narayana college
-
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త
సాక్షి, అనంతపురం: నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాలు కాలేజీకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.అనంతపురం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థులు సంఘాలు ఆందోళనలకు దిగాయి. మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. కాగా, నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అంతకుముందు.. కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చరణ్ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాలేజ్ బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
‘రెడ్బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సీరియస్గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు. -
నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో మరో విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడువిద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం సీరియస్ అయ్యింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. -
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
అనూష ఆత్మహత్య.. నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారమే అనూషను పేరెంట్స్ హాస్టల్లో దింపి వెళ్లారు. ఆమెను డ్రాప్ చేసిన కాసేపటికే గదిలో ఉరివేసుకుని అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం అనూష పేరెంట్స్కి ఫోన్ చేసి.. విద్యార్థి పేరెంట్స్కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, సిటీ దాటకముందే.. పేరెంట్స్ కాలేజీకి బయలుదేరారు. వారు.. కాలేజీకి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, తాజాగా బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూష బంధువులు నారాయణ కాలేజీలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనూష సూసైడ్ చేసుకున్న విషయాన్ని తమకు ముందే ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాము అనూష డెడ్బాడీని చూడకముందే ఎందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారని అడిగారు. ఈ క్రమంలో కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. -
కాలేజీలా.. మురికి కూపాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్రూమ్లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా... రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్రూమ్లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్రూమ్లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్ను విద్యారి్థనులకు ఇచ్చారు. -
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్ను హైదరాబాద్లోని హయత్నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
HYD: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన వినయ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య -
వారం రోజుల్లో 200 మంది విద్యార్థినులకు అస్వస్థత
జిన్నారం(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం శివారులోని నారా యణ కళాశాలలో విద్యార్థినులు వాంతులు, విరోచ నాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. నారాయణ బాలికల కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉన్నారు. నెలరోజుల నుంచి విద్యార్థినులు విరోచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని యాజ మాన్యం గుట్టుగా ఉంచటంతోపాటు రహస్యంగా విద్యార్థినులను ఇంటికి పంపిస్తోంది. వారంరోజు ల్లో 200 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలు కావ టంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. కలు షిత నీరు, ఆహారం వల్లే ఇబ్బందులు పడుతున్నా మని విద్యార్థినులు వాపోయారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి వెంక టేశ్యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదే తప్ప విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యం దృష్టి సారించటంలేదని విమర్శించారు. సంక్రాంతి పండుగ పేరిట విద్యార్థినులకు పది రోజులపాటు యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు. -
నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్స్టేషన్కు బ్లాక్మెయిలర్స్ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్లో దారుణం.. కేర్ టేకర్పై ఎలుగుబంటి దాడి -
నారాయణ మనుష్యులు మరీ..!
సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్లోని నారాయణ కాలేజీ వార్డెన్గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. -
నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్గా పనిచేస్తోంది. అయితే కాలేజీ గదిలో ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్లో భవాని నెల క్రితమే హాస్టల్ వార్డెన్గా చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
-
మాదాపూర్ నారాయణ కాలేజీ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: కార్పోరేట్ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్లో ఓ కార్పొరేట్ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. -
బాచుపల్లిలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మైదరాబాద్: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం -
విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయడం ద్వారా నారాయణ విద్యా సంస్థ, దాని అధిపతి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వారి పట్ల న్యాయస్థానం మెతక వైఖరి అవలంబించకూడదని అన్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన నారాయణకు రిమాండ్ తిరస్కరించి, బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేజి్రస్టేట్ తప్పు చేశారని, పరిధి దాటి వ్యవహరించారని, మినీ ట్రయల్ నిర్వహించారని తెలిపారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే, మేజిస్ట్రేట్ల తప్పులను సమర్థించినట్లవుతుందని తెలిపారు. అందువల్ల మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు తీర్పును రిజర్వ్ చేశారు. నారాయణ ఈ నెల 30వ తేదీలోపు లొంగిపోవాలంటూ సెషన్స్ కోర్టు నిర్దేశించిన గడువును తీర్పు వెలువరించేంత వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) మేజి్రస్టేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నారాయణకు బెయిల్ రద్దు ఉత్తర్వులు తాత్కాలికమైనవి కావని, మధ్యంతర ఉత్తర్వులని వివరించారు. అందువల్ల వాటిపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలే తప్ప, క్వాష్ పిటిషన్ కాదని అన్నారు. ఈ సందర్భంగా చట్ట నిబంధనలను, పలు తీర్పులను వివరించారు. నిబంధనల ప్రకారమే బెయిల్ మంజూరు చేయాలి తప్ప, ఫలానా సెక్షన్ వర్తించదని రిమాండ్ సమయంలో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని, ప్రస్తుత కేసులో మేజి్రస్టేట్ ఇలాంటి ట్రయల్ నిర్వహించారని, దీనిపైనే తమ ప్రధాన అభ్యంతరమని తెలిపారు. ప్రశ్నపత్నం లీకేజీ వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, అందుకు నారాయణను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల వల్ల దర్యాప్తునకు విఘాతం కలిగిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారమైనందువల్ల నారాయణ చర్యలను తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. -
కృష్ణ జిల్లా: మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్
-
మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్.. విద్యార్థుల కేకలు!
సాక్షి, కృష్ణ: జిల్లాలో మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ హల్చల్ చేశాడు. పీకాల దాకా మద్యం తాగి విద్యార్ధులు ప్రయాణిస్తున్న బస్సును నడిరోడ్డుపై వదిలేశాడు. దీంతో, విద్యార్థులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు. వివరాల ప్రకారం.. మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ నడిరోడ్డుపై హంగామా చేశాడు. కాలేజీ పూర్తైన తర్వాత ఉయ్యూరు నుంచి విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించిన డ్రైవర్..రోడ్డుపై బస్సును ప్రమాదకరంగా నడిపాడు. దీంతో, విద్యార్థులు కేకలు వేయడంతో పామర్రు మండలం కనుమూరు జాతీయ రహదారిపై బస్సును నిలిపివేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై ఉన్న డివైడర్ను పట్టుకుని హల్చల్ చేశాడు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ పెద్ద కేకలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు నారాయణ స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. కానీ, విద్యార్థులు ఆందోళన చెందుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థుల పేరెంట్స్, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్ ప్రతాపం
సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు. అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్ఫోన్ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు. చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు) -
Narayana College: అగ్గి రాజేసిన ఫీజు
అంబర్పేట (హైదరాబాద్): ఫీజుల పేరిట కార్పొరేట్ కళాశాలలు సాగిస్తున్న దోపిడీకి అద్దం పట్టే ఘటన ఇది. ఓ కాలేజీ ధనదాహం ఏకంగా ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఇచ్చిన ఫీజు రాయితీ చెల్లదని, ఉత్తీర్ణత పత్రాలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలంటే బకాయి ఉన్న రూ.16 వేలు కట్టాల్సిందేనని ఓ విద్యార్థిపై ఇప్పటి ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారు. ఎంత వేడుకున్నా ఫలితంలేకపోవడంతో, ఈ మొత్తం చెల్లించే స్థితిలో లేని ఆ విద్యార్థి.. విద్యార్థి సంఘాల నేతలను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆ కళాశాలకు వెళ్లిన విద్యార్థి నేతల్లో ఒకరు.. ఎంత ప్రాధేయపడినా ప్రిన్సిపల్ విన్పించుకోక పోవడంతో, విధిలేని పరిస్థితుల్లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ అక్కడే వెలుగుతున్న దీపంపై కూడా పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ విద్యార్థి నేతతో పాటు మరో నాయకుడు, కాలేజీ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్పేట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లించాలంటూ... మల్కాజిగిరి వెంకట్రెడ్డినగర్కు చెందిన సాయి నారాయణ అంబర్పేట–రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ఇటీవల పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కళాశాలకు వెళ్లిన సాయి తనకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతకు సంబంధించిన పత్రాలు, టీసీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే తమకు చెల్లించాల్సిన ఫీజులో ఇంకా రూ.16 వేలు బకాయి ఉందంటూ చెబుతూ వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ తెగేసి చెప్పారు. అయితే గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ రాధాకృష్ణ తనకు రూ.16 వేలు రాయితీ ఇచ్చారంటూ చెప్పిన సాయి, ఆయన్ను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకోవాలని కోరాడు. పదే పదే విజ్ఞప్తి చేసినా.. సాయి మాటలు పట్టించుకోని ప్రిన్సిపల్ సుధాకర్ గత ప్రిన్సిపల్ ఇచ్చిన రాయితీ ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. రూ.16 వేలు కూడా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానని తేల్చిచెప్పారు. అయినా సాయి దాదాపు 15 రోజులు కళాశాల చుట్టూ తిరుగుతూ, తన సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్, తదితరులను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో సాయి తనకు సాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘం నేతలు వెంకటచారి, సందీప్లను కోరాడు. వీరు శుక్రవారం మరికొందరు విద్యార్థులతో కలిసి నారాయణ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపల్ను కలిసి సాయి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పదేపదే కోరినా ఆయన విన్పించుకోలేదు. ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ పునరుద్ఘాటించారు. సాయిని కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేయడం, తాము వచ్చినా పట్టించుకోకపోవడంతో విద్యార్థి నేత సందీప్ ‘ఇస్తారా.. మమ్మల్ని ఇక్కడే చావమంటారా?’ అంటూ ప్రిన్సిపల్పై అసహనం వ్యక్తం చేశారు. ససేమిరా అన్న ప్రిన్సిపల్, ఏఓ.. ఈ క్రమంలోనే కళాశాల కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ గదిలో ప్రిన్సిపల్ సుధాకర్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) అశోక్రెడితో సందీప్ తదితరులు కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. ఎంత వాదించినా సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారుç ససేమిరా అన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సందీప్.. అప్పటికే తెప్పించి పెట్టుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకుని తనపై పోసుకున్నాడు. అలా పోసుకునే క్రమంలో పెట్రోల్ ఏఓ అశోక్రెడ్డి (45), మరో విద్యార్థి నేత వెంకటచారి పైనా పడింది. అలాగే ఆ పక్కనే ఉన్న దేవుడి చిత్రపటం ముందు వెలిగించిన దీపంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సందీప్ సహా ముగ్గురికి తీవ్రగాయాలు... మంటలు అంటుకున్న సందీప్, చారి, అశోక్ తీవ్రంగా గాయడపడ్డారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్కు సైతం మంటల ప్రభావానికి స్వల్పగాయాలయ్యాయి. ప్రిన్సిపల్ గదిలో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ఉద్యోగులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న చాదర్ఘాట్ అగ్నిమాపక శకటాలు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్కు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్కు 65 శాతం, అశోక్కు 50 శాతం, వెంకటచారికి 30 శాతం శరీరంపై కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ కళాశాల ఫీజుల దోపిడీకి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ నేత ఆశోక్రెడ్డి, ఇతర నాయకులు శ్రీకాంత్, దీప్కుమార్లు కళాశాల వద్ద ధర్నా చేశారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు వేధింపులే ఘటనకు కారణం నా కుమారుడు ఇదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారని తెలియడంతో కాలేజీకి వెళ్లాను. ఆ సమయంలోనే ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. ప్రిన్సిపల్ గది వైపు వెళ్లడంతో మంటలు అంటుకుని నేను కూడా స్వలంగా గాయపడ్డాను. ఫీజు కోసం వేధింపులకు గురిచేయడం వల్లే ఈ సంఘటన జరిగింది. – ప్రత్యక్ష సాక్షి మహ్మద్ బూరాన్ ––––––––––––––––––––––––––– విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు: మంత్రి సబిత అంబర్పేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు -
ప్రిన్సిపాల్ రూమ్లో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్ నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్చారీ, కాలేజ్ ఏవో అశోక్కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. టైం టు టైం ఏం జరిగిందంటే ► 12:20కి కాలేజ్ వచ్చిన సాయి నారాయణ అతని స్నేహితుడు సందీప్తో పాటు మరో ఆరుగురు ►12:35 ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్లిన సాయి నారాయణ స్నేహితులు ►12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం ►12:43కి పెట్రోల్ పోసుకున్న సందీప్ అనే విద్యార్థి సంఘం నాయకుడు ►12:43కి ప్రిన్సిపాల్ రూమ్లో మంటలు రావడంతో ఛాంబర్లోకి పరుగెత్తిన ఏఓ అశోక్ ►12:44 కి ప్రిన్సిపాల్ రూమ్లో నుంచి పరుగు ఎత్తడం తో ఏఓ అశోక్ ను పట్టుకున్న సందీప్ ►12:45కి గాయాలతో బయటకు వచ్చిన సందీప్, అశోక్ ►12:45 కి మంటలు ఆర్పిన సిబ్బంది ►12:50కి విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు ► 1:20కి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న బాధితులు. అక్కడి నుంచి యశోద, డీఆర్డీఓ ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’.. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. -
సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య
అనంతపురం: పట్టణంలోని నారాయణ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పనిచేసే ప్రత్యూష (26) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలమేరకు... ప్రత్యూష అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఇందులో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రత్యూష ఉదయం కళాశాల విధులకు హాజరై పర్మిషన్ తీసుకుని గుడ్డం సమీపంలోని రైల్వేట్రాక్కు చేరుకుని గూడ్స్రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాగులో ఉన్న సూసైడ్ నోట్ను పరిశీలించగా తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాదీనం చేసుకున్నామని రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలు.. సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, కర్నూలు: ఏపీ పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాల్ ప్రాక్టిస్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందిదే ప్రధాన పాత్రగా తేల్చారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు పదో తరగతి పరీక్షా పత్రాల మాల్ప్రాక్టీస్లో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్రెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అలాగే తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజ్ లెక్చరర్ సుధాకర్ను నిందితులుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. నారాయణ విద్యాసంస్థల అధినేత గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటిని అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులోఆడుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చదవండి: (గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం జగన్ దంపతులు) -
ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా: నారాయణ విద్యార్థి
బి.కోడూరు: నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి(17) కడప నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల యాజమాన్యం చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనని, రెండు రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి’ అంటూ తల్లిదండ్రులనుద్దేశించి అందులో పేర్కొన్నాడు. ఐ మిస్ యూ అమ్మ.. మిస్ యూ నాన్న.. మిస్ యూ బ్రదర్స్.. అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. అంతేకాకుండా తన అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని రాసుకున్నాడంటూ తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులరెడ్డి వారికి మూడో సంతానం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. బి.కోడూరు ఎస్ఐ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
అగ్నిప్రమాదం..నారాయణ కాలేజీ బస్సులు దగ్ధం
విశాఖ : విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. నారాయణ కాలేజీకి చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే పార్క్ చేసిన బస్సులు దగ్ధం అవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులు నిలిపి ఉంచిన స్థలంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్కింగ్లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు
-
నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్లలో ఐటీ దాడులు
సాక్షి, విజయవాడ : నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు నారయణ, శ్రీచైతన్య కాలేజీలలో తనిఖీలు జరుపుతున్నారు. నారాయణ క్యాంపస్కు వెళ్లిన ఐటీ అధికారులు.. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని మాదాపూర్ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు. -
చై.. నా... గిమ్మిక్కులు చానా!
ఇంటర్లో ప్రభంజనం.. స్టేట్ టాపర్ మా కళాశాల విద్యార్థే.. అంటూ రిజల్ట్ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో నిమిషానికోసారి ప్రచారం చేసే కార్పొరేట్ కళాశాలల డొల్లతనం తేలిపోయింది. మనీతో మార్కులు సాధించిన తీరు బట్టబయలైంది. ప్రాక్టికల్స్లో కార్పొరేట్ కళాశాలలు చేసే గిమ్మిక్కులను టాస్క్ఫోర్స్ కమిటీ పట్టేసింది. 30కి 30 మార్కులు సాధించిన విద్యార్థుల పేపర్లను పునర్ మూల్యాకనం చేసి బోగస్ మార్కులకు చెక్పెట్టింది. కాసులకు కక్కుర్తి పడిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల లెక్కలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అనంతపురం విద్య: ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమారవుతాయి. అందుకే విద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రాక్టికల్స్లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులు తెప్పించుకునేందుకు డబ్బు కుమ్మరించాయి. ఏకంగా ఎక్స్టర్నల్ అధికారులను కొనేసి మార్కులు వేయించాయి. అయితే ప్రాక్టికల్స్పై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీని రంగంలోకి దించింది. దీంతో కార్పొరేట్ ఖరత్నాక్ కథలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. కాసులకు ఆశపడిన అధికారులపై వేటు రంగం సిద్ధమవుతోంది. టార్గెట్ 30కి 30 ఇంటర్లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్లో వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి 19 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించగా... 14వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్స్పై ఎప్పటినుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్ కళాశాలలు.. అందులోనూ నారాయణ, చైతన్య జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పాయి. దీంతో చాలా మందికి 30కి 30 మార్కులు వచ్చాయి. షరా మామూలేనని భావించి... ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. దీంతో ఇంటర్బోర్డు అధికారులు కూడా రోజూ పరీక్ష ముగిసిన వెంటనే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్ఐఓలతో సమీక్ష నిర్వహించారు. అయితే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మాత్రం షరా మామూలేనన్న రీతిలో వ్యవహరించాయి. ఎప్పటిలాగే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్పి ‘మార్కులు’ కొనుగోలు చేసేశారు. టాస్క్ఫోర్స్ కమిటీలను నియామకాన్ని గోప్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాక్టికల్స్ ముగిసే రోజున రంగంలోకి దింపింది. దీంతో కార్పొరేట్ కళాశాల బాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులపై వివక్ష ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులపై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు వివక్ష చూపారు. ప్రతిభ కనబరిచినప్పటికీ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో వారికి ఇవ్వాల్సి మార్కులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కులు, ప్రతిభ ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు. అధికంగా వేసిన మార్కుల్లో కోత విధించి.. మార్కులు ఎన్ని రావాల్సి ఉందో.. అన్నే మార్కులు వేశారు. రంగంలోకి టాస్క్ఫోర్క్ ఇంటర్ ప్రాక్టికల్స్ మార్కులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే టాస్క్ఫోర్స్ కమిటీని రంగంలోకి దింపింది. 30కి 30 మార్కులు వచ్చిన ప్రతి పేపర్ను పరిశీలించి పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్ ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 16 మందితో కూడిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాలోని నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల మార్కులను పరిశీలించాయి. నారాయణ కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి. టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు పునఃపరిశీలన చేస్తే 10 మార్కులు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు. ఎక్కువ మార్కులు వేశారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ప్రాక్టికల్స్లో విద్యార్థి చేసిన దానికంటే అదనంగా మార్కులు వేసినట్లు టాస్క్ఫోర్స్ కమిటీలు గుర్తించాయి. ఇందుకు కారణాలను ఆరా తీశారు. ముఖ్యంగా 30కి 30 మార్కులు వచ్చిన జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చేశారు.– వెంకటరమణ నాయక్,ఆర్ఐఓ, అనంతపురం -
నారాయణా.. అనుమతి ఉందా!
కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్లోని నారాయణ జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నామ మాత్రపు తనిఖీలు.. జిల్లాలో ఇంటర్మీడియట్ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాస్లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్టర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్లోని నారాయణ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్ క్లాస్లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సాలబాయి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ►రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ►ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్ 22న ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ సాలబాయి సూచించారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలోని నారాయణ కళాశాల హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతను.. కాలేజీ హాస్టల్లోని రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో హాస్టల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే రామాంజనేయరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నారాయణలో ఫీ'జులుం'
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ)/తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలల్లో ఫీజుల జులుం మరోసారి వెలుగు చూసింది. విజయవాడలో ఫీజు కోసం ఒత్తిడి చేయడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా, తిరుపతిలో ఫీజు బకాయి విషయంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ ఓ విద్యార్థి తండ్రి ఆందోళనకు దిగాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మెట్టగూడెంకు చెందిన కల్యాణం సునీత తన కుమారుడితో కలిసి మొగల్రాజపురంలో నివాసముంటోంది. స్థానికంగా ఉన్న నారాయణ ఒలంపియాడ్ క్యాంపస్లో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి ఫీజు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. ఫీజులో ఐదువేలతో పాటు యూనిఫామ్, పుస్తకాల కోసం మరో రూ.16 వేలు చెల్లించింది. మిగిలిన రూ.80 వేలలో 60 శాతం మొత్తాన్ని డిసెంబర్ లోపు చెల్లిస్తానని ఆమె యాజమాన్యానికి వివరించింది. బాబుకు అడ్మిషన్ నెంబర్ ఇస్తే పరీక్షలకు హాజరవుతాడని బతిమలాడింది. అయితే మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ నంబర్ ఇస్తామని మొండికేశారు. ఈ నేపథ్యంలో పిల్లవాడు నలుగురిలో ఇబ్బందులు పడటంతో ఆమె తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురైంది. సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీ 51వ కానా వద్ద నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. పాదచారులు ఆమెను అడ్డుకుని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమందించారు. ఆమెను స్టేషన్కు తరలించి సీఐ కాశీవిశ్వనాథ్ కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతిలో ఫీజు బకాయి వివాదం తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ పట్టణంలోని గాంధీ రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో చదివాడు. ఈ ఏడాది డే స్కాలర్గా గాంధీ రోడ్డులోని కళాశాలలో చేరాడు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి రూ. 15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో బకాయి ఫీజు చెల్లించాలంటూ సోమవారం నితిన్ను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించేసింది. కుమారుడిని వెంటబెట్టుకుని కళాశాలకు వచ్చిన గోవిందరెడ్డి, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ గోవిందరెడ్డి కళాశాల ఎదుటే ఆందోళనకు దిగాడు. మొదటి ఏడాది ఫీజు బకాయి చెల్లించకపోవడంతో తండ్రిని తీసుకురావాలని నితిన్ను ఇంటికి పంపించిన విషయం వాస్తవమేనని, గోవిందరెడ్డిపై తాము దాడి చేయలేదని ప్రిన్సిపాల్ వివరించారు. పోలీసులు ఇరువర్గాలను విచారించి, ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పడంతో విద్యార్థి తండ్రి ఆందోళన విరమించాడు. -
తిరుపతిలో నారాయణ కాలేజీ దౌర్జన్యం!
సాక్షి, తిరుపతి: నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు కట్టడంలో అతనికి కొంత ఆలస్యం జరిగింది. దీంతో గత శనివారం నితిన్ను కళాశాల సిబ్బంది అమానుషంగా కాలేజీ నుంచి గెంటి వేశారు. ఈ నేపథ్యంలో నితిన్ తండ్రి గోవిందరెడ్డి ఫీజు కట్టడానికి సోమవారం కళాశాలకు వెళ్లాడు. ఒక్క రోజు ఆలస్యం అయినందుకే మా అబ్బాయిని కాలేజి నుంచి గెంటేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో నారాయణ కాలేజీ సిబ్బంది ఆయనపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. నారాయణ కాలేజీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని, విద్యార్థిని గెంటేయడమే కాకుండా ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన తమపై దాడికి పూనుకున్నారని బాధితులు గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
కూలిన నారాయణ కాలేజీ గోడ
సాక్షి, నెల్లూరు: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్ నగర్లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ కానీ, యాజమాన్యం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రస్తుతం నారాయణ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. కాలేజీ లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. -
‘నారాయణ’ దాష్టీకం
అనంతపురం: విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను సాకుగా చూపి నారాయణ కళాశాల అధ్యాపకులు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగర శివారులోని టీవీ టవర్ వద్ద నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. రాత్రి భోజన సమయంలో మెస్హాల్లో టేబుల్ విషయంలో గొడవ పడ్డారు. సీనియర్లకు ఎదురు చెప్పినందుకు జూనియర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం యాజమాన్యం దృష్టికి పోవడంతో రాత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. గొడవకు పాల్పడ్డారనే కారణంతో యశ్వంత్, మరో విద్యార్థిని కట్టెతో కొట్టారు. దీంతో వాతలు పడ్డాయి. ఈ విషయం కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి పోవడంతో మంగళవారం ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వంట మనుషులు, పని మనుషులతో తమను గొడ్డును కొట్టినట్లు కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు ప్రిన్సిపాల్ శిఖామణి, వైస్ ప్రిన్సిపాల్ నారపరెడ్డి, ఏజీఎం సుధాకర్రెడ్డి, వార్డెన్ భవాని ప్రసాద్లపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థులకు వాతలు
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్లో భాగంగా జూనియర్లు, సీనియర్ల మధ్య ఘర్షణ జరగడంతో... కాలేజీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా విద్యార్థులకు కాలేజీ లెక్చరర్లు వాతలు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డట్టు సమాచారం. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
-
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ : గూడవల్లిలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కాలేజ్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి మృతిపై వివరాలు వెల్లడించేందుకు కాలేజ్ సిబ్బంది నిరాకరిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. iframe border="0" width="100%" height="380" src="https://www.sakshi.com/sites/default/files/video/embed/2019/07/02/1203235.html" frameborder="0" scrolling="no" > -
నడి వేసవిలో ‘నారాయణ’
సాక్షి, అమరావతి బ్యూరో : నారాయణ కాలేజీల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వేసవిలో సెలవులు ఇవ్వకుండా ఉక్కపోతలో విద్యార్థులను మగ్గబెడుతున్నాయి. తమ పిల్లలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నా యాజమాన్యాలు ఇసుమంతైనా లెక్కచేయడం లేదు. ఇష్టం ఉంటే ఇక్కడ చేర్పించండి లేదంటే.. వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఏసీ క్యాంపస్ల పేరుతో నిలువు దోపిడీ..! విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలన్నీ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. 10వ తరగతి ఫలితాలు వెలువడక ముందు నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించాయి. ఏసీ క్యాంపస్ల పేరుతో తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏసీలు పనిచేయకపోవడంతో వేసవిలో ఉక్కపోతకు విద్యార్థులు అల్లాడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి మిగిలిన సమయమంతా తరగతుల్లో పాఠాలు బోధిస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు హాస్టల్ పేరుతో మరో దోపిడీకి యాజమాన్యాలు తెరతీశాయి. నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో అధిక శాతం క్యాంపస్లు అనుమతిలేని భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నివాసానికి అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లలో తరగతులు నిర్వహిస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. నిబంధనలు పట్టవా..! నిబంధనల మేరకు ఇంటర్ తరగతులు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నగరంలోని కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే తరగతులు ప్రారంభించాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. పరీక్షలు ముగియగానే కేవలం వారం రోజులు సెలవులు ఇచ్చి వెంటనే తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పదో తరగతి ఫలితాలు ఈ నెల 14న విడుదలకాగా 10వ తరగతి పూర్తయిన పది రోజులకే కార్పొరేట్ కళాశాలలు ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించాయి. వేసవిలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలను కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఆ రెండు క్యాంపస్లంటే దడ..! పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ ఎన్40 లేడీస్ క్యాంపస్, గొల్లపూడి నల్లకుంటలోని అయ్యప్ప క్యాంపస్లు నరకానికి నకళ్లుగా మారాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతుల పేరుతో వేసవి సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అనుమతుల్లేని భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెరచాటుగా లంచాలు ముట్టజెప్పడంతోనే మిన్నకుండిపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నారాయణ కాలేజీ ఏజీఎం ఇంట్లో సోదాలు
-
డబ్బుతో మళ్లీ దొరికిన ‘నారాయణ’ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి నారాయణ విద్యాసంస్థల సిబ్బంది డబ్బు ప్రవాహం పారిస్తూ రెండోసారి పట్టుబడ్డారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా ఇచ్చి వారితో మాట్లాడి నేరుగా ఓటరుకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆదివారం నెల్లూరులోని 43వ డివిజన్లోని టీడీపీ ఎన్నికల ప్రచార కార్యాలయంలో రూ.8.30 లక్షల నగదుతో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం 40వ డివిజన్ మూలాపేటలో నారాయణ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారి రాజేంద్రకుమార్సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని అధ్యాపకుడిని అదుపులోకి తీసుకుని బైక్ను తనిఖీ చేయగా రూ.50 వేల నగదు, ఓటరు స్లిప్పులు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకుని అధ్యాపకుడితోపాటు నారాయణలో పనిచేస్తున్న మరో ముగ్గురిని పోలీసుస్టేషన్కు తరలించి బాలమురళీకృష్ణపై కేసు నమోదు చేశారు. స్టేషన్లో టీడీపీ నేత పట్టాభి వీరంగం టీడీపీ నేత, మంత్రి నారాయణ ముఖ్యఅనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితోపాటు పలువురు నేతలు పోలీసుస్టేషన్కు చేరుకుని వీరంగం సృష్టించారు. తమ సిబ్బందిని అనవసరంగా ఎందుకు తీసుకొచ్చారు? కావాలనే చేస్తున్నారా? అంటూ పోలీసు సిబ్బందితో గొడవకు దిగారు. తాము సూచించిన వారిపై చర్యలు తీసుకోకపోతే మీ ఇష్టం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.50 వేలు తాము వెంట తీసుకెళతామని.. పట్టుకునే దమ్ముందా? అంటూ పలువురు టీడీపీ నేతలు పోలీసులకు, ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సవాల్ విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వరుసగా నగదు పంపిణీ చేస్తూ తమ వారు పట్టుబడుతుండడంతో పట్టాభిరామిరెడ్డి సహనం కోల్పోయారు. నగదుతో పట్టుబడిన తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని పట్టాభిరామిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. తమ వారిని అకారణంగా తీసుకువచ్చారని, వెంటనే విడిచిపెట్టాలని డీఎస్పీ మురళీకృష్ణపైఒత్తిడి తెచ్చారు. -
ఫీజుల ఒత్తిడి.. నారాయణ విద్యార్థినికి అస్వస్థత
శ్రీకాకుళం , కాశీబుగ్గ: కాశీబుగ్గ నారాయణ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గేదెల వెన్నెల కళాశాల యాజమాన్యం తీరుతో అస్వస్థతకు గురైంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారిథికి చెందిన గేదెల మన్మధరావు, రాజేశ్వరిల కుమార్తె వెన్నెలను కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసింది. అయితే తిత్లీ ధాటికి ఉన్నదంతా పోవడంతో తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి గురై ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు ఆ మెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళన చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్కుమార్, సీఐటీయూ నెయ్యిల గణపతి, జిల్లా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు పుచ్చ దుర్యోధన, గ్రామస్తురాలు అరుణ, కొర్రాయి నీలకంఠం తదితరులు కళాశాల వద్ద ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును నిలదీశారు. అయితే అటువైపు నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు. ఆమె మూడు రోజులుగా రావడం లేదు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వెన్నెల మూడు రోజులుగా కాలేజీకి రావడం లేదు. ఆమె డయాబెటిక్ పేషెంట్. ఇన్సులిన్ లేకపోవడం వల్ల పడిపోయింది. ఆమెపై ప్రత్యేకించి ఒత్తిడి చేయలేదు. అందరినీ అడిగినట్టే అడిగాం.– తిరుపతిరావు, ఏజీఎం,నారాయణ విద్యాసంస్థ -
నారాయణ కాలేజీలో డీన్ లైంగిక వేధింపులు
-
నారాయణ కాలేజీలో లైంగిక వేధింపులు.. డీన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తార్నాకాలోని నారాయణ కళాశాల డీన్ తనను లైంగికంగా వేదిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి బంధువులతో సహా ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు డీన్పై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు డీన్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. డీన్ శ్రీనివాస్ రావు కొద్దిరోజులుగా ఫోన్ చేస్తూ తనను వేదిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత 10 ఏళ్లుగా తాను నారయణ కాలేజీల్లో పనిచేస్తున్నానని, ఇటీవల వచ్చిన డీన్ శ్రీనివాస్ కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తూ అసభ్యకర మాటలతో టార్చర్ పెడుతున్నాడని పేర్కొంది. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయం యజమాన్యానికి తెలియజేయడం కోసమే తాను ఆందోళన చేపట్టినట్లు స్పష్టం చేసింది. -
విద్యార్థిపై ‘నారాయణ’ ప్రిన్సిపాల్ దాష్టీకం
సాక్షి, అమరావతిబ్యూరో : నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ ప్రిన్సిపాల్ దాష్టీకానికి విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అల్లరి చేస్తున్నాడంటూ ప్రిన్సిపాల్ కర్రతో ముఖంపై మోదడంతో విద్యార్థి కింద పడి రెండు పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రా వమైంది. ఓ వైపు విద్యార్థి తీవ్ర గాయాలపాలయినా ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ స్కూల్ రాష్ట్ర మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి మీడియా దృష్టికి రాకుండా తీవ్ర ఒత్తిడి పెంచారు. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న రమేష్ బాబు కుమారుడు రోహిత్సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్లో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లాస్ రూంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదుచేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్ క్లాస్రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్ మొహంపై బలంగా మోదడంతో విద్యార్థి కిందపడ్డాడు. ఈఘటనలో విద్యార్థి రోహిత్కు రెండు పళ్లు విరిగి రక్రస్రావం అయింది. విద్యార్థికి వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్ను తండ్రి నిలదీయడంతో స్కూల్ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చిన్న దెబ్బే తిగిలింది విద్యార్థికి చిన్న దెబ్బే తగిలింది. ఎలాంటి ప్రమాదం లేదు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. ఏ సమస్యా లేదు. – మహేష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ -
నారాయణ కాలేజీ ఏఓ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షలు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నారాయణ కాలేజీ ఏఓను బుధవారం వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ కాలేజీ ఏఓ రఘు విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 5లక్షల రూపాయలు వసూలు చేశాడు. రఘు వారికి సీట్లు ఇప్పించకపోవటంతో ఇద్దరు విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఓ రఘుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో పాటు ప్రశాంత్రెడ్డి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
రెండో రోజూ కొనసాగిన ‘ఎంసెట్’ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ, శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుల విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. శివనారాయణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు శనివారం మధ్యాహ్నం అతన్ని కటక్ తీసుకెళ్లినట్లు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులతో కటక్లోనే శివనారాయణ క్యాంపు నడిపినందున అక్కడి బ్రోకర్ల జాడ తెలిసే అవకాశముందని, క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉండటంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబును హైదరాబాద్లో మరో బృందం విచారించింది. ముగ్గురు విద్యార్థులకే కాకుండా మరో నలుగురికి వాసుబాబు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. కానీ, తాను ముగ్గురినే క్యాంపునకు తరలించినట్లు వాసు చెబుతుండటంతో రుజువులతో సహా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేలో పరీక్ష జరగాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచే కొంతమంది విద్యార్థులతో వాసు టచ్లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. దీంతో వారితో వాసు ఎందుకు టచ్లో ఉన్నాడో చెప్పాలని సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య కళాశాలల విద్యార్థులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడారని, ప్రశ్నపత్రం వ్యవహారంపైనే చర్చించారా అని అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. మళ్లీ బ్రోకర్ల విచారణ వాసుబాబు, శివనారాయణ ద్వారా విద్యార్థులను క్యాంపులకు పంపిన తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ నిర్ణయించింది. వారిరువురూ డీల్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను వారి ముందే ప్రశ్నించనుంది. రూ.35 లక్షల చొప్పున డీల్ సెట్ చేసుకున్న వీరు అడ్వాన్స్గా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు, పూచీకత్తుగా పదో తరగతి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరి నుంచి రికవరీ లేకపోవడంతో ఈ రెండు అంశాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి అంశంపైనా వారు పొంతన లేకుండా వ్యవహరించడంతో సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా సరిగా సమాధానాలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆయా బ్రోకర్లను సైతం మళ్లీ విచారణకు పిలుస్తున్నామని ఉన్నతాధి కారి ఒకరు చెప్పారు. అప్పుడే వారి బాగోతం వెలు గులోకి వస్తుందని, కార్పొరేట్ సంస్థల చీకటి వ్యవహా రం కూడా ఆధారాలతో బయటపడుతుందన్నారు. -
ఆ మంత్రి పేషీతో నీకేం పని?
సాక్షి, హైదరాబాద్: ‘నీకు ఆ మంత్రి కార్యాలయంతో సంబం«ధం ఏంటి? పదే పదే మంత్రి పేషీలోని వ్యక్తులకు ఎందుకు ఫోన్లు చేశావు. లీకేజీ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో డాక్టర్ ధనుంజయ్, సందీప్తో చర్చిస్తూనే మంత్రి కార్యాలయానికి ఎందుకు కాల్స్ చేశావు’ఇవీ సీఐడీ కస్టడీలో ఉన్న శివనారాయణకు దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలు. ఎంసెట్ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ ఇద్దరినీ స్కాంలోని కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచి పరిచయం.. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ఉన్న నిందితులతో పరిచయం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలని సీఐడీ అధికారులు శివనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంతో పాటు మెడికల్ సీట్లు ఇప్పించే కర్ణాటక దావణగెరె గ్యాంగ్తో శివనారాయణకు లింకున్నట్లు సీఐడీ గుర్తించింది. మేనేజ్మెంట్ సీట్ల మాటున ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ చేసే గ్యాంగ్తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారో చెప్పాలని సీఐడీ ప్రశ్నించగా, కేవలం సీట్ల కోసమే సంబంధాలు కొనసాగించానని శివనారాయణ చెప్పినట్లు సమాచారం. రెండు కార్పొరేట్ కాలేజీలకే చెందిన ఆరుగురు విద్యార్థులు ఆ క్యాంపులో ఎందుకున్నారని అధికారులు వివరణ కోరారు. అయితే మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చేంతగా ప్రభావితం చేయడంపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. సంబంధిత మంత్రి కాలేజీలకు ఏడెనిమిదేళ్లుగా విద్యార్థులను చేర్పించడం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పరిచయాలున్నాయని శివనారాయణ వివరించే ప్రయత్నం చేశాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి పేషీలో పనిచేస్తున్న వారి సంబంధీకుల పిల్లలకు కాలేజీల్లో ఫీజు తగ్గించాలని కోరేవారని, అందుకే ఫోన్ మాట్లాడినట్లు శివనారాయణ సీఐడీ అధికారులు వివరించినట్లు తెలిసింది. ధనుంజయ్తో పరిచయం వెనుక.. లీకేజీ స్కాంలో కీలకంగా ఉంటూ వస్తున్న బిహార్లోని పట్నా వాసి, ధావనగిరి మెడికో ధనుంజయ్తో ఎందుకు టచ్లో ఉన్నారని ప్రశ్నించగా, సందీప్తో పాటు గణేశ్ ప్రసాద్ ద్వారా అతడు పరిచయం అయ్యాడని, విద్యార్థులకు కర్నాటకలోని బెంగళూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో మెడికల్ సీట్లు ఇప్పించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ గురించి తెలిసే సంబంధాలు పెట్టుకున్నావా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, తన స్నేహితుల పిల్లల కోసమే తాను ఈ స్కాంలో పాలుపంచుకున్నానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ విద్యార్థులతో పనేంటి? వాసుబాబుపైనా సీఐడీ భారీస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వాసుబాబు పనిచేసిన కాలేజీల విద్యార్థులే లీకేజీ మాఫియా క్యాంపులకు ఎక్కువగా వెళ్లడం, వారికే మంచి ర్యాంకుల రావడంపైనా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు సీఐడీ వాంగ్మూలాలు సేకరించిన 136 మందిలో ఒకే కార్పొరేట్ సంస్థకు చెందిన 86 మంది విద్యార్థులు క్యాంపునకు వెళ్లడంపై వాసుబాబును అధికారులు ప్రశ్నించారు. పూర్వ విద్యార్థులతో సంబంధాలున్నాయా అని ప్రశ్నించగా, తన స్నేహితుల పిల్లల కోసమే సందీప్, గణేశ్ ప్రసాద్తో టచ్లో ఉన్నట్లు వివరించారని తెలిసింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించగా ఏమీ చెప్పలేదని తెలిసింది. 2016 ఎంసెట్ లీకేజీలోనే తాను సందీప్, గణేశ్ ప్రసాద్తో టచ్లో ఉన్నట్లు వాసుబాబు చెప్పగా, సందీప్, గణేశ్ ప్రసాద్ వివరించిన అంశాలను సీఐడీ అధికారులు ముందుపెట్టడంతో వాసుబాబు ఖంగుతిన్నట్లు తెలిసింది. 2015, 2014లోనూ సందీప్, గణేశ్ ప్రసాద్తో ఉన్నారని, అప్పుడు కూడా విద్యార్థులకు సీట్ల పేరుతో సంబంధాలు నడిపినట్లు ఆధారాలున్నాయని చెప్పగా వాసుబాబు నోరుమెదపలేని తెలిసింది. తాను ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చానని, మిగతా వాళ్లతో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్ స్కాం దర్యాప్తులో భాగంగా గతంలో విచారణ సందర్భంగా ఏం జరిగిందని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్పటి అధికారులు గంట పాటు ప్రశ్నించి వదిలేశారని చెప్పినట్లు తెలిసింది. అలా ఎందుకు వదిలేశారని, ఎక్కడినుంచి ఒత్తిడి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా, తనకేం తెలియదని సమాచారం. కటక్కు శివనారాయణ.. లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రంపై విద్యార్థులను కటక్ తీసుకెళ్లిన శివనారాయణను అక్కడికి తరలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. కటక్లోని ఏ హోటల్లో మూడ్రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.. ఎవరి ద్వారా ప్రశ్నపత్రం తీసుకొచ్చారు వంటి వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐడీ విచారించింది. శివనారాయణ, వాసుబాబును వేర్వేరుగా తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీ మొదటి రోజులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరికొంత మంది బ్రోకర్ల అరెస్టుకు సీఐడీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
నారాయణ కాలేజీ బస్సులో మంటలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్స్టేషన్ సెంటరులో నారాయణ విద్యా సంస్థల కళాశాల బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో బస్సులోని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విద్యార్థులను ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ కొద్ది దూరం వెళ్లగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ బస్సును ఆపాలంటూ డ్రైవర్కు చెప్పడంతో బస్సును నిలిపివేశారు. వెంటనే విద్యార్థులు కిందకు దూకి రోడ్డుపైకి పరుగులు తీశారు. కూతవేటు దూరంలోనే జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సంఘటన జరిగిన బస్సులో 30 మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం, ఫిట్నెస్ లేకుండానే బస్సుకు అనుమతులిచ్చిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఎంసెట్ లీకేజీ కేసులో శ్రీచైతన్య డీన్
-
ఎంసెట్ కేటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును అరెస్ట్ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్ చేసింది. దిల్సుఖ్నగర్ శ్రీచైతన్య బ్రాంచ్తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్. వీరిద్దరూ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ధనుంజయ్ థాకీర్, డాక్టర్ సందీప్కుమార్తో డీల్ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? ప్రముఖ కార్పొరేట్ కాలేజీలకు ఎంసెట్ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ శివ నారాయణ, డీన్ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్ ద్వారా పదే పదే టచ్లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. కాలేజీ కోసమే చేశా.. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్తోపాటు ఏజెంట్ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. పిలిచి పంపించారు గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్ కీలక బ్రాంచ్ ప్రిన్సిపల్ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన వివరించారు. కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్ సింగ్ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుబాబును సస్పెండ్ చేసిన శ్రీచైతన్య ఎంసెట్ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్ ఓలేటి వాసుబాబును సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్ కో–ఆర్డినేటర్ నరేంద్రబాబు పేర్కొన్నారు. -
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు
-
ఎంసెట్ పేపర్ లీక్.. నారాయణ, శ్రీచైతన్యలకు లింక్
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...ఎంసెట్ పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితులతో సంబంధాలున్న వాసుబాబును హైదరాబాద్లో, శివనారాయణను గుంటూరులో అరెస్టు చేశామని చెప్పారు. చైతన్య కాలేజీలకు డీన్గా వ్యవహరిస్తున్న వాసుబాబును ఎ-89, మరో నిందితుడు శివనారాయణ ఎ-90గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్లతో వీరిద్దరూ టచ్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు రావడానికి వాసుబాబు, శివనారాయణ ప్రధాన నిందితులతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. -
నారాయణ కళాశాల మూసివేత
మదనపల్లె: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామంటూ ఇల్లిల్లూ తిరిగి, బతిమాలి కళాశాలలో చేర్పించుకున్న నారాయణ కళాశాల యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా కళాశాలను మూసివేసింది. శుక్రవారం కళాశాలకు బయలుదేరిన పిల్లలు ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. వారి గోడు వినేవారు, సమాధానం చెప్పేవారు లేకపోవడంతో విలేకరులను ఆశ్రయించారు. స్థానిక ఎస్బీఐ కాలనీలో నారాయణ స్కూల్ యాజమాన్యం 1 నుంచి 10 వరకు పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల నడుపుతోంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపులో సుమారు 90 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2018–19లో ప్రవేశాల కోసం పదో తరగతి పరీక్షలు ప్రారంభంకాక ముందు నుంచి అధ్యాపకులు పట్టణంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించారు. కళాశాల ప్రారంభమై నెల రోజులకు పైగానే నడిచింది. విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెక్చరర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉన్నట్టుండి కళాశాలను యాజమాన్యం మూసివేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే.. తిరుపతిలోని తమ బ్రాంచీల్లో ఎక్కడైనా ఇదే అడ్మిషన్ నంబర్పై చేర్చుకుంటామని, కాకపోతే ఫీజు ఎక్కువగా ఉంటుందని, హాస్టల్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కట్టిన ఫీజుల్లో అడ్మిషన్ ఫీజు మినహాయించుకుని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా కళాశాల మూసివేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నా వారికి సమాధానం చెప్పేందుకు, పరిస్థి తి వివరించేందుకు కళాశాల యాజమాన్యం ఎవ రూ లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
-
‘నారాయణ’ విద్యార్థుల ఆగ్రహం..!
సాక్షి, కర్నూలు: నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నన్నూర్ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. కోపోద్రిక్తులై.. కాలేజీలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు క్యాంపస్ చేరుకుని విద్యార్థులను చితకబాదారు. పోలీసుల లాఠీఛార్జ్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టూడెంట్ను చితకబాదిన నారాయణ ప్రిన్సిపల్
-
స్టూడెంట్స్ను చితకబాదిన ‘నారాయణ’ ప్రిన్సిపల్ !
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజలు కట్టి కాలేజీకి పంపుతుంటే.. ఇలా హింసిస్తారా అని మండిపడ్డారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా.. రక్తం వచ్చేలా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
యాదాద్రిలో మిస్ ఆస్ట్రేలియా వరల్డ్-2017
యాదాద్రి భువనగిరి జిల్లా : చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్ పోటీలలో బాలికలతో కలసి డాన్స్ చేశారు. హైదరాబాద్లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్య
గూడూరు: నారాయణ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన మాచిరాజు విజయభాస్కర్రాజు, సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీసాయి (20) గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏం జరిగిందో.. ఏమో ఆ విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. లక్ష్మీసాయి గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. గత శుక్రవారం (ఈ నెల 15న) గూడూరులోని అశోక్నగర్ ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్న తన స్నేహితుడు ఎ.మనోజ్ వద్దకు వెళ్లాడు. తనను కళాశాల హాస్టల్ నుంచి పింపించివేశారని 2 రోజులు రూమ్లో ఉంటానని చెప్పడంతో మనోజ్ సరేనన్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో లక్ష్మీసాయిని రూమ్లోనే ఉంచి మనోజ్ ఊరికి వెళ్లి, మంగళవారం తన రూమ్కు చేరుకున్నాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీని తొలగించి చూడగా.. లక్ష్మీసాయి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. లక్ష్మీసాయి ఫీజు చెల్లించాల్సి ఉండటంతో యాజమాన్యం అతడిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని.. సకాలంలో చెల్లించకపోవడంతో హాస్టల్ నుంచి పంపించివేసిందని విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే లక్ష్మీసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: టీచర్ వేధింపులు భరించలేక కూకట్పల్లి వివేకానంద నగర్లోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో నవ్యశ్రీగౌడ్ అనే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. కొంతకాలంగా లెక్కల టీచర్ కీర్తి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థిని చెబుతోంది. పరీక్షలు బాగా రాసినా తక్కువ మార్కులు వేస్తోందని, ఆ తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని స్కేల్తో కొడుతున్నట్లు తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురైన నవ్యశ్రీ చేతిని బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి దండ్రులకు విషయం తెలియజేయడంతో వారు మంగళవారం కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘నారాయణ కాలేజీ ఒత్తిడి తగ్గించకుంటే ఆత్మహత్య చేసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాల యాజమాన్యం చదువుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందంటూ ఆ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బడంగ్పేటకు చెందిన సాయినాథ్ రెడ్డి చంపాపేటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుల పేరుతో కళాశాల సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆపై పరీక్షల పేరుతో తమపై ఒత్తిడి పెంచుతున్నారని సాయినాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి కట్టుకథలు చెబుతున్నారని.. కళాశాల యాజమాన్యం ఒత్తిడిలను మానుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అతను హెచ్చరించారు. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీ విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో సాయినాథ్రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి గంట ఏమన్నారో చూడండి!
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యాకుసుమాలు రాలిపోతుండటం.. ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. విద్యా వికాసాన్ని పంచాల్సిన చదువులే.. యమపాశలై.. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు విద్యార్థులు బలి అవుతుండటం రాష్ట్రంలో తీరని విషాదాన్ని నింపింది. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం.. వారి తల్లిదండ్రుల గుండెల్లో తీరనిశోకాన్ని నింపింది. అయితే, ఇంతటి తీవ్రమైన ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తేలికగా స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రే.. కాలేజీల్లో ఆత్మహత్యలు ఓవర్నైట్లో ముగిసిపోవు అంటూ తేల్చేశారు. విద్యార్థులు చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కమిటీ వేశామని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా కాలేజీలను మూసివేస్తామని మంత్రి గంట అన్నారు. -
నారాయణ కాలేజీకి షాక్; భారీ జరిమానా
సాక్షి, రాయచోటి రూరల్: కడపలోని నారాయణ కళాశాలకు రూ.10 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్ఐఓ రవి పేర్కొన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించామన్నారు. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున ఉన్నతాధికారులు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని ఆర్ఐఓ పేర్కొన్నారు. -
నారాయణ విద్యార్థిని కిడ్నాప్ చేసిన శ్రీచైతన్య
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చదువులో మేటిగా ఉన్న ఓ విద్యార్థికోసం రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు కొట్లాటకు దిగాయి. నెల్లూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిని శ్రీచైతన్య సిబ్బంది తమ వెంట హైదరాబాద్కు తీçసుకెళ్లారు. దీంతో నారాయణ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి శ్రీచైతన్య సిబ్బందిపై నెల్లూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టించారు. వాస్తవానికి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య ఈ తరహా వ్యవహారాలు జరుగుతుంటాయి. కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఈ ఘటన జరగడం విశేషం. నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్ అహ్మద్, ఆరీఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్ నగరంలోని ధనలక్ష్మీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. చదువులో మేటి అయిన ఫాజిల్ నారాయణ హాస్టల్లో ఉంటున్నాడు. దీపావళి సెలవుల నేపథ్యంలో ఈనెల 18న ఇంటికొచ్చాడు. ఫాజిల్ మంచి ర్యాంక్ సాధించే విద్యార్థి కావడంతో 19న శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన లింగాల రమేష్, టి.పార్థసారథిలు అతనింటికి వెళ్లి.. ఫాజిల్కు తమ విద్యాసంస్థలో చేర్పిస్తే ఇంటర్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామంటూ వలవేశారు. ఫాజిల్ తల్లిదండ్రులకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా 20వ తేదీ రాత్రి ఫాజిల్ను తమ వెంట హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడి అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే ఫాజిల్ స్కూల్కు రాకపోవడంతో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నారాయణ సిబ్బంది ఫాజిల్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టాలని కోరారు. విద్యాసంస్థల మధ్య కొట్లాటలో తలదూర్చడమెందుకని భావించిన ఫాజిల్ తండ్రి రియాజ్ అహ్మద్ రెండు రోజులపాటు మౌనం వహించారు. ఒత్తిడి పెరగడంతో రెండు రోజులక్రితం హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ క్యాంపస్కు వెళ్లి తన కుమారుడితో ఒకసారి మాట్లాడాలని అక్కడ సిబ్బంది నాగేంద్ర, పి.రెడ్డిని కోరారు. అయితే కుమారుడితో కలవనివ్వకుండానే ఆయన్ను వారు పంపివేశారు. దీంతో ఫాజిల్ తల్లి ఆరీఫా బుధవారం రాత్రి నెల్లూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీచైతన్య సిబ్బందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నారాయణ యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉండడంతో పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్కు పయనమైనట్టు సమాచారం. -
చదువులా ? చావులా ?
-
చదివేదెలా..?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇవన్నీ నారాయణ కళాశాల పాపాలే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల్లో కడుపు కోతను మిగిల్చాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఆత్మహత్యల నేపథ్యంలో జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి నెలకుంది. వేధింపులు...సతాయింపు సకాలంలో ఫీజులు కట్టకపోతే వేధింపులు...ఇరుకిరుకు గదులు...కడుపునింపని భోజనాలు ...ఆశించిన మార్కులు రాకపోతే సతాయింపు....అంటగడుతున్న బలవంతపు చదువులు...రేటింగ్ పెంచుకోవడానికి విద్యార్థులను ఆయుధాలుగా వాడుతున్న పరిస్థితి...ఇలా ఒకటేంటి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా నారాయణ కళాశాలలపై అనేక ఆరోపణలున్నాయి. బలవంతపు చదువులు అంటగడుతూ ప్రాణాలను తోడేస్తున్నాయి. కార్పొరేట్ కలరింగ్లో తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేస్తున్నాయి. మానసిక ఒత్తిడికి గురి చేసి మరణ శాసనాలను లిఖిస్తున్నాయి. విద్యార్థులను మార్కుల యంత్రాలుగా వాడుతున్నాయి. మార్కుల వేటలో మానసిక ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కార్పొరేట్ కళాశాలలో చదవితే ప్రయోజకులవుతారన్న ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నారాయణలో చదివేందుకు వెనుకంజ... రోజురోజుకీ పరిస్థితి దయనీయంగా మారడం, విద్యార్థుల జీవితాలకు గ్యారంటీ లేకపోవడంతో నారాయణ కళాశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు సైతం క్రమేపీ వెనుకంజ వేస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో నారాయణ కళాశాలల్లో గతంలో 15 బ్రాంచీలుడగా వాటిలో 15 వేల మంది విద్యార్థులు చదువుతుంటేవారు. యాజమాన్య విధానాలు, ఒత్తిడి, చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలతో కళాశాలల సంఖ్య జిల్లాలో ప్రస్తుతం ఆరుకు చేరింది. విద్యార్థులు 50 శాతం మంది పైగా తగ్గిపోయారు.కళాశాల యాజమాన్యం వేధింపుల ధోరణి, నిర్వహణ, పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం లేకపోవడంతో విద్యార్థులు నారాయణ కళాశాలల్లో చేరడంలేదన్న వాదనలున్నాయి. ఫలితంగా చాలావరకు హాస్టళ్లు మూసేసినట్టు సమాచారం. తరగతి గదులు ఇరుకు,ఇరుకుగా, చీకటిగా ఉంటాయని, రోజంతా విద్యుత్తు దీపాలతోనే తరగతులు బోధిస్తున్న పరిస్థితులున్నాయి. గాలిరాక విద్యార్థులు ఉక్కపోతకు గురవుతుంటారని, ఏసీ తరగతి గదులు పేరుకే కానీ అవి సక్రమంగా ఉండవనే వాదనలున్నాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు ఇలా... జిల్లాలో మొత్తం 282 ప్రైవేట్ జూనియర్ కళాశాలలుండగా వాటిలో జనరల్లో 201, ఒకేషనల్లో 81 కళాశాలలున్నాయి. వీటిలో 35 వేలమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక హాస్టళ్ల విషయానికి వస్తే రాజమహేంద్రవరం దానవాయిపేటలో గతంలో నారాయణ రెండు హాస్టళ్లుండేవి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో హాస్టళ్లను మూసివేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ తిరుమల కళాశాలలో ఒకటి, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఈ ఏడాది నుంచి, ప్రతిభ జూనియర్ కళాశాలకు ఒక హాస్టల్ రాజమహేంద్రవరంలో ఉండగా, కాకినాడలో నారాయణకు ఒక హాస్టల్ ఉంది. ఆత్మహత్యల వివరాలు ఇలా... 04 సెప్టెంబర్ 2015 : తాడితోట షెల్టాన్ హోటల్ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో యాజమాన్యం ర్యాంకుల వేధింపులు తాళలేక ఇంటికి వెళ్లి ఇంటర్ చదువుతున్న పెదపాటి రాజేశ్వరరావు బాత్రూమ్లో ఆత్మహత్యచేసుకున్నాడు. తండ్రి జోగేశ్వరరావు బంగారు ఆభరణాల తయారీ పని చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలుకరించగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. కళాశాల ఫీజు చెల్లించడంలో కొద్ది రోజులు ఆలస్యమైతే యాజమాన్యం తరగతి గదిలో అందరిముందు అవమానించేలా ఫీజు కట్టని విద్యార్థులను అవమానించడంతో సున్నిత మనస్కుడైన అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసమైతే తల్లిదండ్రులకు ఫోన్చేసి అడగాలే తప్ప విద్యార్థులను నిలదీయడం మంచి పద్దతికాదన్నారు. 13 అక్టోబర్ 2015 : పాలకొల్లుకు చెందిన నందిని అనే విద్యార్థిని తల్లి రాజమహేంద్రవరంలో నర్స్గా పనిచేస్తుండడంతో ఆమె దానవాయిపేట నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతూ స్థానికంగా ఉన్న షాడే బాలికల హాస్టల్లో ఉంటోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని, సరిగా చదవడంలేదని ఆ విద్యార్థినిని కళాశాలలో మందలించారు. ఈ నేపథ్యంలో అవమానంగా భావించి హాస్టల్కు వచ్చి తెల్లవారు జామున ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. 2008లో : దానవాయిపేటలోని నారాయణ క్యాంపస్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితోపాటు మరో విద్యార్థినిని కూడా మార్కులు తక్కువ వస్తున్నాయని తరగతి గదిలో తోటి విద్యార్థులందరి ముందు అసభ్య పదజాలంతో ఉపాధ్యాయులు దూషించారు. కళాశాల భవనం మూడో అంతస్తుకు వచ్చి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. -
భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
సాక్షి, విజయవాడ: ఆదివారం కూడా కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తుండటాన్ని నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. భారతీనగర్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఉదయం నుంచి తరగతులు నిర్వహిస్తుండటంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని.. ధర్నాకు దిగాయి. ఆదివారం క్లాసులు నిర్వహించొద్దని ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రోజులకే రెసిడెన్షియల్ క్యాంపస్లలో తరగతులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కొనసాగుతున్న నిరసనలు.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘాలు నిరవధిక నిరాహార దీక్షకు దిగాయి. విద్యార్థులను యంత్రాల్లా చదివిస్తూ కేవలం ర్యాంకుల కోసం పరితపిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో చేరిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీ.ఆర్.కళాశాల సెంటర్లో మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంత్రి పదవి నుంచి నారాయణను తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు తమ ధోరణిని మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరులో.. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్బోర్డు నిబంధనలకు అనుగుణంగానే తరగతుల నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఆర్ఐవో కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బోర్డు మార్గదర్శకాలను కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్క విద్యాసంస్థపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
‘నారాయణ’ యాజమాన్యమే పొట్టన పెట్టుకుంది
కడప వైఎస్ఆర్ సర్కిల్: ‘‘మా కుమార్తె పావనిని నారాయణ కళాశాల యాజమాన్యమే పొట్టనపెట్టుకుంది’’ అని మృతురాలి తల్లిదండ్రులు మల్లేశ్వర్రెడ్డి, శివమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలోని అంబేడ్కర్ సర్కిల్లో నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరవకధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని పావని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. తమ కుమార్తె చదువుతోపాటు అన్నింటిలో మొదటిస్థానంలో నిలిచేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. నారాయణ కళాశాల యాజమాన్యమే తమ కుమార్తెను చంపిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులకు, పోలీసులకు ఎటువంటి సమాచారం అందించకుండా రిమ్స్ మార్చురీలో అనాథ శవంలా పావనిని ఉంచారని, దీనిని బట్టి చూస్తే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారించిందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. పావని మృతి పట్ల న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం దారుణమని, తమకు జరిగిన అన్యాయం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదన్నారు. నారాయణ కళాశాల మంత్రులకు చెందినది కాబట్టే ప్రభుత్వం సైతం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తమ కుమార్తె మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మల్లేశ్వర్రెడ్డి, శివమ్మ డిమాండ్ చేశారు. -
కన్నవారికి కడుపుకోత
-
నారాయణలో ఆత్మ’హత్య’లు
-
సారీ మమ్మీ.. సారీ డాడీ
-
సారీ మమ్మీ.. సారీ డాడీ
సారీ మమ్మీ... సారీ డాడీ.. ఐ మిస్ యూ సోమచ్.. బై సన్నీ.. టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకో..బై అక్కా.. బాగా చదివి గ్రూప్స్ సాధించి నాన్నకు మంచి పేరు తీసుకురా.. నాకోసం వెతకొద్దు ప్లీజ్..వేస్ట్ నారాయణ కాలేజీ... క్లోజ్ ది నారాయణ కాలేజీ... నారాయణ కాలేజీ కిల్లింగ్ ద స్టూడెంట్స్ టు రీడ్... సో ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఫ్రం నారాయణ. దే ఆర్ ఆర్ సఫరింగ్ ఇన్ దిస్ కాలేజీ, హాస్టల్... సారీ మమ్మీడాడీ .’ ఇది హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదువుతూ తాజాగా అదృశ్యమైన విద్యార్థిని సాయి ప్రజ్వల వేదన.. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థులు ఎలా రాలిపోతున్నారో ప్రత్యక్ష నిదర్శనం ఈ లేఖ. ఈ మూడేళ్లలో ఏకంగా 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం నారాయణ తదితర కార్పొరేట్ కాలేజీల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్లను స్పష్టం చేస్తోంది. సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి, చదువుల ఒత్తిడికి అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారు. నారాయణ, చైతన్య కాలేజీల్లో భరించలేనంత ఒత్తిడికి గురై నిండు నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో... నిన్న విజయవాడలో... నేడు హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఒత్తిడికి తట్టుకోలేక అదృశ్యమైంది. హైదరాబాద్ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని సాయి ప్రజ్వల కొద్ది రోజులుగా కనిపించటం లేదు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి ఆమె తల్లిదండ్రులు ప్రజ్వల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి కొద్ది రోజుల క్రితం నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థిని నారాయణ కాలేజీలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి కనిపించకుండా పోయింది. కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్ ఆరోపించారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదు. కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం వంత పాడుతుండడమే పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం. అడ్మిషన్ల నుంచే అవకతవకలు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టటమే. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, బోధించే వారిని నియమించకుండా ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో ఇరుకు గదుల్లో విద్యార్ధులను కుక్కుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే సరిపోయే గదిలో ఏకంగా 8 నుంచి 10 మందిని కూర్చోబెడుతున్నాయి. కాలేజీలకు అడ్మిషన్ల సమయంలో సైన్సు, ఆర్ట్స్ తరగతులకు రెండేసి సెక్షన్లకు మాత్రమే అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోవచ్చు. ఇలా తొలుత నాలుగు సెక్షన్లకు 320 మంది విద్యార్థుల కోసం వసతులు చూపించి అనుమతులు పొందుతున్న కార్పొరేట్ కాలేజీలు ఆ తరువాత 10 శాతం వెసులుబాటును ఆసరాగా చేసుకొని మరింత మందిని చేర్చుకుంటున్నాయి. అవే వసతుల్లో అదనపు విద్యార్థులను కుక్కుతున్నాయి. వసతులు లేకుండా మరో 9 సెక్షన్లను ఏర్పాటు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలా మరో 720 మందితో పాటు అదనంగా మరో 10 శాతం నిబంధనతో విద్యార్థులను ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటున్నాయి. దీనికితోడు మరి కొంత మందిని పరీక్షల సమయంలో వేరే కాలేజీ విద్యార్ధుల కింద చూపించి పరీక్షలు రాయిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో ఒక్కో క్యాంపస్లో ఇరుకిరుకు గదుల్లో 2,500 మంది నుంచి 3 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ముందు చూపించిన కొద్ది మంది బోధకులతోనే ఈ వేలాది మంది పిల్లలకు బోధన చేయిస్తున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి ట్యూషన్ ఫీజు కింది రూ.2,800 వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ. 40,000 నుంచి రూ. లక్ష వరకూ గుంజుతున్నారు. హాస్టల్లో ఉంటే దీనికి మరో రూ. లక్ష అదనం. ఇంటర్ బోర్డుపై కార్పొరేట్దే పెత్తనం గాలి వెలుతురు లేని ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్ధులు మగ్గిపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ తెలిసినా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధ బాంధవ్యాలతో ఇంటర్ బోర్డు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ కేబినెట్ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 3,500 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. తక్కిన కాలేజీలన్నీ కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో ఉన్నవే. ప్రభుత్వ కాలేజీల్లో 3 లక్షల మంది విద్యార్ధులు చదువుతుండగా ప్రైవేట్ కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో ఈ కాలేజీలదే పెత్తనంగా మారింది. సొంత సిలబస్... కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వం రూపొందించిన సిలబస్ను పట్టించుకోకుండా తమ సొంత సిలబస్ను బోధిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్, ఎంసెట్, నీట్ సహా ఇతర పరీక్షలకు వాటి దారి వాటిదే. పరీక్షలకు నెలన్నర ముందు మాత్రమే ఇంటర్ సిలబస్ను బోధిస్తున్నాయి. పదో తరగతి పాసై వచ్చిన విద్యార్థికి ఇంటర్ పాఠాలతో బోధన ప్రారంభిస్తే కొంతమేర అవగాహన ఏర్పడుతుంది. కానీ ప్రారంభంలోనే జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల సిలబస్ను బోధిస్తుండడంతో విద్యార్ధులు బెంబేలెత్తిపోతున్నారు. రోజువారీ... వారాంతపు పరీక్షలతో ఒత్తిడి పదో తరగతి వరకు ఆటపాటలతోనో, ఒకింత స్వేచ్ఛగా చదివిన విద్యార్ధులు ఒక్కసారిగా పెరిగిన సిలబస్, ఆపై పోటీ పరీక్షల బోధనతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందులో వచ్చే మార్కులను అనుసరించి విద్యార్ధులను వేర్వేరు సెక్షన్లలోకి మార్పులు చేస్తున్నారు. ఒకవారం ఒక సెక్షన్లో ఉంటే మరో వారం మరో సెక్షన్లోకి వెళ్లాల్సి స్తోంది. దీంతో బోధకులు కూడా మారిపోతుండడం, పాఠ్యాంశాలు కూడా మారిపోతుండడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అర్హతలు లేని వారిని లెక్చరర్లుగా, వైస్ ప్రిన్సిపాళ్లుగా... సరైన అర్హతలు లేని వారిని లెక్చరర్లు, వైస్ప్రిన్సిపాళ్లుగా నియమిస్తున్నారు. కనీసం సబ్జెక్టు గురించి అవగాహన లేని వారిని తీసుకోవటంతో విద్యార్ధులకు వచ్చే సందేహాలు కూడా తీర్చలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ బలహీనతలు బయటపడకుండా ఉండడానికి ఇతరుల ముందే విద్యార్ధులను తిట్టడం, కొట్టడం ఇతర విపరీత చేష్టలకు లెక్చరర్లు దిగుతున్నారు. ఇది కూడా విద్యార్ధుల్లో అవమానానికి, ఆత్మన్యూనతకు దారితీస్తోంది. ఆయా లెక్చరర్లకు ఇచ్చే వేతనాలు రూ.9 వేల లోపే ఉండడంతో యాజమాన్యంపై కోపాన్ని విద్యార్ధులపై చూపిస్తున్నారు. ఇంటర్బోర్డులో అరకొరగా సిబ్బంది.... కార్పొరేట్ కాలేజీలపై పర్యవేక్షణకు ఇంటర్ బోర్డులో తగినంత మంది సిబ్బంది లేరు. జిల్లాకొక ఆర్ఐవో పోస్టు ఉన్నా అందులో చాలావరకు ఖాళీగానో, ఇన్ఛార్జులతోనో నడుస్తున్నాయి. వారికింద సిబ్బంది లేరు. ఇక ఇంటర్ సగానికి పైగా పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బోర్డులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు వెళ్లిపోగా ఏపీలో నియామకాలు మాత్రం చేపట్టలేదు. దీంతో బోర్డులో ఒక్కో అధికారి నాలుగైదు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కాలకృత్యాలూ తీర్చుకోలేకపోతున్న విద్యార్ధులు చదువుల ఒత్తిడితో దొరికిన కొద్ది సమయంలోనే కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్గతిలో విద్యార్ధులుంటున్నారు. ఇక హాస్టళ్లలో యాజమాన్యాలు అందించే ఆహారం చాలా నాసిరకం. దాదాపు ఏకబిగిన రెండు గంటలసేపు సాగే స్టడీ అవర్లో వారు సూచించిన సబ్జెక్టును మాత్రమే విద్యార్ధులు చదవాలి. ఇష్టం లేకున్నా అవే పుస్తకాలు పట్టుకొని తీవ్ర మనస్తాపంతో జీవితంపై అనాసక్తి ఏర్పరచుకుంటున్నారు. వారానికో, నెలకో వచ్చే తల్లిదండ్రులను నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా పంపేస్తున్నారు. -
‘నారాయణ’ను మూసేయండి..