ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం | Thousands of crores land scam behind the cancellation of Pharma City | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం

Published Fri, Sep 27 2024 4:28 AM | Last Updated on Fri, Sep 27 2024 4:28 AM

Thousands of crores land scam behind the cancellation of Pharma City

సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం 

ముఖ్యమంత్రి ఓ పిచ్చోడు.. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు 

రైతుల రుణాలు మాఫీ కాలేదు.. రైతు భరోసా ఇవ్వలేదు 

కాంగ్రెసోళ్లను రైతులు తన్నేటట్లు ఉన్నారు 

కొందరు అధికారులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు

సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌ సిటీ, ఫోర్త్‌ సిటీ అంటూ.. ఫోర్‌బ్రదర్స్‌కు రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్‌ సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్‌ చేసిండ్రు.. కేసీఆర్‌ కిట్లు లేవు.. రంజాన్‌ తోఫా లేదు.. క్రిస్మస్‌ కానుక లేదు. 

సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్‌ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు.
  
రికవరీ చేస్తాం... 
రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్‌ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్‌ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్‌ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.

హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా  రేషన్‌ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు.   

హైకోర్టునూ మోసం చేస్తున్నారు... 
ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. 

ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్‌ సిటీ, ఫోర్త్‌ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్‌ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సిటీ, ఫోర్త్‌ సిటీ, ఫ్యూచర్‌ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్‌ నిలదీశారు. 

ఈ మేరకు కేటీఆర్‌ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement