబా ఇంజినీరింగ్ కాలేజీ ఏరియాలో నిందితుల్లో ఒకరి చెల్లెలు నివసిస్తోంది. ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజులుగా నిందితులు ఆమె వద్ద తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒడిశా పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఒడిశా తీసుకెళ్లారు. -
జైలులో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో మహిళా ఖైదీల కోసం శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ను బుధవారం జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ని మహిళా ఖైదీల బ్లాక్ వద్ద ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని దీని ఏర్పాటుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ యూనిట్లో మహిళా ఖైదీలే పనిచేస్తారని, వారికి ఈ యూనిట్ ఆర్థికంగా కూడా సహాయపడుతుందన్నారు. ఇక్కడ తయారైన నాప్కిన్లను భవిష్యత్లో రాష్ట్రంలో ఇతర జైళ్లకు సరఫరా చేసే చర్యలు చేపడతామన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు సాయి ప్రవీణ్, సూర్యకుమార్, జవహర్బాబు, జైలర్లు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్త ఎగుమతిదారులకు ప్రోత్సాహం
మహారాణిపేట: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ) డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ) సహకారంతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన సదస్సు బుధవారం ముగిసింది. గత రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో 18 దేశాలకు చెందిన 25 మంది కొనుగోలుదారులు, 430 మందికి పైగా ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, రెడీమేడ్ వస్త్రాలు, కాస్మోటిక్స్, ఫార్మా తదితర రంగాలకు చెందిన 79 అవగాహన ఒప్పందాలు జరిగాయి. సుమారు రూ. 60 కోట్ల మేర వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో 38 మంది కొత్త ఎగుమతిదారులకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో ఎం.విశ్వ, ఎఫ్ఐఈవో దక్షిణ రీజినల్ చైర్మన్ గోపాలకృష్ణన్, జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు పాల్గొన్నారు. రూ.60 కోట్ల మేర 79 ఒప్పందాలు -
చార్ధామ్ చూసొద్దామా
సీతమ్మధార: చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(జీఎంవీఎన్) ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా తెలిపారు. ఆశీలమెట్టలోని ఒక హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 16 రోజుల పూర్తి స్థాయి ప్యాకేజీ టూర్ ఈ ఏడాది మే 8న ప్రారంభమవుతుందని, ప్రస్తుతం బుకింగ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రతీ కోచ్లో ఎంటర్టైన్మెంట్, సీసీ టీవీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉంటారని వివరించారు. టూర్ టైమ్స్ రీజినల్ మేనేజర్ రమేశ్ అయ్యంగార్ మాట్లాడుతూ భారతీయ రైల్వేలు, టూర్ టైమ్స్ భాగస్వామ్యంతో ఈ పవిత్ర యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక ప్యాకేజీలో సైట్ సీయింగ్, రాత్రి బస ఉన్న ప్రాంతాల్లో హోటల్ వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. యాత్ర మొత్తంలో రైలు, హోటళ్లలో దక్షిణ భారతీయ భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు తమ లగేజీని కోచ్లోనే ఉంచుకుని యాత్రా స్థలాలను సందర్శించవచ్చని, ఇది యాత్రను మరింత సౌకర్యవంతంగా మారుస్తుందన్నారు. వృద్ధులకు ఇది ఒక ప్రత్యేకమైన టూర్ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ, ఎల్ఎఫ్సీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని, రైల్వే మంత్రిత్వ శాఖ 33 శాతం రాయితీని అందిస్తోందన్నారు. రాయితీ పోనూ థర్డ్ ఏసీకి రూ.70,500, సెకెండ్ ఏసీకి రూ.75,500, ఫస్ట్ ఏసీకి రూ.82,500, స్లీపర్కు రూ.58,500 చార్జీలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. బుకింగ్, ఇతర సమాచారం కోసం www. tourtimes. in వెబ్సైట్ను, 91600 21414, 91600 91414 నంబర్లను సంప్రదించవచ్చు. సమావేశంలో ఫిజీషియన్, సైకియాట్రిస్ట్ నందిని పాల్గొన్నారు. మే 8 నుంచి ‘భారత్ గౌరవ్’ప్రత్యేక రైలు యాత్ర -
ఇసుక లారీ బీభత్సం
అల్లిపురం: మంగళవారం ఉదయం 6.50 గంటలు.. ప్రభాత వేళ సముద్రపు అలలు తీరాన్ని తాకుతుండగా, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారి పెద్ద శబ్దం. ఇసుక లారీ సృష్టించిన బీభత్సం. నోవాటెల్ హోటల్ రోడ్డులో పైనుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై బీచ్రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో బీచ్రోడ్డులో వాహనాల నిషేధం అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరో పది నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటే, ఊహించని ఘోరం జరిగిపోయేది. ఈ ఘటనలో ఒక పాదచారికి గాయాలు కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివీ..శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ హార్బర్కు 40 టన్నుల ఇసుకతో ఓ లారీ బీచ్రోడ్డు మీదుగా వస్తోంది. బీచ్రోడ్డులో నగర ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వేకువజాము 4.30 నుంచి ఉదయం 7 గంటల వరకు, వీఎంఆర్డీఏ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ వాహనాల నిషేధం ఉంటుంది. వీఎంఆర్డీఏ పార్కు వద్ద రోడ్డు మూసివేసి ఉండటంతో లారీ డ్రైవర్ ఏయూ మీదుగా పందిమెట్ట పైనుంచి నోవాటెల్ డౌన్కు దిగాడు. ఆ సమయంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి, బీచ్ వైపు దూసుకుపోయింది. ప్రమాదాల నివారణకు రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద ప్లాస్టిక్ ఇసుక డబ్బాలను ఢీకొట్టింది. ఫుట్పాత్ మీదుగా గోడను ఢీకొట్టి, అవతలి వైపు సర్వీసు రోడ్లోకి ఎగిరిపడి.. పార్కులోకి చొచ్చుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెల్లివీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్.కె.బీచ్కు వాకింగ్కు వెళ్తుండగా, ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పార్కు గోడ దెబ్బతింది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించారు. రవికుమార్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గతంలో ఇక్కడే రెండు ప్రమాదాలుగతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాగా.. బస్సులో పిల్లలు లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ప్రమాదంలో ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రక్షణ గోడను ఢీకొట్టి అవతలి వైపు గల సర్వీ సు రోడ్డులోకి వెళ్లింది. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి తన కుటుంబంతో సహా అక్కడ సేదతీరుతున్నారు. ఈ ప్రమాదంలో అతని తండ్రి చనిపోగా, అధికారికి కాళ్లు విరిగిపోయాయి. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు. -
ఆర్గనైజ్డ్ క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసుల అరెస్ట్
అల్లిపురం: వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 16న ఇల్లీగల్ పేమెంట్ గేట్ వే కేసు విచారణలో భాగంగా తైవాన్ జాతీయులైన ము–చి కోనియన్ సేంగ్ అలియాస్ సంగ్ ము–చి అలియాస్ మార్క్, హా–యున్ చాంగ్ అలియాస్ చాంగ్ హోవో–యున్ అలియాస్ మార్కోలు నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్, సేన్ప్రా బే వ్యూ హోటల్లో బసచేసి అమాయకులను ఆకర్షించి, వారికి సైబర్ నేరాల్లో శిక్షణ అందించేవారు. దేశంలోని వివిధ వ్యక్తుల సాయంతో పేద, వ్యసనాలకు బానిసలైన వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలను తెరిచేవారు. వివిధ రకాల మొబైల్ నెట్వర్కులకు సంబంధించిన సిమ్కార్డులను తీసుకుని, దేశంలో వివిధ ప్రాంతాలలో మకాం వేసి రూ.కోట్ల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత వేజెండ్ల సహకారంతో మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఇద్దరు విదేశీ నిందితులు, ఒక అంతర్ జిల్లా ముద్దాయితోపాటు 26 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. -
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
ఉద్యోగ ప్రస్థానం ● 1997లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం.. ● 1998 నుంచి 2000 డిసెంబర్ వరకు జపాన్లోని టోక్యో యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. ● 2000 డిసెంబర్ నుంచి 2002 జూన్ వరకు ఐఐటీ ఖరగ్పూర్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. ● 2002 జూన్ నుంచి 2007 ఏప్రిల్ వరకు అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ● అనంతరం సెలవులో ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. ● 2011 నుంచి 2019 వరకు ఖరగ్పూర్ ఐఐటీలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. ● 2019 ఆగస్టు నుంచి హెచ్ఏజీ స్కేల్తో అదే చోట ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ● అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ ఖరగ్పూర్ ఐఐటీ డీన్గా, జేఈఈ మెయిన్స్ను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించినప్పుడు చైర్మన్గా వ్యవహరించారు. ● స్థానికుడికే దక్కిన అవకాశం ● ఏయూ ఉపకులపతిగా ఆచార్య రాజశేఖర్ నియామకం విశాఖ విద్య/సింహాచలం: ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆచార్య రాజశేఖర్ది సింహాచలం. తమ ప్రాంతీయుడు ఏయూ వీసీగా నియామకం కావడం ఎంతో గర్వకారణమని రాజశేఖర్ స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ అడవివరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రీన్పార్క్ సమీపంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియడ్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కుటుంబ నేపథ్యం ప్రొఫెసర్ రాజశేఖర్ తండ్రి బలరామకృష్ణ అడవివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సావిత్రి గృహిణి. రాజశేఖర్ సోదరుడు గిరిధర్ విశాఖ స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె కూడా ఖరగ్పూర్ ఐఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. 2017లో అడవివరంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో స్థానికులు రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ ఏయూ వీసీగా నియామకం కావడంతో అతని స్నేహితులు పాశర్ల ప్రసాద్, టి.వి.కృష్ణంరాజు, రాజనాల సత్యారావు, వై.డి.వి ప్రసాద్, గ్రామస్తులు కర్రి అప్పలస్వామి, కొలుసు ఈశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వీసీ రిలీవ్ ఏయూ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. వర్సిటీకి నూతన వీసీని నియమించిన ప్రభుత్వం.. ప్రస్తుత వీసీ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు శశిభూషణరావు వీసీ బాధ్యతల నుంచి వైదొలగి.. తన మాతృస్థానమైన ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వెళ్లారు. ఇదిలా ఉండగా ఆచార్య శశిభూషణరావుకు ఏయూ పూర్తిస్థాయి వీసీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. మరో పక్క వీసీ పోస్ట్ కోసమని ప్రస్తుత రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు, రెక్టార్ కిశోర్బాబు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న వీరిని ఇక్కడ కాకుంటే, రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకై నా పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కూటమికి చెందిన కీలక నేతలు వీరి కి అభయం కూడా ఇచ్చారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి ఆశాభంగం తప్పలేదు. కాగా.. వీసీగా నియమితులైన రాజశేఖర్ ఎప్పుడు విధుల్లో చేరుతారనేది స్పష్టత లేదు. దీనిపై వర్సిటీ వర్గాలకు కూడా సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయరావు పూర్తి స్థాయిలో వర్సిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం ఆంధ్ర యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆచార్యులను రాష్ట్రంలోని వేర్వేరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా ప్రభుత్వం నియమించింది. వర్సిటీ విద్యా విభాగంలో పనిచేస్తున్న ఆచార్య కూన రాంజీని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా యూనివర్సిటీకి, ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న ప్రసన్నశ్రీను రాజమండ్రిలోని నన్నయ యూనివర్సిటీకి వీసీలుగా నియమించింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం దక్కడం విశేషం. -
66 కేసుల్లో 74 మంది అరెస్ట్
● జనవరిలో 106 చోరీ కేసుల నమోదు ● వీటిలో 66 కేసులను ఛేదించిన పోలీసులు ● రూ.92.04 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం ● బాధితులకు సీపీ చేతుల మీదుగా సొత్తు అందజేత క్రికెట్ బెట్టింగ్పై ఫిర్యాదు ఇవ్వండి క్రికెట్ బెట్టింగ్ కారణంగా మోసపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ పిలుపునిచ్చారు. నేరుగా పోలీస్స్టేషన్లో అయినా 7995095799 నెంబర్కు అయినా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఎవరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కూడా ఈ క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై నగర టాస్క్ఫోర్స్ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. విశాఖ సిటీ : నగరంలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 66 కేసులను ఛేదించి 74 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.92,04,095 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 310.13 గ్రాముల బంగారం, 536.6 గ్రాముల వెండి, రూ.4,56,495 నగదు, 7 బైక్లు, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీలు ఉన్నాయని వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, అలాగే నిందితులను గుర్తించేందుకు గత జనవరి నెలలో 864 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నేరాలు జరుగుతున్న తీరుపై 251 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ ద్వారా నిఘా పెట్టామన్నారు. అనంతరం బాధితులకు సొత్తు అందజేశారు. రౌడీలు జైల్లో ఉండాలి రౌడీలు, అసాంఘిక శక్తులు నగరంలో కాదు.. జైల్లో ఉండాలని సీపీ తేల్చి చెప్పారు. ఇప్పటికే విశాఖలో ఏడుగురిపై పీడీ యాక్ట్, ఐదుగురిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలు చేసినట్లు తెలిపారు. ఇంకా చాలా మందిపై ఈ చట్టాలను అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రౌడీలను నగరంలో లేకుండా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీచ్ రోడ్డుపై ప్రత్యేక శ్రద్ధ బీచ్ రోడ్డులో కొంత మంది ఆకతాయిలు రేసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు సీపీ తెలిపారు. నగరంలో పలువురు వాహనదారులు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. నోవోటెల్ హోటల్ డౌన్లో జరిగిన లారీ ప్రమాదం విషయంపై సీపీ స్పందిస్తూ.. ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించామని, గతంలో జరిగిన ప్రమాదంలో ఒక ఎస్పీ అధికారి తండ్రి మరణించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ–1, ఏడీసీపీ ట్రాఫిక్, ఇతర అధికారులు దృష్టి పెట్టారని వెల్లడించారు. డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించాం ఇటీవల విశాలాక్షినగర్ ప్రాంతంలో దొరికిన డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించామని సీపీ తెలిపారు. త్వరలో అందరిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఒడిశా నుంచి కొంత మంది గంజాయిని విశాఖ మీదుగా రవాణా చేస్తున్నారని, వారిపై నిఘా పెట్టామన్నారు. గోవా, బెంగళూరు నుంచి కొంత మంది సింథటిక్ డ్రగ్స్ నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాను పూర్తిగా నియంత్రించే విషయంపై దృష్టి పెట్టామన్నారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
మహారాణిపేట: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, చాకచక్యంగా వ్యవహరించాలని పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారులనుద్దేశించి రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి విడత శిక్షణ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నా.. నిర్లిప్తతకు తావులేకుండా, ఎన్నికల కమిషన్ ఆదేశాలు తుచ తప్పక పాటించాలన్నారు. సొంత నిర్ణయాలు పనికిరావని హెచ్చరించారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సుధాసాగర్, పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పీపీటీ ద్వారా వివరించారు. ఎన్నికల సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆట పాటలతో బోధన అవసరం
విశాఖ విద్య: ప్రీ ప్రైమరీ స్థాయిలో చిన్నారులకు ఆటపాటలతో విద్యనందించేలా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగ చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో 776 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్ష ద్వారా మంగళవారం నుంచి ఆరురోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మండలాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయగా, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఆయన పర్యటించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు. -
నిధుల సంకటం
ఎమ్మెల్సీ ఎన్నికకు● ఎన్నికల నిర్వహణకు రూ.3 కోట్ల వరకు ఖర్చు? ● పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా విడుదల కాని నిధులు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఎన్నికల కమిషన్ గానీ పైసా కూడా విదల్చలేదు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండడం గమనార్హం. దీంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ నిధులను ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగియనుంది. 27వ తేదీన పోలింగ్, వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ముద్రణ శాలలో పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడంతో అవి విశాఖకు చేరుకున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. వాస్తవానికి ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లా అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఫండ్స్ నుంచి నిధులను మళ్లించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాని పక్షంలో మళ్లీ వాటిని సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముంది. 21,555 మంది ఓటర్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21, 555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 12,948 మంది పురుషులు, 8,607 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరంలో 4,937, మన్యం పార్వతీపురం మన్యంలో 2,262, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448, విశాఖలో 5,277, అనకాపల్లి జిల్లాలో 2802 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు, ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తొలి విడతగా ఎన్నికల నిర్వహణపై మంగళవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఈ నెల 24న మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 3న ఆంధ్రా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి కూడా నిధులు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల ఖర్చు రూ.3 కోట్లు! ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 123 పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు నిధులు అవసరం. పోలింగ్ సిబ్బంది భోజనాలు, పోలింగ్ తర్వాత టీఏ, డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది. -
బహుళ పంటల విధానంపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: లాభదాయక సాగు విధానాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్పై కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతు వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, స్థానిక అవకాశాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రత్యేక గ్రూప్లను ఏర్పాటు చేయాలని, వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సమూహాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, ఇతర మార్గాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అధికారి మోహన్ రావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఇతర అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ఆత్మహత్య
సీతమ్మధార: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీ, విష్ణు విల్లా అపార్ట్మెంట్లో పాల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన రామాటాకీస్ దరి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య పద్మావతి రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె కె.సాస(15) పదో తరగతి మధ్యలో ఆపేసింది. సాస ఎవరితో పెద్దగా కలిసేది కాదు. తల్లిదండ్రులతో కూడా ముభావంగా ఉండేది. గత ఏడాది సెప్టెంబర్లో స్కూల్ నుంచి టీసీ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం తన చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. కానీ ఆమె తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. తనకు కడుపునొప్పి వస్తోందని, నువ్వే రావాలని సాస ఆమెను కోరింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమార్తెకు తల్లి నిమ్మరసం ఇచ్చింది. ఆ తర్వాత తల్లి, నాన్నమ్మ ఇంట్లో ఉన్న సమయంలో బాలిక నాలుగో అంతస్తుకు చేరుకుంది. వాటర్ ట్యాంక్పై కళ్లద్దాలు, మొబైల్ ఫోన్ పెట్టి.. అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి సాస కోసం అడగ్గా బయటకు వెళ్లిందని వారు చెప్పారు. అంతలోనే అందరూ బయటకు వెళ్లి చూడగా సాస నిర్జీవంగా కనిపించింది. వెంటనే బాలికను రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇన్చార్జి సీఐ దాలిబాబు పర్యవేక్షణలో ఎస్ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీజీఆర్ఎఫ్తో ‘విద్యుత్’ సమస్యల పరిష్కారం
సీతంపేట: విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా, బిల్లింగ్ లోపాలు, విద్యుత్ మీటర్లలో సమస్యలున్నా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)కు ఫిర్యాదు చేయాల్సిందిగా సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లోని గౌరీ కల్యాణ మండపంలో తాటిచెట్లపాలెం పరిధి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్లు కాలిపోవడం, విద్యుత్ వోల్టేజి హెచ్చు తగ్గులు, విద్యుత్ మీటర్లలో లోపాలు, అదనపు లోడు మంజూరు, యజమాని పేరు మార్పు, కొత్త విద్యుత్ సర్వీసులు వంటి ఏ సమస్య అయినా ీసీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీజీఆర్ఎఫ్కు నేరుగా రాత పూర్వకంగా గాని, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్యపై విచారణ చేపట్టి వినియోగదారునికి న్యాయం చేస్తామన్నారు. సీజీఆర్ఎఫ్కు 2004 నుంచి ఇప్పటి వరకు 8442 ఫిర్యాదులు రాగా వాటిలో 8367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. తాటిచెట్లపాలెం సెక్షన్ పరిధిలో పలువురు వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు షేక్ బాబర్, సులేఖ రాణి, మురళీకృష్ణ, ఈఈ టెక్నికల్ ధర్మరాజు, డీఈఈ విద్యాసాగర్, ఏఈ అప్పలరాజు, లైన్మన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్కు చేరిన ‘ఆయుష్’ పంచాయితీ
పీఎం పాలెం: ఆయుష్ మధురవాడ జోన్ ప్రాంతీయ కార్యాలయ ఉప సంచాలకురాలు(ఆర్డీడీ) ఝాన్సీ లక్ష్మీబాయి, అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దళిత వర్గానికి చెందిన జె.సుష్మ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. గత ఏడాది నవంబర్లో మధురవాడ జోన్ ఆయుష్ ఆర్డీడీగా ఝాన్సీ లక్ష్మీబాయి బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా సిబ్బందితో ఆమెకు పొసగట్లేదు. ఉన్నతాధికారిగా తనకు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదన్న అక్కసుతో దిగువ సిబ్బందిపై రుసరుస లాడుతున్నారని, జూనియర్ అసిస్టెంట్ సుష్మను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లంచ్ సమయంలో అనీజీగా ఉందని, భోజనం చేసేందుకు ఆర్డీడీ గదిలోకి వెళ్లగా, తనపై లక్ష్మీబాయి చేయి చేసుకుని, విపరీతంగా దూషించినట్లు సుష్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పై అధికారినన్న కనీస జ్ఞానం లేకుండా తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడిచేసి తన దుస్తులు చింపివేసినట్లు ఆరోపిస్తూ ఆర్డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆయుష్ ఆర్డీడీ, జూనియర్ అసిస్టెంట్ పరస్పర ఫిర్యాదులు -
ట్రాలర్ ఢీకొని యువకుడి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాలర్ రూపంలో మృత్యువు కబళించింది. షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలేనికి చెందిన మైలపల్లి మనోహర్ (24) మెరినో సంస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం నగరం నుంచి గాజువాక వైపు బైక్పై వెళ్తున్నాడు. షీలానగర్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వెనుకనే వేగంగా వస్తున్న ట్రాలర్ బైక్ను ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పడంతో మనోహర్ తూలి లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మనోహర్ హెల్మెట్ ధరించినా.. లారీ చక్రాల కింద నలిగి హెల్మెట్ ఊడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని షీలానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మనోహర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మనోహర్కు తండ్రి మైలపల్లి దేముడు, తల్లి దేముడమ్మ, ఒక సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
24న సర్టిఫికెట్ కోర్సులకు ఇంటర్వ్యూ
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో నిర్వహిస్తున్న స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్ సేఫ్టీ కోర్సులో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్ సూపర్వైజరీ ప్రొగ్రామ్లో 20 సీట్లు ఉన్నాయన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు టెన్త్ పాస్/డిప్లొమా/ఇంటర్/డిగ్రీ సరిఙ్టఫికెట్, ఆధార్, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్తో పాటు ఒక సెట్ జెరాక్స్తో ఆ రోజు ఉదయం 10గంటలకు నేరుగా గైస్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరారు. -
ఎగిరే పావురమా..
ఏయూక్యాంపస్ : విశాఖ సాగర తీరం ఉదయాన్నే కపోతాల రాకతో సందడిగా మారుతోంది. సూర్యుడు రాకముందే వందలాది కపోతాలు ఆకాశంలో విహరిస్తూ నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. అలల సవ్వడికి తోడు కపోతాల రెక్కల చప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక అనుభూతితో నింపుతోంది. కొంతమంది పక్షి ప్రేమికులు వేసే గింజలు, మురీలు లాంటి ఆహారాన్ని అందుకొని.. అవి నోట కరుచుకుని గాల్లోకి ఎగురుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటోంది. ఉదయాన్నే బీచ్కు వచ్చే పర్యాటకులు, నగరవాసులు ఈ కపోతాలతో కలిసి ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఏయూలో పేలవంగా వజ్రోత్సవాలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగం వజ్రోత్సవాలు పేలవంగా సాగుతున్నాయి. వర్సిటీలో జియో ఫిజిక్స్ విభాగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మూడు రోజుల పాటు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహ ణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి రోజు ప్రారంభ వేడుక డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. రెండో రోజు మంగళవారం ఈ కార్యక్రమాన్ని వర్సిటీలోని జియో ఫిజిక్స్ బ్లాక్కు మార్చారు. రెండు హాళ్లలో సెమినార్లు కొనసాగేలా షెడ్యూల్ ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చే వారికి, ఆహూతులకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఒక హాల్లో మాత్రమే సెమినార్ నిర్వహించగా, రెండో హాల్ నిరుపయోగంగా వదిలేశారు. రెండో హాల్లో సెమినార్ ఇవ్వాల్సిన పలువురు విద్యావేత్తలు, విషయం తెలియక అక్కడే చాలా సేపు కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఒకే హాల్లో సెమినార్ కొనసాగగా, దానికి కూడా పూర్తి స్థాయిలో ఆహూతులు లేక కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. సబ్జెక్టు పరంగా ఎంతో నిష్ణాతులైన వారు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే సమయంలో, వీటిని సద్వినియోగం చేసుకునే రీతిలో విద్యార్థులనైనా భాగ స్వాములను చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విభాగం భవనం ముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మధ్యాహ్నం వరకు 58 మంది మాత్రమే సందర్శించారు. మధ్యాహ్నం తరువాత ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు తిలకించేందుకు వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు త్వరలోనే జరగనున్నాయి. ఓ విభాగం నిర్వహించే వజ్రోత్సవాలే ఇలా ఉంటే.. వర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇంకెలా చేస్తారోనని ఆచార్యులు సైతం పెదవి విరుస్తున్నారు. -
రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికై ంది. ఈ మేరకు విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా 19 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించగా సెలక్షన్ కమిటీ సభ్యులు మంగళవారం 12 మందితో కూడిన తుదిజట్టును ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఎంపికై న రాష్ట్ర కబడ్డీ పురుషుల జట్టు ఒడిశాలోని కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కటక్లో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్, విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్లు వ్యవహరించారు. ఎంపికై న రాష్ట్ర జట్టును జి.రామకృష్ణ చౌదరి, లాలం రమేష్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సీనియర్ జాతీయ క్రీడాకారుడు వీవీ రమణ, సీహెచ్ పద్మరాజు తదితర క్రీడా ప్రముఖులు అభినందించారు. -
నేటి నుంచి ఎగ్జిబిషన్
ఏయూక్యాంపస్: ప్రధానమంత్రి విశ్వకర్మ పథ కం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 21 వరకు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులను 65 స్టాళ్లలో ప్రదర్శించనున్నారు. అర్మకొండను అధిరోహించారు సింథియా: తూర్పు నావికాదళ పరిధిలోని మెటీరియల్ ఆర్గనైజేషన్ విభాగ సిబ్బంది రాష్ట్రంలోని ఎత్తైన శిఖరమైన అర్మ కొండను మంగళవారం అధిరోహించారు. అడ్వెంచర్ యాక్టివిటీస్లో భాగంగా అర్మ కొండ ట్రెక్కింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. -
ఎన్నికల కోడ్ ధిక్కరించిన గంటా
● సింహగిరిపై ఆలయ మరమ్మతుపనులను ప్రారంభించిన గంటా ● హాజరవ్వని ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ వైదిక పెద్దలు సింహాచలం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ధిక్కరించి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. వర్షాలు పడినప్పుడు స్వామి ఆలయం పైకప్పు నుంచి వర్షం నీరు లోపలకి చేరుతోంది. దీంతో రూ.4 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టేందుకు పుణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలిజియస్ ట్రస్ట్ ఇటీవల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎప్పుడు పనులు ప్రారంభించేదీ అధికారులు ప్రకటించలేదు. సింహగిరికి సోమవారం వచ్చిన గంటా శ్రీనివాసరావు సంబంధిత పనులను ప్రారంభించారు. అయితే దేవస్థానం ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు, ప్రముఖ వైదికవర్గం ఎవరూ పాల్గొనలేదు. వారంతా ఎన్నికల కోడ్ ఉండడంతోనే పాల్గొనలేదని తెలుస్తోంది. ఆలయ నిబంధనలు, ఆగమశాస్త్ర పద్ధతులు తెలిసిన ఆలయ వైదిక పెద్దలతో పాటు, ఇంజినీరింగ్ అధికారులు లేకుండా గంటా ఎలా శంకుస్థాపన చేస్తారన్న ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆది నుంచి ఆలయ మరమ్మతు పనులను గంటా తన ఖాతాలో వేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలకు ఆయన చర్యలు బలాన్ని చేకూర్చాయి. -
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
● ముగ్గురు ముఠా సభ్యుల అరెస్టు ● పరారీలో ప్రధాన నిందితుడు గోపాలపట్నం: రిజర్వ్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, విల్లాలు ఇప్పిస్తామని.. రూ.5 వేలు కడితే కోటి వరకు నజరానా వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సోమవారం టాస్క్ఫోర్స్, ఎయిర్పోర్టు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. రెండు రాష్ట్రాల్లో ఓ ముఠా రైస్ పుల్లింగ్, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికెట్లు వంటి పలు రకాల మోసాలకు పాల్పడుతోంది. ఇందులో కొందరు ముఠా సభ్యులు విశాఖలో ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మర్రిపాలెం వుడా లేఅవుట్ పార్క్ సమీపంలో ఒక ఇంటిపై దాడి చేశారు. విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరరావు, కాకినాడకు చెందిన శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన యడ్లపల్లి నారాయణ మూర్తి పరారయ్యాడు. వీరు గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేయడం, రూ.5 వేలు, రూ.10 వేలు కడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. వీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని ప్రజలను ఏమార్చుతున్నారు. కాగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
20 నుంచి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్– విశాఖపట్నం మధ్య నడిచే లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఈ నెల 20 నుంచి, లోకమాన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఈ నెల 22 నుంచి యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్(07025) స్పెషల్ ఈ నెల 21న చర్లపల్లిలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.47 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్ వెళ్తుంది. శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి(07026) స్పెషల్ ఈ నెల 22న మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి సాయంత్రం 4.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.47 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి వెళ్తుంది. పలు రైళ్లు రద్దు... ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19న విశాఖపట్నం–షాలిమర్(22854) ఎక్స్ప్రెస్, 21న సంత్రగచ్చి–ఎంీజీఆర్ చైన్నె సెంట్రల్ (22807) ఎక్స్ప్రెస్, 23న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(22808) ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. -
విజ్ఞాన్ కళాశాలలో విద్యార్థుల కోట్లాట
● యువతరంగం వేడుకలో ఘర్షణ ● ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కూర్మన్నపాలెం: విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. యుద్ధాన్ని తలపించేలా ఒకరినొకరు కొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఈ కొట్లాటలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ కె.మల్లేశ్వరరావు అందించిన సమాచారం మేరకు.. కళాశాలలో ఏటా యువతరంగ్ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి, ఆవిష్కరిస్తున్న సమయంలో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. ఆ సమయంలో ఒక విద్యార్థికి మరో విద్యార్థి కాలు తగిలింది. ఆ విద్యార్థి క్షమాపణ చెప్పినప్పటికీ శాంతించని కాలు తగిలిన విద్యార్థి ఘర్షణకు దిగాడు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో కళాశాల ఆవరణ అంతా గందరగోళంగా మారిపోయింది. ఈ ఘర్షణలో ఈశ్వర్ అనే తృతీయ సంవత్సరం విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఈశ్వర్ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మల్లేశ్వరావు కేసు నమోదు చేశారు. ఇందుకు బాధ్యులైన బీటెక్ చదువుతున్న సూర్యకిరణ్, జయసూర్య, మరికొంతమంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. ప్రస్తుతం కాలేజీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాలు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫొటోలు, ఇతర వివరాలను ఇక్కడి నుంచి అధికారులు పంపించగా, సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సోమవారం కలెక్టరేట్కు తీసుకొచ్చారు. 10 శాతం రిజర్వ్తో కలిపి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యకు సరిపడా పత్రాలను అధికారులు సేకరించి భద్రపరిచారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సంబంధిత వాహనానికి పోలీసులు, ఇతర లైజనింగ్ అధికారుల సమక్షంలో సీలు వేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కమిటీ ఏర్పాటు అల్లిపురం: గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్గా మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా కలెక్టర్, డైరెక్టర్గా వీఎంఆర్డీఏ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జీవీఎంసీ కమిషనర్, డైరెక్టర్లుగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్, చీఫ్ ఇంజినీర్తో పాటు మరో ఇద్దరు వ్యవహరిస్తారని పేర్కొన్నారు.