విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్న ఎస్.శ్రీకాంత్ను పద్మనాభం క్రైమ్కు, ఆరిలోవ క్రైమ్ స్టేషన్కు అటాచ్మెంట్లో ఉన్న ఎ.మురళీకృష్ణను అదే స్టేషన్ ట్రాఫిక్లో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే గాజువాక లా అండ్ ఆర్డర్లో ఉన్న ఎం.రాధాకృష్ణను భీమిలి లా అండ్ ఆర్డర్కు, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్లో ఉన్న ఎ.మన్మథను టూ టౌన్ లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు.