మా బాబుకు వయసు పెరుగుతున్నా.. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేదు. ఇంట్లో ఏ పనీ చేయలేడు. కనీసం అన్నం కూడా తినలేడు. నేను గానీ, నా భర్త గానీ ఇంటి దగ్గర ఉండి బాబుకు అన్నం తినిపించాల్సి వస్తోంది. మా కుమారుడికి పరీక్షలు చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాం. వైద్యుల సలహా మేరకు మందులు వా డుతున్నాం. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలు మందులకు సరిపోవడం లేదు. పింఛన్ మొత్తాన్ని పెంచి మమ్మల్ని ఆదుకోవాలి.
–పద్మశ్రీ, శ్రీనివాస్ తల్లి, జనతాకాలనీ, మల్కాపురం