No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Jun 24 2024 12:24 AM | Updated on Jun 24 2024 12:24 AM

ఆత్మకూర్‌: ఉమ్మడి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో 640 మి.యూనిట్లు లక్ష్యానికిగాను కేవలం 212 మి.యూ. మాత్రమే ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇంత తక్కువ మొత్తంలో విద్యుదుత్పత్తి గతేడాదే కావడం విశేషం. 2022–23లో ప్రాజెక్టుకు వరద అధిక మొత్తంలో చేరడంతో ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 876 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 648 మి.యూ. లక్ష్యానికిగాను 775 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టారు. 2021–22లో 724 మి.యూ. లక్ష్యానికిగాను 704 మి.యూ. సాధించారు.

వరదనీటిపైనే ఆధారం..

జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంల నుంచి వరద వచ్చి చేరితేనే విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది మహారాష్ట్రా, కర్ణాటకలో వర్షాలు మోస్తారుగా కురుస్తున్నప్పటికీ అక్కడి ప్రాజెక్టులు నిండిన తర్వాతే దిగువకు నీటిని వదులుతారు. ఇక్కడ వరణుడు మోహం చాటేయడంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

విద్యుదుత్పత్తి వివరాలిలా..

ప్రాజెక్టు దిగువ జల విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, ఎగువ జల విద్యుత్‌ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2014–15 నుంచి 2023–24 వరకు 4,892 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు.

ఈ ఏడాది లక్ష్యం 600 మిలియన్‌ యూనిట్లు

గతేడాది ఉత్పత్తి కేవలం 212 మి.యూ. మాత్రమే..

ఎగువ కర్ణాటక నీటిపైనే ఆధారం

మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement