రాష్ట్ర విభజనకు కేంద్ర హొం మంత్రిత్వ శాఖ రాజ్యాంగ సవరణను సూచించింది. విభజనకు సంబంధించి నియమించిన మంత్రుల బృందం(జీఓఎం)కు హొం మంత్రిత్వ శాఖ ఒక నివేదిక సమర్పించింది. 85 పేజీల ఈ నివేదికలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. హైదరాబాద్, వనరుల పంపిణీ, సాగు నీరు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలను ముఖ్యమైన అంశాలుగా హొం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవసరమైతో ఆర్టికల్ 371డిని సవరించాలని సూచన చేసింది. ఈ నాలుగు అంశాల విషయంలో స్పష్టత వస్తే విభజన సాధ్యమేనని ఆ శాఖ తెలిపింది. ఇంకా ఈ నివేదికలో శాసన, పాలన, న్యాయపరమైన అంశాలను ప్రస్తావించింది.
Published Tue, Oct 29 2013 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement