ప్రధాన వార్తలు

అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డేనియల్ కెయిన్ వెల్లడించారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్హ్యాన్ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్ పాటుపడుతుంది’’అని అబ్బాస్ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్పైనా ఇరాన్ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్షహర్–4 క్షిపణిను సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్ ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఇరాన్పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్హెడ్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించారు.

అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’.

సర్వే నంబర్లు గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండడంతో అవి రెగ్యులరైజ్ చేసేందుకు వీలు కాలేదు. కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వారసత్వం (విరాసత్) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యుటేషన్ పెండింగ్/కోర్టు కేసులు, డిజిటల్ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్లో తక్కువ జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ తర్వాత వరంగల్ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్ (3,712), మహబూబ్నగర్ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం. – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (నోట్: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.)

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి రా.8.49 వరకు, తదుపరి చతుర్దశి; నక్షత్రం: కృత్తిక ప.2.21 వరకు, తదుపరి రోహిణి; వర్జ్యం: తె.5.20 నుండి 6.49 వరకు (తెల్లవారితే మంగళవారం); దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు; అమృత ఘడియలు: ప.12.04 నుండి 1.33 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు సూర్యోదయం: 5.30; సూర్యాస్తమయం: 6.33; మాస శివరాత్రి మేషం.. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ.వృషభం... కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం.. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.సింహం..... పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.కన్య... కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.తుల... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.వృశ్చికం..... శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. భూలాభాలు. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.ధనుస్సు.... బంధువుల ద్వారా కీలక సమాచారం. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం... పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.కుంభం.... ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీనం.... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మావోయిస్టులను నిద్రపోనివ్వను
రాయ్పూర్: మావోయిస్టులు సాధారణగా వర్షాకాలంలో విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈ వర్షాకాలంలో కూడా మావోయిస్టులను నిద్రపోనివ్వనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వర్షాకాలంలో కూడా ప్రభుత్వ ఆపరేషన్ కొనసాగుతుందని హెచ్చరించారు. చర్చల ప్రసక్తే లేదన్న మంత్రి.. అడవుల్లో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. చత్తీస్గఢ్లోని నవా రాయ్పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ)కి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సెజ్బహార్లోని ఎన్ఎఫ్ఎస్యూ ట్రాన్సిట్ క్యాంపస్ను, ఛత్తీస్గఢ్లోని ఐ–హబ్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామన్నారు. అవసరమైతే అంతకన్న ఎక్కువ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను పూర్తిగా అమలుతో మన దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, వేగవంతమైన, శాస్త్రీయ న్యాయ వ్యవస్థగా మారుతుందని షా అన్నారు. నవ రాయ్పూర్లోని ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్కు రూ. 145 కోట్లు, సీఎఫ్ఎస్ల్కు రూ. 123 కోట్లు ఖర్చవుతుందని, ఇవి మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక పురోగతిపైనే కాకుండా సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో, విజయ్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బీఎన్ఎస్ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్ ప్లస్ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్పైకి ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి (ఏఆర్ కానిస్టేబుల్)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైనట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్ 18 : వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్లోని వాహనం కాదు. ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు గొట్టిపాటి హరీశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్ 22 : వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్ఎస్ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్పై ఒత్తిడి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

అబ్రకదబ్ర.. సూపర్ సిక్స్ ఇచ్చేశా.. మాయాఫెస్టోతో నయ వంచన!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు నాటి సీఎం వైఎస్ జగన్ సిసలైన నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయడం.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజలకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.బీసీలకు వెన్నుపోటు⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు. ⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. ⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొటా్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.మహిళలకు మోసం ⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.⇒ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహంఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.రైతులకు తీరని ద్రోహంవ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.ఉద్యోగులకూ మోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ను రాజీనామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్ను నియమించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్ ఊసే లేదు. అలవెన్స్ పేమెంట్స్పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి ⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–26 బడ్జెట్లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.ముస్లిం మైనార్టీలకు దోఖా ⇒ హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ చేపట్టలేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు. ⇒ నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.గాల్లో దీపంగా ప్రజారోగ్యం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.విద్యుత్ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.అగ్రవర్ణ పేదలకు అన్యాయం ⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు. ⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేయలేదు. ⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు. చెదురుతున్న సొంతింటి స్వప్నం గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.బాదుడే బాదుడు ⇒ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామన్న∙హామీ నిలుపుకోలేదు. ⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూరా.. వాడవాడన బెల్ట్షాపులు వెలిశాయి. ⇒ రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు.

గాజాలో... ఆకలి కేకలు!
గాజా: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంపై మెరుపుదాడి చేపట్టిన హమాస్ ఇతర జిహాదీలు 1,195 మందిని చంపేయడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకుపోయారు. ఆ ఒక్క ఘటన..దశాబ్దాలుగా శరణార్థులుగా సొంత ప్రాంతంలోనే బతుకులీడుస్తున్న పాలస్తీనా ప్రజలను అత్యంత తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేసింది. శక్తివంతమైన ఇజ్రాయెల్ సైన్యం ఆ రోజు నుంచి గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తూ 50 వేల మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు లక్షన్నర మందిని క్షతగాత్రులుగా మార్చేసింది. జిహాదీ గ్రూపులు బందీలను విడుదల చేయలేదనే సాకుతో గాజాను కొన్ని నెలలుగా పూర్తిగా దిగ్బంధంలో ఉంచింది. నీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను సైతం అందకుండా చేసింది. దీంతో ఈ ఆ ప్రాంతంలోని 22% మంది, 4.70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అత్యంత కీలకమైన ఆస్పత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రుల్లో వసతులు, మందులు కరువై సరైన వైద్యం అందక, మహిళలు, చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మంచి నీరు, ఇంధన సరఫరాను సైతం నిలిపివేసింది. డీహైడ్రేషన్, డయేరియా, హెపటైటిస్ వంటి వాటితో జనం, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ప్రాంతంలోని 90 శాతం నివాసాలను నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేసింది. నేలమట్టమైన భవనాల శిథిలాలు, అపరిశుభ్రత మధ్యనే పాలస్తీనియన్లు భయంభయంగా బతుకుతున్నారు. ఐరాస సారథ్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల నుంచి నిల్వలు హమాస్కు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్ మూసివేయించింది. రెండు నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ సారథ్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు పరిమితంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ సైతం అన్నార్తులు తుపాకీ కాల్పులకు గురికాక తప్పడం లేదు. రోజూ పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ‘గాజాలో మానవీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఆకలి చావులకు గురికాక తప్పదు’అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా స్ట్రిప్లోని 20 లక్షల మంది ప్రజల ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఇజ్రాయెల్కు హితవు పలుకుతోంది. భూమిపై నరకం గాజా భూమిపై నరకం కంటే అధ్వానంగా గాజా ప్రాంతం తయారైందని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జరిక్ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు, బందీలను వదిలిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు కనీస మానవీయమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. గాజాలో చట్టపరమైన, నైతిక, మానవీయ ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్పింగ్ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)

అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్తో పాటు కెపె్టన్ శుబ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1.
పంట – కలుపు
పట్టు తప్పుతోంది!
స్థిరమైన ఆదాయానికి.. ఎస్డబ్ల్యూపీ మంత్ర!
తనిఖీలతో బోధనెలా?
సెల్ఫోన్ వాడకంతో మాటలు రాని చిన్నారులు
హైదరాబాద్–బెంగళూరు.. డిఫెన్స్ కారిడార్!
ఆ 3 అణు కేంద్రాలు
‘కనీస’ కనికరం లేదా..!
ఇరుకున పడ్డ ఇరాన్!
‘గెస్టు’కు రెగ్యులర్ గుబులు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తోడల్లుడు కావడమే అర్హతా?
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
పంట – కలుపు
పట్టు తప్పుతోంది!
స్థిరమైన ఆదాయానికి.. ఎస్డబ్ల్యూపీ మంత్ర!
తనిఖీలతో బోధనెలా?
సెల్ఫోన్ వాడకంతో మాటలు రాని చిన్నారులు
హైదరాబాద్–బెంగళూరు.. డిఫెన్స్ కారిడార్!
ఆ 3 అణు కేంద్రాలు
‘కనీస’ కనికరం లేదా..!
ఇరుకున పడ్డ ఇరాన్!
‘గెస్టు’కు రెగ్యులర్ గుబులు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తోడల్లుడు కావడమే అర్హతా?
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
సినిమా

ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?
మంచు ఫ్యామిలీ తీసిన 'కన్నప్ప'.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు)గత కొన్నాళ్ల నుంచి 'కన్నప్ప' ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. 'కన్నప్ప' విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈయన కనిపించారు.సడన్గా 'కన్నప్ప' దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు)అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్కి.. 'కన్నప్ప' దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు: బ్రహ్మనందం)

కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే సాధారణమైన విషయం ఏం కాదు. స్టార్ హీరోల వారసులైనా సరే సరైన మూవీస్ చేస్తేనే నిలబడతారు. లేదంటే మెల్లగా సైడ్ అయిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తెలుగులో యాంకర్గా టాప్లో ఉండే ప్రదీప్.. గత కొన్నేళ్లుగా తన ప్రొఫెషన్ని పక్కనబెట్టి హీరోగా ప్రయత్నాలు చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడికే వచ్చేశాడు.యాంకర్గా ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల నుంచి ఛానల్తో డ్యాన్స్, కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఇవి చేస్తూనే అత్తారింటికి దారేది, 100% లవ్ తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత మంచి గుర్తింపు రావడంతో హీరోగా ప్రయత్నిద్దామని '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీలో ఒక్క పాట తప్పితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే చిత్రంతో వచ్చాడు.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?)కొన్ని నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కూడా ప్రదీప్కి హీరోగా అదృష్టం తీసుకురాలేకపోయింది. దీంతో ఆలోచనలో పడిపోయాడు. తనకు తెలిసిన యాంకరింగ్ మళ్లీ మొదలుపెట్టేశాడు. 'కుక్ విత్ జాతిరత్నాలు' పేరుతో ఈ వీకెండ్ నుంచి ప్రారంభం కాబోతున్న కామెడీ వంట షోకి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. తమిళంలో ఇదివరకే హిట్టయిన 'కుక్ విత్ కోమలి' అనే షో దీనికి స్పూర్తి. ఇందులో యష్మీ, సన్నీ, బాబా మాస్టర్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, దీక్షా పంత్, హరి, సీరియల్ నటుడు ప్రభాకర్, ముక్కు అవినాష్ ఉన్నారు.ప్రదీప్ మళ్లీ యాంకరింగ్ వైపు రావడం బట్టి చూస్తే హీరోగా పెద్దగా వర్కౌట్ కాలేదని రియలైజ్ అయినట్లు ఉన్నాడు. బహుశా అందుకే మళ్లీ షోలు చేయడం మొదలుపెట్టాడని అనిపిస్తోంది. ప్రదీప్ అనే కాదు సుడిగాలి సుధీర్ కూడా గతంలో ఇలానే రెండు మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. కాకపోతే వీటిలో 'గాలోడు' అనే మూవీ తప్పితే మిగతావన్నీ ఆడలేదు. దీంతో ఎప్పటిలానే యాంకరింగ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్)

నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
కష్టాలు లేని జీవితం ఉండదు. మెగా డాటర్ నిహారిక లైఫ్లోనూ కష్టాలున్నాయి. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. కానీ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి. నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు, దూరం, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2023లో నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు.ఆ ఒక్కటే అవసరంతాజాగా ఈ విషయం గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నిహారిక, నేను ఎక్కువ మాట్లాడుకుంటాం. పిల్లల కెరీర్ విషయాల్లో నేను తలదూర్చను. నా పిల్లల హిట్స్, ఫ్లాప్ గురించి నాకవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృథానే! వరుణ్.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా? అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటాం అని బదులిచ్చాడు. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.తప్పు నాదేకానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పయింది. ఆ పెళ్లి మేం చేసిన తప్పు. మేం సరిగా జడ్జిమెంట్ చేయలేకపోయాం. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్లాం. కానీ.. తనకు, అబ్బాయికి సింక్ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారిద్దరూ కలిసుండేందుకు నేనెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇష్టం లేదన్నారు, సరేనని చెప్పాను. ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు చేస్తోంది. కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా

కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్
కమెడియన్గా కెరీర్ ప్రారంభించి.. 'జబర్దస్త్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ ప్రస్తుతం పలు సినిమాలు, ఈవెంట్స్ చేసుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా టీవీ కామెడీ షోల్లో ఎక్కడా కనిపించట్లేదు. 2023లో యాంకర్ సుజాతని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. 8 నెలల క్రితం వీళ్లకు కూతురు పుట్టగా.. ఇప్పుడు ఆ చిన్నారి తొలి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)తన కూతురు ఖ్యాతికకు అన్నప్రాసన జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగానే రాకేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఫొటోగ్రాఫర్స్ ఆలస్యం వల్ల ఇలా లేటుగా ఫొటోలు పెట్టానని విషయాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. దేవుడికి పూజ చేయడం, అమ్మాయిని చూపించడం లాంటివి చేశారు గానీ పాప ఏం దేన్ని ఒడిసి పట్టుకుందనేది మాత్రం రివీల్ చేయలేదు.రాకేశ్ భార్య సుజాత విషయానికొస్తే.. న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టింది. బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొంది. కాకపోతే ఎక్కువ వారాలు హౌసులో ఉండలేకపోయింది. ప్రస్తుతం ఈమె కూడా ఎక్కడా పనిచేయట్లేదు. పాపని చూసుకుంటోంది. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ లైఫ్ని రాకేశ్- సుజాత ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, గ్లౌసెస్టర్షైర్ దిగ్గజం డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్లో వెస్టిండీస్పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ను అవుట్ చేశారు.అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన లారెన్స్..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు..లారెన్స్ మృతి పట్ల భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు కట్టుకుని బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్గా సెంచూరియన్ ఓలీ పోప్(106) ఔట్ కాగా.. ఐదో వికెట్గా కెప్టెన్ బెన్ స్టోక్స్(20) పెవిలియన్కు చేరాడు.భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఇంకా టీమిండియా స్కోర్కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్(42), జేమీ స్మిత్(5) ఉన్నారు.

టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..
టీ20 ప్రపంచ కప్ 2026కు కెనడా జట్టు ఆర్హత సాధించింది. శనివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్లో బహామాస్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కెనడా.. వరల్డ్కప్ బెర్త్ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్నకు కెనడా క్వాలిఫై కావడం ఇదే రెండో సారి.అమెరికాస్ క్వాలిఫైయర్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లోనూ విజయం సాధించిన కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు.13వ జట్టుగా..2026 టీ 20 వరల్డ్ కప్లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో భారత్, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్కప్-2024 టాప్-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హత సాధించాయి.గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అగ్రస్ధానంలో నిలిచినప్పటికి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెనడా ఆర్హత సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు

IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం తనను మించిన బౌలర్ లేడని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పలు చెరిగాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి సహచర పేసర్లు తేలిపోయిన చోట.. బుమ్రా తన బౌలింగ్ స్కిల్తో ఆకట్టుకున్నాడు.పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. భారత్ పడడొట్టిన మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే కావడం గమనార్హం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్ను గేమ్లో ఉంచాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వసీం అక్రమ్ రికార్డు బ్రేక్..సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్లో బెన్ డకెట్ను ఔట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్(146) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో అక్రమ్ ఆల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.సెనా దేశాల్లో బుమ్రా రికార్డుఆస్ట్రేలియా- 12 మ్యాచ్లు- 64 వికెట్లుఇంగ్లాండ్ 10 మ్యాచ్లు- 39 వికెట్లున్యూజిలాండ్- 2 మ్యాచ్లు- 6 వికెట్లుదక్షిణాఫ్రికా- 8 మ్యాచ్లు- 38 వికెట్లుసెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుజస్ప్రీత్ బుమ్రా 147వసీం అక్రమ్ 146అనిల్ కుంబ్లే 141ఇషాంత్ శర్మ 130

అభిషేక్ విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచరీ! 15 సిక్స్లతో
మధ్యప్రదేశ్ లీగ్ (MPL) 2025లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరాభిమాని అభిషేక్ పాఠక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జబల్పూర్ రాయల్ లయన్స్, బుందేల్ఖండ్ బుల్స్ జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో బుందేల్ఖండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ పాఠక్.. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.అతడిని ఆపడం ఎవరిని తరం కాలేదు. అభిషేక్ ఓవరాల్గా 48 బంతుల్లో15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బుందేల్ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో జబల్పూర్ జట్టు 227 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో బుందేల్ఖండ్ విజయం సాధించింది."నేను 13 ఏళ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు అండర్-16, అండర్-19, అండర్-23 స్దాయిలో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాను. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాను.నేను ఈ స్దాయికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు ఎంతో ఇష్టం. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 229 పరుగులు చేశాడు.వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ పాఠక్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఇండియన్ క్రికెటర్గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్పై సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సూర్యవంశీ రికార్డును పాఠక్ బ్రేక్ చేశాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు వీరేఉర్విల్ పటేల్- 28 బంతులుఅభిషేక్ శర్మ- 28 బంతులురిషబ్ పంత్- 32 బంతులుఅభిషేక్ పాఠక్-33 బంతులువైభవ్ సూర్యవంశీ- 35 బంతులు View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official)
బిజినెస్

ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422).

ఇరుకు ఇళ్లకు అవసరం.. ఇలాంటి ఫర్నీచర్
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నీచర్ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్.. అలాగే ఈ ఫర్నీచర్ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వాల్ క్యాబినెట్స్.. వంటగది లేదా లివింగ్ రూమ్లో సెరామిక్ లేదా గ్లాస్వేర్ను అలంకరించటానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్ కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులు ఉంచుకోవచ్చు.మినీమలిస్టిక్ డ్రెసింగ్ మిర్రర్.. ఇంట్లోని మొత్తం ఫర్నీచర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెసింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుగ్గా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్ను ఉంచి వాడుకోవచ్చు.కోజీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు.సైడ్ టేబుల్స్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ను అమర్చుకోవచ్చు.

తప్పుడు టికెట్ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్లైన్కు జరిమానా
ప్రయాణికుడికి తప్పుడు విమాన టికెట్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. స్పైస్ జెట్ తప్పుడు టికెట్లు జారీ చేయడంతో ఓ సీనియర్ సిటిజన్ ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని, ఆ ప్రయాణికుడికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.ముంబై (సబర్బన్) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూన్ 17న జారీ చేసిన ఉత్తర్వులలో ప్రయాణికుడిని "మానసిక వేధింపులకు" గురిచేసిన సంఘటనలో "లోపభూయిష్టమైన సేవ, నిర్లక్ష్య ప్రవర్తన"కు స్పైస్ జెట్ను వినియోగదారుల కమిషన్ దోషిగా పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ 2020 డిసెంబర్ 5న ముంబై నుండి దర్భంగాకు స్పైస్ జెట్లో రానూపోనూ టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై-దర్భంగా ప్రయాణం పూర్తి కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుగు ప్రయాణాన్ని విమానయాన సంస్థ రద్దు చేసింది. 2020 డిసెంబర్ 8న ముంబైలో పీహెచ్డీ ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుడు కోరగా అదే రోజు పాట్నా నుంచి కోల్కతాకు, అక్కడి నుంచి ముంబైకి ప్రయాణించేందుకు స్పైస్జెట్ ప్రత్యామ్నాయ టికెట్ అందించింది.అయితే తీరా పాట్నాకు చేరుకున్న తర్వాత ఆ టికెట్లు తప్పుగా ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికుడు మరుసటి రోజు ఉదయం తన సొంత ఖర్చులతో మరో విమానాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు మానసిక వేదనతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆలస్యంగా రావడం వల్ల ఆయన పరీక్షకు కూడా రాయలేకపోయారు.ఇదంతా విమానయాన సంస్థ సేవల్లో లోపం, నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ సదరు వ్యక్తి వినియోగదారుల ప్యానెల్ ను ఆశ్రయించారు. రూ.14,577 ఛార్జీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2 లక్షలు, లిటిగేషన్ ఖర్చు కింద రూ.25 వేలు స్పైస్ జెట్ నుంచి ఇప్పించాలని కోరారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రద్దు జరిగిందని, దీనికి తమ బాధ్యత పరిమితమని స్పైస్ జెట్ వాదించింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బుకింగ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదుదారుడికి పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని ఎయిర్లైన్స్ పేర్కొంది.దీనిపై వినియోగదారుల కమిషన్ స్పందిస్తూ విమానాల రద్దు విమానయాన సంస్థ నియంత్రణకు అతీతమైనదని అంగీకరిస్తూనే ఫిర్యాదుదారుకి తప్పుడు టికెట్లు జారీ చేసిన నిర్లక్ష్య చర్య నుంచి విమానయాన సంస్థ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ప్రయాణికుడికి మానసిక వేదనకు పరిహారంగా రూ .25,000, లిటిగేషన్ ఖర్చు కోసం రూ .5,000 చెల్లించాలని కమిషన్ విమానయాన సంస్థను ఆదేశించింది.

జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్లను ఆడుకోవచ్చు.ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలుజియో ప్రారంభించిన కొత్త ప్లాన్లు.. ఒకటి రూ.495 ప్లాన్, మరొకటి రూ.545 ప్లాన్. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.👉 ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్.. 👈రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి జియో నంబర్తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది.
ఫ్యామిలీ

వావ్.. బాంబూ గ్రోవ్..
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్’. జపాన్లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది. ఈ వనంలో వేలాది వెదురు మొక్కల మధ్య నుంచి కాలిబాట ఉంటుంది. ఆ దారిన నడిచి వెళ్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణానికి నిలయం. సన్నని వెదురు కాండాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎత్తుగా పెరిగి, పచ్చని గుడిసెలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెదురు ఆకుల గుండా ప్రసరించే సూర్యకాంతి భూమిని చేరే తీరు, తేలికపాటి గాలికి వెదురు కాండాలు ఒకదానికొకటి తాకుతూ సృష్టించే మృదువైన శబ్దం మనసుని మైమరపిస్తుంటాయి. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ, వెదురు కాండాలు వివిధ కోణాల నుంచి కనిపిస్తాయి. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..)

అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!)

అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..
చిరునవ్వుతో ట్రెండ్ సెట్ చేయడమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టయిలింగ్ టెక్నిక్! మేకప్ కాదు, ఫిట్నెస్, ఫన్ , ఫ్యాషన్ ఈ మూడింటి మిక్స్తో తన లుక్ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!నేను ఫాలో అయ్యే స్టయిలింగ్ రూల్ ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్ హైలైట్ అయితే, మేకప్ మ్యూట్గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్ సీక్రెట్! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ! అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్ ఆప్షన్ ఈ ‘హాథ్ ఫూల్’ జ్యూలరీ. ఇది బ్రేస్లెట్ కాదు, రింగ్ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్ లవర్స్కి ఫేవరెట్గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్ చేసుకోవాలి. హాథ్ ఫూల్ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్ చేయొద్దు.లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్ షోరూమ్లా కనిపిస్తుంది. సింపుల్ మేకప్, లైట్ జ్యూలరీ, మల్లెపూల బన్ దీనికి బెస్ట్ కాంబినేషన్. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్ ఏదైనా హాథ్ ఫూల్ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్ పార్టీల్లో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాక్వెలిన్ ధరించిన జ్యూలరీ బ్రాండ్: కోహార్ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్: ఎకయాధర: రూ. 40,075.(చదవండి: సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు)
ఫొటోలు
అంతర్జాతీయం

‘నోబెల్ శాంతి’కి నామినేట్ చేద్దామనుకుంటే.. ఇలా చేశారేంటి?
కరాచీ: ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన తర్వాతే రోజే ఇరాన్పై అగ్రరాజ్యం దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. నోబెల్ శాంతి పురస్కరానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ‘ఎక్స్’ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 🔊PR No.1️⃣8️⃣2️⃣/2️⃣0️⃣2️⃣5️⃣Pakistan Condemns the US Attacks on the Nuclear Facilities of the Islamic Republic of Iran.🔗⬇️https://t.co/2qpo27WzVQ pic.twitter.com/ugtFomQ5HO— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) June 22, 2025 డొనాల్డ్ ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాల్సిందే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21వ తేదీ) వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. అయితే నాలుగురోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని తెలిపింది. మరి ఇప్పుడు అదే ట్రంప్.. ఇరాన్పై దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. కొన్ని దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమయ్యారని నిన్న, మొన్నటి దాకా భావించిన పాక్.. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ఖండించింది. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడని అనుకున్న వేళ.. ఆయన ఇరాన్పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగేందటనే భావనలో పడింది పాక్. తమకేదో సాయం చేశాడని నోబెల్కు సిఫార్సు చేద్దామనుకుంటే.. ట్రంప్ ఇలా చేశారేంటని అనుకోవడం ఇప్పుడు పాక్ వంతైంది. తాము ఓ అధికార ప్రకటన చేసిన రోజు వ్యవధిలోనే ట్రంప్ ‘ఎంత పని చేశారు’ అని తలలు పట్టుకోవడే తప్పితే ఏమీ చేసేది లేకుండా పోయినట్లైంది పాక్ పరిస్థితి. ఇదీ చదవండి:‘మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా’.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!

ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో నేను మాట్లాడాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్తో పాటు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.

క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యంతో జతకట్టిన అమెరికా ఆర్మీ ఇస్లామిక్ దేశంలోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేసిన కొన్ని గంటలకే ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ▶️ Huge smoke rises into the sky following Iran's missile strike in Tel AvivFollow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/HqPJaPUzFz— Press TV 🔻 (@PressTV) June 22, 2025ఈ వీడియోలలో టెల్ అవీవ్లో దట్టమైన పొగ ఆవరించినట్లు కనిపిస్తోంది. వీధులు నిర్మానుష్యంగా ఉండటం, క్షిపణి వర్షం నుంచి తప్పించుకునేందుకు స్థానికులు పరుగెత్తడం మొదలైనవి కనిపిస్తున్నాయి.▶️ Huge smoke rises into the sky following Iran's missile strike in Tel AvivFollow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/HqPJaPUzFz— Press TV 🔻 (@PressTV) June 22, 2025ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం మధ్య ఇజ్రాయెల్లోని ఒక భవనం ఇరాన్ దాడికి గురైంది. బెన్ గురియన్ విమానాశ్రయంతో పాటు ఇతర ఇజ్రాయెల్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపింది.ఇస్లామిక్ రిపబ్లిక్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదంలో అమెరికా జోక్యం దరిమిలా మిడిల్ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరాన్ తన అణుకార్యక్రమాన్ని ముగించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.حيفا وتل أبيب بعد الهجوم الإيراني pic.twitter.com/OthqlKEivw— Al Jadeed News (@ALJADEEDNEWS) June 22, 2025మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ తాము ఒక జట్టుగా పనిచేశామని, బహుశా ఇంతకు ముందు ఎవరూ చేయనట్టుగా పనిచేశామన్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్?

ఇక ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించిన భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోవాలనుకునే భారతీయ పౌరులను భారత్ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి ముందుగా భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పించనున్నామని ఎంఈఏ తెలిపింది. విదేశాలలో ఉన్న భారత పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంది.భారత్ చేరుకోవాలనుకునేవారు టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని ఎంఈఏ తెలిపింది. ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ఇరాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధును ప్రారంభించింది. దీనిలో భాగంగా 800 మందికి పైగా భారతీయులను మూడు చార్టర్ విమానాలలో భారత్ తరలివచ్చారు. ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్?
జాతీయం

ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.

విమానం నుంచి ‘మేడే కాల్’.. తప్పిన పెను ప్రమాదం
ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.గువహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో గురువారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం చాలా తక్కువగా ఉందని పైలట్ గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి ‘మేడే’ సందేశం పంపారు.దీంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్య, అగ్నిమాపక సేవలతో సహా అత్యవసర సేవల బృందాలను మోహరించారు. రాత్రి 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. 168 మంది ప్రయాణికులు విమానంలో ఉండగా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.మేడే కాల్ అంటే..ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్థకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.

ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!
ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. Arrowhead (T-84) రాజస్థాన్లోని రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్ క్యాన్సర్తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్ రిజర్వ్కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. ఈలోపు.. ఆరోహెడ్ చివరి క్షణాలను సచిన్ రాయ్ అనే నేచర్ ఫొటోగ్రాఫర్ బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఆరోహెడ్ వీడియోను షేర్ చేసింది. ‘‘అది జూన్ 17వ తేదీ. పదమ్ తలాబ్ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తున్నా. View this post on Instagram A post shared by Sachin Rai (@sachin_rai_photography)దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్థాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది. అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. T-84కు ఆరోహెడ్ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది.

రాహుల్ గాంధీ డిమాండ్ను తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిలా ్లకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కేటీదొడ్డి మండలం కోతులగిద్దకు చెందిన అనిత (26)కు పాతపాలెం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులుతో కొంతకాలం కిందట వివాహమైంది. కాగా అనిత అదే గ్రామానికి చెందిన మాల దలాయి రంగస్వామితో వివాహేతర సంబంధం కొనసాగించేది.ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో పలుమార్లు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త ఈ నెల 15న హైదరాబాద్లో కూలీ పనులకు వెళ్లగా.. అదేరోజు రాత్రి రంగస్వామి ఇంటికొచ్చా డు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రంగస్వామి.. ఆమె గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. ఈ ఘటనపై అనిత తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంగస్వామి అనితతో తరచూ ఫోన్లో మాట్లాడటాన్ని గుర్తించి శనివారం తెల్లవారుజామున సంగాల పార్కు సమీపంలో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించారని.. ఐదురోజుల్లో కేసు ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. రంగస్వామిని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

గాయకునికి కిలాడీ మోసం
యశవంతపుర: హెల్ప్లైన్ పేరుతో గాయకునికి మహిళ టోపీ వేసిన ఘటన మంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గాయకుడైన కె.రాజేశ్ సంగీత కచేరీలను నిర్వహించేవాడు. ఈయన స్వస్థలం దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి. ఆయనకు గతేడాది ఫేస్బుక్ ద్వారా సంధ్య పవిత్ర అనే మహిళ పరిచయమైంది, ఈమెది బెంగళూరు అని తెలిసింది. మోసపోయిన వ్యక్తులకు సాయం చేస్తానని చెప్పుకొంది. ఓ వ్యవహారంలో హైకోర్టు ద్వారా కేసును పరిష్కారించుకోవాలని చెప్పి రాజేశ్ నుంచి రూ.3.2 లక్షలను పలు విడతలుగా వసూలు చేసింది. కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. రాజేశ్ నిలదీయగా, వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు కట్టుకథలు చెప్పిందామె. బాధితుడు గట్టిగా అడగడంతో, నీ కాళ్లు చేతులు విరిచేయిస్తానని సంధ్య బెదిరించింది. రాజేశ్ బెళ్తంగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి
మైలవరం(కృష్ణా): భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్లో నివసించే వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. రవిశంకర్, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్ ఫోన్ సిగ్నల్ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.ఫోన్ సిగ్నల్ ఆధారంగా..ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్తో పాటు సెల్ఫోన్ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్ సిగ్నల్ను ట్రాక్చేసి రవిశంకర్ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది.

ఇద్దరు బాలికల బలవన్మరణం
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు. వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.