స్టేడియంలో పైలాన్‌ ఆవిష్కరణ | - | Sakshi

స్టేడియంలో పైలాన్‌ ఆవిష్కరణ

Mar 31 2025 11:08 AM | Updated on Mar 31 2025 1:27 PM

స్టేడియంలో పైలాన్‌ ఆవిష్కరణ

స్టేడియంలో పైలాన్‌ ఆవిష్కరణ

విశాఖ స్పోర్ట్స్‌: వైఎస్సార్‌ స్టేడియం ఆధునికీకరణకు గుర్తుగా పైలాన్‌ను ఐసీసీ చైర్మన్‌ జై షా ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఎంపీ శ్రీ భరత్‌, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, మాజీ క్రికెటర్‌ చాముండేశ్వరినాథ్‌, మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌ పాల్గొన్నారు.

ఫుడ్‌ కోర్టులో ఐసీసీ చైర్మన్‌ సందడి

మధురవాడ: ఐపీఎల్‌ మ్యాచ్‌ అనంతరం ఐసీసీ చైర్మన్‌ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, మంత్రి లోకేష్‌ పీఎంపాలెంలోని ఓ హోటల్‌లో సందడి చేశారు. ఐసీసీ చైర్మన్‌ విశాఖలో స్ట్రీట్‌ ఫుడ్‌ తీసుకోవాలని లోకేష్‌కు చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు బీచ్‌రోడ్డు, ఇతర ప్రాంతాల్లోని ఫుడ్‌ కోర్టుల గురించి మంత్రికి వివరించారు. అయితే, దగ్గరలోనే చేద్దామని అనడంతో అక్కడ స్వగ్రామ ఫుడ్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. దీంతో వారు అక్కడ అర గంటకు పైగా గడిపి చాట్‌, పావ్‌ బాజీ రుచి చూశారు. టీ తాగి ఉద్యోగులతో ఫొటోలు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement