Land scam
-
భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం
-
అమోయ్కుమార్ ‘భూ’ కేసుల విచారణలో కొత్త ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్కుమార్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల విచారణలో కీలక మలుపు తిరిగింది.నాగారం ల్యాండ్ స్కామ్ ఈడీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంది. అమోయ్కుమార్పై వచ్చిన ఆరోపణలపై వివరాల కోసం తెలంగాణ డీజీపీకి తాజాగా ఈడీ లేఖ రాసింది.భూ అక్రమాలపై ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయని లేఖలో డీజీపీకి ఈడీ తెలిపింది. ఈడీ లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. ఈడీకి చేరిన శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం,రాయదుర్గం ల్యాండ్ల వివరాలిచ్చారు.పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ వేగవంతం చేయనుంది.ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్రావుకు గ్రీన్కార్డు..? -
TG: అమోయ్కుమార్ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్కుమార్ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్కుమార్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్కుమార్ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్కుమార్ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు. ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్కుమార్కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
Nalgonda: రూ.20 కోట్ల భూ కుంభకోణం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ రివేంజ్ కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులను రాజకీయంగా సమాధి చేసేలా ఎత్తులు వేస్తున్నారు. అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం విశేషం. మిర్యాలగూడలో ప్రముఖ ప్రజాప్రతినిధికి ప్రత్యర్థి గ్రూప్లో ఆర్థిక విభేదాలు కలిసి వచ్చాయి. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడగా సుమారు రూ.20 కోట్ల విలువైన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.పది గుంటల ప్రభుత్వ భూమి..మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖుల మధ్య భూ వివాదం చినికిచినికి గాలివానలా మారి 65 సంవత్సరాల క్రితం జరిగిన భూ కుంభకోణం బయటపడింది. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్రోడ్డుపై సర్వే నంబర్ 992లో సుమారు పదిగుంటల భూవివాదం పరాకాష్టకు చేరింది. భూమి అమ్మకాల విషయంలో ఎంపీ ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరిన పదవిలో ఉన్న ప్రముఖుడు, మరో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. సదరు భూమిలో తన 35శాతం వాటా అమ్ముతా రూ.15 కోట్లు ఇవ్వాలని, లేదా.. మీ చేతిలో ఉన్న 65 శాతం భూమి అమ్మితే రూ.9కోట్లు ఇస్తానని పేచీ పెట్టడంతో విసిగిపోయిన ఇద్దరు.. ప్రధాన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆ భూమి గత వివరాలు తెలుసుకునే పనిలో భాగంగా పహాణీ తీయడంతో ఆ భూమి కాస్తా ఆబాది గ్రామ కంఠం భూమిగా తేలింది. 1977–78లో గ్రామ కంఠం భూమిగా నమోదు కావడం, అందులో 8.38 ఎకరాల భూమి ఆబాది (గ్రామకంఠం)లోనిదిగా తేలింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ నెల 19న ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు.రాజకీయ విభేదాలతో వెలుగులోకి..ఈ భూ కుంభకోణం బయటికి రావడానికి అధికార పార్టీ నేత హస్తం ఉందని, ఇందుకు రాజకీయ విభేదాలు కూడా కారణమని తెలుస్తోంది. చట్టసభలో ఉన్న ప్రతినిధిని బాధితులు ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చిందని సమాచారం. మొత్తం మీద 65 సంవత్సరాల క్రితం ఆ భూమిలో అప్పటి పట్టణ మున్సిపల్ చైర్మన్ నివాసం ఉండి ఆయన మున్సిపాలిటీ తరఫున షాపులు నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఆయన మరణించిన అనంతరం ఆ స్థలాన్ని అమ్మేశారు. ఇప్పటివరకు నాలుగైదు చేతులు మారాయి. ప్రస్తుతం పొత్తులో ఉన్న స్థలాన్ని తాత్కాలికంగా అద్దెకిచ్చారు. ఆ అద్దెలను కూడా పట్టణ ప్రజాప్రతినిధి తీసుకోవడంతో వారిలో ఆర్థిక వివాదం మరింత పెరిగింది. ఇప్పుడు ఆ భూమి కొనుగోలుదారుల్లో కలవరం మొదలైంది.డాక్యుమెంట్లను పరిశీలిస్తాంమిర్యాలగూడ సర్వే నంబర్ 992లో సుమారు పది గుంటల భూమి మీకు ఎలా వచ్చిందో చెప్పాలని కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరాం. కొనుగోలుదారులు ఒక్కరోజులోనే సమాధానం ఇచ్చారు. వారిచ్చిన సమాధానం, డాక్యుమెంట్లు, ఆధారాలను ఉన్నతాధికారులకు సమర్పించాం. ఆ డాక్యుమెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం– వెంకన్న, మున్సిపల్ డీఈ -
Muda Scam: సీఎం సిద్ధరామయ్యపై విచారణ.. ముడా ఛైర్మన్ రాజీనామా
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా విజయనగర్లోని అప్మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని తన భార్యకు అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.ఇదిలా ఉండగాా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్చేశారు. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ను జూన్లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్ను అనుమతించవద్దని గవర్నర్ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం
సాక్షి టాస్క్ఫోర్స్: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగుతుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. రూ.కోట్లలో బేరసారాలు..కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఓ తహశీల్దార్ తిరుపతి రూరల్ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. కొమ్ము కాయాల్సిందే...!కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ⇒ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్తో పాటు మట్కా, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్ ఇచ్చారు. ⇒ ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్ సర్కిల్కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. ⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్లోని సర్కిల్స్లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై పొరుగు సర్కిల్స్కు వెళ్లిన ఇన్స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. జిల్లా పరిషత్లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్స్టేషన్కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్ డివిజన్లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో పోస్టింగ్కు భారీగా డిమాండ్ ఉంది. అమలాపురం రూరల్ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. ⇒ ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరంలో ఎస్ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్ బావమరిది కూడా లైన్లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్లకు భారీ డిమాండ్ ఉంది. ⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్కు పంపించారు. ⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు అప్పగించినట్లు చెబుతున్నారు. -
100 కోట్ల భూమి స్వాహా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత
-
తిరుపతిలో కూటమి నేత అరాచకం 22 రోజులుగా రోడ్డుపై కుటుంబం ధర్నా
-
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్తో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్కు భూ సంతర్పణ అలైన్మెంట్ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్కు ఐఆర్ఆర్ అలైన్మెంట్కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
బాబు మింగిన భూములు కక్కించిన తెలంగాణ హై కోర్టు
-
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
అధికారులతో కుమ్మకై మభ్యపెట్టి మా పత్రాలు కాజేసి..
-
ఆడవాళ్ళని చూడకుండా పోలీసులతో.. రామోజీ రావు అకృత్యాలపై మహిళలు
-
ఫిలింసిటీ నిర్మాణం కోసం రామోజీ వేసిన అడుగులు..స్టెప్ బై స్టెప్
-
'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేశ్ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్షీట్లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. సింగపూర్ కన్సల్టెన్సీ ముసుగు సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. సీఆర్డీయే ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం భ్రమింపజేసింది. కానీ ఆ పేరుతో సింగపూర్లోని ప్రైవేట్ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని తీసుకువచ్చి పక్కాగా అవినీతి కథ నడిపించింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందు పరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఇదిగో అడ్డగోలు దోపిడీ ఇలా.. ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు తమ హెరిటేజ్ ఫుడ్స్కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ – సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కో లో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి ఆయన వద్ద నుంచి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. మ్యాప్ను చుట్టూ తిప్పేశారు.. ► లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో ద్వారా పొంగూరు నారాయణ.. తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. చంద్రబాబు, నారాయణ కుటుంబాలు అక్రమంగా దక్కించుకున్న భూముల సమీపంలోనే ప్రభుత్వ నిధులతో సీడ్ క్యాపిటల్ ఏరియా, స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికను ఆమోదించింది. అందుకోసం ఏకంగా ప్రభుత్వ నిధులు రూ.5,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తద్వారా తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసేందుకు కుట్ర పన్నింది. ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దాంతో నారాయణ ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ► ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. పవన్ కల్యాణ్కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. ► ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ► ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. ► క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. లోకేశ్ అరెస్ట్కు ప్రతిబంధకం కాదు ఐఆర్ఆర్ కేసులో సీఐడీ చార్జ్షీట్ దాఖలు ఇప్పటికే విచారణలో ఉన్న ‘రెడ్బుక్’ కేసును ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. రెడ్బుక్ కేసులో లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు ఈ చార్జ్సీట్ ప్రతిబంధకం కాదు. ఐఆర్ఆర్ కేసులో అధికారులు, సాక్షులను బెదిరిస్తూ కేసు విచారణను ప్రభావితం చేసే రీతిలో రెడ్బుక్ పేరిట ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో గతంలో ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించిన లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 13కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐఆర్ఆర్ కుంభకోణం కేసు, రెడ్బుక్ బెదిరింపులు వేర్వేరు కేసులు. కాబట్టి ఐఆర్ఆర్ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ రెడ్బుక్ పేరిట బెదిరింపు కేసులో లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని నిపుణులు స్పష్టం చేశారు. -
గేటులోపలికి పట్టాదారుణ్ని అనుమతిస్తాం, మీడియాకి అనుమతి లేదు
-
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్ను ఈడీ అరెస్ట్చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
రాబందు రామోజీ..సంచలన నిజాలు బయటపెట్టిన బాధితులు..
-
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా.. బెయిల్పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత చంద్రశేఖర్ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పిటిషనర్ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
అమరావతి భూదోపిడిలో వెలుగులోకి కొత్త కుట్రలు
-
ప్రభుత్వ భూములూ మింగేశారు!..అమరావతిలో చంద్రబాబు ముఠా అరాచకాలు
-
లోకేష్ లో భయం..త్వరలో జైలుకు !
-
రింగ్ రోడ్డు పేరుతో లోకేష్ భూ దోపిడీ..పవన్ కళ్యాణ్ కు వాటా..!
-
నారాయణ భూ దందా
-
పారని బాబు, నారాయణ పాచిక
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో భాగమైన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులైన మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయనకు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి నారాయణ ఏదో జరిగిపోతోందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి వినతి మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత వారి పిటిషన్లపై విచారణ సాగకుండా వారే శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్టే పొడిగింపు ఉత్తర్వులూ పొందుతున్నారు. హైకోర్టులో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. తాజాగా గురువారం ఇదే రీతిలో విచారణను సుదీర్ఘ కాలానికి వాయిదా వేయించేందుకు వారి న్యాయవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. కోర్టులో వారి ఎత్తులను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. న్యాయస్థానానికి సైతం వారి ఎత్తుగడలు అర్థమయ్యాయి. దీంతో వచ్చే గురువారానికి మాత్రమే విచారణను వాయిదా వేయించుకోగలిగారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టే పొంది వాయిదాల మీద వాయిదాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2021లో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలంటూ బాబు, నారాయణ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2021 మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ వాయిదా పడుతోంది. ఆ తరువాత ఈ వ్యాజ్యాలు ఓ న్యాయమూర్తి వద్ద విచారణకు రాగా, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే కొనసాగుతుందంటూ ఉత్తర్వులు పొందారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. చంద్రబాబు, నారాయణ తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మరోసారి సుదీర్ఘ వాయిదాకు వారి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. బాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు నోటీసు అందలేదని, అందువల్ల విచారణ జరపడం సరికాదని అన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించిన కోర్టు అధికారి.. నోటీసు ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకొని మరోసారి రికార్డులు చూడాలని కోరారు. మరోసారి రికార్డులను పరిశీలించగా, రామకృష్ణారెడ్డికి 2021లోనే నోటీసులు పంపినట్లు ఉన్న ఉత్తర్వుల కాపీ దొరికింది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు, నారాయణ న్యాయవాదులు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి సుధాకర్రెడ్డి అడ్డుతగిలారు. నోటీసులు అందలేదన్న సాకుతో వాయిదా వేయించాలని చూశారన్నారు. వాదనలు వినిపించేందుకు సిద్ధమని చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఎందుకు వాయిదా కోరుతున్నారని, ఇది టూ మచ్ అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఇప్పటికే విచారణను ఎన్నోసార్లు వాయిదా వేయించారని చెప్పారు. వాళ్లే చాలాసార్లు వాయిదా తీసుకున్నారని దమ్మాలపాటి అనగా, ఎవరు ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నారో తేల్చేందుకు తాను ఇక్కడ లేనని న్యాయమూర్తి కరాఖండిగా చెప్పారు. సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బుధవారం మరో కేసు ఉన్నందున విచారణను గురువారానికి కోరతామని దమ్మాలపాటి చెప్పడంతో తాను అంగీకరించినట్లు తెలిపారు. గురువారం కూడా వాయిదా కోరడంలో అర్థం లేదన్నారు. తమ ఎత్తుగడ ఫలించదని బాబు, నారాయణ న్యాయవాదులకు అర్థమవడంతో తాము సుదీర్ఘ వాయిదా కోరడం లేదని దమ్మాలపాటి చెప్పారు. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ బుధవారానికి మొగ్గు చూపగా, దమ్మాలపాటి పదే పదే అభ్యర్థించడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
ఒక్కొక్కటిగా వెలికి వస్తున్న చంద్రబాబు అండ్ కో అక్రమాలు
-
టీడీపీ సర్కారు భూ కుంభకోణాలపై ఏసీబీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
-
అమరావతిలో బాబు అవినీతి కథలు
-
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు విర్రవీగారు.. ఇప్పుడేమైంది..
ఇంతకాలం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ఏమని అంటుండేవి? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకలేరని, వారేమిటి? స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు కూడా ఏం పీకుతారు? అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. పైగా ఎదురు డబాయించడం. వాళ్లను బ్యాన్ చేస్తా! వీళ్లను బ్యాన్ చేస్తా? నేను గెలిచాక పోలీసుల సంగతి చూస్తా! జగన్కు ట్రీట్మెంట్ ఇస్తా అంటూ ఇష్టారీతిన బెదిరించడం చంద్రబాబుకు అలవాటైంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే అంతలా మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉంటారా? ఈ సరికే అనేక కేసులలో చంద్రబాబు అండ్ కో ఏ రకంగా నిందితులో జగన్ అసెంబ్లీలోనే తెలియచెప్పారు. అప్పట్లో చంద్రబాబుకు న్యాయ వ్యవస్థలో ఉన్న బలం ఆధారంగా కేసులు ముందుకు వెళ్లకుండా నెగ్గుకు రాగలిగారు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అప్పుడప్పుడు ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన పై వచ్చిన అవినీతి అభియోగాల మీద విచారణకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా తమను ఏమీ పీకలేరని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. రాజధాని భూములలో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్న కేసులో ఆస్తుల జప్తునకు సిఐడీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆరంభించారు. అమ్మో! ఇంకేముంది ఇదంతా రాజకీయ వేధింపే అంటూ ప్రచారం ఆరంభించారు. వారికి మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి జగన్ టీడీపీ నేతలను వేటాడమన్నారని ఏకంగా కథనాన్ని రాసింది. మరో టీడీపీ పత్రిక చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లును జప్తు చేశారని పేర్కొంది. అదేదో చంద్రబాబుకు సంబంధం లేని భవంతి అని జనం అనుకోవాలన్నది వారి తాపత్రయం కావచ్చు. అసలు ప్రభుత్వం చేసిన అభియోగం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్కు ప్రభుత్వపరంగా లాభం చేసి, ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు చెందిన ఇంటిని పొందారన్నది ఆరోపణ. దీనినే క్విడ్ ప్రోకో అంటారు. గతంలో ఒక వ్యక్తిగా జగన్ పరిశ్రమలు పెడితే, వాటిలో ఎవరైనా పెట్టుబడులు పెడితేనే చంద్రబాబు బ్యాచ్ క్విడ్ ప్రోకో అంటూ ఆరోపించేది. దానికి సోనియాగాంధీ కూడా తోడై అక్రమ కేసులు పెట్టి ఆయనను నెలల తరబడి జైలులో ఉంచారు. మరి చంద్రబాబు ఏకంగా కొందరికి అనుచిత లబ్ది చేకూర్చి ఒక భవంతిని తీసుకుంటే ఏమనాలి? బహుమతి అని వినసొంపైన పేరు పెట్టినా, దానినే లంచం అని కూడా అంటారు కదా! ఈ ఇంటికి సంబంధించి చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారు? ఒకసారి ఇది ప్రభుత్వ భవనం అని, పూలింగ్ లో వచ్చిందని, తను సీఎంను కనుక అందులో ఉంటున్నానని అన్నారు. ఈ ఒక్క భవనాన్ని మాత్రమే ఉంచుతామని, మిగిలిన నదీతీర భవనాలను తొలగించి టూరిజం అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆయన పదవీకాలంలో ఆ పనిచేయలేదు. నిజానికి అసలు ఆయన ఉంటున్న కట్టడమే అక్రమ నిర్మాణం. నదీ తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించిన కట్టడం. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వస్తే అప్పటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవలో తిరుగుతూ ఈ అక్రమ కట్టడాలన్నిటిని తమ ప్రభుత్వం కూల్చి వేస్తుందని చెప్పారు. ఈ కట్టడాల వల్ల నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే అందులో నివాసానికి దిగేసరికి ఎక్కడివారక్కడ నోరు మూసుకోవలసి వచ్చింది. హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడానికి రాత్రికి, రాత్రే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. పర్యావరణవేత్లలు చెప్పినా, అధికారులు చెప్పినా, అదే అక్రమ కట్టడంలో ఉండడానికి చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పట్లోనే చంద్రబాబు ఈ ఇంటిని తీసేసుకున్నారని ప్రచారం జరిగేది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ కూడా తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని ప్రకటించారు. అది చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద బహుమతిగా పొందారని, కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిని ఆయన అలా పొందడం చట్ట విరుద్దమని సీఐడీ కేసు పెట్టి , భవనాన్ని జప్తు చేసింది. లింగమనేని రమేష్కు చంద్రబాబు ఏ రకంగా ఉపయోగపడ్డారు? ముందస్తు సమాచారం ద్వారా రమేష్కు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించారని, అమరావతి రాజధాని గ్రామాల చుట్టూరా రింగ్ రోడ్డు ప్లాన్ వేసినప్పుడు రమేష్ భూములు ప్రభుత్వ భూ సమీకరణలో పోకుండా అలైన్ మెంట్ లో మార్పులు చేశారని సీఐడీ ఆరోపణ. చంద్రబాబుకు కుటంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందిన భూమి పోకుండా, రింగ్ రోడ్డు పక్కనే తమ భూమి ఉండేలా ప్లాన్ మార్చుకున్నారన్నది మరో అభియోగం. హెరిటేజ్ సంస్థ కూడా ముందస్తుగానే కంతేరు ప్రాంతంలో 14 ఎకరాల మేర కొనుగోలు చేసింది. అది అప్పట్లోనే వివాదాస్పదం అయింది. చంద్రబాబు అద్దెకు ఉంటున్నందునే ఆ ఇల్లు ను జప్తు చేశారన్నట్లుగా టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఉత్త పుణ్యానికి చంద్రబాబు ఆ ఇంటిని పొందారన్నది ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అది ప్రైవేటు బిల్డింగ్ అని అసెంబ్లీలో చెప్పడం విశేషం. ప్రభుత్వ భవనం అయితే దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసి ఉంటుంది. లేదా ప్రతిపక్ష నేత హోదాలో దానిలో ఉంటున్నానని చెప్పవచ్చు. అలాకాకుండా మళ్లీ లింగమనేనికి ఎలా వెళుతుంది? ఒకవేళ నిజంగానే లింగమనేని నుంచి అద్దెకు తీసుకుని ఉంటే, సంబందిత అద్దె లావాదేవీలు ఎందుకు చూపించలేదు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు. ఆయన తరపున కొందరు టీడీపీ నేతలు మాత్రం యథా ప్రకారం ఇదంతా కక్ష అని విమర్శిస్తూ మాట్లాడారు. నారాయణ సమీప బంధువులు లేదా ఆయన విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది పేరుతో ముందుగానే భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక లాభం పొందాలని నారాయణ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించినవారిని సీఐడీ విచారించింది. వారు తమ సాక్ష్యాలలో ఆ భూములు నారాయణవేనని వెల్లడించారట. తాజాగా ఈ లావాదేవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రెండున్నర ఎకరాల వాటా ఉందని వార్త వచ్చింది. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికి లింగమనేని సన్నిహితుడు కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం మార్పు చేసిన అలైన్ మెంట్ కనుక అమలు అయి ఉంటే వేల కోట్ల రూపాయల లబ్ది వీరికి అక్రమంగా జరిగి ఉండేదని సీఐడీ అంచనా వేసింది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గాను భూ సేకరణ జరిగింది. ఆ టైమ్ లో తెలుగుదేశం నేతలు పలు ఆరోపణలు చేస్తుండేవారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తో పాటు కొందరు టీడీపీ నేతలకు చెందిన భూముల గుండా రింగ్ రోడ్డు వెళ్లిందని, తద్వారా వారికి నష్టం వాటిల్లేలా చేశారని ఈనాడు మీడియా కథనాలు ఇచ్చేది. అలాగే రామోజీరావుకు చెందిన కొంత భూమి కూడా పోయిందని అంటారు. దాంతో ఆయన ఆగ్రహానికి లోనై అవుటర్ రింగ్ రోడ్డులో గద్దలు అంటూ చెలరేగిపోయి బోలెడు స్టోరీలు ఇచ్చేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అధికారుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి వారి సందేహాలను నివృత్తి చేసే యత్నం చేసింది. అప్పట్లో అన్ని స్టోరీలు రాసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అలైన్ మెంట్ మార్పు, అస్సైన్డ్ భూముల కుంభకోణం వంటివాటికి మద్దతు ఇచ్చేలా వార్తలు ఇస్తుండడం విశేషం. ఇక ఈ కేసు ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎసీబీ న్యాయమూర్తికి ఈ జప్తు సమాచారం ఇచ్చి ఆయన అనుమతి పొంది ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం పెట్టిన 1944 నాటి చట్టం ప్రయోగిస్తారా అని టీడీపీ మీడియా వాపోతోంది. అందులో ఉన్న సెక్షన్ 3 వర్తించదని, కేసు నిలబడదని వాదిస్తోంది. చట్టం ఎప్పటిదైనా అది రద్దు కానంతవరకు అమలు అవుతుంది. మన దేశంలో ఉన్న క్రిమినల్ చట్టాలలో అత్యధికం స్వాతంత్రం రావడానికి పూర్వం నాటివేనన్న సంగతి మర్చిపోరాదు. చంద్రబాబు, లింగమేనేని, నారాయణలపై ఆరోపణలు చేస్తున్నా, అసలు రాజధానే నిర్మాణం కానప్పుడు, రింగ్ రోడ్డే లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందని టీడీపీ మీడియా ప్రశ్నించింది. గత ప్రభుత్వం రూపొందించిన దాని ప్రకారం అమలు చేస్తే చంద్రబాబు తదితరులు లాభపడేవారా? కారా? అన్నది ఇక్కడ ప్రశ్న. దొంగతనం జరిగినా, సొత్తు ఏమీ దక్కలేదుగా అంటే చోరీ నేరం కాకుండా పోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరమైన విషయమే. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన 2 జీ స్పెక్ట్రం , బొగ్గు గనుల స్కామ్ లలో కూడా ఊహజనిత నష్టాల ఆధారంగానే సీబీఐవారు కేసులు పెట్టారన్న సంగతి గుర్తుంచుకోవాలి. రాజధాని భూముల క్విడ్ ప్రోకో కేసులోనే కాకుండా అస్సైన్డ్ భూముల వ్యవహారంలో కూడా టీడీపీ నేతలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు తో సహా టీడీపీ నేతల మూలాలను వైసీపీ ప్రభుత్వం పీకడం మొదలుపెట్టినట్లేనా! తెలుగుదేశం నేతలు ఇంతకాలం ఏం పీకుతారంటూ వేస్తున్న ప్రశ్న జవాబు లభిస్తున్నట్లేనా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ చదవండి: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కూ వాటా -
అమరావతి ల్యాండ్ స్కాంలో స్పీడ్ గా సీఐడీ విచారణ
-
విచారిస్తేనే వెలుగులోకి బాబు కుంభకోణాలు
విచారిస్తేనే వెలుగులోకి బాబు కుంభకోణాలు -
సుప్రీం తీర్పుతో టీడీపీలో గుబులు
కర్నూలు(హాస్పిటల్)/బొమ్మలసత్రం: అమరావతి భూ కుంభకోణం విచారణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ నాయకుల్లో గుబులు మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.12.90కోట్లతో నిర్మించిన డయాగ్నోస్టిక్ బ్లాక్, రూ.4.50కోట్లతో నిర్మించిన ఉమెన్స్ పీజీ హాస్టల్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో కలిసి ఆమె గురువారం ప్రారంభించారు. రూ.120 కోట్లతో నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూకుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి తదితర వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగింపునకు వీలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వారి అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందనే ఆందోళన స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, జనం మద్దతు టీడీపీకి దక్కే పరిస్థితి లేదని, ఈ విషయం అర్థమయ్యే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతులు ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని తెలిపారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు ఈ ఏడాది నుంచే ప్రారంభం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కూడా వచ్చాయన్నారు. నంద్యాల, ఏలూరు, మచిలిపట్నం, విజయనగరంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాజమహేంద్రవరం మెడికల్ కళాశాలకు కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్రెడ్డి, అకడమిక్ డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్ పాల్గొన్నారు. -
చంద్రబాబు అండ్ కో కి సుప్రీం షాక్
-
చంద్రబాబు అండ్ కో కి సుప్రీం షాక్
-
జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: 30 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ హయాంలోఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారని ఏకిపారేశారు. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అందుకే తనను జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని గుడివాడ ఎద్దేవా చేశారు. అందుకే విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈమేరకు అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? -
చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు: ఈడీ
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటంబసభ్యుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో అక్రమ నగదు, ఆభరణాలను భారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ కుటుంబసభ్యుల నివాసాల్లో రూ.కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారు కడ్డీలు, ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు లభించినట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ బంగళా విలువ ప్రస్తుతం రూ.150 కోట్లని, దీన్ని గతంలో రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు అంతస్తుల భవనం ఏబీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై రిజిస్టర్ అయి ఉందని, కానీ తేజస్వీ యాదవ్ దిన్ని నివాసంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు జాబ్ ఫర్ స్కాం ద్వారా వచ్చిన నగదు లేదా రాబడిని ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన రత్నాలు, ఆభరణాల సంస్థలు అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రాబడి విలువ ప్రస్తుతం రూ.600కోట్లు అని ఈడీ అధికారులు చెప్పారు. వీటిలో రూ.350కోట్లు స్థిరాస్థులు కాగా.. బినామీల ద్వారా రూ.250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు. చదవండి: రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్కు సీబీఐ సమన్లు -
కాసేపట్లో మాజీ మంత్రి నారాయణ నివాసానికి సీఐడీ
-
ఆ మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించండి
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో.. తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, నారాయణ విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ పొత్తూరి ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసులను కొట్టేయాలని కోరుతూ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఇద్దరు మహిళలున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని ఆదేశించారు. -
నారా, నారాయణ అవినీతి బంధం గుట్టు రట్టు
-
అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్
సాక్షి, విజయవాడ: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, రాజేశ్పై ఫిర్యాదు వచ్చింది. రెండు సెంట్ల భూమి ఆక్రమించారని ఆరోపణ ఉంది. ఎన్వోసీపై సంతకం ఏఈది కాదు. ఫేక్ ఎన్వోసీతో 0.26 సెంట్ల భూమి కబ్జా చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశాము. ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ-2 విజయ్, ఏ-3 రాజేశ్గా ఉన్నారు. 464, 467, 471, 474 R/w 120-B, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఏ-1, ఏ-3ని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాము. కుట్ర చేసి భూమి ఆక్రమించారనేది ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం
అయోధ్య: అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్, మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది భూకుంభకోణానికి పాల్పడినట్లు అయోధ్య అభివృద్ధి అథారిటీ(ఏడీఏ) ఆరోపించింది. వీరంతా స్థానికంగా ఇళ్ల ఫ్లాట్ల అక్రమ క్రయవిక్రయాలకు పాల్పడంతోపాటు, అనధికారికంగా కాలనీలను నిర్మించినట్లు ఏడీఏ తెలిపింది. కుంభకోణంతో సంబంధమున్న మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గోరఖ్నాథ్ బాబా తదితర 40 మంది పేర్లను శనివారం విడుదల చేశామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ చెప్పారు. వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కాషాయపార్టీ అవి నీతి నీడ పడకుండా కనీసం అయోధ్యనైనా కాపాడాలన్నారు. బీజేపీ నేతలు అయోధ్యలో 30 వరకు కాలనీలను అక్రమంగా ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఖజానాకు వందలాది కోట్ల రూ పాయల నష్టం కలిగించారని ఆరోపించారు. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
అయోధ్య భూకుంభకోణంపై దర్యాప్తు
లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్రమ కొనుగోళ్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసులో 2019లో చరిత్రాత్మక తీర్పు వెలువడిన మరు క్షణమే అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భూముల బలవంతపు కొనుగోళ్ల పర్వం ఊపందుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషన్ బంధువులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, డీఐజీ తదితరులు అయోధ్య సమీప స్థలాలను కొనుగోలు చేశారన్న వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రెవెన్యూ శాఖను ఆదేశించారని యూపీ అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సమాచార) నవనీత్ సెహగల్ చెప్పారు. మతం ముసుగులో హిందుత్వ వాదులు స్థలాలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రియాంక కుంభకోణంపై యూపీ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆలయం కోసం అధిక ధరలకు భూములు కొంటూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సుప్రీంకోర్టు సూమోటోగా కలగజేసుకుని న్యాయం చేయాలన్నారు. ఆలయం కోసం వేల కోట్ల విరాళాలిచ్చిన రామభక్తుల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఎస్పీ చీఫ్ మాయవతి సైతం డిమాండ్చేశారు. -
చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం.. రూ.500 కోట్లు..!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2,300 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్, వెబ్ల్యాండ్కు ఎక్కించారు. ఈ స్కామ్కు సంబంధించి ఇప్పటిదాకా ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూముల విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. యదమరి మండలం గొల్లపల్లి రిటైర్డ్ వీఆర్ఓ గణేష్ పిళ్లై ఈ అక్రమాలకు ప్రధాన సూత్రదారి. జూలై 01, 2009లో ఒకే రోజు ఆన్లైన్లో ఎక్కించి అక్రమాలకు పాల్పడ్డారు. చదవండి: (భూదేవి పేట భేష్.. అభినందించిన ప్రధాని మోదీ) చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సర్వే నెంబర్ 459లో 45.42 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. రాజన్, ధరణి, మధుసూధన్లు ఆన్లైన్లో 160.09 ఎకరాలు చూపించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై సోమల తహశీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి మే 29, 2020లో పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పెద్ద పంజానీ మండలంలో కూడా 2015లో తహశీల్దార్ శ్రీదేవి సహాయంతో నిందితులు అక్రమాలకు పాల్పడ్డారు. సీసీఎల్ఏ నివేదిక ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. ఇదే పేర్లతో 14 మండలాల్లో 93 సర్వే నంబర్స్లలో 2,300 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ కుంభకోణంలో గణేష్ పిళ్లైతో పాటు, అతని కుమారులు మధుసూధన్, సుధ, కోమలి, అడవి రమణ మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశాము. గణేష్ పిళ్లై కూతరు ధరణి పరారీలో ఉంది' అని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. -
వెయ్యి కోట్ల కుంభకోణం
సాక్షి, న్యూఢిల్లీ: కోకాపేట్ భూముల వ్యవహారం సీబీఐ ముందుకు చేరింది. కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల ఫిర్యాదు లేఖను సీబీఐ డైరెక్టర్కు అందించారు. అనంతరం నార్త్బ్లాక్ వద్ద రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భూముల అమ్మకాల పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అనుయాయులకు, పార్టీ నేత లకు చవక ధరలకే విలువైన భూముల్ని కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములున్న కోకాపేట్లో ఎకరం భూమిని రూ. 25 కోట్లకు అమ్మారని, అంతకన్నా తక్కువ రేట్లున్న పుప్పాలగూడ, ఖానామెట్లో మాత్రం ఎకరం భూమిని రూ.40 కోట్లకు అమ్మారన్నారు. పుప్పాల్గూడకు చెందిన 125 ఎకరాల భూకుంభకోణం వివరాలను త్వరలో బయటపెడతానని చెప్పారు. ప్రైవేట్ బిల్డర్లకు లాభం భూముల వేలం వ్యవహారంలో ఎంఎస్టీసీ క్రియాశీల సహకారంతో సిండికేట్ ఏర్పడినందున, వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్, స్విస్ చాలెంజ్ పద్ధతి వంటి పారదర్శక వేలం విధానాన్ని చేపట్టి ఉంటే కచ్చితమైన విలువ తెలిసి ఉండేదన్నారు. ఎంఎస్టీసీ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖజానాకు నష్టాన్ని కలిగించి, ముఖ్యమంత్రి సన్నిహితులైన ప్రైవేట్ బిల్డర్లకు లాభాన్ని చేకూర్చారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఐటీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్ నిబంధనలను ఉల్లంఘించి, కేసీఆర్ చెప్పినవారికే వేలంలో భూములు వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు. మధ్యవర్తిగా వేలంలో పాల్గొన్న ఎంఎస్టీసీ నియోపోలిస్, కోకాపేట్, గోల్డెన్ మైల్ బిడ్డర్ల పేర్లను బహిర్గతపరచలేదన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తా.. భూకుంభకోణంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిల కుటుంబ సభ్యులు, మైహోం సంస్థకు చెందిన వారు ఉన్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంపై త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతిపై ఏదైనా కోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప విచారణకు ఆదేశించే అవకాశం సీబీఐకి చాలా తక్కువగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారన్నారు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్లు అవినీతికి పాల్పడితే నేరుగా సీబీఐ విచారణ చేపట్టవచ్చన్న విçషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. అడిగిన 24 గంటల్లోనే కేసీఆర్కు అపాయింట్మెంట్ దొరికినప్పుడు, కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్, కిషన్రెడ్డిలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. -
అనంతపురంలో టీడీపీ నేతల భూదందాలు
-
అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీని సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆగస్టు 5కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ కౌంటర్లో ఆగస్టు 12వ తేదీ లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని దమ్మాలపాటిని ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అమరావతి భూ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన న్యాయవాది కె.శ్రీనివాస స్వామిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. స్వామిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏసీబీ కేసుపై దమ్మాలపాటి అత్యవసర పిటిషన్.. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్రానికి గతేడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి గతేడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం పెండింగ్లో ఉండగానే.. ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రాయడం వల్ల తమ పరువుపోతోందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం విచారిస్తాం.. తాజాగా గురువారం దమ్మాలపాటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దమ్మాలపాటి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను న్యాయమూర్తి పరిశీలించారు. 4 వారాల్లో ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే విచారణ జరుపుతానని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు, ఆ కౌంటర్పై రీజాయిండర్ దాఖలుకు ఇరుపక్షాలకు నిర్ణీత గడువు విధించారు. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని చెప్పారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో 13వ నిందితురాలిగా ఉన్న వెల్లంకి రేణుకాదేవి వ్యాజ్యాన్ని కూడా దమ్మాలపాటి పిటిషన్కు జత చేశారు. ఆ వ్యాజ్యంలో కూడా విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. చర్చనీయాంశమైన ‘గ్యాగ్’.. ఈ వ్యాజ్యాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను నిలిపేశారు. ఈ కేసులో ఏ ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే స్టే ఎత్తివేత కోసం వాదనలు వినిపిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 4 వారాల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. -
అప్పన్న భూముల బాగోతంపై విచారణ షురూ
సింహాచలం (పెందుర్తి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సింహాద్రి అప్పన్నస్వామి భూముల గోల్మాల్పై విశాఖలో విచారణ ప్రారంభమైంది. ఈ భూబాగోతంపై రాష్ట్ర దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ డి. భ్రమరాంబ, విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మంగళవారం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టి రికార్డులను పరిశీలించారు. నగరంలోని అడవివరం, చీమలాపల్లి, వేపగుంట ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రూ.10వేల కోట్లకు పైగా విలువచేసే 748.07 ఎకరాలను 2016లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం ఆస్తుల రికార్డుల నుంచి తొలగించింది. దేవాలయాల భూములు పరిరక్షణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్లో సరిహద్దుల గుర్తింపు)లో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భూములు దేవస్థానానివి కావని, వేరే వారివంటూ 2016 డిసెంబరు 14న అధికారిక నోటిఫికేషన్ జారీచేశారు. ఈ బాగోతాన్ని గత నెల 27న సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, దేవదాయ శాఖ విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్తో తొలుత ఓ కమిటీని ఏర్పాటుచేశారు. అలాగే, 2016లో సింహాచలం దేవస్థానం అప్పటి ఈఓ, ప్రస్తుతం దేవదాయ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్గా ఉన్న కె. రామచంద్రమోహన్ను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో.. వారం రోజుల కిందట పుష్పవర్థన్ ప్రాథమికంగా కొంత విచారణ చేపట్టారు. తాజాగా, విచారణ కమిటీలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను కూడా సోమవారం నియమించారు. దీంతో సోమవారం సింహాచలం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళ నుంచి పలు రికార్డులు తీసుకుని పరిశీలించారు. పూర్తి విచారణ చేపట్టి నివేదికను దేవదాయ శాఖ కమిషనర్కు అందజేస్తామని భ్రమరాంబ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు శాంతి, వినోద్కుమార్, అన్నపూర్ణ కూడా రికార్డులను తనిఖీలు చేశారు. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణకు కమిటీ
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/విజయనగరం టౌన్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయానికి చెందిన సుమారు రూ.12 వేల కోట్లు విలువ చేసే 840 ఎకరాల భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి తొలగించిన అంశంపై విచారణకు దేవదాయ శాఖ ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–19 మధ్య ఆలయ భూముల ఆస్తుల రిజిస్టర్లలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్–1 చంద్రకుమార్, విశాఖపట్నం డివిజన్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్లతో కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్టు భూముల్లో జరిగిన అక్రమాలపైన కూడా ఈ ఇద్దరు అధికారులు విచారణ జరిపి ఈ నెల 15లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. సింహాచలం ఆలయ, మాన్సాస్ ట్రస్టు ఈవోలు విచారణ కమిటీ ముందు రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించేటప్పుడు ఆయా అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ సింహాచలం దేవస్థానానికి 2010లో 11,118 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2016 నాటికి ఇందులో 10,278 ఎకరాలే మిగిలాయి. 840 ఎకరాల భూములను ఆలయ రికార్డుల నుంచి తప్పించినట్లు దేవదాయ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణలో భాగంగా జియోఫెన్సింగ్ ప్రక్రియ చేపడుతున్న క్రమంలో ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం జిల్లా అధికారులతో విచారణ జరిపించగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2016లో అప్పటి సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కె.రామచంద్రమోహన్ ఆలయ భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి వందల ఎకరాలను రికార్డుల నుంచి తొలగించినట్లు గుర్తించారు. అలాగే ఆయన మాన్సాస్ ట్రస్ట్ ఈవో (ఎఫ్ఏసీ)గా ఉన్న సమయంలో పలు భూ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించి ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. మాన్సాస్లో ప్రారంభమైన ఆడిటింగ్ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు, భూవ్యవహారాలపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. గత 16 ఏళ్లుగా ట్రస్టులో ఆడిటింగ్ జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వం ట్రస్ట్ వ్యవహారాలతోపాటు భూములపై కూడా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు మాన్సాస్ ట్రస్ట్ రికార్డులు, భూముల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో అధికారుల బృందం కోటలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోమవారం రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 నుంచి మాన్సాస్ ట్రస్ట్ ఆడిటింగ్ జరగలేదన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఏటా ఆడిటింగ్ చేసేందుకు నోటీసులిస్తున్నా ట్రస్ట్ పెద్దలు సహకరించలేదని చెప్పారు. ఇప్పటికీ దేవాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు తమకు అందజేయలేదని స్పష్టం చేశారు. -
అమరావతి భూచోళ్లు
-
Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం
సాక్షి, అమరావతి: సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో.. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్ తహాసీల్దార్ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్ జారీ చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు ఎవరూ అడగక్క పోయినా.. అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్ఎన్ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 2010 ఆస్తుల రిజిస్టర్ను సాకుగా చూపి.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్డీడ్ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్ఆర్సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది. ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా విచారణ సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్. -
భూబకాసురుల పై ఉక్కుపాదం
-
పూలింగ్...భారీ కుట్ర
-
దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి భూకబ్జాపై విచారణ
-
కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు: ఈటల
-
ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం: ఈటల
సాక్షి, హైదరాబాద్: పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సమాజం అసహ్యించుకునే స్థితిలో ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీ కోసం 19 ఏళ్ల పాటు చాలా కష్టపడి పనిచేశానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని.. హుజూరాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఈటల తెలిపారు. చావునైనా భరిస్తా.. ఆత్మగౌరవాన్ని వదులుకోనన్నారు. ‘‘గతంలో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్లీ గెలిచా. 2008లో 16 మంది రాజీనామా చేస్తే ఏడుగురు గెలిచారు.. అందులో నేను ఒకడిని. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు. ఉద్యమ నేతగా, మంత్రిగా పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆనాడు కేసీఆర్ ఎప్పుడూ డబ్బును నమ్ముకోలేదు. ఆనాడు కేసీఆర్ అణచివేతకు భయపడలేదు. అలాంటి కేసీఆర్ తన శక్తిని మొత్తం నాపై పెట్టారు. ఒక వైపు రెవిన్యూ, విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులతో విచారణ జరిపించారు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచవు’’అంటూ ఈటల వ్యాఖ్యానించారు. నాది వ్యాపార ధోరణి కాదు.. ఉద్యమంలోనే పనిచేశానని ఈటల పేర్కొన్నారు. ఉద్యమానికి ముందే తనకు పౌల్ట్రీ వ్యాపారం ఉందని తెలిపారు. ‘‘అసైన్డ్ భూములు నేను కొనుగోలు చేస్తే నేను శిక్షకు అర్హుడ్ని. అసైన్డ్ భూముల్లో చిన్న నిర్మాణం చేసినా చర్యలు తీసుకోండి. భూములు కొలవాలంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. రాజ్యం మీ చేతుల్లో ఉంది.. అధికారులు మీరు చెప్పిందే రాస్తున్నారు. భూముల సర్వేపై మాకు నోటీసులు ఇచ్చారా?. భయానక వాతావరణం సృష్టించి భూ సర్వే చేశారు. రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. నాపై కేసులు పెట్టే అధికారం కూడా మీకు ఉంది. చట్టాన్ని గౌరవించాలి కానీ అతిక్రమించడం కరెక్ట్ కాదు. అధికారులు రూపొందించిన రిపోర్ట్ తప్పులతడకగా ఉందని’’ ఈటల అన్నారు. తనకు ఇప్పటివరకు కలెక్టర్ నివేదిక అందలేదని.. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అరెస్ట్పై ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ శిష్యరికంలో నేను కూడా ప్రజలనే నమ్ముకున్నా. నేను కచ్చితంగా కోర్టుకు వెళ్తానని’’ ఈటల స్పష్టం చేశారు. మీకు నిజాయితీ, నిష్పక్షపాతం ఉంటే అసైన్డ్ భూముల ఘటనలు ఎన్ని జరగలేదు? మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు అసైన్డ్ భూముల నుంచి వేయలేదా?’’ అంటూ సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ ప్రశ్నలు సంధించారు. మీరే ప్రలోభపెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వ్యక్తులు కాదు.. వ్యవస్థ శాశ్వతం అని ఈటల అన్నారు. ‘‘మహిళా పారిశ్రామికవేత్తపై ఈ విధంగా చేయడం మీకు తగునా?. నిన్న ఎన్నికల ఫలితాల్లో ప్రజాగ్రహం ఏ విధంగా ఉంటుందో చూశాం. అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. మీ అరుపులకు, కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు. సాంబశివుడు చనిపోయిన నేను వెళ్తే నయీం ముఠా కూడా నన్ను భయపెట్టింది.. కానీ నేను భయపడలేదు. నయీం లాంటి హంతక ముఠా చంపుతానంటే నేను భయపడలేదని’’ ఈటల పేర్కొన్నారు. దేవరయాంజల్ దేవాదాయ భూముల ఆక్రమణలపై విచారణ కమిటీ మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలోని దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈటల, ఇతరులు ఆక్రమించారన్న ఫిర్యాదులపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: ‘ఈటల బావమరది సూరి బెదిరించారు’ ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా! -
ఏం జరగబోతోంది?.. ఈటల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీపై అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ విచారణపై ఈటల.. న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈటల తన సతీమణి పేరు మీద నెలకొల్పిన జమున హాచరీస్ సంస్థ భూ ఆక్రమణలకు పాల్పడిందని ఇప్పటికే మెదక్ కలెక్టర్ ధ్రువీకరించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివేదిక కూడా అందజేశారు. మరోవైపు భూకబ్జా, అటవీ చట్టాల ఉల్లంఘన కేసులు నమోదుతో పాటు, అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం చర్యలకు కలెక్టర్ సిఫార్స్ చేసిన సంగతి విదితమే. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. మరో వైపు ప్రభుత్వానికి నేడు విజిలెన్స్ నివేదిక అందజేయనుంది. అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ అరెస్ట్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శామీర్ పేట్లోని ఈటల రాజేందర్ నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. చదవండి: ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా! రెండోసారి పవర్.. ఈటలపై నజర్! -
రాజకీయాల్లో అణిచివేతలు, కుట్రలు ఉంటాయి: ఈటల
-
పక్కా ప్లాన్ ప్రకారమే నాపై కుట్ర: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అణచివేతలు సహజమని.. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండో సారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ భావజాలం లేదని.. తనకు రెండో సారి పదవి ఇచ్చేందుకు సంకోచించారని ఈటల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కేసీఆర్ను కలిశానని, కేటీఆర్ను కలిసేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్ర జరిగిందని.. తాను ఎక్కడా భూములు ఆక్రమించలేదని పేర్కొన్నారు. ‘‘నాపై ఆరోపణలు వచ్చిన వెంటనే నన్నే పిలిచి అడగొచ్చు కదా?. కేసీఆర్కు తెలియకుండా ప్రభుత్వంలో చీమ చిటిక్కుమంటుందా?. మంత్రి హోదాలో ఉండి నా సమస్యలే పరిష్కరించుకోలేకపోయా. నాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. భవిష్యత్ కార్యాచరణపై నాకే క్లారిటీ లేదు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని’’ ఈటల అన్నారు. చదవండి: ఈటల భూ వివాదం: కమలాపూర్లో హై టెన్షన్... ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ -
‘అసైన్డ్’ స్కామ్లో సీఐడీకి కీలక ఆధారాలు!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ దర్యాప్తు అధికారులు తాజాగా కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరుæ జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీలు ఉన్నట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో దీన్ని ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయడంపై సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సేకరించిన పలు ఆధారాలను కూడా న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో క్షుణ్నంగా దర్యాప్తు జరిపేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
చంద్రబాబుకు సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ సీఐడీ అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి నోటీసు జారీచేశారు. గత సర్కారు హయాంలో పక్కా పథకం ప్రకారం సాగిన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. దీంతో ఈ స్కామ్లో ప్రమేయమున్న చంద్రబాబుతో పాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్కామ్కు సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా కేసు దర్యాప్తు అధికారి సీఐడీ విజయవాడ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65.. డోర్ నెంబర్ 8–2–293/82/ఎ/1310లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41ఎ(3), (4) కింద నోటీసు అందజేసింది. ఈనెల 23 ఉ.11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఏ–1గా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే, మాజీమంత్రి నారాయణకు సీఆర్పీసీ సెక్షన్–41, అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు సీఆర్పీసీ–160 కింద నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం పథకం ప్రకారం అక్రమాలకు పాల్పడిందని, ఈ భూ స్కామ్పై విచారణ చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 24న ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్కుమార్ ఆదేశాలతో దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు అసైన్డ్ భూ కుంభకోణం నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ స్కామ్లో ప్రమేయమున్న చంద్రబాబు, నారాయణ, వారికి సహకరించిన మరికొందరు అధికారులపైన ఈ నెల 12న కేసు (ఎఫ్ఐఆర్ 5/2021) నమోదు చేశారు. పథకం ప్రకారం కుట్ర చేసినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్ 120బి రెడ్విత్ 34, 35, 36, 37.. ఇతరులకు నష్టం కలిగించేలా బాధ్యత కలిగిన ప్రతినిధులు చట్టాన్ని ఉల్లఘించినందుకు సెక్షన్–166, పథకం ప్రకారం తప్పుడు పత్రాలు సృష్టించడంపై 167, బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న వారు చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సెక్షన్ 217తోపాటు ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలుచేసి వారిని నష్టపరిచినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్డ్–1989, అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్–1977 సెక్షన్–7 ప్రకారం కేసులు నమోదు చేశారు. చంద్రబాబుకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులు దర్యాప్తునకు సహకరించండి.. చంద్రబాబుకు జారీచేసిన నోటీసులో సీఐడీ పలు ఆంక్షలను విధించింది. అవి.. ► అమరావతి పేరుతో సాగిన అసైన్డ్ భూముల స్కామ్ కేసులో సీఐడీ విచారణకు, దర్యాప్తు సక్రమంగా సాగేందుకు పూర్తిగా సహకరించాలి. ► అప్పట్లో జరిగిన వాస్తవాలను విచారణ సమయంలో వెల్లడించాలి. ► దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ జోక్యం చేసుకోకూడదు. ► ఈ కేసులో సాకు‡్ష్యలను బెదిరించడం, ప్రభావితం చేయడం చేయరాదు. ► సాక్ష్యాలను దెబ్బతీసేందుకు ఎటువంటి తెరవెనుక ప్రయత్నాలకూ పాల్పడకూడదు. ► ఈ కేసులో సీఐడీ విచారణకు, న్యాయస్థానానికి ఎప్పుడు హాజరుకావాలన్నా సిద్ధంగా ఉండి సహకరించాలి. ► ఈ కేసు దర్యాప్తు అధికారి విధించే షరతులను విధిగా పాటించాలి. ► షరతులు ఉల్లంఘిస్తే అరెస్టు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సీఐడీ ప్రాథమిక నివేదిక సిద్ధం అమరావతి రాజధాని మాటున జరిగిన భూముల సమీకరణలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారం పథకం ప్రకారం జరిగిన కుట్రేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇక్కడి అసైన్డ్ భూములను భూసమీకరణలో చేర్చడానికి జీఓ ఇచ్చారని సీఐడీ ప్రధాన అభియోగం మోపింది. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారం ఇచ్చిన లీకులతో అధికార పార్టీ నేతలు కొందరు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. వీటికి ఎలాంటి ప్లాట్లు రావని చెప్పడంతో దళితులు తమ భూములను కారుచౌకగా అమ్ముకునేలా చేశారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగారు. దీంతో వారు దారుణంగా మోసపోయారు. మరోవైపు. ఈ భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నేతలు విపరీతమై ఒత్తిళ్లు చేసి పనులు చక్కబెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలతో జీఓలు జారీచేయించారు. అనంతరం వన్టైమ్ సెటిల్మెంట్ కింద వాటి క్రమబద్ధీకరణకు అనుమతించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల అభ్యంతరాలను, సూచనలను అప్పట్లో ఏపీ సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు బేఖాతరు చేశారు. ఒకే సామాజికవర్గం వారికే లబ్ధి ఇదిలా ఉంటే... అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చి ప్లాట్లు పొందిన వారిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా లబ్ధి పొందినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదా.. ► చంద్రబాబు తనయుడు, మాజీమంత్రి లోకేశ్ సన్నిహితుడు కొల్లి శివరామ్ 47.39 ఎకరాలను ఈ విధంగానే కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. ► లోకేశ్ మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. ► లోకేశ్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను కారుచౌకగా స్వాధీనం చేసుకున్నారు. -
ఒక్క నోటీసుతో బాబు ప్రాణాలకు వచ్చిన ముప్పేంది?
తాడేపల్లి: ఎన్నెన్నో అక్రమాలు చేసి మీరు దళితుల భూముల్ని కొట్టేశారు.. రాజధాని పేరుతో మీ సొంత వారికి భూములు ఎలా కాజేశారో అందరికీ తెలుసు అని చంద్రబాబుకు అందిన నోటీసులపై విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. నోటీస్ ఇవ్వగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. బినామీల పేరుతో వేలాది ఎకరాలు కాజేశారని, ఆ రోజే మేము జరిగిన అక్రమాలు ప్రశ్నించామని గుర్తుచేశారు. విచారణకు సహకరిస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. మీలా మాకు వ్యవస్థలను మ్యానేజ్ చేయడం రాదని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఒక్క నోటీసుతో చంద్రబాబు ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏముంది అని ప్రశ్నించారు. ఆయన భద్రత విషయంలో కేంద్రం కల్పించుకోవాలి అనడం హాస్యాస్పదమని తెలిపారు. అలిపిరి సంఘటన తర్వాత ఆయన బ్లాక్ క్యాట్ కమాండోలను ఇప్పటికీ ఎలా వాడుకుంటున్నాడో అందరికీ తెలుసుని గుర్తుచేశారు. ఈ పీకే భాష ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ఆయన గడ్డంలో వెంట్రుక పీకడం కాదు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని పీకేసిన విషయం చూసుకో అని హితవు పలికారు. దళితుల భూములను కాజేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సురేశ్ తెలిపారు. విజయవాడ, గుంటూరు ప్రజల్లో తమపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. సొంత అజెండా పేరుతో రైతులను మోసం చేసి కృత్రిమ ఉద్యమం నడిపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి సురేశ్ తెలిపారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అమరావతిలో సూర్యుడి వేడి 10 డిగ్రీలు తగ్గించేందుకు మబ్బుల్లో ఏసీ పెడతా అన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసినట్లు ప్రజలు గమనించారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్క పథకమైనా గుర్తుకు వస్తోందా.. అని ప్రశ్నించారు. ఇప్పటికే మీ పార్టీ మూసుకుపోయిందని తెలిపారు. ప్రజా తీర్పుతో తమ బాధ్యత పెరిగిందని తెలిపారు. కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, సుపరిపాలన, మంచి పాలన అందిస్తామని మంత్రి సురేశ్ వివరించారు. 200 రోజులుగా అమరావతిలో దళిత మహిళలు తమకు సెంటు జాగా కోసం పోరాడుతున్నారని, అవి చంద్రబాబుకు కనబడవా అని ప్రశ్నించారు. -
‘భూస్కామ్ చేసిన బాబుకు నోటీస్ వస్తే తప్పేంటి’
కృష్ణా జిల్లా: అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కామ్లు చేశారని, సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో దళిత వర్గాలను మోసం చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కుదారులైన దళితులను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని చెప్పారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలోఅవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం, దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు: ఆర్కే సీఆర్డీఏ చైర్మన్గా ఉండి చంద్రబాబు, నారాయణ పెద్ద కుట్ర చేశారని.. పక్కా ప్లాన్తో ఎస్సీ, ఎస్టీల భూములు కాజేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల భూములు కొట్టేశారని తెలిపారు. ఇక తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలను భయపెట్టి లాక్కున్నారని చెప్పారు. ప్యాకేజీ రాదు.. భూములు ఇవ్వాల్సిందేనని బలవంతంగా లాక్కున్నారని వివరించారు. శివాయి జమీందార్, లంక భూములు, ప్రభుత్వ, దేవాదాయ భూములను కూడా తన మనుషులకు కట్టబెట్టారని ఆర్కే వివరించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేయించారని ఆరోపించారు. పట్టా భూములను సైతం కారుచౌకగా కొట్టేశారని తెలిపారు. జీవోలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారని, ఐఏఎస్ను తప్పించి చంద్రబాబు సీఆర్డీఏ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. జీవో మీద చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉండవు.. కానీ నోటిఫై ఫైల్స్ మీద మాత్రం చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉన్నాయి అని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు, నారాయణ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. -
టీడీపీ అక్రమాలు.. నివేదిక సిద్ధం
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తయింది. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్.. పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు విచారణ పూర్తిఅయినట్లు సిట్ చైర్మన్ విజయ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా విచారణ కొంతమేర ఆలస్యమైందని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రాగానే నివేదికను అందిస్తామని తెలిపారు. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు అంతా సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ రెవెన్యు డివిజన్ పరిధిలో భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేశామన్నారు. (9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు) ప్రభుత్వ భూములు కేటాయింపులు, రికార్డులు ట్యామ్ పరింగ్, ఎన్ఓసీ జారీ, 22A భూములు అక్రమాలు జరిగాయని వెల్లడించారు. మొత్తం 350 నుంచి 400 ఎకరాల్లో భూములు అక్రమాలు జరినట్లు గుర్తించామన్నారు. 22A నిషేధిత భూములు విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉడా బహిరంగ వేలం వేసి అమ్మిన 10 ఎకరాలు భూమిని 22 A నిషేధిత భూముల్లో చేర్చారని అన్నారు. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. రెవెన్యూ అధికారులు సహకారంతో చాలా అక్రమాలు పాల్పడ్డారని చెప్పారు. 22A భూములు విషయంలో స్పష్టమైన పరిష్కరంతో పాటు సిట్ ద్వారా సూచనలు కూడా చేస్తున్నామన్నారు. (గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు) సిట్ విచారణపై కమిటీ సభ్యురాలు వైవీ అనురాధ మాట్లాడుతూ.. ‘సిట్ దృష్టికి 1340 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ రిపోర్ట్స్ జతచేసి ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదికలో ఇచ్చాము. నిషేధిత భూములు 22 A లో చాలా అక్రమాలు జరిగాయి. 500 పైగా రెవెన్యూ రికార్డులు తారు మారు చేశారు. 300 కు పిటిషన్లు పైగా 22 A నిషేధిత భూములు అక్రమాలు జరిగాయి’ అని అన్నారు. సిట్ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదు ను పరిశీలించాము. సిట్ నివేదికలో అన్ని విషయాలు, సూచనలు పొందు పరిచాము.. - భాస్కరరావు..రిటైర్డ్ జడ్జి.. సిట్ సభ్యులు -
అమరావతి భూ కుంభకోణంలో.. ‘పెద్ద’ తలకాయలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో కీలక వాదనలు వినిపించింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ నెంబర్లతో సహా హైకోర్టు ముందు ఉంచింది. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను కూడా కోర్టుకు సమర్పించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక చాలా పెద్ద తలకాయలున్నాయని, సీఐడీ దర్యాప్తును కొనసాగనివ్వాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించిన అంశాల్లో కీలక వివరాలివీ... బాబు హయాంలో లలిత ఆస్పత్రికి భారీ లబ్ధి లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి యాజమాన్యం వెలగపూడి, తాడికొండ, తక్కెళ్లపాడు గ్రామాల్లో 2014 సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు 26.62 ఎకరాలను కొనుగోలు చేసింది. తమ భూములున్న చోట కోర్ క్యాపిటల్ వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియక భూములు విక్రయించినట్లు అమ్మకందార్లు వాంగ్మూలం ఇచ్చారు. నార్త్ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని, కంచికచర్ల, బలుసుపాడు, లింగాపురం, నవులూరు, బేతంపూడి, మందడం, ధరణికోట, ఉంగుటూరు తదితర గ్రామాల్లో 2014 జూన్ 6 నుంచి డిసెంబర్ 24 వరకు 17.80 ఎకరాలను కొనుగోలు చేశారు. చేకూరి తేజస్వి ఇంట్లో భూ లావాదేవీల డాక్యుమెంట్లు పెద్ద సంఖ్యలో లభించాయి. మనీ లాండరింగ్ దిశగా దర్యాప్తు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరాం. లోకేష్ సన్నిహితుడు రాజేశ్.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ ఫిన్లీజ్లో పనిచేసిన కిలారు రాజేశ్కు లోకేష్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజేశ్ భార్య శ్రీహాస, మరొకరు కంతేరులో 2.64 ఎకరాల భూమిని 2014 ఆగస్టు, సెప్టెంబర్లో కొన్నారు. తాళ్లం మణికొండ అనంత సాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రీ రియల్టర్స్ రాజధాని గ్రామాల్లో 23.60 ఎకరాలను 2014 మార్చి నుంచి నవంబర్ వరకు కొనుగోలు చేసింది. వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నంబూరు, కంతేరు, కాజ గ్రామాల్లో 2014 జూన్ నుంచి నవంబర్ వరకు 12.23 ఎకరాలు కొనుగోలు చేసింది. గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవులూరు, బేతపూడి, ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసింది. చదవండి: సీఎం జగన్పై పిటిషన్లు విచారణార్హం కాదు -
కశ్మీర్ భూ స్కామ్లో మాజీ మంత్రులు!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో రోష్ణి చట్టం అడ్డం పెట్టుకొని అక్రమంగా భూములు కలిగిన మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల జాబితాను జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం బయట పెట్టింది. ఈ జాబితాలో అక్రమంగా భూములు లబ్ధి పొందిన 400 మంది జాబితాలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మాజీ నాయకులు హసీబ్ ద్రాబు, కాంగ్రెస్ నాయకులు కేకే ఆమ్లా, జమ్మూ కశ్మీర్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎంవై ఖాన్ తదితరులు ఉన్నారు. జమ్మూ కశ్మీర్ పరిధిలోని భూ ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2001లో అప్పటి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం ‘జమ్మూ కశ్మీర్ స్టేట్ ల్యాండ్స్ వెస్టింగ్’ పేరిట ఓ చట్టం తీసుకొచ్చింది. ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్ట్ల కోసం అవసరమైన నిధులను సమీకరించడంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకున్న నాటి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆ చట్టాన్ని ‘రోష్ణి’ చట్టంగా పేర్కొంది. ఈ చట్టం దుర్వినియోగం అయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి ఎలాంటి విలువ లేదంటూ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ 2018లో ఈ చట్టాన్ని కొట్టి వేశారు. (చదవండి: రాహుల్ గాంధీ పునరాగమనం!) 2018, జనవరిలో జరిగిన కథువా రేప్ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది అంకుర్ శర్మ ఈ చట్టాన్ని ఎత్తివేయాలంటూ వాదించారు. కశ్మీర్లో ‘జిహాది’ని అంతమొందించాలంటూ ఈ చట్టాన్ని ఎత్తివేయక తప్పదని చెప్పారు. రోష్ణి చట్టం పేరుతో జరిగిన అక్రమ భూ లావాదేవీలపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని అక్టోబర్ 12వ తేదీన జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోష్ణి చట్టం కింద జరిగిన దాదాపు 25 వేల కోట్ల కుంభకోణంలో ప్రతి ఎనిమిది వారాలకోసారి దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని కూడా కోరింది. మాజీ రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్ భల్లా పేరును కూడా ప్రత్యేకించి ప్రస్తావించిన హైకోర్టు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అందరి పేర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ఆ ఆదేశాలను పురస్కరించుకొనే లబ్ధిదారుల పేర్లను సీబీఐ బయట పెట్టింది. వారిలో పీడీపీ నాయకుడు హసీబ్ ద్రాబు ఉన్నారు. ( చదవండి: నితీష్ కుమార్కు ఆర్జేడీ ఆఫర్) తాము మాత్రం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, 1956లో తన తాత, హైకోర్టు జడ్జీ నుంచి అర ఎకరం భూమిని కొనుగోలు చేశారని, దానిపై తాను స్టాంప్ సుంకాన్ని, ప్రభుత్వ ఫీజులను చెల్లించానని హసీబ్ తెలిపారు. తన తాత చనిపోయిన అనంతరం ఆ భూమి 2006–8 మధ్యకాలంలో తన తండ్రికి సంక్రమించిందని, రోష్ణి చట్టం వచ్చినప్పుడు తాను పదవిలో లేనని, ఆ చట్టం కింద లీజులో ఉన్న భూమికి కాస్తా యాజమాన్య హక్కులు వచ్చాయని ఆయన వివరించారు. , -
విశాఖ భూ కుంభకోణం: సిట్ విచారణ ప్రారంభం
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణాలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ మళ్లీ మొదలైంది. కరోనా వల్ల ఈ ఏడాది మార్చి నెల నుంచి విచారణ నిలిచిపోయింది. ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సిట్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ శనివారం విశాఖ చేరుకుని కమిటీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో చైర్మన్ విజయకుమార్, సభ్యులు వై.వి.అనురాధ, భాస్కరరావు సమావేశమై దర్యాప్తుఫై చర్చించారు. కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సిట్ వద్ద పనిచేసిన ఉప కలెక్టర్ శేష శైలజ, తహసీల్దార్ తిరుమలరావుకు ఇటీవల బదిలీ అయ్యింది. వారి స్థానంలో సిట్కు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సిట్ దృష్టికి 1400ల దరఖాస్తులు గత ఏడాది అక్టోబర్లో సిట్ను ప్రభుత్వం నియమించింది. అనంతరం నవంబర్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు సిట్ బృందం సిరిపురం వుడా ఆడిటోరియంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1400ల దరఖాస్తులురాగా ఇప్పటి వరకు 400లు ఫిర్యాదులకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. ఇంకా 1000 దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. రెండు, మూడు నెలల్లో వీటి విచారణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో సిట్ బృందం పనిచేస్తోంది. ఎన్వోసీలు, భూ స్థితి మార్పు, రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం... తదితర అంశాలపై విచారిస్తున్నారు. 13 మండలాల్లో భూ కుంభకోణాలు జిల్లాలోని 13 మండలాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణాలు జరిగినట్టుగా సిట్ బృందం గుర్తించింది. విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, నగర పరిధిలోని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మధార, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల్లో భూ కుంభకోణాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు చేయడం, ట్యాంపరింగ్, వెబ్ల్యాండ్లో పేర్లు మార్పు చేయడం, అక్రమంగా ఎన్వోసీలు జారీ చేయడం, భూ సర్వే నెంబర్లు దిద్దడం, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, జిరాయితీ భూముల్లో పెద్దల పేర్లు చేర్చడం, తాత ముత్తాతల నుంచి భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే పేర్లు మార్పు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్వోసీలు కూడా ఇబ్బడిముబ్బడిగా జారీ చేసేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఎక్స్సరీ్వసెమెన్లకు చెందిన భూములను ఇతరులకు ఇచ్చే విషయంలోనూ ఎన్వోసీలు ఇష్టారాజ్యంగా జారీ చేసేశారు. వీటిని కూడా సిట్ పరిశీలించనుంది. సమగ్రంగా దర్యాప్తు చేపట్టి నివేదిక సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. -
న్యాయవాదికి ఏపీ హైకోర్టు ఆదేశాలు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ను సవాలు చేస్తూ అడ్వకేట్ మమత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని మాజీ అడ్వకేట్ జనరల్తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.(చదవండి: హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి) కాగా, రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. -
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అడ్వొకేట్ ఆన్ రికార్డ్ మహఫూజ్ నజ్కీ ఈ పిటిషన్ వేశారు. తనను అరెస్టు చెయ్యొద్దని దమ్మాలపాటి ఒక్కరే పిటిషన్ దాఖలు చేస్తే.. హైకోర్టు మాత్రం ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్న మిగిలిన 12 మందిని కూడా అరెస్టు చెయ్యొద్దని ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను సవాలు చేయకపోయినా హైకోర్టు స్టే ఇచ్చింది దమ్మాలపాటి శ్రీనివాస్ 14వ తేదీనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అమరావతి భూ కుంభకోణంలో తనను అరెస్టుచేసే అవకాశం ఉందని.. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 15వ తేదీ ఉ.9 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదుతో దమ్మాలపాటి రిట్ పిటిషన్ నిరర్థకమైంది. అయితే, హైకోర్టు మాత్రం, ఆ రిట్ నిరర్థకమైనప్పటికీ.. ఏసీబీ ఎఫ్ఐఆర్ను ఆయన సవాలు చేయకపోయినప్పటికీ ఆయన పిటిషన్ను విచారించి, ఆయన కోరిన ఉత్తర్వులన్నింటినీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు స్టే ఇచ్చి ఎఫ్ఐఆర్ వివరాలపై గ్యాగ్ ఉత్తర్వులు సైతం జారీచేసింది. ఎఫ్ఐఆర్ను పట్టించుకోండా హైకోర్టు ఏకపక్ష ఉత్తర్వులు రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కొనుగోళ్ల విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్గా తన పదవిని దుర్వినియోగం చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని తనతో పాటు తన బంధువులు, సన్నిహితులు భూ కొనుగోళ్లు చేసి లబ్ధి పొందారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారన్నది దమ్మాలపాటి ఆరోపణ. వాస్తవానికి ఇది శుద్ధ తప్పు. ఒకవేళ ఇందులో నిజం ఉందని అనుకున్నా కూడా.. న్యాయస్థానం ఏసీబీ దర్యాప్తును నిలిపేయడానికి వీల్లేదు. హైకోర్టు కనీసం ఎఫ్ఐఆర్లోని అంశాలను ప్రస్తావించకుండా పూర్తి ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చి పెద్ద తప్పు చేసింది. ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్ను తోసిపుచ్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో చెప్పింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయవచ్చు. దర్యాప్తు పూర్తయ్యే వరకు జోక్యం కుదరదని “సుప్రీం’ చెప్పింది ఇక దర్యాప్తు అన్నది దర్యాప్తు సంస్థల పరిధిలోని వ్యవహారమని.. అది పూర్తయ్యేంత వరకు న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. అయినప్పటికీ.. హైకోర్టు మాత్రం దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడమే కాక, ఆయన కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు వాదన వినిపించే హక్కేలేదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. సీఆర్పీసీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అయినా కూడా హైకోర్టు, అటు సీఆర్పీసీకి, ఇటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. దమ్మాలపాటి పిటిషన్ను కొట్టేయాల్సి ఉన్నా.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారన్న ఆందోళనతో దమ్మాలపాటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. దానిని ప్రాథమిక దశలోనే కొట్టేయాలి. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా హైకోర్టు దానిని విచారించడమే కాక అతను కోరిన మేర ఉత్తర్వులిచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే దర్యాప్తును ఆపేయాలన్న ఉద్దేశంతో దమ్మాలపాటి ఆ పిటిషన్ను దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసే ముందు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను పూర్తిగా విస్మరించింది. ఉ. 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేరోజు సాయంత్రంకల్లా హైకోర్టు స్టే ఇచ్చేసింది. స్టేవల్ల సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది ఏసీబీ నమోదు చేసింది ఓ భారీ భూ కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీల కుమార్తెలతో పాటు ఇతర నిందితుల పాత్ర గురించి ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అడ్వొకేట్ జనరల్గా ఉన్న సమయంలో దమ్మాలపాటి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అందులో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదైన దశలో హైకోర్టు స్టే ఇవ్వడంవల్ల, నిందితులు సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది. అలాగే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇది దర్యాప్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందువల్ల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టం దృష్టిలో చెల్లవు. బినామీలు, బంధువులు, సన్నిహితుల పేర్ల మీద భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారన్న విషయాన్ని హైకోర్టు కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సీనియర్ న్యాయవాదికి చట్టంలో ఎలాంటి రక్షణలేదు దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ అయినంత మాత్రాన, ఏ చట్టం కూడా అతనికి రక్షణ కల్పించడంలేదు. న్యాయవాదిపై కేసు నమోదు చేయకూడదని న్యాయవాదుల చట్టంలో ఎలాంటి నిబంధనలేదు. సీనియర్ న్యాయవాదిగా దమ్మాలపాటి శ్రీనివాస్ ఎలాంటి రక్షణ కోరజాలరు. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా అతను కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలి. ఈ వ్యవహారంలో కొన్ని మౌలిక ప్రశ్నలు.. – ఎఫ్ఐఆర్ను సవాలు చేయకపోయినప్పటికీ, దర్యాప్తును నిలుపుదల చెయ్యొచ్చా? – దర్యాప్తు మొదలైన ప్రాథమిక దశలోనే రొటీన్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ను నిలుపుదల చెయ్యొచ్చా? – అసలు దర్యాప్తును నిలిపేస్తూ రొటీన్ పద్ధతిలో స్టే జారీచేయడానికి వీలుందా? – సీఆర్పీసీ ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే నిందితులకు వాదనలు వినిపించే హక్కు ఉందా? – దర్యాప్తు సంస్థ పరిధిలో ఉండే దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరైన చర్యేనా? – ఎఫ్ఐఆర్లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు, దర్యాప్తు ప్రక్రియను నిలిపేయవచ్చా? – హైకోర్టును ఆశ్రయించని నిందితుల విషయంలో కూడా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వొచ్చా? – నేరానికి పాల్పడిన న్యాయవాదిపై కేసు నమోదు చేయకుండా న్యాయవాదుల చట్టం కింద రక్షణ ఉందా? -
తవ్వేకొద్దీ అక్రమాలు!
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూమి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ దందాలో అప్పటి తహసీల్దార్, ప్రస్తుతం సస్పెండైన కామారెడ్డి ఆర్డీఓ నరేందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అసైన్డ్, సీలింగ్ భూములతో పాటు వివాదాస్పద భూముల్లో కూడా ఆయన జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖాజీపల్లిలో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారని సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. అప్పటి జిన్నారం తహసీల్దార్, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, మరొక అధికారిని సస్పెండ్ చేసింది. అలాగే.. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 2012–13లో నరేందర్ జిన్నారం తహసీల్దార్గా ఉన్న సమయంలో అన్నారంలోని 261 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములను కూడా పట్టాలుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాదారంలోని అసైన్డ్ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పట్టాగా మార్చినట్లు సమాచారం. అలాగే.. కొర్లకుంట గ్రామంలోని 35 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు రికార్డులు తారుమారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాజీపల్లిలోని 180 సర్వే నంబర్లో సీలింగ్ భూమిని ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ తహసీల్దార్గా ఉన్న సమయంలో జరిగిన స్థలాల మార్పిడి, ఇతర రెవెన్యూపరమైన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మాజీ సైనికులకు నోటీసులు! అసైన్డ్ భూ దందాలో భాగస్వాములైన మాజీ సైనికులు తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగ నాయకులు, ఎం.మధుసూదన్, ఎన్.గంగాధర్ రావులకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఖాజీపల్లిలోని 180 సర్వేనంబరు అసైన్డ్ భూమిని మీకు ఏ సంవత్సరంలో అప్పగించారు, ఎప్పటి నుంచి రికార్డులలో మీ పేరుంది? వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇవ్వడానికి అర్హత ఉందా..? ఈ భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత ఉంది..? చనిపోయిన తహసీల్దార్ సంతకంతో మీకు పట్టాలు ఎవరిచ్చారు..? తదితర ప్రశ్నలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. నోటీసులకు సరైన, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈ భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. కొల్చారం తహసీల్దార్కూ లింకు! కొల్చారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రస్తుత కొల్చారం తహసీల్దార్ పాత్ర ఉందని తేలింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన.. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అప్పట్లో సహదేవ్ జిన్నారం తహసీల్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేశారు. భూ దందాల్లో కూడా సహదేవ్ పాత్ర ఉందని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్కు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. కాగా, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సర్వే నంబర్ 297లో గల 0.13 గుంటల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో సహదేవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. -
అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ లోక్సభా పక్షనేత పీవీ మిథున్రెడ్డి కేంద్రాన్ని కోరారు. కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు దానిపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందన్నారు. అంతేకాకుండా సదరు వ్యవహారం మీడియాలో రాకుండా ‘నిషేధిత’ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఇందులో ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకేలా ఉండాలన్నారు. లోక్సభ జీరో అవర్లో బుధవారం ఈ అంశంపై మిథున్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని ఏర్పాటులో నాలుగు వేల ఎకరాల భారీ భూకుంభకోణం జరిగింది. ఆ భూముల విలువ రూ.లక్షల నుంచి ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. ► అప్పటి సీఎం రాజధాని తిరువూరులో, ఇతర ప్రాంతాల్లో వస్తుందని అధికారికంగా ప్రకటించి.. తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేశారు. ఇది అధికారిక రహస్యాల్ని స్వప్రయోజనాలకు వాడుకోవడమే. ► ఇదొక భారీ కుంభకోణం. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు, తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లు కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొన్నారంటేనే వాళ్లు బినామీలని అర్థమవుతోంది. ► దేశం చూసిన అతిపెద్ద స్కాముల్లో ఇదొకటి. అందువల్ల సీబీఐ దర్యాప్తు జరపాలని ఇప్పటికే మా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ► అలాగే ఫైబర్గ్రిడ్ నెట్వర్క్లో కూడా రూ.2 వేల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయి. దీనిపైనా, అంతర్వేది రథం దగ్ధం ఘటనపైన కూడా దర్యాప్తు జరపాలి. -
కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం రాత్రి ఇచ్చిన ఆదేశాలు ఇదివరకెన్నడూ చూడనివని, ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించిందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి ఆదేశాల ద్వారా న్యాయస్థానం కొత్త సంప్రదాయానికి తెరతీసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలివీ.. ► ఈ ఆర్డర్ చూశాక పెద్దలకైతే ఒక తీర్పు, మరొకరికైతే ఇంకొక రకమైన తీర్పు అన్నట్లుగా ఉంది. సాధారణంగా ప్రభుత్వం మీడియాకు సంకెళ్లు వేయాలని, వ్యతిరేకంగా చట్టాలు చేయాలని చూస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మీడియా హక్కుల పరిరక్షణకు అండగా నిలబడతాయి. ► కానీ తాజా హైకోర్టు తీర్పు ద్వారా పరిస్థితి ఒక్క సారిగా మారింది. ఇదో కొత్త పోకడ అని అర్థమైంది. ఈ కుంభకోణం విచారణలో న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అమరావతిలో భూములు కొన్నారని ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు 12 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ► దీంతో దేశంలో అత్యంత పలుకుబడి గల శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యాయి. ఇక్కడ మేం కోర్టులను ఏమీ అనడం లేదు. ఒక కుంభకోణంపై ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదు అయితే.. అందులో కొందరు నిందితులుగా ఉన్నంత మాత్రాన ఆ శక్తులన్నీ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కదిలాయో అర్థం కావటం లేదు. ► ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించే అంశం కాదు. ఎవరి వ్యక్తిత్వాన్నీ హననం చేసే పరిస్థితీ లేదు. అప్పటికప్పుడు శిక్షలు పడవు. ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు అయింది. సహజంగా ఇలాంటి విషయాల్లో సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలే ఇంతవరకూ చూశాం. ఆధారాలతోనే కేసు నమోదు ► ఈ కేసులో అమరావతి రాజధాని ప్రాంతంలో అప్పట్లో పలుకుబడి గల కొందరు వ్యక్తులు భూములు కొన్నారని ఆధారాలుండటంతో స్వంతంత్ర సంస్థ అయిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సిట్ దానికి ఆధారం. దీనివల్ల ఎవరి ప్రతిష్టకూ భంగం కలుగక పోయినా ఆగమేఘాల మీద మంగళవారం రాత్రి 9.10 గంటలకు దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ► ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తులు, దాన్లోని అంశాలు మీడియా, సోషల్ మీడియాలో రాకూడదని ఆదేశాలిచ్చింది. దీన్నో విశేషంగా, కొత్త సంప్రదాయంగా మా పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఎవరికో ఏదో చురుక్కుమనిపించిందనిపిస్తోంది. దాంతో పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యుడికి ఒక న్యాయం ఉంటుందని అనుమానం వచ్చేట్లుగా వ్యవహరించారని భావిస్తున్నాం. ► ఇలాంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థకున్న నిష్పాక్షికతపై నమ్మకం సడలితే.. దానికి ఆ వ్యవస్థే బాధ్యత వహించాలి తప్ప ఇతరులను నిందించలేం. ఈ తీర్పుపై జాతీయ మీడియా సీనియర్ జర్నలిస్టులు, మేధావులు రాజ్ దీప్ సర్దేశాయ్.. సిద్ధార్థ వరదరాజన్, న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ ఘాటుగా స్పందించారు. మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి ► ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే, దర్యాప్తు జరగకుండా స్టే ఇవ్వడం అంటే విజ్ఞులు, మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణలో ఏ మాత్రం తొందర లేదు. ఇది కక్ష సాధింపా.. కాదా అని తేల్చాల్సి ఉండగా.. మసిపూసి, మారేడు కాయ చేసి, నిందితులుగా ఉన్న వారిని తప్పించాలని చూడటం అంటే దొంగలకు రక్షణ ఇవ్వడం వంటిదే. ► ఇది కక్ష సాధింపా? లేదా? అనేది సీబీఐ విచారణలో తేలాలి. అలా కాకుండా కక్ష సాధింపు అని వాదిస్తున్న వారిని రక్షించడమంటే ఇంకేముంది? ఒక దొంగతనాన్ని ఫలానా వ్యక్తే చేశాడనే అనుమానం ఉన్నప్పుడు అనుమానితుడే కోర్టుకు వచ్చి నాపై కోపంతో కేసు పెట్టారు కనుక చెల్లదని అంటే ఎలా ఉంటుంది? ► అసలు తప్పు జరిగిందా, లేదా అన్నది తేల్చాలి కదా! కోర్టులు ప్రీమెడిటేటెడ్కు (ముందుగానే ఒక అభిప్రాయానికి) రాకూడదు. ► దమ్మాలపాటి ఒక అడ్వకేట్, అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తర్వాత అడిషనల్ ఏజీ అయి, తర్వాత ఏజీ అయ్యారు. ఆయన కోర్టును కదిలించడమేంటి? సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దమ్మాలపాటి గంటకు లక్షల్లో.. రోజుకు కోట్లల్లో ఫీజులు తీసుకునే ముకుల్ రోహిత్గీ లాంటి న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగాడు? వాళ్లేమైనా ఉచితంగా చేస్తున్నారేమో... మాకైతే తెలియదు. అసలు దర్యాప్తే వద్దా? ► టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ కుంభకోణంపై ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ కమిటీల రెండు జీవోలను రద్దు చేయాలని రిట్ వేస్తే హైకోర్టు స్టే ఇచ్చేసింది. ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్లో దీనిపై సీబీఐ విచారణను అడిగాం. వాళ్లను కూడా ప్రతివాదులుగా చేర్చండి అని అడిగితే దానిని మాత్రం డిస్మిస్ చేశారు. దీనిపై అసలు దర్యాప్తే వద్దంటారా? ► మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తులపై బుధవారం తీర్పు రానున్నట్లు కోర్టు మంగళవారం రాత్రి 7.30–8.00 గంటలప్పుడు కాజ్ లిస్టులో పెట్టింది. అప్పుడే అందరికీ తెలిసింది. కానీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే ప్రెస్మీట్ పెట్టి ఈ విషయం ఎలా చెప్పగలిగారు? ► అసలు న్యాయస్థానాలున్నది ఎవరి ప్రయోజనాల కోసం? హక్కులు హరించి, న్యాయానికి అవకాశం లేని అశక్తులపై దౌర్జన్యం చేసినప్పుడు హైకోర్టు ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది కానీ ఇలా జరిగితే ఎలా? మీడియా నోరు కట్టేస్తారా? ► మీడియాకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం అంటే.. మాట్లాడకుండా నోరు కట్టేయడం, నోరు బిగించడం. ఇది ఓవర్ రియాక్షన్లా అనిపిస్తుంది. ► దమ్మాలపాటి శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు ఉన్నారు కనుక ఇందులో ముందుకు వెళ్లకూడదని వీళ్లు హైకోర్టును అడిగారట. వారు ఏమైనా చేసి ఉంటే వాటిని ప్రశ్నించ కూడదా? ఇన్ సైడర్ ట్రేడింగ్ స్పష్టం ► 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అమరావతి రాజధాని అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో మేం ఆ విషయం చెప్పాం. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం అని కూడా చెప్పాం. దానిమీదే ప్రజలు తీర్పు ఇచ్చారు. ► ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే, ఆ తప్పుల మీద, వారు చేసిన అక్రమాల మీద విచారించే హక్కు ఉంటుంది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదైంది. పెద్దోళ్లుంటే వదిలేయాలా? ► సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు, మాజీ అడ్వొకేట్ జనరల్.. వీళ్లంతా ఉన్నారు కాబట్టి.. వాళ్లను రక్షించాలి. దీని దారం పట్టుకుని లాగితే చివరకు చంద్రబాబు దగ్గరకు వెళుతుంది. ఇందులో ఎవరైతే తప్పులు చేశారో.. ఆ శక్తులు విజయం సాధిస్తున్నాయనే అనుమానం కలుగుతోంది. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టం. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం. ► హైకోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకుంటే.. ఇక ఎవరూ అమరావతిపై నోరు ఎత్తటానికి వీల్లేదు. గ్యాగింగ్ చాలా తీవ్రమైన విషయం. గ్యాగింగ్ మీడియా, గ్యాగింగ్ సిస్టమ్, గ్యాగింగ్ ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ లెజిస్లేచర్, గ్యాగింగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్.. వీటన్నింటిపై విజ్ఞులైన ప్రజలు, మేధావులు, న్యాయ కోవిదులు మాట్లాడాలి. ► అసలు ఇన్ని కేసులు.. ఇన్ని ఎంక్వైరీలు ఎందుకు? జగన్ తనపై కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారని చంద్రబాబు అంటే ఇక అంతా అయిపోయినట్టేనా.. కోర్టు డైరెక్షన్ ఇస్తుందా! ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు.. వీళ్లపై కక్ష కట్టామని ఒక పత్రికలో ఇవాళ రాశారు. దమ్మాలపాటి శ్రీనివాస్తో కలిపి రాసినందుకు నిజానికి వాళ్లంతా బాధపడిపోయి ఉంటారు. ► గతంలో జగన్పై కేసులు వేసినప్పుడు.. తప్పేముంది.. దర్యాప్తు జరుగుతుంది. కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు.. అంటూ న్యాయమూర్తులు మాట్లాడారు. అంటే మీకే గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు ఉన్నాయా? జగన్కు గౌరవ మర్యాదలు అప్పుడు లేవా? దేవాలయాల్లో వరుస ఘటనలు.. చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడనే గట్టి అనుమానం ఉంది. -
గత ప్రభుత్వ విధానాలను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి కథనాలు ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని పేర్కొన్న హైకోర్టు బుధవారం మరో ఉత్తర్వులను వెలువరించింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం, ప్రత్యేక దర్యాప్తుబృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. అలాంటి కారణాలు కనిపించడం లేదు... కొన్ని పరిమిత సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించగలదని, తమ ముందున్న ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం అలాంటి సందర్భం ఏదీ ఉత్పన్నం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాలను ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా అనుసరించాలని, బలమైన, నిర్థిష్ట కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ దారి నుంచి పక్కకు తొలగవచ్చని, అలాంటి కారణాలు ప్రస్తుత కేసులో స్పష్టంగా కనిపించడం లేదని పేర్కొంది. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించాలంటే అందుకు శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, ప్రభుత్వ స్వతఃసిద్ద అధికారం కాదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే విషయంలో ఈ రోజు వరకు ఏ శాసనం కూడా అలాంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదంది. విధానపరమైన లోపాలున్నాయి.. ఎలాంటి అధికారం లేకుండా, ఏకపక్షంగా, అహేతుకంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు కన్నా ముందు దర్యాప్తు చేయడం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటునకు అభ్యర్థన లాంటి విధివిధానాలపరమైన లోపాలున్నాయంది. స్వతఃసిద్ధ వివక్ష, రాష్ట్ర ప్రభుత్వమే ఫిర్యాదుదారు, దర్యాప్తుదారు అన్న దురభిప్రాయాన్ని కలిగించడం, అపరిమిత సమీక్షాధికారం లాంటి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించుకునేందుకు తగిన ఆధారాలు లేవంది. తగినంత సమయం తీసుకున్నా కూడా ఆరోపిత నేరాలకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి లేదని తెలిపింది. పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్ వేశానన్న వర్ల... – గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, ఉప సంఘం నివేదిక ఆధారంగా అక్రమాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనుబంధ పిటిషన్లు వేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు వర్ల రామయ్య స్వయంగా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రభావితమైన వ్యక్తులే దాఖలు చేస్తారు.. – ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తులే సాధారణంగా రిట్ పిటిషన్లు దాఖలు చేస్తారు. నేరుగా ప్రభావితం కాని వ్యక్తులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారణార్హత లేదని న్యాయస్థానాలు ప్రాథమిక స్థాయిలో తిరస్కరిస్తాయి. ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసుకోవాలని సూచిస్తాయి. అయితే వర్ల, ఆలపాటి రిట్ పిటిషన్లపై ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. బాబు బృందం అక్రమాలను నివేదించిన ప్రభుత్వం – విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అమరాతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలను సైతం కోర్టుకు సమర్పించింది.వీటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాసిన లేఖను కూడా కోర్టు ముందుంచింది. ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో న్యాయస్థానానికి నివేదించింది. అమరావతి భూ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఈసీఐఆర్ (పోలీసు ఎఫ్ఐఆర్ లాంటిది) నమోదు చేసిందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలని అనుబంధ పిటిషన్లో అభ్యర్థించింది. అయితే వీటిని తోసిపుచ్చుతూ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటిపై స్టే ఉత్తర్వులు ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
హక్కుల కాలరాతే!
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరసలో ఉన్న ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోంది? – వినోద్ కె.జోస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ద కారవాన్ సాక్షి, అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు మొత్తం 13మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ కేసులో హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, పాత్రికేయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కుండబద్దలు కొట్టారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొంటూనే.. ఈ ఉత్తర్వులు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో దేశంలోనే ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్తోపాటు జాతీయ స్థాయి ప్రముఖ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయి, రాహుల్ శివశంకర్, సిద్ధార్థ్ వరదరాజన్, ఉమా సుధీర్, శ్రీరాం కర్రి, ధన్యా రాజేంద్రన్ తదితరులు ఉన్నారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి. ఆశ్చర్యం.. మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులా? ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సై డర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని కేసు నమోదైంది. దాంతో ఆ మాజీ అడ్వకేట్ జనరల్ ఆ విషయాన్ని మీడియా ప్రచురించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్చర్యం.. హైకోర్టు ఆ పిటీషన్ విచారించింది. మరింత ఆశ్చర్యం.. వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. వాళ్లు మీడియాను నియంత్రిస్తారా? – ధన్యా రాజేంద్రన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద న్యూస్ మినిట్ అసాధారణ తీర్పు ఈ తీర్పు అసాధారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అసాధారణం. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, బలవంతులు అన్నింటి నుంచి బయట పడతారు. – రాహుల్ శివశంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్, టైమ్స్ గ్రూప్ ఈ ఉత్తర్వులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయేమో న్యాయస్థానం ఉత్తర్వులను పాటించాల్సిందే. కానీ ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తి కుమార్తెలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రచురించొద్దన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయోనన్నది విస్మయ పరుస్తోంది. – ఉమా సుధీర్, ఎన్డీటీవీ ప్రజల్లో సందేహాలకు తావిచ్చేట్టుగా ఉంది దేశంలో న్యాయ వ్యవస్థలోని ప్రముఖుల బంధువులపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదని ఏపీ హైకోర్టు ఉత్వర్వులు ఇవ్వడం సాధారణ ప్రజలకు పలు సందేహాలు కలిగేందుకు అవకాశం ఇస్తోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభమైన మీడియా హక్కులను కాలరాసేట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛపై ఉన్నత న్యాయ వ్యవస్థ ఆంక్షలు విధించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలహీన పరుస్తుంది. ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులను పునఃసమీక్షించాల్సిందిగా కోరుతున్నాం.– కె.శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించనున్నా రన్నది ముందే తెలుసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన ఆరోపణలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వివరాలను మీడియా ప్రచురించొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు. – సునీల్జైన్, మేనేజింగ్ ఎడిటర్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి.– ప్రముఖ వార్తా సంస్థ ‘ద వైర్’ కథనం ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టిన వారే అధికారం చలాయిస్తున్నారు ఏపీ భూ కుంభకోణాల ఎఫ్ఐఆర్కు నివాళి. ఈ ఎఫ్ఐఆర్ కొద్ది సేపే జీవించినా సరే ఉపయుక్తకరంగా జీవించింది. రోజూ వేలాది ఎఫ్ఐఆర్లు నమోదు అవుతాయి. కానీ ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టేశారు. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపై ఎప్పుడు ఎలా దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తున్న వారే భారతదేశంలో అసలైన అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. – సిద్ధార్థ్ వరద రాజన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద వైర్ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదనే ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? కోర్టులంటే గౌరవం ఉంది. కానీ మీడియాపై ఆంక్షలు విధిస్తే ఎలా? అలా అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చేసిన అవినీతిపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన చర్యలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం ఏముంది? – శ్రీరాం కర్రి, రెసిడెంట్ ఎడిటర్, దక్కన్ క్రానికల్ హైకోర్టు ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అడ్వొకేట్ జనరల్, ఇతర ముఖ్య వ్యక్తులపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాస్తవాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయకుండా హైకోర్టు జారీచేసిన ‘నిషేధిత’ ఉత్తర్వు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19కు, సమాచార హక్కు చట్టానికి విరుద్ధం. హైకోర్టు ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేయడమే. ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం కూడా. ఇది రూమర్లకు దారి తీస్తుంది. – ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అయితే ప్రచురించకూడదా? సామాన్యులపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎక్కడలేని హడావుడి చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడొచ్చు. అదే ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదైతే మాత్రం వాటిని మీడియా ప్రచురించకూడదని ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది.– రాజ్దీప్ సర్దేశాయి, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్ -
అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆపండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కుమార్తెలిద్దరితో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను హైకోర్టు నిలిపేసింది. అంతేకాక ఈ కేసులో ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను ఆదేశించింది. ఈ విషయాన్ని ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫాంలకు తెలియచేయాలని డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల కాపీ అందుకున్న తర్వాత ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని డీజీపీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిలను ఆదేశించింది. పలు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నోటీసుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దమ్మాలపాటి ఒక్కరే పిటిషన్ దాఖలు చేసి, తన గురించి మాత్రమే అభ్యర్థన చేసినప్పటికీ, న్యాయస్థానం నిందితులందరిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రమేశ్.. – భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. – ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, నిర్భంధించకుండా, తనపై ఇతర కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగే దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షణలోనే కొనసాగించాలని పోలీసులను ఆదేశించాలన్నారు. – హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా తనపై మరో దర్యాప్తు, విచారణ చేపట్టకుండా ఆదేశించాలని కోరారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలోనైనా దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. – ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ దొనాడి రమేశ్ ముందు విచారణకు వచ్చింది. కేసుల విచారణ ప్రారంభించడానికి ముందే జస్టిస్ రమేశ్.. ఈ కేసును తాను విననని, మరో బెంచ్కి పంపాలని, నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైల్ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎందుకు తాను ఈ కేసును వినదలచుకోలేదో జస్టిస్ రమేశ్ కారణం చెప్పలేదు. రేపు విచారిస్తామన్న సీజే.. సాయంత్రం కల్లా అనుబంధ పిటిషన్.. – సీజే జస్టిస్ మహేశ్వరి కేసుల విచారణకు సిద్ధమవుతుండగా, దమ్మాలపాటి తరఫు న్యాయవాది ప్రణతీ, తమ పిటిషన్ గురించి, జస్టిస్ రమేశ్ కేసు నుంచి తప్పుకున్న అంశం గురించి సీజే దష్టికి తీసుకొచ్చారు. అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే సీజే మహేశ్వరి ఈ వ్యాజ్యంపై రేపు (బుధవారం) విచారణ జరుపుతామని మౌఖికంగా స్పష్టం చేశారు. – ఇదిలా ఉండగానే, సాయంత్రం దమ్మాలపాటి ఓ అనుబంధ పిటిషన్ను అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రావడం వల్ల తమ పరువుపోతోందని, అందువల్ల ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా వాటిని నియంత్రించాలని ఆ అనుబంధ పిటిషన్లో కోర్టును కోరారు. – ఈ అనుబంధ పిటిషన్ గురించి సాయంత్రం 5.45 గంటలకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్కు తెలియచేశారు. ఈలోపు హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సీజే ముందు ఉంచడం, ఆయన దమ్మాలపాటి సోమవారం దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా తెప్పించుకుని పరిశీలించడం, ఈ రెండింటినీ కలిపి తానే వినాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. సాయంత్రం 6.30 గంటలకు విచారణ మొదలైంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు.. – దమ్మాలపాటి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, శ్యాం దివాన్లు రాగా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ శ్రీరామ్, ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, సీఐడీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్లు వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు సాగాయి. – ముందుగా రోహత్గీ, దివాన్లు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్పై ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. తమకు వ్యతిరేకంగా కేసులు వాదించారన్న కక్షతో న్యాయవాది అయిన దమ్మాలపాటి శ్రీనివాస్పై కేసులు పెట్టారని తెలిపారు. – ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వార్తలు పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో రావడం వల్ల పిటిషనర్ పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుందన్నారు. అందువల్ల వాటిని నియంత్రిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున, ప్రధాన పిటిషన్పై ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. అయితే పిటిషనర్పై కఠిన చర్యలేవీ తీసుకోకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కొత్తగా ఆయన పరువు పోవడానికి ఏమీ లేదు.. – అనంతరం ఏసీబీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్పై ఉదయం నుంచి అన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఆయన పరువు పొయ్యేదేమీ లేదన్నారు. పోవడానికి ఏమీ మిగల్లేదని వివరించారు. అందువల్ల మీడియాను నియంత్రించాలన్న పిటిషన్ నిరర్థకమన్నారు. – మీడియా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నప్పుడే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి తప్ప, వ్యక్తులు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేసినప్పుడు మీడియాను నియంత్రిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వివరించారు. – పిటిషనర్ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించబోమని, సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేస్తామని కోర్టుకు నివేదించారు. సీఐడీ తరఫున ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, 1950 నుంచి ఎంతో మంది ఏజీలు వచ్చారు.. పోయారని, వారిలో ఎవరిపై కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదని కోర్టుకు నివేదించారు. కేసు నమోదు చేయడం దురుద్దేశం ఎలా అవుతుందన్నారు. సీఎంను ప్రతివాదిగా చేయడం ఫ్యాషనైపోయింది.. – ఏజీ శ్రీరామ్ వాదిస్తూ, ప్రతీ కేసులో ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేయడం ఫ్యాషన్గా మారిపోయిందన్నారు. ఈ కేసులో కూడా ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం దారుణమని వివరించారు. – గాలి వార్తలు, వాళ్లూ వీళ్లూ చెప్పుకునే మాటల ఆధారంగా ముఖ్యమంత్రిపై నిందారోపణలు చేస్తూ ప్రతివాదిగా చేస్తున్నారని, ఈ కేసులో కూడా పిటిషనర్ అలానే చేశారని కోర్టుకు నివేదించారు. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేన్నారు. – ఈ సమయంలో సీజే స్పందిస్తూ, ముఖ్యమంత్రికి తాము ఎలాంటి నోటీసు ఇవ్వడం లేదన్నారు. అందరి వాదనలు విన్న సీజే, గంటన్నర తర్వాత ఉత్తర్వులు వెలువరించారు. ఏసీబీ కేసులో దర్యాప్తును నిలిపేశారు. నిందితులెవ్వరిపై కఠిన చర్యలొద్దని ఆదేశించారు. -
సీఆర్డీఏ భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు
అమరావతి : సీఆర్డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వెల్లడవడంతో ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ కోరేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సంసిద్ధమయ్యారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో కూడా అంతులేని అవినీతి చోటుచేసుకుందని తెలియడంతో ఈ బాగోతంపైనా సీబీఐ దర్యాప్తు కోరాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ రెండు కుంభకోణాలపై గతంలోనే వైఎస్సార్సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా, నెలల తరబడి కేంద్రం పెండింగ్లో పెట్టడంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిపై గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం గతంలో రాజధాని పరిధిలో చోటుచేసుకున్న భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కామ్ సాధారాణ కుంభకోణాలు కావని, చంద్రబాబుకు సన్నిహితులైన వారు ఎందరో వాటి వెనక ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు విస్పష్టంగా పేర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేపడితే ఈ కుంభకోణాల వెనుక పెద్దల హస్తం బయటపడుతుందని నిజానిజాలు వెలుగుచూస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీలు భావిస్తున్నట్టు తెలిసింది. ఉన్నతస్ధాయి విచారణతోనే చంద్రబాబు బాగోతం వెలుగుచూస్తుందని వారు చెబుతున్నారు. -
రాజధాని భూ కుంభకోణం: కీలక అరెస్టులు
-
రాజధాని భూ కుంభకోణం: ఇద్దరికి రిమాండ్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను సీఐడీ బుధవారం అరెస్టు చేసింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన సురేశ్.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. అదే విధంగా భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబును కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో సురేశ్, సుధీర్ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన సుధీర్ బాబు.. టీడీపీ నాయకులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా అమరావతి ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్) -
బయటపడ్డ రేవంత్రెడ్డి అక్రమాలు: క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తయింది. గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 127లో రేవంత్రెడ్డి, కొండల్ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్లు, కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీనితో పాటు సర్వే నెంబర్ 127లనే 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్టు గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పూర్తి నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంగళవారం సమర్పించారు. ఆర్డీవో నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకునట్లు నివేదికలో పేర్కొన్నారు. (రేవంత్ భూ ఆక్రమణ నిజమే) సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టన్ని ఉల్లంఘించినందుకు రేవంత్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో నివేదికలో కోరారు. అలాగే నింబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను సైతం కూల్చివేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గండిపేట సమీపంలో అక్రమంగా ఫామ్హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించేందుకు సోమవారం ఆయన అనుచరులతో కలిసి అక్కడి చేరకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు, రేవంత్కు పెద్దఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి, కేటీఆర్ల అక్రమ భూముల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) స్థానికుల ఆరోపణల ఆధారంగా.. గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విశాఖ ‘సిట్’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, పరిసర మండలాల్లో జరిగిన భూకుంభకోణంపై సమగ్ర విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూకుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాలను నిగ్గు తేల్చడం కోసం నూతన ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తూ గత ఏడాది అక్టోబర్ 17న జీవో జారీ చేసింది. విశాఖపట్నం, పరిసర మండలాల్లో విలువైన భూములను కొట్టేయడమే లక్ష్యంగా భూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, ప్రైవేట్ భూములకు చెందిన రికార్డులను కూడా తారుమారు చేశారని వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సిట్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంది. లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవలే సీఎంను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించింది. దర్యాప్తు పరిధి ఎక్కువగా ఉండటం, ఇంకా కొన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నందున తుది నివేదిక సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం మరో మూడు నెలలు సిట్ను పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్లో టీడీపీ నేతలు
-
భారీగా రికార్డుల ట్యాంపరింగ్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖలో భూ కుంభకోణాలపై వచ్చిన ఫిర్యాదుల విచారణ వేగవంతం చేసినట్టు సిట్ సభ్యురాలు, మాజీ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను ఉప కలెక్టర్లకు అందజేశామని,వీరు విచారణ అనంతరం అవసరమైతే క్షేత్ర స్థాయి పర్యటన చేస్తామని ఆమె చెప్పారు. సోమవారం సిట్ కార్యాలయంలో అనురాధ విలేకరులతో మాట్లాడారు. సిట్కు మొత్తం 2497 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 1594 సిట్ పరిధిలో వున్నాయని, నాన్ సిట్ పరిధిలో 914 ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. సిట్ మొదటి దశ (13 మండలాలు పరిధి)లో 1381 ఫిర్యాదులు, సిట్ రెండో దశ(గుర్తించిన 13 మండలాలు కాకుండాఇతర ప్రాంతాలు)లో 182 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. భారీగానే ట్యాంపరింగ్.. జిల్లాలో ప్రభుత్వ,జిరాయితీ భూముల రికార్డులు భారీగా ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించామని వై.వి.అనురాధ తెలిపారు. 252 ఫిర్యాదులు ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించామని, 204 ఫిర్యాదులు క్లాసిఫికేషన్ ఛేంజ్ అయినట్టు గుర్తించామన్నారు. ట్యాంపరింగ్ ఎక్కువగా ఆనందపురం మండలంలో ఉన్నాయని, రెండో స్థానంలో పెందుర్తి , మూడో స్థానంలో భీమిలి మండలం ఉందని ఆమె తెలిపారు. ముందుగా ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్ మీద దృష్టి పెట్టామని, ఆ తర్వాత జిరాయితీ భూముల ట్యాంపరింగ్పై దృష్టి సారిస్తామన్నారు. పత్రిక పబ్లికేషన్ ఆధారంగా ఏడు అంశాల్లో ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విభజించి ఉప కలెక్టర్లకు పంపామని, వారి నుంచి వచ్చిన నివేదిక తర్వాత తాము విచారణ చేస్తామన్నారు. తొలి విడతగా తహసీల్దార్లకు 35 ఫైల్స్ పంపామని, వీటి విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. జిరాయితీ భూములు 22ఏ జాబితాలోకి.. జిల్లాలో అనేక ప్రాంతాల్లో జిరాయితీ భూములను 22ఏలో చేర్చారని, ఒక్కసారిగా తహసీల్దార్లు ఎందుకు చేర్చారన్న దానిపై సమాధానం లేదని సిట్ సభ్యురాలు వై.వి.అనురాధ తెలిపారు. దీనిపై జిల్లా రిజస్ట్రార్ ఎస్.మన్మథరావు నుంచి నివేదిక తీసుకున్నామని, 22 ఏ పేరిట అనేక భూములకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, దీని వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించామన్నారు. ,తహసీల్దార్లు కావాలని కొన్ని భూములను 22ఏ పెడుతున్నారన్న అనుమానం వుందని ఆమె వివరించారు. దీనిపై తహసీల్దార్లను పిలిచి విచారణ చేస్తామన్నారు. సిబ్బంది కొరత లేదు.. సిట్ విచారణ కోసం అవసరమైన సిబ్బందిని ఇచ్చారని, నలుగురు ఉప కలెక్టర్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు,4 జూనియర్ అసిస్టెంట్లు,నాల్గోవ తరగతి సిబ్బందిని కూడ ఇచ్చారని అనురాధ తెలిపారు. వినతులు స్వీకరించడానికి కౌంటర్కు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించారని వివరించారు. ఈ కౌంటర్లో వినతులు స్వీకరిస్తున్నామని, సిబ్బంది రావడంతో విచారణ వేగవంతం చేసినట్టు తెలిపారు. సమావేశంలో సిట్ సభ్యుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
తీగలాగుతున్న సిట్
-
తొలగిపోనున్న ‘భూ’చోళ్ల ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐదేళ్ల కిందట టీడీపీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణం పేరిట విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాల పంట భూములను అడ్డగోలుగా దోచేసిన పాలకులు.. అటు తర్వాత విశాఖ నగరం మీద పడిపోయారు. నవ్యాంధ్రలో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రూ.లక్ష కోట్ల విలువైన భూములను చెరబట్టేశారు. హుద్హుద్ను కూడా తట్టుకున్న విశాఖపట్నం.. టీడీపీ భూబకాసురులు సృష్టించిన భూదందాల విలయాన్ని మాత్రం తట్టుకోలేక చిగురుటాకులా వణికిపోయింది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని చెప్పిన పాలకులే భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. అధికారం అండతో విచ్చలవిడిగా కబ్జాలకు తెగబడ్డారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రికార్డులను మాయం చేసి, తారుమారు చేసేసి మరీ అడ్డంగా భూములను తన్నుకుపోయారు. రికార్డుల గల్లంతుతో బట్టబయలైన కుంభకోణం.. 2017 మే నెలలో భూముల రికార్డులు మాయమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొన్ని వేల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ)లు ఉండగా ఇందులో 16,735 ఎఫ్ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3022 ఆర్ఎస్ఆర్లు ఉండగా అందులో 379 అదృశ్యమయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. వీటిలో చాలా వరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. ఇలా భూ కుంభకోణం బట్టబయలైంది. విశాఖ జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న నేతల్లో చాలామంది భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్న వారే. వీరిలో చాలా మందిపై బహిరంగ ఆరోపణలే వినిపించాయి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్పైన ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. ట్యాంప‘రింగ్’లోనే టీడీపీ ‘సిట్’... కుంభకోణంపై సాక్షి దినపత్రికలో వరస కథనాలు ప్రచురితం కావడంతో కలకలం రేగింది. దీనికితోడు ప్రతిపక్షాల ఆందోళనలతో దిగొచ్చిన టీడీపీ సర్కారు 2017 జూన్ 20న సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. అయితే.. సిట్ బృందానికి నాటి టీడీపీ ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. విచారణను రికార్డులు ట్యాంపర్ అయిన భూములకే పరిమితం చేసింది. భూ ఆక్రమణలు, ముదపాక భూముల వ్యవహారం సిట్ పరిధిలోకి తీసుకురాకపోవడంతో బాధితుల్లో నైరాశ్యం అలముకుంది. విచారణపై అప్పటి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించిందో ఈ పరిమితులతో అర్థం చేసుకున్న ప్రజలు సిట్ను విశ్వసించలేదు. ఎలాంటి పరిమితులూ లేవు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖ భూ కుంభకోణాల్లో దోషులను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే సిట్కు ఎలాంటి పరిమితులు విధించకుండా.. స్వేచ్ఛగా విచారణ జరిపేలా మార్గదర్శకాలు జారీ చేసింది. నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. టీడీపీ భూ దందాలకు బలైన అధికారులు.. మొత్తంగా భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను మాత్రం బలి చేసేసింది. తహసీల్దార్ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్ స్థాయికి చెందిన సుమారు 48 మందిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. అసలు దోషుల్ని వదిలేయడం, బాధితులకు సరైన న్యాయం జరగకపోవడంతో.. మరోసారి దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. మరో సిట్ వేసి సమగ్ర విచారణ చేపడతామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్.. దానికి కట్టబడి సిట్ ఏర్పాటు చేశారు. నివేదిక ఏమైందో...? అయినప్పటికీ.. గత సిట్కు 2875 ఫిర్యాదులందాయి. వీటిలో మూడొంతులు టీడీపీ నేతలపైనే వచ్చినట్లు బహిర్గతమైంది. ఇక వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాలపైనే సిట్కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి..క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2018 జనవరి 29న ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించగా పది నెలలు తొక్కిపెట్టిన ప్రభుత్వం ఆ ఏడాది నవంబర్ 6న కేబినెట్ ముందుకు తీసుకొచ్చింది. కానీ అందులోని వివరాలు బహిర్గతం చేయకుండా కాలగర్భంలో కలిపేసింది. -
విశాఖ భూ కుంభకోణాలపై సిట్
మితిమీరిన బంధుప్రీతి, భూదాహంతో విశాఖ భూములను చెరబట్టి అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సాగించిన భూకబ్జాల నిగ్గు తేల్చి, దోషులపై చర్యలు తీసుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. వందల కోట్లలో సాగిన ఈ కుంభకోణాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. వాస్తవానికి అప్పట్లోనే భూదందాలను సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి తేవడం.. రచ్చ కావడంతో అప్పటి టీడీపీ సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. కానీ కబ్జాకాండల్లో పాత్రధారులు, సూత్రధారులందరూ తమ పార్టీవారే కావడంతో.. సిట్ సమర్పించిన నివేదికను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది.కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి భూ కుంభకోణాలపై పక్కాగా విచారణ జరిపించి.. దోషులు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం.. తన మాటకు కట్టుబడి సిట్ను ఏర్పాటు చేసింది. ఇద్దరురిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జితో కూడిన ఈ బృందం.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వ స్థలమైనా.. ప్రైవేటు స్థలమైనా సరే.. కబ్జాదారులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకునేవాళ్లు. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. కొందరు అధికారులు వారితో కుమ్మక్కు కాగా.. మరి కొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డులు తారుమారు చేయడమనే సరికొత్త భూ దందాకు బహుశా దేశంలోనే మొదటిసారి ఇక్కడే బీజం పడిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో సాక్షిలో వరస కథనాలు రావడంతో ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం సిట్ను నియమించినప్పటికీ.. ఆ నివేదిక మాత్రం వెలుగు చూడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం రాగానే.. ప్రజల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తుల మేరకు భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుంబాక విజయసాయిరెడ్డి విశాఖ వచ్చిన సందర్భంలో కూడా.. మరో సిట్ ను నియమించి ఈసారి పక్కాగా విచారణ చేపట్టి.. అక్రమార్కుల అంతుతేలుస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. సిట్ చీఫ్గా డా. విజయ్కుమార్.. రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి డా.విజయ్కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి జీవోని విడుదల చేశారు. విధులు.. అధికారాలు.. -సిట్ బృందానికి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు, వెబ్ల్యాండ్ ఖాతాలను నిశితంగా పరిశీలించే అధికారం ఉంటుంది. -మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల రికార్డులను.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించే అధికారం ఉంది. -ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయన్నదానిపై కమిటీ విచారణ జరుపుతుంది. - రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతారు. -భూ వివాదాలు, ఆరోపణలకు సంబంధించి ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా పిలిచి విచారించే అధికారం సిట్కు ఉంది. -ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. -జిల్లా అధికారులు సిట్కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. -సిట్ బృందానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కు సూచించింది. అక్రమార్కులను వదిలిపెట్టం : ముత్తంశెట్టి అల్లిపురం(విశాఖ దక్షిణం): భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం కొత్తగా సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన సిట్ భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించినా.. సకాలంలో రిపోర్టును బహిర్గతం చేయలేదన్నారు. భూకబ్జాదారులకు కొమ్ము కాయటమే కాకుండా భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నాయకులను రక్షించుకునేందుకు సిట్ నివేదికను బుట్టదాఖలా చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్విజయకుమార్, వై.వి.అనురాధ, విశ్రాంత జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులతో కూడిన సిట్ మూడు నెలల పాటు పనిచేస్తుందని తెలిపారు. బాధితులు సిట్ సభ్యులను కలసి వివరాలు అందజేయాలని కోరారు. -
రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రాజధాని ఎక్కడ వస్తుంది అనే అంశం గురించి చంద్రబాబు తన టీమ్కు ముందుగానే లీకులిచ్చారు. దాంతో రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు కోటరీ భారీగా భూములు కొన్నది. సాక్షి టీవీ ఇన్విస్టిగేషన్లో టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగు చూసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షి టీవీ కీలక ఆధారాలు సంపాదించింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్లో కీలక సూత్రధారుగా వ్యవహరించారు. ప్రభుత్వం రాజధాని గురించి ప్రకటించకముందే ఆంజనేయులు, తన కుమార్తె లక్ష్మీ సౌజన్య, తండ్రి సత్యనారాయణ పేరుతో భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతంలోని మందడం, కొండమరాజుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఆంజనేయులు భూములు కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 106/1, 106/2 లో అక్టోబర్ 2014లో 2ఎకరాల 22సెంట్ల భూమిని కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో కొన్నట్టు తేలింది. సర్వే నెంబర్ 374/సీ అక్టోబర్ 9, 2014న ఎకరం 79సెంట్లు, సర్వే నెంబర్ 420/1ఏ అక్టోబర్ 9 2014న 96 సెంట్లు, సర్వే నెంబర్ 430/1ఏ సెప్టెంబర్ 23, 2014న 98 సెంట్ల భూమిని తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. (చదవండి: నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు) -
అమాత్యుని లయ.. అంతా మాయ!
చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్టు చిరుదోగ్యులు తమ ఇళ్ల కోసం కొనుక్కున్న భూమిని ప్రభుత్వ పెద్దలు బినామీ పేర్లతో కబ్జా చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్డీఏ కబ్జాదారుల క్రయవిక్రయాలకు అనుమతిచ్చేసింది. ప్రజలకు సహకరించాల్సిన సహకార శాఖ అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఫలితంగా విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (వీఆర్టీఏ)కు చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాకా అయిన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఈ భూ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. నిజమైన సభ్యులకు చెందాల్సిన ప్లాట్లతో కబ్జాకోరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వ శాఖల తీరును గమనిస్తే దీని వెనుక మంత్రి ఉమా అండ దండలున్నాయనేది స్పష్టమవుతోందని బాధిత సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి తప్పుదోవ పట్టించే నివేదికలు విజయవాడ కేంద్రంగా ప్రైవేటు లారీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో 1970లో విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్టీఏ) ఏర్పడింది. విజయవాడ వన్టౌన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది చిరుద్యోగులు ఈ అసోసియేషన్లో చేరారు. సొంతింటి స్థలం పొందాలనే ఆశయంతో 1980లో ఇబ్రహీంపట్నంలో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు లారీ యజమానులు, సంఘ సభ్యులు విరాళాలు అందించారు. అప్పట్లో దాని విలువ రూ.3.50 లక్షలు. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ.వంద కోట్లు ఉంటుంది. వీఆర్టీఏలో సభ్యులకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించుకునేలా 1980 డిసెంబర్లో కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో ఆ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. ఎంఐజీ, ఎల్ఐజీ పేరుతో 250, 150 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించాలని నిర్ణయించారు. 1981లో కొత్త కార్యవర్గం ఏర్పడటంతో సమస్యలు మొదలయ్యాయి. విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్టీఏ) పేరును 1997లో విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీజీటీఏ)గా మార్పు చేశారు. మళ్లీ 2000లో దాన్ని ‘ది విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్’గా పేరు మార్చారు. విలువైన భూమిపై కన్నేసిన కొందరు ఆ తర్వాత వీఆర్టీఏ హౌసింగ్ సొసైటీని కూడా మూసేస్తూ దాని పేరిట ఎలాంటి భూమి లేదని ప్రకటించారు. గతంలో సొసైటీ బాధ్యుడిగా ఉన్న వ్యక్తి దగ్గర పని చేసిన ఉద్యోగి ఇదే భూమిలో రెండంతస్తుల భవనం కట్టి, అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు.. మంత్రి జోక్యంతో తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన సీఆర్డీఏ, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాస్తవంగా వీఆర్టీఏ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కు చెందిన సభ్యులకు దక్కాల్సిన ప్లాట్లు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. దీంతో కబ్జాకోరులు ప్రభుత్వ శాఖల సహకారంతో ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ఈ ప్లాట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు. సర్వే నంబర్లు 214/2ఏ, 3ఏలలో 2.13 ఎకరాలు, 207/2లో 4సెంట్లు, 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాలు, 214/2బీ,3బీలలో 4.48 ఎకరాలు చొప్పున సుమారు 9 ఎకరాలు ఉండాలి. కానీ అందులో 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని గతంలోనే ప్రకటించగా, మిగిలిన మూడు సర్వే నంబర్లలో 139 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతిపాదిత 318 ప్లాట్ల లేఔట్లో 179 ప్లాట్లు అన్యాక్రాంతమయ్యాయి. వాస్తవంగా సభ్యులైన 20 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించగా మిగిలినవి బినామీ పేర్లతో బయటి వ్యక్తులకు కట్టబెట్టారు. కబ్జాదారులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ను తొలుత సేల్డీడ్గా జరిపించి ఆ దస్తావేజులను ఎవరికీ చూపొద్దని చెబుతున్నట్టు సమాచారం. స్థానిక సబ్ రిజిస్టార్ ఆఫీసును ప్రలోభపెట్టి కొన్నేళ్లుగా ప్లాట్ల వివరాలు బయటకు పొక్కకుండా చూశారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని ఆనేక మందికి ఇష్టారాజ్యంగా ప్లాట్లను అమ్ముకున్నారు. దీంతో ఆ ప్లాట్లలో 27 పక్కా భవనాలు కూడా వెలిశాయి. మిగతావన్నీ ఖాళీ ప్లాట్లుగా ఉన్నప్పటికీ, ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురుకి విక్రయించారని సమాచారం. కొన్న వారు తమదంటే తమదని స్థలం వద్ద తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ 9 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను కూడా విజయవాడలోని ఒక బ్యాంకులో మార్ట్గేజ్లో పెట్టినట్టు తెలిసింది. న్యాయం జరిగే వరకు పోరాడతాం భూ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. రికార్డులు తారుమారు చేసి ప్లాట్లను అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులకు కొన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్లో లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని లోకాయుక్త ఆదేశించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల అధికారులకు, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదులు చేశాం. ఆ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడి నిజమైన సొసైటీ సభ్యులకు అందే వరకు పోరాటం సాగిస్తాం. – బొజ్జా రాఘవరావు,వీఆర్టీఏ మాజీ కార్యదర్శి -
‘కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం’
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఈ కుంభకోణం వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె ఇద్దరు సోదరులు, మరిది సూత్రధారులుగా ఉన్నారు. పేద రైతులను బలవంత పెట్టి ఎకరానికి 30 వేల రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేశారు. కియా ప్రాంతంలోని భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్ల రూపాయలు ఆర్జించార’ని ట్వీట్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో..‘కియా భూకుంభకోణంతో కాల్వ శ్రీనివాసులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో చేరారు. అనుబంధ పరిశ్రమల వాళ్లు ఎకరం 2 కోట్ల రూపాయలకు కొనాలా. ఎడారి నేల నుంచి కోట్ల రూపాయలు ఎలా అర్జించవచ్చో టీడీపీ నేతలకు తెలుసు. దోచుకున్న సొత్తుతో అనంతపురంలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్’ అని తెలిపారు. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర భూకుంభకోణం. పరిటాల సునీతమ్మ,ఇరు సోదరులు,మరిది, సూత్రదారులు.పేద రైతుల భూములు బలవంతపెట్టి ఎకరం 30 వేలు కంటే తక్కువకే కొన్నారు.కియా ప్రాంతంలో భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మవరం ఎమ్మేల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్లు ఆర్జన. — Vijayasai Reddy V (@VSReddy_MP) 24 December 2018 కాల్వ శ్రీనివాసులు,4 ఎమ్మెల్యేలు కియా భూకుంభకోణం కోటీశ్వరుల జాబితాలో చేరారు.అనుబంధ పరిశ్రమల వాళ్లు ఎకరం 2కోట్లకు కొనాలి.ఎడారి నేల నుంచి కోట్లు ఎలా ఆర్జించొచ్చో టీడీపీ నేతలకు తెలుసు.దోచుకున్న సొత్తుతో అనంత లోని 14అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్. — Vijayasai Reddy V (@VSReddy_MP) 24 December 2018 -
భూంఫట్!
సాక్షి, అమరావతి: అధికారం అండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో విలువైన భూములను కాజేస్తున్నారు. వాగులు, చెరువులను సైతం ఆక్రమించి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ భూ రికార్డులను తారుమారు చేస్తున్నారు. భూములను కొట్టేసేందుకు కొన్నిచోట్ల బాధితుల బంధువులనే పావులుగా వాడుకోవడం గమనార్హం. బాధితుల బంధువులకు వాటాల ఎర... భూదందాల కోసం చిన్న చిన్న వివాదాలున్న విలువైన ఆస్తుల సమాచారాన్ని సేకరించి రంగంలోకి దిగుతున్నారు. వివాదాలు లేనిచోట కూడా ఏదో ఒక మెలికపెట్టి నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హక్కుదారుల బంధువులకు వాటాలిస్తామంటూ ఎరవేసి అప్పు ఇచ్చినట్లు తనఖా పత్రాలు సృష్టిస్తున్నారు. తనఖా పత్రం కూడా తమ పేర్లతో కాకుండా బినామీ పేర్లతోనే రాయించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. తనఖా పత్రం రాయించుకున్న వారి పేర్లతో ఆస్తి బదలాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వీటి ఆధారంగా ఆస్తులు మ్యుటేషన్ చేయించి బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా వ్యవహరిస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా ఇదంతా సివిల్ వివాదమంటూ కేసు నమోదు చేయకుండా తిరస్కరించేలా కబ్జాదారులు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడలో మాఫియా రాజ్యం విజయవాడ సింగ్నగర్లోని సుమారు రూ.50 కోట్ల విలువైన 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బోండా ఉమా తన భార్య, సన్నిహితుల పేరుతో రికార్డులు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో చేతులు మార్పించి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత, తనకు సన్నిహితుడైన మాగంటి బాబులకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్లు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ హక్కుదారులు ఆందోళన చేయడంతో పోలీసులతో కూడా కొట్టించారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో చివరకు ఈ భూమిని వదులుకుంటున్నట్లు బోండా ఉమ ప్రకటించడం గమనార్హం. పెద్దలతో ఎందుకు?.. రాజీ చేసుకోండి! కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక నేత అనుచరులు కూడా విజయవాడలో ల్యాండ్ మాఫియా నిర్వహిస్తున్నారు. గొల్లపూడి ప్రాంతంలో మంత్రి అనుచరులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఓ మహిళ 1978లో కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూమికి మంత్రి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ‘పెద్దవారితో మీకు ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడుకుని రాజీ చేసుకోండి’ అని ఓ రెవెన్యూ అధికారి బాధితురాలికి సూచించినట్లు తెలిసింది. విశాఖలో కూడా ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ. వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు ఓ మంత్రి బంధువులు అంతా సిద్ధం చేసుకున్నారు. వాగులూ వంకల ఆక్రమణ.. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో వందలాది చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని సాగు భూములుగా మారిపోయాయి. భారీ వర్షాలు పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చెరువులు, నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో భారీ నష్టం జరిగింది. పంట కాలువ ఆక్రమించి వంతెన.. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె రెవెన్యూ గ్రామంలో పెద్దఓరంపాడు చెరువు నుంచి రామక్కపల్లెకు వెళ్లే పంటకాలువపై అధికార పార్టీ నాయకులు అక్రమంగా వంతెన నిర్మించి అలుగు పోరంబోకులో బోర్లు వేసి ఏకంగా చెరువు భూమిని చదును చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేశారు. కాలువ గుండా వర్షాకాలంలో నీరు ప్రవహిస్తే చెరువు నిండి 500 ఎకరాలకు నీరు అందుతుంది. కాలువకు అడ్డంగా వంతెన నిర్మిస్తే చెరువులోకి నీరు రాదు. అలుగు కింద భూమిని మొత్తం సాగు చేసుకోవాలని ఓ టీడీపీ నాయకుడి అనుచరుడు 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వెంటనే వంతెనను తొలగించి చెరువు అలుగు వద్ద ఆక్రమణలను తొలగించాలని రామక్కపల్లె, అప్పారాజంపేట, అనంతంపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆవిలాల చెరువులో భారీ భవంతులు.. తిరుపతిలోని ఆవిలాల చెరువు చాలావరకూ ఆక్రమణలతో చిక్కిపోయింది. మట్టి తోలి ఎత్తు చేసి చెరువు భూమినే ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అక్కడ ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు ఉండటంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదేం దారుణం! గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు పంచాయితీకి చెందిన సింగం శాంతాదేవి (టెకులమ్మ) నుంచి ముగ్గురు వ్యక్తులు 1998లో వీలునామా ద్వారా రాయించుకున్న, 2005లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్న 10.78 ఎకరాల విలువైన భూములను 2013లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామా రాయించుకున్న సింగం ప్రసాదరెడ్డి అనే వ్యక్తికి తహసీల్దారు ఏకపక్షంగా బదలాయించి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం గమనార్హం. ఓ టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా సాగినట్లు ఆరోపణలున్నాయి. 2005లో రిజిస్ట్రేషన్ సమయంలో శాంతాదేవి ఆంగ్లంలో సంతకం చేయగా ప్రసాద్రెడ్డి సమర్పించిన అన్ రిజిస్టర్డ్ వీలునామాలో ఆమె వేలిముద్ర ఉండటం ఫోర్జరీ వ్యవహారాలకు నిదర్శనం. దీనిపై బాధితులు ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలంటూ గుంటూరు ఆర్డీవో కోర్టులో అప్పీల్ కూడా చేసుకున్నారు. సెంటు రూ. 20 – 25 లక్షలకు అమ్మకం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో మన్నూరు, ఊటుకూరు, పోలి, క్రిష్టం చెరువులు ఆక్రమణలపాలయ్యాయి. చిత్తూరు జిల్లా పుల్లంపేట మండలంలో పుల్లంగేరు, రాజంపేట ప్రాంతంలో చక్రాలమడుగు అని వ్యవహరించే వాగు ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. భారీ వర్షం కురిస్తే రాజంపేటలో ఇళ్లలోకి నీరు చేరు ప్రమాదం పొంచి ఉంది. కడప – చెన్నై రహదారిని ఆనుకుని చక్రాలమడుగు వాగు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న భూమిని స్థానిక టీడీపీ నాయకులు సెంటు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు. చక్రాలమడుగు వాస్తవంగా జలవనరుల శాఖది. ఈ భూమి క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అయితే భూమి వర్గీవకరణనే నకిలీ రికార్డులతో మార్చేసి కోట్లు దండుకుంటున్నారు. -
నేరస్తులను లగడపాటి ఎలా రక్షిస్తారు?
-
ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది?
-
వెలుగులోకి కేశినేని రమేష్ లీలలు
సాక్షి, విజయవాడ : గురుపీఠం భూ కుంభకోణం నిందితుడు కేశినేని రమేష్ అలియాస్ నవీన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తీగ లాగాతే డొంక కదిలినట్టుగా రమేష్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. భవానీ గురుపీఠం భూమి అమ్మకం పేరుతో రమేష్ కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ రమేష్ అఖిల భారత భవానీ పీఠాన్ని సంప్రదించాడు. ఆ భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే 100 ఎకరాల భూమికి, రమేష్కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించిన ట్రస్ట్ నిర్వాహకులు కృష్టలంక పోలీసులు అశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం రమేష్, అతని అనుచరుడు సబ్రమణ్యాన్నిఅరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఓ రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్ వద్ద రమేష్ పని చేస్తున్నాడు. రమేష్పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులున్నాయి. అంతేకాక శ్రీకాకుళం మెలియాపుట్టి కురజాడ గ్రామాన్ని దత్తత పేరుతో మోసం చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని గ్రామంలో అప్పలు చేసి తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రామంలో శ్రీమంతుడిగా చెలమణి అయిన రమేష్, రెండు నెలలు పని చేయించుకుని గ్రామస్థులకు కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను తొక్కిపెట్టిన సీఎం
-
మాజీ సీఎంపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హరియాణా మాజీ ముఖ్యమంత్రిపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. భూపేందర్ సింగ్ హుడా హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న (2004-07) సమయంలో 912 ఎకరాల్లో భూ కుంభకోణం జరిగిందని జస్టిస్ ఎకే గోయల్, ఉదమ్ లలిత్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హూడా సీఎంగా ఉన్న సమయంలో డీఎల్ఎఫ్ హౌసింగ్ కార్సోరేషన్కు ఇండస్టీయల్ టౌన్షిప్ కొరకు కేటాయించిన భూముల్లో భారీ ముడుపులు తీసుకున్నారని, వాటిని వెంటనే రికవరీ చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. కేసును వెంటనే దర్యాప్తు చేసి భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సుప్రీం ఆదేశించింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజా ప్రతినిదులే భారీ కుంభకోణలకు పాల్పడితే ప్రజలకు రక్షణ ఎక్కడినుంచి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర అసహానం వ్యక్తం చేసింది. ఉధ్దేశ పూర్వకంగానే ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రజలనుంచి తీసుకున్న భూములన్నింటిని స్వాధీనం చేసుకోవాలని సీబీఐని ఆదేశించింది. (కాగా రైతులు దగ్గర నుంచి తీసుకున్న 912 ఎకరాల్లో.. ఎకరానికి కేవలం రూ. 25 లక్షల చొప్పున రైతులకు చెల్లించి, రూ.80 లక్షలు చెల్లించామని ప్రభుత్వనికి లెక్కల్లో చూపారు. కాగా డీఎల్ఎఫ్ సంస్థకు మాత్రం ఎకరం 4.5 కోట్ల చొప్పున 912 ఎకరాలను కేటాయించారు.) -
‘నయీమ్ ఎన్కౌంటర్ వెనుక చీకటికోణం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూములపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించారని తెలిపారు. లబ్దిదారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారని.. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉందని వెల్లడించారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు. రామేశ్వరరావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్, మహేశ్వరం మండలంలో రామేశ్వరరావుకు భూములెన్ని ఉన్నాయో, వాటిలో అసైన్డ్ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని సూటిగా అడిగారు. కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారని రేవంత్ అన్నారు. సీఎం, ఆయన బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని.. ధైర్యముంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని సవాల్ విసిరారు. నయీమ్ ఎన్కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం భూ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలను సూటిగా అడిగారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
అమరావతిలో మరో ఘరానా మోసం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ఘరానా మోసం బయటపడింది. రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు. సీఆర్డీఏ అధికారులతో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏకి మందడం రెవెన్యూలో గౌస్ ఖాన్ భూమి ఇచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. నది పరివాహక ప్రాంతంలో మిగులు భూమికి పత్రాలు సృష్టించి గౌస్ ఖాన్ పేరుతో అధికారులు ల్యాండ్ పూలింగ్కు తీసుకున్నారు. ఇందుకోసం గౌస్ ఖాన్కు ప్లాట్లు కూడా కేటాయించారు. దీంతో అతడికి సుమారు రూ.3.50 కోట్లుకు పైగా విలువ చేసే ప్రయోజనాలు చేకూరాయి. ఈ కుంభకోణం వెనుక సీఆర్డీఏ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గౌస్ ఖాన్ ఆ ప్లాట్లను హైదరాబాద్కు చెందిన ఓ మహిళకు విక్రయించాడు. అయితే లింక్ డాక్యుమెంట్ల వద్ద ఈ ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీఆర్డీఏ అధికారులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. కాగా ఈ కుంభకోణంలో సీఆర్డీఏ అధికారులతో పాటు టీడీపీ నేతల పాత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపైన సీబీఐ విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలు జరిగాయి: సీఆర్డీఏ కమిషనర్ రాజధాని ప్రాంతం మందడంలో భూఅక్రమాలు జరిగాయని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అంగీకరించారు. మందడంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ లైన్ రికార్డులను తారుమారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అదనపు కమిషనర్ షణ్ముకంను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక వస్తుందని, మందడం భూ దందాపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. ఈ కుంభకోణంలో సీఆర్డీఏ అధికారుల పాత్ర కూడా ఉండవచ్చన్నారు. కంప్యూటర్ ఆపరేటర్తోనే ఈ అక్రమం జరిగే అవకాశం లేదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని తెలిపారు.59 వేల ప్లాట్లు లాటరీ ద్వారానే ఇచ్చామని,మంత్రులు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఇచ్చామనే అంశంపై ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదటు సీపీఎం ఆందోళన అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భారీ కుంభకోణాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం మంగళవారం ఆందోళనకు దిగింది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులే భూదందాకు సహకరిస్తున్నారని, ప్లాట్ ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. మంత్రులకు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించింది. సిఎం నివాసంకు సమీపంలోనే భూదందా జరుగుతోందని,రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సీఆర్డీఏ ప్రాంత సీపీఎం కన్వీనర్ సిహెచ్ బాబూరావు ఆరోపణలు చేశారు. -
‘టీడీపీ భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లుగా సాగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి దేవినేని ఉమ భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సిట్ల పేరుతో కాలయాపన చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం భూకబ్జాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. -
విజయవాడలో మరో భూ బాగోతం
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ భూ కబ్జా బాగోతం మరిచిపోకముందే.. మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది. దీంతో భూకబ్జాకు నిరసనగా మంగళవారం కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. అక్రమణకు గురైన స్థలంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆక్రమణకు గురైన స్థలంలో ఉన్న బోర్డులు, జెండాలను విద్యార్థులు పీకేశారు. ప్రోక్లైన్లతో స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్రగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో బీఆర్టీఎస్ రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు. -
‘బొండాగిరి’పై ఇంటెలిజెన్స్ ఆరా..!
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి బొప్పికట్టించిన ‘బొండాగిరి’ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు బొండా వ్యవహారాల చిట్టాను సేకరించినట్టు సమాచారం. నగరంలో సాధారణ వ్యక్తిగా మొదలైన ప్రస్థానం, చిత్తూరు జిల్లాలో అజ్ఞాతవాసం, ఆపై రాజకీయంగా సాగిస్తున్న దందాల వరకు అన్ని వివరాలనూ సేకరించారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ఆయన తనయుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్ రేస్, యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరుల ప్రమేయమున్న పలు వ్యవహరాలపై కూడా ఆరా తీశారు. బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఉన్న సత్యనారాయణపురం సీతారామ కళ్యాణమండపానికి తాళం వేయడం నుంచి మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ప్లాట్ను ఆక్రమించుకోవడం (వైద్యం అందక ఆమె 13 ఏళ్ల కుమార్తె సాయిశ్రీ మృత్యువాత పడడం), విజయవాడ శివారు కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా సోదరుడు పెన్సింగ్ వేసి ఆక్రమించడం, సింగ్నగర్, పాయకాపురం బర్మాకాలనీల్లో ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు, ప్లాట్లు ఆక్రమించడం ఇలా అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే సతీమణి సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి రాంబాబు మరో ఆరుగురు ఉండటం సంచలనం రేపింది. ఈ అన్ని సంఘటనల వివరాలతో ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. బొండా ఉమాపై అనర్హత వేటువేయండి విజయవాడ సిటీ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూకబ్జాలు, దందాలపై చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బొండా అనుచరులు గతంలో సుమశ్రీ అపార్ట్మెంట్ను ఆక్రమించుకోవడం, సెటిల్మెంట్లతో నిస్సహాయులను బెదిరించడం ఇలా ఎన్నో దారుణాలు వెలుగుచూసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. -
బెజవాడలో బొండాగిరి!
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరంలో 5.16 ఎకరాల భూమి.. విలువ రూ.50 కోట్లు పైమాటే... యజమానులు సాదాసీదా వ్యక్తులు. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రహరీ కట్టేశారు... తప్పుడు పత్రాలు సృష్టించి దానికి తన భార్యను యజమానిని చేసేశారు. ఆ భూమికి వారసుడినని వచ్చిన వ్యక్తిపై తన మనుషులతో దౌర్జన్యం చేసి వెల్లగొట్టారు. విషయం వెలుగులోకి వచ్చి సీఐడీ కేసు నమోదు కావడంతో అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు. తమ మాట వినకుంటే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం నేపథ్యం ఇదీ... విజయవాడ మొగల్రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్రసమరయోధుడు. అప్పట్లో కర్నూలు జైల్లో మూడేళ్లు శిక్ష అనుభవించారు కూడా. ఆయనకు ప్రభుత్వం 1952లో విజయవాడలోని సింగ్నగర్లో 10.16 ఎకరాల భూమి కేటాయించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో వెంటకేశ్వరరావుకు వివాహం కాలేదు. రామకృష్ణకు వివాహమై పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు 1981లో, పెద్ద కుమారుడు వెంటకేశ్వరరావు 2013లో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ భూమిపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. ప్రస్తుతం అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.10కోట్లు పైనే ఉంది. ఆ లెక్కన దాని విలువ రూ.50కోట్లుపైమాటే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లు ఒప్పంద పత్రాలు సృష్టించారు. (వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు.) అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లు మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి డెవలప్మెంట్ కోసం రాసిచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపాలాగా ఉంచారు. కోటేశ్వరరావును బురిడీ కొట్టించింది ఇలా... ఈ భూమాయ కోసం అబ్దుల్మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను కూడా ఎమ్మెల్యే బోండా పకడ్బందీగా బురిడీ కొట్టించారు. కోటేశ్వరరావు తన ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడైన కార్పొరేటర్ మహేష్ను సంప్రదించారు. అందులో భాగంగా విజయవాడ గాంధీ నగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన కోటేశ్వరరావుతో పలు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో అప్పు ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఆ రోజు కోటేశ్వరరావు చేసిన సంతకాలతోనే కథ నడిచింది. వెంకటేశ్వరరావు నుంచి భూమిని కోటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు... దాన్నే ఎమ్మెల్యే భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మార్చారు. కాగా అతనితో పాటు భూమి రాయించినట్లు ఉన్న మరో వ్యక్తి అబ్దుల్ మస్తాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వెలుగులోకి వచ్చిందిలా... తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సురేష్బాబు (రామకృష్ణ కుమారుడు) అక్కడకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లిన సురేష్పై ఎమ్మెల్యే మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం సీఐడీ విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు తనకు ఆ భూమి విషయమే తెలీదని... రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను చేసిన సంతకాలను ఇలా వాడుకున్నారని కోటేశ్వరరావుకు అర్థమై అదే విషయాన్ని వారికి చెప్పారు. దీంతో సీఐడీ వారు బోండా ఉమా భార్య సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి బాబు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒప్పుకోకుంటే చంపేస్తాం అంటూ కోటేశ్వరరావుకు బోండా వర్గీయుల బెదిరింపులు తమ భూబాగోతం బట్టబయలు కావడం, అందులో కోటేశ్వరరావు వాంగ్మూలం కీలకం కావడంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. తాము చెప్పినట్లు చేస్తే భారీ మొత్తం ఇవ్వడంతోపాటు కేసు నుంచి బయటపడేస్తామని ఆశ చూపుతున్నారు. లేకుంటే అంతు చూస్తామని బోండాకు అత్యంత సన్నిహితుడైన కార్పొరేటర్ గండూరి మహేష్ బెదిరిస్తున్నారు. దాంతో భీతిల్లిన కోటేశ్వరరావు బోండా ఉమా వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ను ఆదివారం కోరారు. మా భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది: కేసిరెడ్డి సురేష్బాబు ‘స్వాతంత్య్ర సమరయోథుడైన మా తాతగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది. సామాన్యులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే బోండా ఉమానే తన భార్య సుజాత పేరిట భూమి కబ్జా చేస్తే ఇక మాకు దిక్కెవరు? దీనిపై మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి’ -
ఒక లూలూ కోసం..
సాక్షి, అమరావతి : మీకు మంచి సెంటర్లో పదెకరాల భూమి ఉంది. ఏదైనా నిర్మాణం చేయడానికి కావాల్సిన నిధులున్నాయి. మీరు ఆ స్థలంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటే ఏం చేస్తారు? మీరే స్వంతంగా నిర్మించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేటు సంస్థ ఫైవ్స్టార్ హోటల్, షాపింగ్ మాల్ కట్టుకునేందుకు ఏకంగా రూ.905 కోట్ల విలువైన భూమిని నామమాత్రపు లీజుకు కట్టబెట్టేస్తుంది. వెనుకబడిన ప్రాంతంలో అయితే రాయితీలిచ్చి ప్రోత్సహించడం సహజం. కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ముందుకు వచ్చే వైజాగ్లాంటి పట్టణంలో ఓ ప్రైవేటు కంపెనీ హోటల్ కట్టుకునేందుకు భారీ రాయితీలు ఎందుకు? అసలు ఏ ప్రభుత్వమైనా ఒక ప్రైవేట్ గ్రూపునకు ఇచ్చేందుకు మరో ప్రైవేట్ సంస్థకు చెందిన భూమిని తీసుకుంటుందా? తీసుకున్న భూమికి బదులు ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములను కేటాయిస్తుందా? ఆ విధంగా కేటాయించిన భూమిని ఆ ప్రైవేట్ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికయ్యే రిజిస్ట్రేషన్ ఫీజును, స్టాంపు డ్యూటీని, కేపిటల్ గైన్స్ను ఖజానా నుంచి భరిస్తుందా? అంటే ఎవ్వరైనా సరే అలా చేయరనే చెబుతారు... కానీ చంద్రబాబు సర్కారు మాత్రం అదే పని చేసింది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.171.27కోట్ల భారం మోపింది. ఆ మొత్తంతో ప్రభుత్వమే స్వయంగా> హోటల్, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ కట్టే అవకాశమున్నా పక్కన పెట్టేసింది. చట్టానికి, నిబంధనలకు వ్యతిరేకంగా లూలూ గ్రూపునకు, సీఎంఆర్ గ్రూపునకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగారు. న్యాయశాఖతో పాటు విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్ అభ్యంతరాలను బేఖాతరు చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి... నామమాత్రపు లీజుకు విలువైన భూముల అప్పగింత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన లూలూ గ్రూపునకు విశాఖపట్నంలో రూ.905 కోట్ల విలువైన భూములు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర ఎకరాకు రూ.50 లక్షల నామమాత్రపు లీజునకు 12.52 ఎకరాలు లూలూ గ్రూపునకు కేటాయించారు. మొదట లీజు కమ్ డెవలప్మెంట్ కింద ఏపీఐఐసీకి చెందిన 9.12 ఎకరాలను ఏడాదికి రూ.4.51 కోట్ల లీజు కింద ఇచ్చారు. అది చాలదన్నట్లు సీఎంఆర్ సంస్థకు చెందిన మరో 3.40 ఎకరాల భూమిని సేకరించి ఇస్తున్నారు. దీనికి అదనంగా ఐదుశాతం లీజు వసూలు చేయాలని నిర్ణయించారు. లూలూకోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా సీఎంఆర్ సంస్థకు రూ.321 కోట్లు విలువైన 4.85 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి ఈ వ్యవహారం సెటిల్ చేయడం విశేషం. దీనివల్ల ఖజానాపై నేరుగా రూ.171.27కోట్ల భారం పడుతున్నా పట్టించుకోలేదు. సమీపంలోని మరో ప్రైవేట్ సంస్థకు చెందిన 1.99 ఎకరాల భూమిని లూలూ గ్రూపు కొనుగోలు చేసుకునేందుకు ఏపీఐఐసీ సహాయ సహకారాలు అందించనుండటం గమనార్హం. స్వయంగా సీఎం బేరసారాలు... విశాఖపట్టణం జిల్లా వాల్తేరు వార్డు ఆర్కేబీచ్ ఫ్రంట్ దగ్గర లూలూ గ్రూపు ఐదు నక్షత్రాల హోటల్తో పాటు, మెగా కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. తొలుత 9.12 ఎకరాల్లో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కొచ్చి వెళ్లి అక్కడ లూలూ గ్రూపు కన్వెన్షన్ సెంటర్ను సందర్శించి వచ్చారు. వారితో మంతనాలు జరిపారు. ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర గల సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాలు కూడా ఉంటే కన్వెన్షన్ సెంటర్ బీచ్ ఫ్రంట్లో వస్తుందని లూలూ గ్రూపు యాజమాన్యం, చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా సరే సీఎంఆర్ గ్రూపునకు చెందిన భూమిని తీసుకుని లూలూ గ్రూపునకు కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులతో స్వయంగా ఆయనే బేరసారాలను కొనసాగించారు. గత ఏడాది జూలై 19వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాల భూమిని తీసుకుని ఆ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా మరో చోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. సీఎంఆర్ షరతులన్నింటికీ తలూపిన సర్కారు తామిచ్చే 3.40 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా 1:1.5 రేషియోలో భూమి కేటాయించాలని సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా తమకు ప్రత్యామ్నాయంగా కేటాయించే భూమి విలువకయ్యే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కేపిటల్ గెయిన్స్ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండు చేశారు. అలాగే ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూమి 150 ఫీట్ రోడ్డుకు అన్ని వైపులా 25 శాతం సెట్ బ్యాక్ ఇవ్వాలని, అదనపు అంతస్తులకు అనుమతివ్వాలని, ఆ భూమిని మిశ్రమ వినియోగానికి అనుమతివ్వాలని, వాస్తుకు అనుగుణంగా వుడా మాస్టర్ ప్రణాళికలో అవసరమైన సవరణలు చేయాలని సీఎంఆర్ గ్రూపు తన డిమాండ్లలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో సీఎంఆర్ గ్రూపు డిమాండ్లన్నింటినీ అంగీకరించారు. ఆరు చోట్ల ప్రత్యామ్నాయంగా 4.85 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయించారు. రహదారులు–భవనాలు, వుడా, గ్రేటర్ విశాఖపట్టణం కార్పొరేషన్కు చెందిన ఆ 4.85 ఎకరాల్లో 2.15 ఎకరాలు వచ్చే ఏడాదివరకు హెచ్బీసీకి లీజుకు ఇచ్చారు. ఇప్పుడు హెచ్బీసీతో సంప్రదింపులు జరిపి ఆ లీజును రద్దు చేయాలని, అలాగే మిగతా భూములను ఎవ్వరికైనా లీజుకు ఇస్తే ఆ లీజులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఖజానాపై రూ.171 కోట్ల భారం లూలూ గ్రూపునకు ఇస్తున్న ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర గల సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.246.84 కోట్లుగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ప్రత్యామ్నాయంగా సీఎంఆర్ గ్రూపునకు కేటాయిస్తున్న 4.85 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.321 కోట్లుగా పేర్కొన్నారు. ఆ భూమిని వుడా, రహదారులు–భవనాలు, గ్రేటర్ విశాఖలు సీఎంఆర్ గ్రూపు పేరు మీద క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ విలువైన భూమికి కేపిటల్ గెయిన్ కింద 20 శాతం మేర రూ.64.20 కోట్లు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ కింద రూ.24.07 కోట్లు, సీఎంఆర్ గ్రూపు భూమి విలువ ప్రత్యామ్నాయంగా ఇస్తున్న భూమి విలువకు మధ్య వ్యత్యాసం రూ.75 కోట్లు, ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర సీఎంఆర్ గ్రూపు భూమిలో గల ఫంక్షన్ హాల్కు రూ.ఎనిమిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.171.27 కోట్ల భారం పడుతున్నా సర్కారు పట్టించుకోకపోవడం గమనార్హం. న్యాయశాఖ, కలెక్టర్ అభ్యంతరాలు బేఖాతరు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వడానికి వీల్లేదని, అలాగే మూడో పార్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోరాదని న్యాయశాఖ అభిప్రాయపడింది. అలాగే కేపిటల్ గెయిన్స్తో పాటు ఇతర రిజస్ట్రేషన్ చార్జీలను, ఇతర పన్నులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అనేది చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. మూడవ పార్టీ అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించవచ్చే తప్ప నేరుగా ప్రభుత్వ జోక్యం ఉండరాదని పేర్కొంది. ఎంత భూమి తీసుకుంటే అంతే భూమి, అంతే విలువను మాత్రమే పరిహారంగా ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదని వుడా వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ అభ్యంతరాలన్నింటినీ పక్కన పెట్టి లూలూ గ్రూపునకు, అలాగే సీఎంఆర్ గ్రూపునకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ... రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లూలూ సంస్థకు మొదట కేటాయించిన భూమి 9.12 ఎకరాలు సీఎంఆర్ గ్రూపునుంచి సేకరించిన భూమి 3.40 ఎకరాలు ప్రత్యామ్నాయంగా సీఎంఆర్కు కేటాయించిన భూమి 4.84 ఎకరాలు కలెక్టర్ నివేదిక ప్రకారం ఎకరా మార్కెట్ విలువ రూ.72.35 కోట్లు మొత్తం 12.52 ఎకరాల మార్కెట్ విలువ రూ.905.82 కోట్లు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు వల్ల భారం రూ.171.27 కోట్లు మొత్తంమీద ప్రభుత్వానికి వచ్చే లీజు ఏడాదికి రూ.6.27 కోట్లు -
భూకుంభకోణంపై వేసిన సిట్ ఏమైంది
-
ల్యాండ్ స్కామ్ కేసులో తహశీల్దార్లకు మెమోలు
-
వర్సిటీ స్థల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి
విశాఖపట్నం: యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ) పరిధిలోని భూముల కబ్జా ఆరోపణలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. వైవీయూ వీసీతో ఆయన మాట్లాడగా ప్రహరీ లేకపోవడంతో భూ ఆక్రమణ ప్రయత్నం జరిగిందని వీసీ తెలిపారు. వీసీల సమావేశంలో ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలని యూనివర్సిటీలకు మంత్రి సూచిస్తునే ఉన్నారు. ఇప్పటికైనా అన్ని యూనివర్సిటీలు వెంటనే ప్రహరీలు నిర్మించుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. ఈ భూ కబ్జా ఆరోపణలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, భూమి కబ్జాకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వీసీని మంత్రి ఆదేశించారు. -
విశాఖ భూకుంభకోణం విచారణలో హైడ్రామా
విశాఖపట్నం: విశాఖపట్నం భూకుంభకోణం విచారణలో హైడ్రామా నెలకొంది. విశాఖపట్నంలో భారీగా తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదులతో వెల్లువెత్తుతుండగా.. ఈ స్కాంపై దర్యాప్తుకు ఏర్పాటైన సిట్ మాత్రం ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేసింది. బాధితుల ఫిర్యాదులతో అధికార పార్టీ నేతల భూకబ్జాల బాగోతం బయటపడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఫిర్యాదుల స్వీకరణ గడువును పెంచలేదు. సిట్ దర్యాప్తు పరిధిని పెంచినప్పటికీ ఫిర్యాదుల గడువును పెంచకపోవడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో కేవలం 276 ఎకరాలు మాత్రమే కబ్జా అయ్యాయని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనకు అందుతున్న ఫిర్యాదులకు మధ్య ఎక్కడ కూడా పొంతన కుదరడం లేదు. విశాఖలో 1700 ఎకరాలకుపైగా భూములు కబ్జా అయ్యాయని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. -
అన్నీ ఆధారాలను సిట్కు సమర్పించా: మంత్రి
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణాలపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట హాజరయ్యారు. భూ కబ్జాలపై ఆధారాలను సిట్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 లో భూ ఆక్రమణలపై కలెక్టర్ లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. కొంతమంది ప్రభుత్వభూముల నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని వివరించారు. సుమారు 1600 ఎకరాల భూముల రికార్డులను ట్యాంపర్ చేశారన్నారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే ఇచ్చి నష్టపరిహారం తీసుకున్నారని వెల్లడించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో భారీ మొత్తంలో చెల్లింపులు చేశారన్నారు. మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వ స్ధలాన్నే కాజేసి సొంత భూమని నమ్మించి కోట్ల రూపాయిలను బడాబాబులు కాజేశారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని కూడా సిట్ ముందు వుంచాననని అయ్యన్న చెప్పారు. మెడ్ టెక్ వ్యవహారంలో మంత్రి హోదాలో చెల్లింపులు ఆపమని లేఖ రాసినా చెల్లింపులు ఆగలేదన్నారు. మరి కొన్ని ఆధారాలతో ఈ నెల 19న సిట్ అధికారులను కలుస్తానన్నాని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. -
రాజా అక్రమార్క
♦ ఆ ఇద్దరిలో ఒకడే.. ఈ చేకూరి సుధాకర్రాజు ♦ పోలీసులకు చిక్కిన ట్యాంపర్ కింగ్ సుధాకర్రాజు ♦ ఇతని బాగోతాలను గతంలోనే బయటపెట్టిన సాక్షి ♦ కానిస్టేబుల్ నుంచి రియల్టర్ వరకు అన్నీ మోసాలే ♦ హైదరాబాద్ నుంచే విశాఖలో భూచక్రం తిప్పిన ఘనుడు ♦ మంత్రి, ఆయన తనయుడి అండతో అరాచకాలు ♦ ఏఆర్ కానిస్టేబుల్గా చేస్తూ.. డీఎస్పీనంటూ దందాలు చేయడంతో ఉద్యోగం ఊడింది.. ♦ దాంతో రియల్టర్ అవతారమెత్తాడు. మాటల చాతుర్యంతో అందరినీ బురిడీ కొట్టిస్తూ భూదందాలు మొదలెట్టాడు.. ♦ అంతేనా రికార్డులు తారుమారు చేసి.. అనుభవదారుల తలరాతలు మార్చేయడంలో తానే రాజుననిపించుకున్నాడు.. ♦ హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ దందాలు నడిపేవాడు.. మంత్రి, అతని కుమారుడి అండతో చెలరేగిపోయాడు.. ♦ కేసులెన్ని నమోదైనా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తప్పించుకోవడంలో ఘనుడనిపించుకున్నాడు.. ♦ దానికోసమే తన ఇంటి పేరును కూడా మార్చేసుకున్నాడు.. అయినా ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలకు చిక్కిన ఈ రాజా అక్రమార్కుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు. సాక్షి, విశాఖపట్నం: భూ దందాలు, రికార్డుల తారుమారుతోపాటు లేని కంపెనీలను సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టే ఆ ఘనుడే చేకూరి సుధాకర్రాజు అలియాస్ చింతాడ సుధాకర్రాజు. ఆరంభంలో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి డీఎస్పీ అవతారమెత్తి పోలీసులకు చిక్కిన కృష్ణా జిల్లాకు చెందిన ఈ సుధాకర్రాజు ఉద్యోగం పోగొట్టుకున్నాక హైదరాబాద్లో సెటిలయ్యాడు. కొన్నాళ్లకు విశాఖ స్థిరాస్తి వ్యాపారంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్లోనే ఉంటూ విశాఖలో భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నాడు. అతనిపై అప్పటికే పలు కేసులుండడంతో ఇంటి పేరును చేకూరికి బదులు చింతాడగా మార్చుకుని సీహెచ్ సుధాకర్రాజుగా చెలామణీ అవుతున్నాడు. నేతలతో బంధం కోట్లు గడించాక రాజకీయ నాయకులతో బంధాన్ని పెంచుకున్నాడు. వారి అండతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడం, రికార్డులను ట్యాంపర్ చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు, పాస్పుస్తకాలు సృష్టించడం, టైటిల్డీడ్స్ మార్చడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకం చేపట్టడం మొదలెట్టాడు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకస్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కుమారుడితో సంబంధాలు పెట్టుకున్నాడు. దీంతో అక్రమంగా కొట్టేసిన భూ ములను సక్రమం చేసుకునే పనిని తేలిక చేసుకున్నాడు. విశాఖలో వెలుగు చూసిన భారీ భూకుంభకోణంలో రికార్డుల ట్యాంపరింగే కీలకంగా మారింది. ఇందులో సుధాకర్రాజు పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. తహసీల్దార్ల వద్ద మాత్రమే ఉండాల్సిన డిజిటల్ కీని హస్తగతం చేసుకొని ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లోకి వెళ్లి డి పట్టా అని ఉన్న చోట ‘డి’ని ‘జి’గా మార్చేయడం.. అనుభవదారుల పేర్లు మార్చి వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు పుట్టిస్తాడు. వాటిని చూపి రిజిస్ట్రేషన్లు కూడా చేయించేస్తాడు. అంతేకాదు.. చేకూరి కెమికల్స్ పేరుతో ఒకటి, మరో ఇన్ఫ్రా ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టు లేని కంపెనీలను సృష్టించాడన్న ఆరోపణలున్నాయి. కేసులే కేసులు.. ఎండాడ, రుషికొండ, భీమిలి, మధురవాడ, కొమ్మాది, పీఎంపాలెంతో పాటు నగరంలోని సీతమ్మధార, వాల్తేరు, చినగదిలి, చినగంట్యాడ తదితర ప్రాంతాల్లో సుధాకర్రాజు భూదందాలకు, రికార్డుల ట్యాంపరింగ్కు పాల్పడ్డాడు. ఈయన అక్రమాలపై విశాఖ ఫోర్త్టౌన్, త్రీటౌన్, భీమిలి, పరవాడ, టూటౌన్, పీఎం పాలెం పోలీస్ స్టేషన్లలో 2012 నుంచి డజనుకు పైగానే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ రాజకీయ అండతో ఇన్నాళ్లూ అరెస్టు కాకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ చీటింగ్ రాజు జోలికెళ్లడానికి పోలీసులు కూడా సాహసం చేయలేకపోయారు. జూ సమీపంలోని సీతకొండ విశాఖ వ్యాలీ స్కూలు వద్ద 24.05 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లో ఉన్న సుధాకర్రాజును ఎట్టకేలకు విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కాల్డేటా తీస్తే.. సుధాకర్రాజు కాల్డేటాను పరిశీలిస్తే ఆయనుకు రాష్ట్రమంత్రి, ఆయన కుమారుడితో పాటు ఇతర నేతలతో ఉన్న లింకులన్నీ బయటపడే అవకాశం ఉంది. ఆ మంత్రి కుమారుడితో ఈయనకు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుధాకర్రాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వీరితో ఉన్న సంబంధాలు వెలుగు చూస్తాయి. ముందే చెప్పిన ‘సాక్షి’ సుధాకర్రాజు సాగిస్తున్న భూకబ్జాలు, భూదందాల వ్యవహారాన్ని ‘సాక్షి’ దినపత్రిక ముందే వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఎలా కాజేస్తున్నది, ఫోర్జరీ డాక్యుమెంట్లను ఎలా సృష్టిస్తున్నదీ, రికార్డుల ట్యాంపరింగ్కు ఎలా పాల్పడుతున్నదీ వెలుగులోకి తెచ్చింది. ఈయనకు రాష్ట్రమంత్రి, ఆయన తనయుడు సహకరిస్తున్న తీరునూ, హైదరాబాద్లో ఉంటూ సుధాకర్రాజు విశాఖలో భూ చక్రం తిప్పుతున్న తీరునూ పలు కథనాల ద్వారా బయటపెట్టింది. -
ఏమంటే ఏమవునో?
‘అవును.... ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత సమస్య. దానికి పదవినీ... పార్టీని అడ్డం పెట్టుకున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయమే.’ తెలుగుదేశం పార్టీలో ఎవరిని కదిపినా ఇదే వ్యాఖ్యానం. ‘అసలు మనమెందుకు దీనిపై మాట్లాడాలి. పూర్తి ఆధారాలతో సాక్షి ప్రచురించాక... ఇక చెప్పేదేం ఉంటుంది. ఏమైనా మాట్లాడితే అందులో మమ్మల్నీ జమకట్టేయరూ...’ ఇది కొందరి మనోగతం. ఇంకా కొందరైతే ఆయన బండారం బట్టబయలైందని సంబరపడుతున్నారు. ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది మరి... ఇప్పటికైనా అధిష్టానం దీనిపై స్పందిస్తే మంచిది’ అని పార్టీలోని ఇంకోవర్గం అభిప్రాయం. మొత్తమ్మీద మంత్రి సుజయ్కు... గిరిజనులకు మధ్య జరుగుతున్న వివాదం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ వారు చెప్పిందే వేదం... చేసిందే చట్టం అనుకున్నారు. అర్థ బలానికి అంగ బలం తోడైతే ఇక తమకు తిరుగే ఉండదని భావించారు. అందుకే అడ్డగోలుగా పార్టీ ఫిరాయించేశారు. ముఖ్యమంత్రితో బేరం కుదుర్చుకుని మంత్రి పదవిని కొట్టేశారు. ఇక ప్రణాళికా బద్ధంగా గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కునేందుకు పావులు కదిపారు. కానీ నిరుపేద గిరిజన రైతులను రోడ్డుపాలు చేయాలనుకునే ప్రయత్నం బెడిసి కొట్టినట్టయింది. టీడీపీ పరువు కాస్తా గంగలో పడేలా చేసింది. ఎప్పుడో ప్రభుత్వం పంచి పెట్టిన భూములను ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పి అన్యాయంగా వారి నుంచి లాగేసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ‘సాక్షి’ బయటపెట్టడం... దానికి విపక్షాలు గొంతు కలపడం... ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండించడం... సామాన్య మధ్యతరగతి ప్రజలైతే మంత్రుల నిజస్వరూ పం ఇదా అని విమర్శించడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే పార్టీలో సైతం దీనిని ఖండించేందుకు... దీనిపై వ్యాఖ్యానించేందుకూ... మంత్రి తరఫున మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. పెదవి విప్పితే పార్టీకే నష్టం మంత్రికి, గిరిజనులకు మధ్య నడుస్తున్న వివాదంపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, అసలే గిరిజనులు, వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని ఎవరికి వారు కిక్కురుమనకుండా కూర్చుంటున్నారు. అదీగాక సుజయ్ కృష్ణ రంగారావు సొంత వ్యవహారం కావడంతో దీనిపై నోరువిప్పితే తర్వాత ఎదురయ్యే ప్రజా వ్యతిరేకత వల్ల మొత్తం తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుందని భావించి మౌనం వహిస్తున్నారు. ఇక టీడీపీలో మరో వర్గం మాత్రం ‘సాక్షి’ కథనాలు, విపక్షాల విమర్శలతో మంత్రికి తగిన శాస్తి జరిగిందంటున్నారు. కేవలం ఆస్తులు కాపాడుకునేందుకే తమ పార్టీలోకి వచ్చారన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. జనానికి ఎలా చెప్పాలో... తాము చేసింది తప్పు కాదనీ... కేవలం తమకు చెందిన భూములనే తీసుకుంటున్నామని... జనాన్ని నమ్మించడం ఎలాగో అర్థం కాక బొబ్బి లి రాజులు సతమతం అవుతున్నట్టు తెలిసింది. దీనిపై సుజయ్ తన తమ్ముడు బేబీ నాయనతో చర్చించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం వల్ల జనం వద్ద చులకనైపోతున్నామేమోనన్న బెంగ కూడా వారిలో పట్టుకుంది. ఒకవేళ వాస్తవాలు ఇవీ అని చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో ఉం టారా అన్నది వారి సందేహం. అలా అని ఇప్పు డు వెనకడుగు వేసేందుకు కూడా అహం అడ్డొస్తోంది. అందుకే దీనిపై బొబ్బిలి కోట లోనూ తర్జనభర్జనలు సాగుతున్నాయంట. అధికారులు బెంబేలు ఈ అన్యాయానికి ప్రత్యక్షంగా సహకరించినవారు... ఏకంగా పాత్రధారులైన అధికారుల్లో ‘సాక్షి’ కథనాలు వణుకు పుట్టించాయనే చెప్పాలి. మంత్రి కదా ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ప్రజల్లో, పత్రికల్లో చులకనైపోతున్నామని తెలిసినా ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక చివరకు ‘ఏం రాసుకుంటారో రాసుకోండి.. మేం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’ అని బొబ్బిలి తహసీల్దార్ కోరాడ సూర్యనారాయణ వ్యాఖ్యానించారంటే ఆయనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ ఈ వ్యవహారంపై ఎలా స్పం దిస్తే ఏమవుతుందోనని ఏకంగా తెలియదని చెప్పుకొచ్చారు. గిరిజన రైతులకు ఇచ్చిన డి పట్టా భూములను మంత్రి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి తనకు ఇంత వరకూ తెలియదనీ. దానికి సంబంధించిన ఫైలుగానీ, ఫిర్యాదులు గానీ తమ దగ్గరకు రాలేదనీ, తహసీల్దార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాననీ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇలా జిల్లా టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా మంత్రి సుజయ కృష్ణ రంగారావు వ్యవహారం రచ్చ రచ్చకావడంతో బెంబేలెత్తిపోతున్నారు. -
సీబీఐ విచారణ జరపాల్సిందే!
♦ మియాపూర్ భూ కుంభకోణంపై కాంగ్రెస్ నేతల డిమాండ్ ♦ కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ రద్దుపై మండిపాటు సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించా ల్సిందేనని ఈ విషయంలో నిజానిజాలు తేలేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ అంశంపై తాము కలుస్తామని కోరగా, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత రద్దు చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిప డ్డారు. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినం దుకు ప్రతిఫలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడాలని కేంద్రం ప్రయత్నిస్తోందా? అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేందంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకాడడం దురదృష్టకర మని దిగ్విజయ్ పేర్కొన్నారు. కేంద్రానికి చెందిన భూములు కూడా ఈ కుంభకోణంలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు లేకుం డానే కేంద్రం సీబీఐ విచారణకు ఆదే శించవచ్చునని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాగా, మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్పిందేనని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్ చేశారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరడానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరామని, అయితే బుధవారం అపాయింట్ మెంట్ ఇచ్చి తర్వాత ఆరోగ్యకారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. మరో రోజు తమకు సమయం కేటాయించాల్సిందని, అసలు అపాయిం ట్మెంట్ లేదనడం అప్రజాస్వామికమని జానారెడ్డి విమర్శించారు. న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. టీఆర్ఎస్తో చీకటి ఒప్పందం: ఉత్తమ్ టీఆర్ఎస్ ప్రభుత్వంమీద వచ్చిన ఆరోపణలపై విచారణకు బీజేపీ సర్కార్ ఎందుకు వెనుకాడుతోందని, ఇది చీకటి ఒప్పందం కాదా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నిలదీశారు. పది నుంచి పదిహేనువేల కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేశారని, కనీస ఆయన వ్యక్తిగత కార్యదర్శికి కూడా వినతి పత్రం అందించడానికి అంగీకరించలేదని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. -
అక్రమాలే పెట్టుబడి కోట్లు రాబడి
- అడ్డగోలుగా వెనకేసుకున్న ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు - అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే - బంధువులు, డాక్యుమెంట్ రైటర్లే బినామీలు - ఇళ్లు, భూములు, కంపెనీల్లో భారీగా పెట్టుబడులు - ముగిసిన ఏసీబీ కస్టడీ.. ఆస్తులు బయటపెట్టిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన సబ్ రిజిస్ట్రార్ల ఆస్తులు వందల కోట్లకు చేరాయి. మియాపూర్ భూ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల బినామీలు, వారి ఆస్తులను ఏసీబీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు రూ.25 కోట్లు దాటిపోయాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు శ్రీనివాస్ రావు, రమేశ్ చంద్రారెడ్డి, యూసఫ్లను ఏసీబీ మూడ్రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. బుధవారం వీరి కస్టడీ ముగి యడంతో విచారణలో వెలుగులోకి వచ్చిన ఆస్తుల వివరాలను ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు మీడియాకు విడుదల చేశారు. శ్రీనివాస్రావు.. కళ్లు చెదిరే ఆస్తులు కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్గా పనిచేసిన శ్రీనివాస్ రావు ఆస్తులు రూ.25 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. ఆరు ఇళ్ల స్థలాలు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలోని మూసాపేట్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, 12 బ్యాంకు ఖాతాలున్నాయని గుర్తిం చింది. తన కుమారుడు కనిష్కతోపాటు మరి కొందరిని ఈయన బినామీలుగా పెట్టుకు న్నట్టు తెలిపింది. హాసిని పవర్ ప్రాజెక్ట్, నార్త్ స్టార్ హోమ్స్, మంజీరా హోల్డింగ్స్, ఐ–కాన్ నిర్మాణ కంపెనీల్లో రూ.14 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించింది. అలాగే మన్సూ రాబాద్లో రూ.15 లక్షల విలువైన ఇల్లు, సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్లో 33 ఎక రాల వ్యవసాయ భూమి, సికింద్రాబాద్ మారేడుపల్లిలో రూ.3.65 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్, రూ.1.3 కోట్ల ఇన్సూరెన్స్ బాండ్లు, రూ.2.38 కోట్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.90 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు, రూ.14 లక్షలతో తిరిగిన విదేశీ టూర్ల వివరాలు, పెళ్లిళ్లకు చేసిన రూ.30 లక్షల ఖర్చు వివరాలను బయటకు తెచ్చింది. రూ.30 లక్ష ల విలువైన ఫార్చూనర్ కారు, రూ.7 లక్షల జిప్సీ కారు, రూ.లక్ష విలువైన రెండు బైకులు, రూ.10 లక్షల విలువైన బంగారు అభరణా లను ఏసీబీ గుర్తించింది. అక్రమార్జనతో షెల్ కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిం చినట్టు ధ్రువీకరిం చింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.75 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది. యూసఫ్.. రూ.25 కోట్లపైనే.. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన మహ్మద్ యూసఫ్కు ఇప్పటికే హుమాయు న్నగర్, గుడిమల్కాపూర్లో జీ+1 ఇల్లు, బషీర్బాగ్లో ఒక ఫ్లాట్, బండ్లగూడలో ఒకటి, రాయదుర్గంలో ఒక ఇల్లు, శంకర్పల్లిలో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు బైకులు న్నట్టు గుర్తించారు. మూడ్రోజుల కస్టడీలో మరిన్ని ఆస్తులు బయటపెట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రూ.కోటి విలువైన రెండెకరాల భూమి, బ్యాంక్ ఖాతాలో రూ.49 లక్షల నగదు, రూ.6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.5 లక్షల విలువైన కారు, రూ.30 వేల విలువైన రెండు బైకులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన రూ.30 లక్షలతో తన కుమా రుడిని వైద్య విద్య చదివిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తన మామను బినామీగా పెట్టుకొని యూసఫ్ ఈ ఆస్తులు కూడబెట్టి నట్టు ఏసీబీ తెలిపింది. యూసఫ్ ఆస్తులు రూ. 12 కోట్లు ఉంటుంటాయని తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.25 కోట్లకు పైగానే ఉండ వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైటర్లే బినామీలు మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డి కొత్త పంథాలో అక్రమార్జనకు తెరదీశాడు. డాక్యుమెంట్ రైటర్లను బినామీలుగా మార్చుకొని వారి పేరిట భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు బయటపెట్టారు. గతంలో సోదాలు చేసిన సమయంలో రూ.3.65 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు, పదెకరాల వ్యవసాయ భూమి, ఒక ఇంటి స్థలం, మూడున్నర కేజీల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.1.07 కోట్ల నగదు, రూ.30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు ద్విచక్ర వాహనాలు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా కస్టడీలో విచారించగా నాగోలులో ఒక ఇల్లు, ఎల్బీనగర్ రాక్టౌన్ కాలనీలో ఫ్లాట్, కర్మన్ఘాట్లోని అగ్రికల్చర్ కాలనీలో ఒక ఫ్లాట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఆయన తన డ్రైవర్ను బినామీగా పెట్టుకున్నట్టు గుర్తించి అతడి ఖాతా ద్వారా రూ.కోటి పైగా నగదు చలామణి అయినట్టు వెల్లడించారు. ఈ కోటి రూపాయలను రమేశ్ తన పిల్లల వైద్య విద్య కోర్సుకు ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నారై బంధువుల పేరిట కూడా భారీగానే ఆస్తులు జమ చేసినట్టు ఏసీబీ తెలిపింది. రమేశ్ మొత్తం ఆస్తులు రూ.12 కోట్ల వరకు ఉంటాయని, అయితే మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.25 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
విశాఖలో భూకుంభకోణం వాస్తవం
హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తిరుపతి (అలిపిరి): విశాఖలో 300 ఎకరాలకు సంబంధించి భారీ భూ కుంభకోణం జరిగిందని వాస్తవాలు కూడా వెలుగులోకి తెచ్చింది కూడా రాష్ట్రప్రభుత్వమేనని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందన్నారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయాల్సి వుందని, ఈసారి పాలకవర్గంలో నాన్ పొలిటీషియన్కు స్థానం కల్పించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు. ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని,అ ందుకు తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ముందుకు పోవడం అభినందనీయమన్నారు. -
విశాఖ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించగలరా?
- పీలేరు ఎమ్మెల్యే చింతల సవాల్ పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దైర్యం ఉంటే విశాక భూస్కాంపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పీలేరులో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులో మాట్లాడుతూ.. తాను నిప్పునని నిత్యం చెప్పుకుంటున్న సీఎం, తన మంత్రివర్గ సభ్యులు ఏ తప్పు చేయనపుడు సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పెద్దలు తప్పు చేయలేదని నమ్మకం ఉంటే ఏ విచారణకైనా సిద్దం కావాలి తప్ప తాను ఆడించినట్లు ఆడే వారితో ‘సిట్’ వేయడమేంటని నిలదీశారు. సీఎం సహా టీడీపీ నేతలకు జగన్ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోందన్నారు. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద స్కాం జరగలేద్నారు. రికార్డులు తారుమారు చేసే హుద్హుద్ తుఫాన్లో రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం దుర్మార్గమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి విశాఖ ప్రజల భూములను బలవంతగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అక్రమాలు, స్కాంలపై విచారణకు సిద్ధం కాకుండా ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగడం టీడీపీ నేతల దిగజారుగుతనానికి నిదర్శమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా వర్ల రామయ్యను ప్రజలు తిరస్కరించారని, అయితే సీఎం వద్ద తన మనుగడ కాపాడుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని చింతల రామచంద్రారెడ్డి అన్నారు. -
‘విశాఖను భూకబ్జాల హబ్గా మార్చారు’
-
‘భూకుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే’
విజయవాడ: ఇద్దరు మంత్రుల మధ్య తగాదా పెట్టి భూ కుంభకోణం పై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం నాయకులు రాఘవులు అన్నారు. ఈ అంశంపై సిట్ దర్యాప్తు సరిపోదని సీబీఐ విచారణ చేపడితే అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. రాఘువులు సోమవారం ఉదయం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుఫాన్ పేరుతో రికార్డులు మాయం చేసి వేల కోట్లు విలువ చేసే భూములను దోచుకున్నారన్నారు. భూ కుంభకోణం పై రోజుకో విధంగా ప్రభుత్వం మాట్లడుతోందని విమర్శించారు. బ్యాంక్ల నుంచి లోన్లు తీసుకోవడానికే భూ రికార్డులు ట్యాంపర్ చేశారని డీజీపీ చెబుతున్నారని.. అయితే ఇది నేరం కాదా అని రాఘవులు ప్రశ్నించారు. -
శ్మశానాలనూ వదలరు
భూ కుంభకోణాల్లో మునిగిన టీడీపీ నేతలు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు ధ్వజం గుమ్మఘట్ట : భూ కుంభకోణాలతో టీడీపీ నేతలు నిండా మునిగారని, మరోసారి గనుక వారికి అవకాశమిస్తే శ్మశానాలను కూడా వదిలిపెట్టరని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలంలో పలు వివాహ, శుభకార్యాలకు సతీమణి కాపుభారతితో కలిసి కాపురామచంద్రారెడ్డి హాజరయ్యారు. బేలోడులో దళిత నేత రామాంజనేయులు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పెట్టేసి ప్రజాధనం దోచుకుని.. దాచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన భూకుంభకోణాలే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు విస్మరించి, వంచించిన వైనంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యం చేస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నా పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కల పెంపకం, వంకల్లో మట్టి తవ్వకం తదితర పనుల్లో అవినీతి భారీగా జరిగిందన్నారు. రాయదుర్గానికి వచ్చిపోయే (స్థానికేతర) నాయకులను నమ్మితే అభివృద్ధి సంగతి మరిచిపోవాల్సిందేనన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా నెలలో 26 రోజులపాటు ప్రజల మధ్యనే ఉంటూ వారి పక్షాన నిలిచి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతున్నానని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ, ఎస్సీసెల్ రాష్ట్ర్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, గోవిందు, పార్టీ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్ ఆర్టీ జగన్మోహన్రెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ జరిపించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ కుంభకోణాలపై తూతూ మంత్రంగా విచారణ జరిపితే న్యాయం జరగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ స్కాంల వెనక ఎవరెవరున్నారో వెలికి తీయకపోతే సీఎం కేసీఆర్ తప్పు చేసిన వారవుతారని, సమగ్ర విచారణ జరిపించడం ద్వారా సీఎం చిత్తశుద్ధి నిరూపించుకో వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఒక్కగజం కూడా అన్యాక్రాంతం కాలేదంటే ఎలా అని ప్రశ్నించారు. లోపభూయిష్టమైన రెవెన్యూ చట్టాలను మార్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోని కారణంగానే కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇచ్చినా కేసీఆర్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. -
విశాఖలో మరో భారీ భూకుంభకోణం!
బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్రాజు సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో జరిగిన మరో భారీ భూకుంభకోణ భాగోతాన్ని 15 రోజుల్లో బయటపెడతానని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్రాజు చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను బయటపెట్టబోయే కుంభకోణంలో ప్రజాప్రతినిధులే నేరుగా భూదోపిడీకి పాల్పడిన ఉదంతాలున్నాయని తెలిపారు. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నానని, అన్ని వివరాల్ని సాక్ష్యాధారాలతోనే మీడియా ముందుంచుతానని చెప్పారు. విశాఖ భూకబ్జాలపై ఇప్పటికే వెలుగులోకొచ్చిన అంశాలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్తో న్యాయం జరుగుతుందని ప్రజలెవరూ భావించట్లేదన్నారు. జరిగిన భూకుంభకోణంపై ఆరునెలల క్రితమే అసెంబ్లీ సాక్షిగా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను డిమాండ్ చేశానని, రాష్ట్రప్రభుత్వం అప్పుడే విచారణకు ఆదేశించివుంటే.. ఇప్పుడీ పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గదిలో వర్షపునీటి లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూకబ్జాలపై స్పందించివుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. 15వ తేదీన విశాఖలో ప్రజలందరి సమక్షంలో జరగాల్సిన బహిరంగ విచారణను రద్దుచేసి సిట్ద్వారా విచారణకు ఆదేశించడాన్ని ఆయన తప్పుపట్టారు. -
ఎంపీ హరి.. మౌనంతో సరి!
► విశాఖ భూకుంభకోణాలపై స్పందించని నేత ► నగర పరువు మంటగలుస్తున్నా సరే.. ► మిత్రపక్ష పెద్దల రక్షణకే కట్టుబడ్డారని ఆరోపణలు ► ప్రజాప్రతినిధిగా బాధితుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శలు ► సహచర బీజేపీ నేత గర్జిస్తున్నా.. ఈయనది మాత్రం మౌనముద్రే ‘విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాం.. అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులతో ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం’.. అని సందు దొరికినప్పుడల్లా సోది చెబుతుంటారు.. మన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారైన హరిబాబు.. పనిలో పనిగా సీఎం చంద్రబాబును, టీడీపీ జిల్లా నేతలను కీర్తించడం ఎన్నడూ మరిచిపోలేదు.. మరి అదే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా పేరుతో ఫలహారం చేసేసిన భారీ కుంభకోణం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది.. బ్రాండ్ ఇమేజ్ సంగతేమోగానీ.. విశాఖ పరువును మంటగలిపేసినా.. స్థానిక ఎంపీగా హరిబాబు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: భూ రికార్డులను తారుమారు చేసి.. గల్లంతు చేసి.. దర్జాగా కబ్జాలపర్వం సాగించిన బడా భూ చోరుల ఆగడాల వల్ల విశాఖ పరువు జాతీయస్థాయిలో దెబ్బతింటోందని విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ పెద్దల భూదాహానికి విశాఖ బ్రాండ్ ఇమేజ్ కొట్టుకుపోతున్నా.. స్థానిక ఎంపీగా హరిబాబు మాత్రం నోరు మెదపడం లేదు. సహచర పార్టీ నేత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు విశాఖ భూ దందాలపై సమయం దొరికినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. అధికార టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆధారాలతో సహా ముదపాక భూముల కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రను బట్టబయలు చేశారు. విశాఖ రూరల్, భీమిలితో సహా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఓ పక్క ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో రూ.2,200 కోట్ల విలువైన భూములకు చెందిన 1బీ రికార్డులు ట్యాంపరింగ్కు గురికాగా...లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యమ బాటలో విపక్షాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జాతీయస్థాయి ఉద్యమానికి నడుం బిగించాయి. ఇప్పటికే ముదుపాకలో ఆక్రమణకు గురైన భూముల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీకి చెందిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ మంత్రి గంటా ఏకంగా అయ్యన్నపై సీఎంకే ఫిర్యాదు చేశారు. ఇలా రోజురోజుకు ఈ భూ కబ్జాల దుమారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. కుంభకోణాల్లో అత్యధిక శాతం తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే జరుగుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా హరిబాబు వీసమెత్తయినా స్పందించ లేదు. ఆయన తీరుపై విశాఖవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలున్నందున సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తుంటే జాతీయ స్థాయిలో పరపతి కలిగిన హరిబాబు మాత్రం ఆ దిశగా తానూ ప్రయత్నిస్తానన్న పాపాన పోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం కబ్జాకోరుల పాలై మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని వ్యక్తినా.. ఎంపీనా తాము ఎంపీగా ఎన్నుకున్నది అని వారు ఆవేదన చెందుతున్నారు. ‘విశాఖకు అది చేశాం..ఇది చేశాం.. అని లేని గొప్పలు చెప్పుకోవడం కాకుండా తమ కష్టాలపై స్పందించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భూ కుంభకోణంపై ఎంపీ హరిబాబు నోరు విప్పి బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిత్రపక్ష పెద్దలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతే మాత్రం సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని భూ కబ్జాల బాధితులు హెచ్చరిస్తున్నారు. -
భూదోపిడీపై సీబీఐ విచారణ జరపాలి
► గవర్నర్ను కోరిన టీపీసీసీ బృందం ► ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక భూముల పందేరం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాజధాని శివారు భూమాయపై కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా కదిలారు. గురువారం గవర్నర్ను కలసి ఫిర్యాదు చేశారు. భూకుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్ర ఉందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ బృందం గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేతలు గవర్నర్ను రాజ్భవన్లో కలిశారు. దేశంలోనే ఇంతపెద్ద భూదోపిడీ, కుంభకోణం జరగలేదని ఆయనకు వివరించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతతో తక్షణమే స్పందించాలని గవర్నర్ను కోరారు. సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రజాపద్దుల కమిటీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, శ్రీశైలంగౌడ్, డి.సుధీర్రెడ్డి, బిక్షపతి యాదవ్, డీసీసీల అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, క్యామ మల్లేశం, ఒబేదుల్లా ఖాన్, సంతోష్కుమార్ గవర్నర్ను కలిసినవారిలో ఉన్నారు. హైదరాబాద్ శివారుల్లోని మియాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా దక్కించుకున్నారని ఫిర్యాదు చేశారు. సీఎం మాటమార్చడంలో మర్మమేమిటి? ప్రభుత్వ భూముల్లో భారీగా కుంభకోణం జరిగిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు గజం భూమి కూడా పోలేదని చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందని ఉత్తమ్కుమార్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ ఎదుట ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు, భూముల కుంభకోణానికి సంబంధముందని ఆరోపించారు. ప్రతీ ఫిరాయింపు వెనుక ప్రభుత్వ భూముల బదలాయింపు, అక్రమ రిజిస్ట్రేషన్ ఉందనే విషయాన్ని గవర్నర్కు వివరించామని చెప్పారు. ప్రభుత్వ భూములపై ఏర్పాటైన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నవారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, సీఎం పేషీ అధికారులు ప్రధానపాత్ర పోషిం చారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడినందుకే టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు తన 50 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. జాతీయస్థాయిలో పోరాటం: సీఎల్పీ తీర్మానం భూముల కుంభకోణంపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) తీర్మానించింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో గురువారం సీఎల్పీ సమావేశమైంది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు, జ్ఞానపీఠ్ అవార్డు‡ గ్రహీత సి.నారాయణరెడ్డికి సీఎల్పీ సంతాపం ప్రకటించింది. అనంతరం మియాపూర్సహా రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణం, వ్యవసాయం, రైతుల పరిస్థితిపై చర్చించి తీర్మానాలు చేసింది. ఈ సమావేశం వివరాలను శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి మీడియాకు వివరించారు. మియాపూర్ భూకుంభకోణం దేశంలోనే అతిపెద్దదని, సీబీఐ విచారణకు తగిన కేసు అని సీఎల్పీ అభిప్రాయపడినట్టు చెప్పారు. ఈ కుంభకోణంపై జాతీయస్థాయి పోరాటానికి కాంగ్రెస్పార్టీ చొరవ తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని పార్టీల నేతలతో వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్ను కలసి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లు వివరించారు. క్షేత్రస్థాయి పోరాటాలకు టీపీసీసీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో అన్ని జిల్లాల్లో సభలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్పార్టీ సీనియర్నేత, రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి పేరును నల్లగొండ జిల్లాలోని ఒక ప్రాజెక్టుకు పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు. -
గంటా, అయ్యన్నల మధ్య ‘ల్యాండ్’మైన్
- సీఎంకు గంటా లేఖాస్త్రం! - అయ్యన్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు - విశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు - భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ భూ కుంభకోణం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రగిలిస్తోంది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వైరం చినికి చినికి గాలివానగా మారుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు చాన్నాళ్లుగా ఉప్పు, నిప్పులా ఉంటున్నారు. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంలో గంటా పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నారంటూ గంటాను ఉద్దేశించి పత్రికా సమావేశాల్లోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో గంటా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అయ్యన్న వ్యాఖ్యల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి, విశాఖ ప్రతిష్ట దిగజారుతుందని అందులో స్పష్టం చేశారు. అయ్యన్న ఆరోపణలతో ప్రతిపక్షాలు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీపై అపనమ్మకం కలుగజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ గాని, సీబీసీఐడీ, లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇన్నాళ్లూ అయ్యన్న వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడని, లేఖల సంస్కృతికి దూరంగా ఉండే గంటా ఒక్కసారిగా సీఎంకు లేఖ రాయడం తెలుగుదేశం పార్టీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గంటా ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ బుధవారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గంటా ఈ లేఖను ఈనెల 4న సీఎంకు రాసినా ఆలస్యంగా బుధవారం బయటకు వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అంటున్నాయి. -
టీఆర్ఎస్ ఎంపీ కేకే కీలక నిర్ణయం
హైదరాబాద్: ఇబ్రహీపట్నం మండలం దండుమైలారంలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తమ కుటుంబం గోల్డ్స్టోన్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాల సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఇందుకు ప్రతిగా తాము భూములు కొనుగోలుకు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ఆయన కోరుతున్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించి.. తమకు భూమిని అమ్మినవారికి నోటీసులసు ఇస్తామని కేకే చెప్తున్నారు. సొంత టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితో పోదల్చుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక్కడ 36 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఈ నేపథ్యంలో సేల్ డీడ్ రద్దుచేసుకోవాలని కేకే నిర్ణయించారు. -
'దమ్ముంటే దీపక్రెడ్డిని సస్పెండ్ చేయండి'
విజయవాడ: చంద్రబాబు నాయుడికి దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భూ కుంభకోణంలో కూరుకుపోయి ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న దీపక్ రెడ్డి విషయం బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో జరిగిన భూదందాను డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్లు నిర్ధరించారు. ఈ అంశంపై సమస్యను పక్కదోవ పట్టించి దోషులను కాపాడేందుకే చంద్రబాబు సీట్ విచారణ అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ మాఫియాగా మారింది. ప్రతి అక్రమం వెనుక టీడీపీ నేతలే సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపించారు. -
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరండి
గవర్నర్కు టీటీడీపీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్కు టీటీడీపీ బృందం విన్నవించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, వేం నరేందర్రెడ్డి తదితరులు రాజ్భవన్లో గవర్నరును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎల్.రమణ, రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులూ ఈ కుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు. మియాపూర్ భూములను పేదలు ఆక్రమించుకోవాలని, వారికి టీటీడీపీ అండగా ఉంటుందని రేవంత్ అన్నారు. కబ్జా భూములు ప్రభుత్వానివేనని బోర్డులెందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కుంభకోణంలో కీలక పాత్రధారులపై ఇప్పటికీ కేసులు నమోదుకాలేదని విమర్శించారు. పాత్రధారుల కుటుంబీకులతో ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, దీంతో ఆయన చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. కుంభకోణంపై సమీక్షించాలని గవర్నర్ను కోరామని.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టరును కలసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని రేవంత్ చెప్పారు. -
భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ 22న తెలంగాణ పార్టీ ప్లీనరీ.. సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన ఎనీవేర్ రిజిస్ట్రే షన్ కాస్త ఎనీవేర్ కరప్షన్గా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఎమ్మెల్సీ దీపక్రెడ్డి భూ కుంభకోణా లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నెల 22న ప్లీనరీ.. ఈ నెల 22న హైదరాబాద్లోని నాగోలు ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్లీనరీ నిర్వహించనున్నట్లు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తా మన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, రాబోయే రెండేళ్లలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న వాగ్దానం అమలు ఏ దశలో ఉంది, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారో సమీక్షి స్తామని చెప్పారు. పాలమూరు–రంగా రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశం కోర్టుకు వెళ్లిందని.. ఈ విషయమై ప్రభుత్వ న్యాయ నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఈసీ సభ్యుడిగా సింగిరెడ్డి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సింగిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యు డిగా నియమించినట్లు శ్రీకాంత్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ‘‘విశాఖలో రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై వేల ఎకరాలు కబ్జా చేశారు.. ఇంత భారీ కుంభకోణంపై విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. విచారణ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే వాస్తవాలు వెల్లడవుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. శర్మ మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులు తారుమారవుతున్న విషయాన్ని సరిగ్గా ఏడాది క్రితమే తనతోపాటు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు, రవికుమార్ కలసి గుర్తించామని తెలిపారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పది కేసుల్లో ఇలా రికార్డులు ట్యాంపర్ అయినట్టుగా గుర్తించామన్నారు. ఈ విషయాన్ని అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. వెబ్ల్యాండ్ పేరుతో ల్యాండ్ రికార్డులను ఆన్లైన్తో పొందుపర్చే ప్రక్రియ సమయంలోనే ఈ భూబాగోతం జరిగిందని, ఈ భూకబ్జాలకు అమరావతిలో బీజం పడిందని శర్మ అన్నారు. -
ఏం ప్రవీణ్... ఏమిటీ రచ్చ! : చంద్రబాబు
జిల్లా కలెక్టర్కు చంద్రబాబు క్లాసు భూ కుంభకోణాలపై ఆరా వాటిపై మాట్లాడవద్దని హుకుం సాక్షి కథనాలపై చర్చ.. క్లిప్పింగుల పరిశీలన బహిరంగ విచారణ రద్దు.. సిట్ ఏర్పాటు విశాఖపట్నం : విశాఖలో పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్న భూ కుంభకోణాలు ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశం నేతల అండ చూసుకొని అక్రమార్కులు సాగిస్తున్న భూదందాలపై ఆధారాలతో ప్రధాని, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తామన్న అఖిలపక్షం హెచ్చరికలతో ప్రభుత్వ పెద్దలకు వణుకు పుట్టింది. ఈ పరిస్థితుల్లో బహిరంగ విచారణ జరిపితే మరింత రచ్చ అవుతుందన్న భయంతో దాన్ని రద్దు చేసి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ను అమరావతిలోని తన కార్యాలయానికి రావాలని సీఎం ఆదేశించారు. ఉదయం పదిన్నరకే అక్కడికి చేరుకున్న కలెక్టర్.. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ‘ఏం ప్రవీణ్.. విశాఖలో అసలేం జరుగుతోంది.. ఏమిటా రచ్చ.. ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకు బహిరంగంగా ప్రకటించావ్.. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగే ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది.. భూములు దోచేసిన వారంతా,. మన పార్టీ వాళ్లేనా.. బయటి వాళ్లు ఎవరూ లేరా... ఇదంతా ఎటుపోతోంది’.. అని చంద్రబాబు కలెక్టర్కు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. దానికి కలెక్టర్ మౌనం దాల్చారు. భూ కుంభకోణాలపై తన వద్దనున్న పక్కా సమాచారం, ఆయా అక్రమాల్లో టీడీపీ నేతల ప్రమేయంపై ఆధారాలన్నింటినీ బాబుకు అందించినట్టు తెలిసింది. అదేవిధంగా భూ దందాలపై ఇటీవల సాక్షిలో వచ్చిన వరుస కథనాల క్లిప్పింగ్లను కూడా కలెక్టర్ బాబు కు అందించినట్టు తెలిసింది. కలెక్టర్ ఇచ్చిన ఫైళ్లు, సాక్షి కథనాల క్లిప్పింగ్లను నిశితంగా పరిశీలించిన బాబు..‘మన వాళ్ల సంగతి నేను చూస్తా... ముందు అక్కడ రచ్చ కాకుం డా చూడండి.. పదే పదే భూ కుంభకోణా లపై మాట్లాడకండి.. మీరు కమిట్ అయిన ట్యాంపరింగ్పై మాత్రం పక్కాగా విచారణ చేపట్టినట్టు ప్రచారం కల్పించండి.. ఇందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పా టు చేస్తాను’.. అని బాబు సూచించి నట్టు సమాచారం. కలెక్టర్తో చంద్రబాబు సుదీర్ఘ భేటీ అనంతరం.. విశాఖ రూరల్ మండలంలోని కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ వివాదాలు, రికార్డుల ట్యాంపరింగ్లపై సిట్తో దర్యాప్తు చేయనున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. సిట్లో సభ్యుల పేర్లను ఇంకా ఖరారు చేయని ప్రభుత్వం.. ఆ బృందంలో రెవెన్యూ, పోలీసు,. న్యాయాధికారులు ఉంటారని పేర్కొంది. -
భూ కుంభకోణం ఆరోపణలపై కేకే వివరణ
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38 ఎకరాల భూమి విషయంలో తన కూతురు, కోడలుపై వచ్చిన ఆరోపణలపై ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ భూముల వ్యవహారంపై ఏ అధికారిని సస్పెండ్ చేయలేదని అన్నారు. 2013లో అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేసుకుని దండు మైలారంలో భూములు కొన్నామని, అయితే తాము వివాదంలో ఉన్న భూములు కొనలేదని తెలిపారు. భూముల కొనుగోలు పూర్తిగా చట్టప్రకారమే జరిగిందన్నారు. తమ కుటుంబం 50 ఎకరాలు కొన్న మాట వాస్తవమేనని, రెవెన్యూ పత్రాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆ భూములు కొన్నట్లు కేకే తెలిపారు. చట్టప్రకారమే భూములు కొన్నానని, తాను దొంగను కాదని అన్నారు. ఆ భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆర్డర్ కూడా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఎవరి దగ్గర భూములు కొన్నానో తనకు తెలుసునని కేకే తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యుడినని, చట్టాలు చేసేది తామేనని, వాటిపై గౌరవం ఉందని అన్నారు. కాగా సర్వే నెంబర్ 36లో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు మీద కొన్న 50 ఎకరాల్లో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. గోల్డ్ స్టోన్ కంపెనీ ఈ భూములను కేకే కుమార్తెకు అమ్మినట్లు సమాచారం. ఈ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి అధికారి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. -
బాబుకు తెలిసే భూమాయ!
► తుపాన్ సమయంలో విశాఖలోనే సీఎం ► అప్పుడే భూరికార్డులు మాయం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి రెండు ఉదంతాలను పరిశీలిస్తే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణ చేయాలని సీఎం పేషీ నుంచి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు సూచనలు అందగానే పాలకమండలి ఆమోదించి కార్యాచరణలోకి దిగింది. హుద్హుద్ తుపాన్ వచ్చినప్పుడు వేలాది రికార్డులు గల్లంతయ్యాయని చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు, బినామీలు రికార్డులను తారుమారు చేశారనే వాదనలు ఉన్నాయి. హుద్హుద్ సహాయ పనుల పర్యవేక్షణ పేరిట సీఎం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్లో మకాం వేశారు. ఆ సమయంలో ఆయనకు తెలియకుండానే రికార్డులు గల్లంతు అయ్యాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖలో 2,45,896 ఫీల్డ్ లెవల్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ)లు ఉండగా 16,735 ఎఫ్ఎంబీలు కనిపించకుండాపోయాయి. 3022 రెవెన్యూ సర్వీస్ రికార్డ్ (ఆర్ఎస్ఆర్)లు ఉండగా అందులో 379 అదృశ్యం అయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 233 మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలా వరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. రాష్ట్ర లైబ్రరీలో 4551 రికార్డులు భద్రపర్చడంతో వాటిని వెనక్కు తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రికార్డులు ఎందుకుపోయాయనే దానికి వారిస్తున్న సమాధానాలు వింటే నివ్వెరపోవడం ఖాయం! హుద్హుద్ తుపానులో ఈ రికార్డులు పోయాయని కలెక్టర్ చెబుతున్నారు. 2014 అక్టోబర్ 12న హుద్హుద్ తుపాను విశాఖ తీరాన్ని దాటింది. ఈ ఘటనల్లో ఎక్కడా తహసీల్దార్ కార్యాలయాలు కూలిపోయినట్లు, కొట్టుకుపోయినట్టు, ధ్వంసమైనట్లు రికార్డు కాలేదు. పైగా తహసీల్దార్లు, ఆర్డీవోలు, రెవెన్యూ సిబ్బంది కార్యాలయాల్లోనే ఉండి తుపాను పరిస్థితిని సమీక్షించారని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. ఇక సీఎం కూడా ఆ çసమయంలో విశాఖలోనే మకాం వేశారు. ఇదే సమయంలో రికార్డులు పోయాయని చెబుతున్నారు. తుఫాను నష్టాలకు సంబంధించిన వివిధ అంశాల ప్రస్తావనలో కూడా ఏ అధికారి రికార్డులు పోయాయని అప్పుడు చెప్పలేదు. ‘సాక్షి’లో భూ కుంభకోణాలపై వరుసగా కథనాలు వచ్చిన తర్వాతే అధికారులు రికార్డులు పోయాయని ఇప్పుడు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. రికార్డులు మాయమైన విషయాన్ని రెÆండున్నరేళ్ల తర్వాత గుర్తించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల అవకతవకలకు సంబంధించి కీలక అంశాలు, ఆధారాలు వెలుగులోకి రాకుండా తమను తాము రక్షించుకునేందుకు కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. హుద్హుద్లో కొట్టుకుపోయాయంటున్న భూరికార్డులివే విశాఖ జిల్లా భీమిలి మండలంలో 4500 ఎకరాలు, పెందుర్తిలో 3500, అనకాపల్లిలో 6500, యలమంచిలిలో 4000, విశాఖ నగరంలో 300 ఎకరాల భూముల రికార్డులు కనిపించడం లేదంటూ అధికారులే ప్రకటించారు. రెవెన్యూ సర్వీసు రికార్డులకు తోడు ఎఫ్ఎంబీ, రెవెన్యూ విలేజ్ మ్యాప్, సెటిల్మెంట్ ఫేర్ అడంగల్స్ కూడా హుద్హుద్ తుపానులో గల్లంతయ్యాయని చెప్పుకొచ్చారు. జిల్లాలో 2789 గ్రామాలకు మాత్రమే విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి. 233 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ మ్యాప్స్ లేని పరిస్థితి. ఆర్ఎస్ఆర్, ఎస్ఎఫ్ఏ, సెట్వార్స్ 3022 ఉండాల్సి ఉండగా. కేవలం 2643 మాత్రమే ఉన్నాయి. 379 గ్రామాలకు సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయి. రెవెన్యూ భూ రికార్డులను బట్టి జిల్లాలో ఎఫ్ఎంబీలు 2,45,896 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2,29,161కి మాత్రమే ఉన్నాయి. 16,735 ఎఫ్ఎంబీలు గల్లంతయ్యాయి. ఈ ఎఫ్ఎంబీలలో 1,06,239.6 ఎకరాల భూమి ఉంది. విశాఖ అర్బన్, గ్రామీణ మండలాల్లోనే 1463.74 ఎకరాలకు చెందిన 78 ఎఫ్ఎంబీలు మాయమయ్యాయి. వీటితోపాటు సెటిల్మెంట్ ఫెయిర్ అడంగళ్లు (ఎస్ఎఫ్ఏ)లు కూడా లక్షల సంఖ్యలో గల్లంతయ్యాయి. విశాఖపట్నం డివిజన్లో 79,691, అనకాపల్లి డివిజన్లో 72,640, నర్సీపట్నం డివిజన్లో 5,633, పాడేరు డివిజన్లో 1,37,116 ఎస్ఎఫ్ఏలు కనిపించడంలేదు. -
సమన్వయలోపం వల్లే భూకుంభకోణం: దత్తాత్రేయ
హైదరాబాద్ : మియాపూర్ భూకుంభకోణంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. మియాపూర్లో 696 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురికావటం బాధాకరమైన విషయమని, రెవిన్యూ , రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల విచ్చలవిడిగా భూకుంభకోణం ఆయన అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ..హెచ్ఎండీఏ, ప్రభుత్వ భూమిని బాహాటంగా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చెయ్యటం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలు పాటించనందువల్లే ప్రభుత్వానికి రూ.600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. భూకుంభకోణంపై వేసిన కమిటీ చేసిన ఆడిట్ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వివరాలు ప్రభుత్వం ఆన్లైన్ లో అందరికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ల విషయంలో టెక్నాలజీని ఉపయోగించి పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. భూ భారతి స్కీం (ఎలక్ట్రానిక్ ల్యాండ్ రికార్డింగ్ సిస్టం) సంపూర్ణంగా అమలు చెయ్యాలన్నారు. మా భూమి పోర్టల్ కు ప్రచారం కల్పించాలని సూచించారు. వెంటనే భూ చట్టాలకు సవరణలను తీసుకొని రావాలని అభిప్రాయపడ్డారు. భూ కుంభకోణంలో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఏడాదిలోనే డిగ్రీ పాస్.. భారీగా భూదందా!
హైదరాబాద్: సీసీఎస్ అధికారులు అరెస్టు చేసిన టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై గతంలో ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో దీపక్రెడ్డికి 15 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగ పత్రాలు సృష్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట దీపక్రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. 2012 ఉప ఎన్నికలో రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్రెడ్డి...2017లో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అయితే 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో 6 వేల 781 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించాడు. దాంతోపాటు కేవలం ఏడాది కాలంలోనే డిగ్రీ పాసైనట్లు దీపక్రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నాడు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడెలో అతనికి విలువైన మూడు ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అత్యంత ఖరీదైన 8084 చదరపు అడుగుల స్థలం, అదే రోడ్లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం వున్నాయి. అలాగే శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్ రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2400 గజాల స్థలం వున్నాయి. జూబ్లీహిల్స్లోనూ అతని భార్య పేరుతో 7 కోట్లకు పైగా విలువచేసే 16,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం వుంది. దీపక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ IPC 506 కింద అతనిపై రెండు కేసులు, అక్రమణలకు పాల్పడ్డాడంటూ IPC 447 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. కేసుల పరంపర అంతటితోనే ఆగలేదు. అడ్డుకోవడంతోపాటు దాడి చేశాడంటూ IPC 341 కింద కేసు, అల్లర్లకు పాల్పడ్డాడంటూ 147 సెక్షన్ కింద కేసు, మారణాయుధాలు కలిగి వున్నాడంటూ 148 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టేందుకే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డితో పాటు మరికొందరు ప్రయత్నించారని....విచారణలో అది నిజమని తేలడంతో అరెస్ట్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. దొంగ పత్రాలు సృష్టించి భూములు కొల్లగొట్టేందుకు యత్నించారని చెప్పారు. వందల ఎకరాల కబ్జా చేసినట్టు పలు స్టేషన్ల నుంచి ఫిర్యాదులు రావడంతోనే....కేసును విచారణకు స్వీకరించి అరెస్ట్ చేశామన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్తో ఆయన బాధితుల సంబరాలు అంబరాన్నంటాయి. బోజగుట్టలో బాధితులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా తమను దీపక్రెడ్డి బెదిరిస్తూ ఎన్నో భూములను కబ్జా చేశాడని...ఎట్టకేలకు దీపక్రెడ్డి అరెస్ట్తో తమ బాధలకు విముక్తి లభించిదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్లో ఉన్నా ఫోన్ లో రాయబారాలు సాధారణంగా రిమాండ్లో వున్న వ్యక్తి ఫోన్ ఉపయోగించడం రూల్స్ ఒప్పుకోవు. అయితే దీపక్ రెడ్డి ముందు రూల్స్ బలాదూర్ అన్నట్లుగా వుంది. ఆయనను 15 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ దీపక్ రెడ్డి పోలీసుల రిమాండ్లో ఉండగానే నింపాదిగా ఫోన్లో రాయబారాలు జరపడం సాక్షి కెమెరాకు చిక్కింది. -
భూ మాయాజాలం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు
విశాఖపట్నం: విశాఖ జిల్లా భూ మాయాజాలంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తహసీల్దార్ మజ్జి శంకర్రావుపై ఏసీబీ శాఖ దాడులు ప్రారంభించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసులు నమోదు చేసి పలుచోట్ల సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని గాజువాక సహా విజయనగరం, నర్సీపట్నం, బొబ్బిలి, శ్రీకాకుళంలో ఆయన బంధువుల నివాసాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. శంకర్రావు కుమారుడి అత్తగారు కొటవురట్ల ఎంపీపీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. శంకర్రావు గతంలో విశాఖ రూరల్ తహశీల్దార్గా పని చేశారు. ఈ సమయంలో శంకర్రావు పెద్దయెత్తున భూరికార్డులు మాయం చేసిన వ్యవహారంలో సస్పెండ్ అయ్యారు. తర్వాత ప్రభుత్వం నుంచి మళ్లీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. తనకు విశాఖ జిల్లాలోనే పోస్టింగ్ కావాలని పట్టుబట్టినప్పటికీ.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆయన ఇక్కడ వద్దంటూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ పరిణామాలతో శంకర్రావుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో విశాఖ భూరికార్డుల మాయంపై నమోదైన క్రిమినల్ కేసులో నిందితుడిగా శంకర్రావును చేర్చడంతో ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన ఆస్తుల వేటలో భాగంగా బుధవారం కూడా ఏసీబీ పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. -
విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే యత్నం: గంటా
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై మంత్రి గంటా శ్రీనివాస్రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' విశాఖకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించారు. రెవెన్యూ మంత్రి ఇక్కడకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణాన్ని అధికార పార్టీ సభ్యులమే బయటపెట్టాము. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని ఎవర్ని వదిలిపెట్టం. ఎంత పెద్ద వారైనా ఉపేక్షించేది లేదు' అన్నారు. శంకర్రావు ఆస్తుల పై ఏసీబీ దాడులకు, భూకుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదని.. ఏసీబీ తన పని చేస్తోందని అన్నారు. -
తిమింగలాలను తప్పిస్తారా
విచారణ తూతూ మంత్రమేనా? lవిశాఖ భూ కుంభకోణం విచారణపై బాధితుల్లో అనుమానాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూ కబ్జాల్లో భారీ తిమింగలాలను తప్పిస్తారా? విచారణ తూతూ మం త్రమేనా? ఇప్పుడు విశాఖ జిల్లా వాసుల్లో ఇవే సందేహాలు. విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్పై ఈనెల 15న ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో విశాఖ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయి తే దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వెల్లువెత్తాయి. టీడీపీ పెద్దలను గట్టున పడేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల వ్యవహారశైలి కూడా అనుమానాలు బలపడే విధంగానే ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్పై వచ్చిన ఫిర్యాదులపై అధికార యం త్రాంగం అత్యంత రహస్యంగా వ్యవహరిస్తోంది. వచ్చిన ఫిర్యాదుల్లో ఏ ఒక్కటీ బహిర్గతపరచొద్దంటూ భూముల కుంభకోణం వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కమాం డ్ కంట్రోల్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ నెల 15న జరిగే బహిరంగ విచారణపై బాధితుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా లేదా అనే ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగ రం.. దాని చుట్టుపక్కల గ్రామీణ మండలాల్లో భారీ ఎత్తున జరిగిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. డిప్యూటీì కలెక్టర్ పర్యవేక్షణలో తహసీల్దారు నేతృత్వంలో మే నెల 15 నుంచి 20 వరకూ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఐదు రోజుల్లో మధురవాడ నుంచి 25, కొమ్మాది నుంచి 5 ఫిర్యాదులు అందా యి. ఫిర్యాదుల వివరాల కోసం కమాండ్ కంట్రోల్ అధికారులను సాక్షి సంప్రదించగా..వివరాలు బహిర్గత పరచొద్దని ఆదేశాలున్నాయని వారు చెప్పారు. -
కోట్ల విలువైన భూమిని దోచుకుంటున్నారు
-
ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న
నర్సీపట్నం: భూ దోపిడీదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తాను నిజాన్ని నిర్భయంగా చెపుతానని, మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న.. విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. -
అసలు విశాఖలో ఏం జరుగుతోంది?
విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యరాయణ డిమాండ్ చేశారు. రికార్డుల టాంపరింగ్ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు విశాఖలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని, వాటి గురించి అడిగితే హుద్హుద్ తుపానులో కొట్టుకుపోయారని అంటున్నారని తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడూ చూడలేదన్నారు. భూస్కామ్తో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వేల ఎకరాల భూములను దోచేస్తున్నారని, ప్రభుత్వ భూములను కాపాడుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఏం జరుగుతుందో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా జరగదని మంత్రులే అంటున్నారని తెలిపారు. ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోరు? ఎవర్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలోనే భూస్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సమ్మిట్ల పేరుతో విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని బొత్స సత్యరాయణ విమర్శించారు. -
అసలు విశాఖలో ఏం జరుగుతోంది?
-
ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా
-
టీడీపీ నేతలు వేల ఎకరాలు కబ్జా చేశారు
-
‘ల్యాండ్’ మైన్స్!
► రోజురోజుకూ పెరిగిపోతున్న మియాపూర్ భూముల స్కాం పరిధి ► మొత్తం ఎకరాలు816 ► స్కాం విలువ15,000 కోట్లు ► ఎల్బీనగర్, బాలానగర్లకూ విస్తరించిన అక్రమాలు ► ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అరెస్ట్.. దందా వెనుక బడాబాబులు ► గోల్డ్స్టోన్ ప్రసాద్కు ఉన్నతాధికారుల అండ ► 2002లో హైదర్నగర్లో వంద ఎకరాలు కాజేసే యత్నం ► శంకర్పల్లి ప్రాంతంలో ఓ చానల్ సీఈవోతో కలసి భూముల కొనుగోలు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణాన్ని తవ్వేకొద్దీ విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ స్కాం ఏకంగా 816.04 ఎకరాలకు విస్తరించింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులకు కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సబ్ రిజిస్ట్రార్లు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు అరెస్టయ్యారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ అధికారులతో రియల్టర్లు, అక్రమార్కుల కుమ్మక్కుతోనే ఈ భారీ కుంభకోణం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా... మియాపూర్, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో అక్కడ ఎకరా రూ.15 కోట్ల దాకా పలుకుతోంది. దీంతో వీటిపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, రియాల్టర్లు రంగంలోకి దిగారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తమకు అనువుగా మార్చుకున్నారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఈ కుంభకోణానికి తెరలేపారు. సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, 20లో 109.18 ఎకరాలు, 28లో 145.26 ఎకరాలు, 100లో 207 ఎకరాలు... ఇలా మొత్తం 693.04 ఎకరాలపై బడాబాబులు కన్నేశారు. 2016 జనవరి 15న అమీరున్నీసా బేగంతో పాటు మరికొందరు ఆ భూములపై తమకు హక్కులున్నాయని, వాటిపి ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ తదితరులకు దఖలు పరుస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన రాచకొండ శ్రీనివాసరావు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా అనుమతించడంతోపాటు ఆ భూములకు ఎలాంటి మార్కెట్ విలువ లేదంటూ రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించేశారు. ఈ కేసులో శ్రీనివాసరావుతోపాటు పార్థసారథి, పీవీఎస్ శర్మలను సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుల జాబితాలో ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్, దానికి డైరెక్టర్గా ఉన్న గోల్డ్స్టోన్ ప్రసాద్ (డాక్టర్ పి.సంజీవని ప్రసాద్) భార్య పి.ఇంద్రాణి ప్రసాద్, మరో డైరెక్టర్ మహితా కడ్డల్, సికింద్రాబాద్లోని సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్, గోల్డ్స్టోర్ ఇన్ఫ్రాటెడ్ లిమిటెడ్లో సివిల్ ఇంజనీర్గా పని చేస్తూ సువిశాల్ సంస్థలో డైరెక్టర్గా ఉన్న సయ్యద్ రఫియుద్దీన్ తదితరులను చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భూమాయ వెనుక గోల్డ్స్టోన్ ప్రసాద్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా టెక్ కంపెనీతోపాటు ట్రినిటీ ఇన్ఫ్రా, సువిశాల్ పవర్ జెన్ సంస్థల పుట్టుపూర్వోత్తరాలు తవ్వే పనిలో ఉన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు లేక కూడా రాశారు. మరో రెండు ఫిర్యాదులు భూ కుంభకోణాలకు సంబంధించి కూకట్పల్లి ఠాణాలో ఉన్న కేసుకు తోడు మియాపూర్ పోలీసుస్టేషన్లోనూ మంగళవారం రెండు ఫిర్యాదులు అందాయి. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తిరుపతిరెడ్డి, హెచ్ఎండీఏ సైట్ ఆఫీసర్ జోగారావు ఈ ఫిర్యాదులు చేశారు. మియాపూర్ గ్రామం సర్వే నం.44లో 25 ఎకరాలు, 45లో 85 ఎకరాలు సైతం ఇదే రకంగా అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కుంభకోణం విస్తృతి 693.04 ఎకరాల నుంచి 816.04 ఎకరాలకు చేరినట్లైంది. మొత్తం దాదాపు రూ.15 వేల కోట్ల స్కామ్ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరి అరెస్ట్.. మియాపూర్ స్కాంపై దర్యాప్తు సాగుతుండగానే... ఎల్బీనగర్, బాలానగర్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్లు రమేశ్ చంద్రెడ్డి, యూసుఫ్ అరెస్టయ్యారు. భూముల రిజిస్ట్రేషన్న్ భాగోతంలో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు అక్రమార్కులకు ఇచ్చిన స్టాంపు డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వానికి ఏకంగా రూ.587.11 కోట్ల ఆదాయానికి గండి పడింది. సబ్ రిజిస్ట్రార్లు ఇలా అక్రమార్కులకు సహకరించడం వెనుక పెద్దల హస్తం సైతం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్న్ వివరాలను రిజిస్ట్రార్లు బుక్–1లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూడకుండా ఉండేందుకు అరెస్టయిన సబ్ రిజిస్ట్రార్లు ఆ వివరాలను చరాస్తులను రిజిస్ట్రేష¯న్ చేసే బుక్–4లో నమోదు చేయడం గమనార్హం. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ.. ఆడిట్లో ఈ విషయం గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి చేరిన నివేదికను కొందరు పెద్దలు తొక్కిపెట్టారని తెలుస్తోంది. గోల్డ్స్టోన్ ప్రసాద్కు ఉన్నతాధికారుల సహకారం నగర శివార్లలో ప్రభుత్వ భూములు కాజేయడం గోల్డ్స్టోన్ ప్రసాద్కు కొత్తమీ కాదు. 2002లోనూ ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేషీలో ఓ ఉన్నతాధికారి సహకారంతో హైదర్నగర్లో వంద ఎకరాలకు పైగా కాజేసే ప్రయత్నంలో అనేక నకిలీ పత్రాలు సృష్టించాడు. తాను అనుకున్న పని పూర్తి చేసేందుకు అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఎరచూపడం, ఆస్తులు కొనుగోలు చేసి ఇవ్వడం ప్రసాద్కు అలవాటు. ఇలా మియాపూర్లో అత్యంత విలువైన వందలాది ఎకరాలను చేజిక్కించుకున్నాడు. ప్రైవేట్, ప్రభుత్వ భూములను కొల్లగొట్టాడు. చనిపోయిన వ్యక్తుల పేరిట నకిలీ జీపీఏలు సృష్టించి వేల కోట్ల అక్రమార్జన ధ్యేయంగా ఫోర్జరీ సంతకాలు, బీనామీ వ్యక్తులతో సూట్కేస్ కంపెనీలను సృష్టించి బడా రియల్టర్లను, వ్యాపారస్తులను మోసం చేసిన తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో తన సమీప బంధువు ఒకరి సాయం తీసుకోవడం ద్వారానే భూ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ అధికారి పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టీవీ ఛానల్ సీఈవోతో కలసి.. ప్రముఖ ఛానల్ సీఈవో ఒకరితో కలిసి గోల్డ్స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బయటపడింది. ఇందుకు మూడు కంపెనీలను సృష్టించిన ప్రసాద్.. సదరు టీవీ చానల్ సీఈవో కుటుంబ సభ్యులు ఇద్దరినీ అందులో డైరెక్టర్లుగా నియమించాడు. ఈ భూములకు సంబంధించి సర్వాధికారాలు కంపెనీ డైరెక్టర్లవే. పన్నెండేళ్ల క్రితమే ఈ భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అవి కంపెనీ ఆధీనంలోనే ఉన్నాయా లేదా అన్న అంశంపై పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. జూన్ 2కు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో అరెస్టయిన కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు, స్థిరాస్తి వ్యాపారులు పార్థసారథి, పీవీఎస్శర్మలు వేసిన బెయిల్ పిటిషన్ విచారణను మియాపూర్ కోర్టు జూన్ 2కు వాయిదా వేసింది. అలాగే వీరిని కస్టడీలోకి కోరుతూ మియాపూర్ పోలీసులు వేసిన పిటిషన్ను మియాపూర్ కోర్టు కొట్టేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎంఎస్జే కోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. -
మేడ్చల్ సబ్రిజిస్ట్రార్ అరెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రభుత్వం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్సన్ వేటు వేసింది. బాలనగర్ సబ్రిజిస్ట్రార్ యూసఫ్, మేడ్చల్ సబ్రిజిస్ట్రార్ చంద్రారెడ్డి, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మేడ్చల్ సబ్రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి, బాలనగర్ సబ్రిజిస్ట్రార్ యూసఫ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
భారీగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు
భూకుంభకోణం నేపథ్యంలో సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 29 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వివిధ జిల్లాల సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. డీఐజీ, జిల్లా కార్యాలయాల్లో సూపరిం టెండెంట్లుగా పనిచేస్తున్న వారికి సబ్ రిజిస్ట్రార్లుగా పోస్టింగ్ ఇచ్చారు. భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి, బాలా నగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇక చంపాపేట, గండిపేట, శంకర్పల్లి, రాజేంద్రనగర్, ఆజంపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లను వారి స్థానాల నుంచి బదిలీ చేసినా.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సీఎం, డిప్యూటీ సీఎంలతో రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నబీ, నోడల్ డీఐజీ శ్రీనివాసులు మంగళవారం రాత్రి వరకు కసరత్తు చేసిన అనంతరం ఈ బదిలీలు జరిగాయి. -
ఎవరినీ ఉపేక్షించబోం
కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ బద్మాష్ పనిచేశారు: మహమూద్ అలీ అక్రమాలకు పాల్పడే సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు బద్మాష్ పనిచేశాడు. బాధ్యత కలిగిన రిజిస్ట్రేషన్ల శాఖ పరువును పూర్తిగా బద్నాం చేశాడు. దొంగపని చేయడం వల్లే జైలు పాలయ్యాడు..’ అని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్లో వందల ఎకరాల భూముల కుంభకోణం, కూకట్పల్లిలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసేపుడు కనీసం పైఅధికారులను సంప్రదించకుండా కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు దుర్మార్గమని.. దీనిపై ఆ శాఖ మంత్రిగా తాను తీవ్రంగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. బాలానగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్లపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ముఖ్యమంత్రి భారీగా వేతనాలు పెంచారని.. అయినా కొందరు అధికారులు ఇలా వ్యవహరించడంపై దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే మియాపూర్ భూకుంభకోణంలో రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు. కొంత ఆలస్యమైంది.. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా రిజిస్ట్రార్లదేనని, కూకట్పల్లి ఆఫీసులో జరిగిన అక్రమాలను తెలుసుకునే విషయంలో కొంత ఆలస్యమైందని మహమూద్ అలీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా మూడు లేదా ఆరు నెలలకోసారి తప్పనిసరిగా ఆడిట్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. అక్రమాల నియంత్రణ కోసం అధికారులతో చర్చించి రెండు మూడు రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని.. ఒకేచోట సంవత్సరాల తరబడి ఉన్న అధికారులను బదిలీ చేస్తామని తెలిపారు. కాగా.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వలన ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. అయితే కొందరు దొంగలకు కూడా ఉపయోగపడుతోందని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసే విషయమై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు.