
ఐపీఎల్ మ్యాచ్ చూసిన అనాథలు
● సీపీకి కృతజ్ఞతలు
అల్లిపురం: వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ను వీక్షించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి 65 మంది అనాథ పిల్లలకు అవకాశం కల్పించారు. భీమిలిలోని ఎస్వోఎస్ సంస్థ నుంచి 45 మంది, గాజువాకలోని డిజైర్ సంస్థ నుంచి 20 మంది పిల్లలు ఈ మ్యాచ్ను చూశారు. పోలీస్ కమిషనర్ వారితో కలిసి కొంత సమయం గడిపారు. తమకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు పిల్లలు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు.