నారాయణ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుగేటు సమీపంలోని నారాయణ ఐఐటీ స్పార్క్ అకాడమీ వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన పవన్ నాయక్(17) ఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.