‘విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారు’ | cpm leader narsingarao slams cm chandrababu on visakha land scam | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 22 2017 1:24 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సింగరావు విమర్శించారు. ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాలో పాల్గొన్న పాల్గొన్న ఆయన.. దేశంలోనే అతిపెద్ద భూస్కాం విశాఖలో జరిగిందన్నారు. లక్షలాది ఎకరాల భూములను తెలుగుదేశం పార్టీ నేతలు లాక్కున్నారని నర్సింగరావు మండిపడ్డారు. పేదల భూములను కొల్లగొట్టినవారికి బేడీలు వేయాలన్నారు. ఓ వైపు బీజేపీ ఎంపీ విష్ణుకుమార్‌ రాజు కబ్జాల గురించి మాట్లాడుతుంటే.. విశాఖ ఎంపీ హరిబాబు మాత్రం మాట్లాడటం లేదని నర్సింగరావు విమర్శించారు. అధికారపార్టీ నేతల భూకబ్జాలపై అన్ని పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement