GoM
-
జీఎస్టీ స్లాబ్ల్లో మార్పులు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి స్లాబ్ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ అత్యున్నత స్థాయి సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.జీవోఎం కన్వీనర్గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్టీ పన్ను స్లాబ్లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్ను విధిస్తున్నారు. -
ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై మంత్రుల కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సహా మంత్రులతో ఏర్పాటుకానున్న కమిటీ ఈ నాలుగు రంగాలలో ఎన్ని పీఎస్యూలను కొనసాగించేదీ నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు వ్యూహాత్మక రంగాలుగా ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రంగాలలో సాధ్యమైనంత తక్కువగానే ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశంపై నీతి ఆయోగ్ ప్రాథమిక జాబితాను రూపొందిస్తోంది. తద్వారా ప్రభుత్వం వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టనుంది. ఇతర రంగాలను ప్రయివేటైజ్ చేయనుంది. తద్వారా ప్రయివేటైజ్ చేయనున్న కంపెనీలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్కు కేబినెట్ ఓకే..: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్)ను ప్రయివేటైజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అనుమతించినట్లు పాండే తాజాగా ట్వీట్ చేశారు. కంపెనీలో 100 శాతం వాటాను విక్రయించేందుకు గత నెల 27న గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్లో భాగంగా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించారు. ప్రైవేటీకరణ లేదా విలీనం జాతీయ భద్రత, కీలక మౌలికసదుపాయాలు, ఇంధనం, మినరల్స్, ఫైనాన్షియల్ సర్వీసులను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎంపిక చేశారు. వీటిలో అతి తక్కువగా పీఎస్యూలను కొనసాగించే వీలున్నట్లు పాండే తెలియజేశారు. మిగిలిన కంపెనీలను ప్రైవేటీకరించడం, విలీనం, ఇతర సీపీఎస్ఈలకు అనుబంధ సంస్థలుగా మార్చడం లేదా మూసివేయడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. వెరసి ప్రభుత్వ రంగ కంపెనీలలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయిన్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్లో డిజన్వెస్ట్మెంట్ను వేగవంతం చేయనున్నట్లు వివరించారు. -
కొత్త కేసులు 24,879
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 487 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 7,67,296కు, మరణాలు 21,129కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,69,789 కాగా, 4,76,377 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 62.08 శాతానికి చేరుకుంది. సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు భారత్లో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చేసిన ప్రకటనపై రాజేశ్ భూషణ్ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. 90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే... దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో గురువారం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. -
వచ్చే 3నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ..
శ్రీనగర్/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ఇంటర్నెట్ చాలా ప్రమాదకరం ‘ఇంటర్నెట్ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. రాహుల్ రాజకీయ బాలుడు కశ్మీర్లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్ మాలిక్ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్ చేసిన ప్రకటనను వాడుకుని పాక్ ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను సమర్థించే కాంగ్రెస్ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్లో కాంగ్రెస్ నేత(ఆధిర్ రంజన్ చౌధురి) కశ్మీర్పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్పై జీవోఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర సభ్యులు. ఈ బృందం ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్లో ఉంటుంది. ‘కశ్మీర్’ అంతర్గత అంశమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్లో హింసను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్ హస్తం ఉందన్నారు. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన పిటిషన్లో రాహుల్ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పాక్ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి: జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ బుధవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్ను ప్రశ్నించారు. కశ్మీర్ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్ బుధవారం ట్వీట్ చేయడంపై జవదేకర్ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్ అంశంపై రాహుల్ యూ–టర్న్ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు. రాహుల్కు ముద్దు వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
లైంగిక వేధింపులపై జీవోఎం
న్యూఢిల్లీ: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. ఇందులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుందని హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. పని ప్రదేశంలో మహిళల గౌరవాన్ని కాపాడటానికి, భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ–బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తామని వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
#మీటూ ఎఫెక్ట్: రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్లకు కమిటీలో చోటు కల్పించారు. -
ఎట్టకేలకు గట్టి బిల్లు
ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డులు మొదలుకొని బాలబాలికలు, యువతుల వరకూ వేలాదిమందిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ఎట్టకేలకు ఒక సమగ్ర చట్టం రాబోతున్నది. దీనికి సంబంధించి రూపొందించిన బిల్లు ప్రస్తుతం మంత్రుల బృందం(జీఓఎం) పరిశీలనలో ఉంది. నాగరిక విలువలనే సవాలు చేస్తున్న మనుషుల అక్రమ తరలింపు దుర్మార్గాన్ని అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాలు చాలడం లేదని, ఆ విషయంలో అత్యంత కఠినమైన చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నడో 2004లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై ఆ న్యాయస్థానం ఆదేశాలిచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఇన్నాళ్లకు ఆ బిల్లు రూపుదిద్దుకుంది. మాదక ద్రవ్యాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతంగా చాపకింద నీరులా సాగిపోతున్న నేరం మనుషుల అక్రమ తరలింపే. ఈ మాఫియా సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి అమాయక ఆడపిల్లల్ని వలలో వేసుకునే దళారులు మొద లుకొని అనేకులున్నారు. బాధితుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికీ తర లించడం, దేశ సరిహద్దులు కూడా దాటించడం ఇటీవలికాలంలో పలుమార్లు బయటపడింది. ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న వీరేందర్ దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు కేంద్రాల్లో దాదాపు 50మంది యువతులు, బాలికలను కాపాడారు. దాడులు జరగ బోతున్నాయని ముందస్తు సమాచారం అందుకుని చాలామందిని అప్పటికే వేరే చోటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. నిరుడు పశ్చిమబెంగాల్లో వెల్లడైన ఉదంతం మరింత దుర్మార్గమైనది. రోజుల వయసున్న పిల్లల్ని బిస్కెట్ల పెట్టెల్లో పెట్టి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. ప్రసవించిన తల్లికి బిడ్డ పుట్టగానే మరణించిందని అబద్ధం చెప్పి, అందుకు కోర్టు గుమాస్తాల ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తెప్పించి ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడప్పుడు దేశంలో వివిధ రైల్వే స్టేషన్లలో పదులు, వందల సంఖ్యలో పిల్లల్ని తరలిస్తూ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్నవారిలో బాలికలనైతే వ్యభిచార కేంద్రాలకు విక్రయించడం, మగపిల్లల్ని వెట్టి చాకిరికి వినియోగించుకోవడానికి అమ్మడం సర్వసాధారణం. ఇవికాక పిల్లల అవయవాలు తొలగించి వారిని యాచక వృత్తిలోకి నెట్టడం కూడా రివాజు. మనుషుల అక్రమ తరలింపు రకరకాల ముసుగుల్లో సాగుతోంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామని, ఇంటి పనులకు అవసరమని, అనాథలకు ఆశ్రయమిస్తామని, దత్తత కోసమని మభ్యపెట్టి అమాయక బాలబాలికలను తెచ్చి నరకకూపాల్లోకి తోస్తున్నారు. వ్యవసాయంలో, ఇటుకల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయించడానికి లేదా వ్యభిచారం చేసేందుకు తరలిస్తున్నారు. పిల్లలను చీకటికొట్టాల్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి వారిని దారికి తెచ్చుకుని ఇదంతా సాగిస్తున్నారు. అపహ రించిన పిల్లల ద్వారా ఏటా దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నదని అంచనా. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం నిరుడు మనుషుల అక్రమ తరలింపు కేసులు 8,132 నమోదయ్యాయి. అంతక్రితం సంవత్సరం ఈ మాదిరి కేసులు 6,877. రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్, రాజస్థాన్లలో మహిళల అపహరణలు అధికంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఈ మాదిరి కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. 2015లో న్యాయస్థానాల ముందు 5,003 కేసులుంటే కేవలం 384 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది. ఇందులో 55 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే 14.4 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. చట్టంలో నేరాల నిర్వచనం సక్రమంగా లేకపోవడం, ఆ చట్టాల అమలులో చూపే నిర్లక్ష్యం నేరగాళ్లకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మన దేశంలో భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. మనుషుల అక్రమ తరలింపుపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికి మూడుసార్లు ముసాయిదా బిల్లులు రూపొందించింది. అయితే అందులోని లోటుపాట్లు ఎత్తి చూపి వాటిని సవరిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని వివిధ సంస్థలు, వ్యక్తులు చెప్పడంతో తగినంత సమగ్రతతో తాజా బిల్లు రూపొందించారు. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయనాలు లేదా హర్మోన్లు ప్రయోగించడం, అవయవాలను తొలగించి పిల్లలను భిక్షాటనలో పెట్టడం, వెట్టిచాకిరీ కోసం మనుషుల్ని తర లించడం, వ్యభిచార వృత్తిలోకి దించడం, పిల్లలను మానవ కవచాలుగా లేదా సైనికులుగా వినియోగించడం, లైంగిక దోపిడీకి పాల్పడటం, వారిని అశ్లీల చిత్రాల్లో వినియోగించడం వగైరా నేరాలకు తాజా బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదించింది. అలాగే జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ తరలింపు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం నెలకొల్పాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక అధి కారులుంటారు. మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లలో పాలుపంచుకునేవారికి ఈ బిల్లు కనీసం ఏడేళ్ల కఠిన శిక్ష, గరిష్టంగా పదేళ్ల శిక్ష ప్రతిపాదిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి వాటిని ప్రచారంలో పెడతామని బెదిరించి బాధితులనుంచి లేదా వారి కుటుంబాలనుంచి డబ్బులు వసూలు చేసినా, ఇతరత్రా ఒత్తిళ్లు తెచ్చినా మూడు నుంచి ఏడేళ్ల శిక్ష విధిస్తారు. ఈ బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారడం తక్షణావసరం. అలాగే ఎంత కఠినమైన చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఉద్దేశం నెరవేరదు. అందువల్ల నేరగాళ్లతో కుమ్మక్కయ్యే, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుండాలి. బాధితులకు పునరావాసం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తేనే ఈ దుర్మార్గం దుంపనాశనమవుతుంది. -
రెస్టారెంట్లలో జీఎస్టీపై జీవోఎం ఏర్పాటు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో జీఎస్టీ పన్ను రేట్లపై పునఃసమీక్ష, కంపొజిషన్ పథకాన్ని మరింత సులభతరంగా రూపొందించేలా సూచనల కోసం అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిస్వా నేతృత్వంలో మంత్రుల కమిటీ(జీవోఎం) ఏర్పాటైంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన జీఎస్టీ మండలి భేటీలో జీవోఎంను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో మంత్రుల కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్, చత్తీస్గఢ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్లు ఇతర సభ్యులుగా ఉంటారు. -
జీఎస్టీ సవాళ్లపై ప్రత్యేక కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో ఐటీ సవాళ్లు, ఎగుమతులపై ప్రత్యేక కమిటీలను నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 21వ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్తో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కమిటీని నియమించినట్లు తెలిపింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కమిటీని పర్యవేక్షించనున్నట్లు వివరించింది. చత్తీస్ఘడ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి డా. టీఎమ్ థామస్ ఐసాక్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోని కమిటీ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులో ఐటీ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి పని చేస్తుందని తెలిపింది. ఎగుమతులపై నియమించిన కమిటీకి రెవెన్యూ శాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఎగుమతులలో ఏర్పడుతున్న అడ్డంకులు, జీఎస్టీ తర్వాత ఎగుమతులను పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్కు ఈ కమిటీ సలహాలు ఇస్తుందని తెలిపింది. ఈ కమిటీలో సీబీఈసీ చైర్మన్, డైరెక్టర్ జనరల్, డీజీఎఫ్టీ అడిషనల్ సెక్రటరీ, జీఎస్టీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్, ఎక్స్పోర్ట్స్ కమిషన్ డీజీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ల కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని వివరించింది. -
యూపీఏ జీవోఎంలపై వేటు
30 మంత్రుల బృందాలను రద్దు చేసిన మోడీ సర్కారు ఆయా అంశాలపై ఇక మంత్రిత్వ శాఖలదే నిర్ణయం న్యూఢిల్లీ: యూపీఏ పాలనావశేషాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా.. ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 30 మంత్రుల బృందాలను(జీవోఎం) మోడీ సర్కారు రద్దు చేసింది. వాటిలో 9 సాధికార మంత్రుల బృందాలు(ఈజీవోఎం) కాగా, 21 సాధారణ జీవోఎంలు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ఈజీవోఎంలు, జీవోఎంలకు నిర్దేశించిన విధులను ఆయా మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలే నిర్వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరింత సాధికారత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇబ్బందులు ఎదుర్కొనే పక్షంలో కేబినెట్ సెక్రటేరియట్, పీఎంవో సహకరిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడే వివాదాలపై కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ జీవోఎంలలో చాలా వాటికి నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఇతర కీలక మంత్రులు చిదంబరం, శరద్ పవార్లు నేతృత్వం వహిస్తున్నారు. అవినీతి, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పాలనాసంస్కరణలు.. మొదలైన అంశాలపై ఆ జీవోఎంలను ఏర్పాటు చేశారు. వాటి సిఫారసులపై కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునేది. ఏదైనా అంశంపై కేబినెట్ మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు జీవోఎంలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడితే చివరి నిర్ణయం ప్రధానిగా నరేంద్ర మోడీనే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఆయనపై బాధ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. జీవోఎంల ఏర్పాటు మొదట్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. యూపీఏ పాలనలో అది మరింత విస్తృతమైంది. ఈజీవోఎంలకు నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉండేది. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 60 వరకు జీవోఎంలు ఏర్పాటయ్యాయి. అయితే అవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగుతూ ఉండేవి. కాగా, ఆయా అంశాల సంక్లిష్టత, వాటిలో ఒకటికి మించిన మంత్రిత్వ శాఖల జోక్యం ఉన్నందువల్లనే మంత్రుల బృందాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ జీవోఎంల ఏర్పాటును కాంగ్రెస్ సమర్ధించుకుంది. అయితే, జీఓఎంల రద్దుపై ఎలాంటి విమర్శలు చేయకుండా.. తాము కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు, అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని వ్యాఖ్యానించింది. -
జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. -
ఆప్షన్లు ఉంటాయని చెప్పామా?: జైరాం రమేశ్
-
ఆప్షన్లు ఉంటాయని చెప్పామా?: జైరాం రమేశ్
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ, ఆప్షన్లు, ప్రత్యేక పరిస్థితులు..ఇలా ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలున్నాయి వారంలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం ఆప్షన్లు ఉండకూడదని ఉద్యోగ సంఘాల డిమాండ్ హైదరాబాద్: ‘‘ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు కచ్చితంగా ఉంటాయని ఎవరు చెప్పారు? నేను లేదా జీవోఎం ఇతర సభ్యులు ఎవరైనా అధికారికంగా ప్రకటన చేశారా? రాజకీయ పార్టీలు ఏవో తప్పుగా ప్రచారం చేస్తే పట్టించుకుంటారా?..’’ అని తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన కూడా ఇప్పటికే పూర్తయిందని, వారం రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవిభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం సభ్యుడి హోదాలో గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్లోని ఒక హోటల్లో జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సి.విఠల్, ఎం.నారాయణ (తెలంగాణ ఉద్యోగుల సంఘం), చంద్రశేఖర్గౌడ్, హరికిషన్ (గ్రూప్-1 అధికారుల సంఘం), పి.రఘు (విద్యుత్ ఉద్యోగుల జేఏసీ), పి.మధుసూదన్రెడ్డి (ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్), శివశంకర్ (రెవెన్యూ ఉద్యోగుల సంఘం), రాములు (ఉపాధ్యాయ సంఘం), సురేశ్ (సచివాలయ టీఎన్జీవో), శ్యాం కుమార్ (వాణిజ్యపన్నులు) తదితర ముఖ్య సంఘాల నేతలు సహా తెలంగాణకు చెందిన 27 ఉద్యోగ సంఘాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డీ) ప్రకారం ఏర్పాటైన జోనల్ వ్యవస్థ అమల్లో ఉండగా తెలంగాణేతర ఉద్యోగులకు ఆప్షన్లు ఎలా ఇస్తారు? తెలంగాణ రాష్ట్రంలోనూ సీమాంధ్ర ఉద్యోగులను ఎలా భరిస్తాం?..’’ అని జైరాంను తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వవద్దని, స్థానిక ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జైరాం రమేశ్... జీవోఎం సభ్యుడిగా ఆప్షన్ల అంశంపై మాట్లాడుతున్నా. ఆప్షన్లు మాత్రమే ఉంటాయని ఎవరూ, ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. ఉద్యోగుల పంపకానికి ఆరు ప్రాతిపదికలు ఉన్నాయి. స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డి) ప్రకారం అమలులో ఉన్న జోనల్ వ్యవస్థ, ఆప్షన్ల పరిశీలన, కొన్ని ప్రత్యేక పరిస్థితుల ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుంది..’’ అని వివరించారు. ‘‘ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న అవకాశాలు, మానవతా దృక్పథం వంటివి ప్రత్యేక పరిస్థితుల కిందకు వస్తాయి. ఉద్యోగుల పంపకంపై మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించాం. వాటిని ప్రకటించడానికి ఎన్నికలకోడ్ అమలులో ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్కు లేఖ రాశాం. వారంలోగా స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయి. వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి’’ అని జైరాం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమేనని, ఎవరికీ అన్యాయం చేయబోమని పేర్కొన్నారు. కాగా, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదని చంద్రశేఖర్గౌడ్ అభిప్రాయపడగా.. పదేళ్ల ఉమ్మడి అడ్మిషన్ల విధానాన్ని సవ రించాలని మధుసూదన్రెడ్డి కోరారు. కార్పొరేషన్ ఉద్యోగుల విభజన అధికారం పూర్తిగా ఆయా కార్పొరేషన్లకే అప్పగించడంవల్ల అన్యాయం జరిగే అవకాశాలున్నాయని, దీనిపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు కోరారు. దీనిపై స్పందించిన జైరాం... వాటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలుంటాయని హామీ ఇచ్చారు. -
మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి
జీఓఎం సమావేశానికి హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : మునాక్ కాలువ ద్వారా ఢిల్లీ రాజధానికి అందించే నీటి విషయంలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రు ల బృందం (జీఓఎమ్) జూన్ మొదటి వారంలో సమావేశం కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జీఓఎం సమావేశం నిర్వహించి, తదుపరి విచారణకల్లా పరిస్థితిపై ఓ నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖకు జస్టిస్ హిమా కోహ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ నివేదిక సమర్పించలేకపోతే సంబంధిత శాఖా సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ జలబోర్డుకు ఈ కాలువ ద్వారారోజుకి 80 మిలియన్గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. 744 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మూడు నీటిశుద్ధి కేంద్రాలకు పంపించి, తద్వారా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా చేస్తోంది. జీఓఎం మార్చి 6న జరిగిన సమావేశానికి అనారోగ్య కారణంగా కేంద్రమంత్రి కపిల్సిబల్ హాజరు కాలేకపోయినందున ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జలవనరుల శాఖ కోర్టుకు అఫిడవిట్ను దాఖలు చేసింది. సమావేశం నిర్వహించి ద్వారకా, బవన, ఓఖ్లా నీటిశుద్ధి కేంద్రాలకు నీరు సరఫరా చేసి పనులు తొందరగా ప్రారంభమయ్యేటట్లు చూస్తామని ఢిల్లీ జలబోర్డు తరపు న్యాయవాది సుమీత్ పుష్కర్ణ కోర్టుకు నివేదించారు. మూడు నీటిశుద్ధి కేంద్రాల్లో పనులు ప్రారంభమయితే ప్రస్తుతం నిత్యావసరాలకోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న ద్వారక, దానిచుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉండదని స్థానికు లు అంటున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయని, తమకు ఢిల్లీ జలబోర్డు ఒక్కనీటి చుక్క కూడా ఇవ్వక 20 ఏళ్లు దాటిపోయిందని ఆరోపిస్తూ మహవీర్ ఎన్క్లేవ్ కాంప్లెక్స్ కాలనీల వెల్ఫేర్ కాన్ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది. నంగ్లోయి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఎలాం టి అంతరాయం లేకుండా తమకు నీటి సరఫరా చేయాలని కోరుతూ 1994లో ఢిల్లీ జలబోర్డుకు 34లక్షలు చెల్లించామని అసోసియేషన్ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ద్వారకా నీటిశుద్ధి కేంద్రం పనిచేయకపోవడంవల్ల తాము నీటి సరఫరా చేయలేకపోతున్నామంటూ డీజేబీ తప్పించుకుంటోందని అందులో పేర్కొన్నారు. -
'కొత్త రాజధాని ఏర్పాటుకు కమిటీ'
-
రేపు కేంద్ర క్యాబినెట్ ముందుకు టీ బిల్లు
-
ప్రత్యేక తెలంగాణపై నివేదిక సిద్ధం చేసిన జీవోఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తుది అంకానికి చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి జీవోఎమ్(కేంద్ర మంత్రుల బృందం)కు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ నివేదికను అందజేశారు. కొత్తరాజధానికి నిధులు కేటాయించడంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడిగింపుపై, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో ఉంచడంపై ఎటువంటి స్పష్టత రాలేదు. జనాభా ప్రాతిపదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను కేంద్రం పక్కకుపెట్టింది. హైదరాబాద్ ను యూటీ(కేంద్ర పాలిత ప్రాంతం)చేయాలన్న సీమాంధ్ర మంత్రుల విన్నపాన్ని కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర కేబినెట్ రేపు మరోసారి ప్రత్యేక భేటీ కానుంది. ఇదిలా ఉండగా టి.బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ సూచించిన సవరణల్లో కొన్నింటినైనా పరిష్కారించాలనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేపటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు స్పష్టత రానుంది. -
తుది అంకానికి తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు తుది అంకానికి చేరింది. సోమవారం తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. గురువారం బిల్లుపై తుది కసరత్తులు పూర్తి చేసిన జీవోఎం శుక్రవారం క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టనుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో తెలంగాణ బిల్లుకు కొన్ని సవరణలు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయంపై ఈ సవరణలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లులో 42వ ప్రతిపాదనలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశం ఉంది. ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించి ఇందులో కీలక సవరణ చేసినట్టు తెలిసింది. ఈ మార్పులతో రేపు క్యాబినెట్ ముందుకు దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బిల్లును ఆమోదిస్తారని, అనంతరం సోమవారం లోక్సభ ముందు తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని ఢిల్లీ వర్గాల సమాచారం. -
విభజన బిల్లుకు తుది మెరుగులు
-
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
-
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, జిఓఎం సభ్యుడు వీరప్ప మొయిలీ చెప్పారు. జిఓఎం సంప్రదింపులు ఎందుకు కొనసాగుతున్నాయన్న దానిపై ప్రశ్నలు అనవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని మొయిలీ తెలిపారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జిఓఎం సభ్యులు ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
విభజన బిల్లుకు తుది మెరుగులు!
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జీవోఎంలోని కేంద్ర మంత్రులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై జీవోఎంలోని కేంద్ర మంత్రులు ఈ సందర్బంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు కేంద్ర క్యాబినేట్ భేటీ కానుంది. అయితే ఆ సమయానికి విభజన బిల్లుకు తుది రూపం ఇచ్చేందుకు జీవోఎం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఆంధప్రదేశ్ విభజన జరిగితే పోలవరం డివిజన్ సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని తదితర మొత్తం 9 ప్రతిపాదనలు జీవోఎం వద్ద సీమాంధ్ర కేంద్ర మంత్రులు బుధవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఎదుట తెలంగాణ బిల్లు టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉంది. -
అసంపూర్తిగా ముగింపు..
-
జీవోఎం మళ్లీ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. మంగళవారం జరిగిన భేటీనే ఆఖరిదని వార్తలు వచ్చినా.. బుధవారం సాయంత్రం మళ్లీ సమావేశమైంది. నార్త్బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ పాల్గొన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించారు. -
అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ
-
ఈ వారంలోనే తెలంగాణ బిల్లు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఈ వారంలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై జీవోఎమ్ సమావేశం ముగిసింది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు, సవరణలను పరిశీలించారు. బిల్లుకు కొన్ని సవరణలను జిఓఎం ఆమోదించింది. తుది బిల్లుని సిద్ధం చేశారు. సమావేశం ముగిసిన తరువాత గులాంనబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. ఇదే ఆఖరి జీవోఎమ్ సమావేశమని ఆజాద్ తెలిపారు. ఎల్లుండి జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ నోట్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ వారంలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతంలోనే కలిపేందుకు జీవోఎమ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11న తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రారంభమైన జీవోఎం సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళశారం సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లులపై అసెంబ్లీ పంపిన అభిప్రాయాలు,సవరణలను జీవోఎం ఈ సందర్భంగా పరిశీలించనుంది. అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజివంటి అంశాలను తిరిగి బిల్లులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం చర్చించనుంది. సవరణలు చేసి తుది బిల్లును జీవోఎం సిద్ధం చేయనుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తిరిగి కేబినెట్ బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, ఆంటోనీ హాజరయ్యారు. కాగా సమావేశం జరిగే హోంశాఖ కార్యాలయానికి కేంద్రమంత్రి పురందేశ్వరి, కిల్లి కృపారాణి వచ్చారు. -
ఈ రోజు మద్యాహ్నం GOM భేటీ
-
యూరియా స్థిర వ్యయం పెంపు!
న్యూఢిల్లీ: యూరియా స్థిర వ్యయాన్ని టన్నుకు రూ.350 పెంచేందుకు కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) సిఫారసు చేసింది. ఈ సిఫారసును కేంద్రమంత్రివర్గం అంగీకరిస్తే.. పెంపు తరువాత టన్ను యూరియా కనీస స్థిరవ్యయం రూ. 2300 కానుంది. అయితే, పెరిగిన ధరను సబ్సీడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది, రైతులపై ఆ భారం పడదు. తాజా పెంపు ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రభుత్వంపై యూరియా సబ్సీడీ భారం రూ. 900 కోట్ల మేర పెరగనుంది. 30 ఏళ్ల పైబడిన సంస్థలు ఉత్పత్తి చేస్తున్న యూరియాకు టన్నుకు రూ. 150, మిగతా అన్ని సంస్థలకు రూ. 350 పెంపును వర్తింపజేయాలని సంబంధిత జీఓఎం సిఫారసు చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీకాంత్ జెన గురువారం వెల్లడించారు. యూరియా స్థిర వ్యయాన్ని నిర్ణయించేందుకు ఆధారమైన మూల సంవత్సరాన్ని కూడా 2002-03 నుంచి 2008-09కి మార్చారు. అయితే ఎరువుల కంపెనీలు మాత్రం స్థిరవ్యయాన్ని టన్నుకు రూ. 700 పెంచాలని, మూల సంవత్సరాన్ని 2011-12 చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు, కూలీల ఖర్చు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలు మరమ్మతు, నిర్వహణ ఖర్చు, అమ్మకం ఖర్చులు.. వీటి మొత్తం ఆధారంగా యూరియా ప్లాంట్లలో స్థిర వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఎరువుల సబ్సిడీల కింద రూ. 70585 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. భారత్ ఏటా 22 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. మరో 8 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. -
ఫిబ్రవరి 11న లోక్సభలో టి- బిల్లు?
-
ఫిబ్రవరి 11న లోక్సభ ముందుకు తెలంగాణ బిల్లు?
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై అసలు చర్చ పూర్తి కాలేదు. గట్టిగా మాట్లాడితే అసలు సభ కూడా సజావుగా సాగడంలేదు. బిల్లుకు ఇప్పటికే వేల సంఖ్యలో సవరణలు వచ్చాయి. వాటిని ఇంకా క్రోడీకరించలేదు. ఈలోపే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సమాయాభావం వల్ల, లోక్సభ సమావేశాలు ముగిసిపోయే అకాశం ఉన్నందున ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, తెలంగాణపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఇదే ఆ బృందం చిట్టచివరి సమావేశం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవోఎం బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా బిల్లుపై జీవోఎం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తుది చర్చలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందుకు ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ బిల్లు వెళ్తుందని సమాచారం. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలలో తెలంగాణ బిల్లు లోక్సభ ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈసారి కూడా బిల్లును సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. సవరణల గురించి ఆయనతో ప్రస్తావించగా, బిల్లుకు తప్పకుండా వేల సంఖ్యలో సవరణలు వస్తాయని, వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరు ఎంతగా అభ్యంతరాలు చెబుతున్నా, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు సైతం కాదంటున్నా కూడా వడివడిగా అడుగులు వేస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు తాము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. -
'సీఎంకు తెలిసినంతగా రాజ్యాంగం నాకు తెలీదు'
-
'సీఎంకు తెలిసినంతగా రాజ్యాంగం నాకు తెలీదు'
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు. రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని... బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు. -
రియల్ తెలంగాణకు జై
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో రాయల తెలంగాణ ప్రచారం నేపథ్యం లో 48 గంటల ఉద్రిక్తతకు తెరపడింది. కేంద్ర మంత్రుల కమిటీ(జీవోఎం) సమావేశం తర్వా త జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. గురువారం సాయంత్రం వర కు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బంద్ను పాటించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు రాత్రి కేంద్ర కేబినేట్ నిర్ణ యం వెలువడటంతో సంబరాలు జరుపుకున్నా రు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బెల్లంపల్లి తదితర నియోకవర్గాల్లో రాత్రి బాణాసంచా కాల్చారు. తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద ని వాళులు అర్పించారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎన్జీవోల సంఘం జిల్లా అ ధ్యక్షుడు అశోక్తోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా రాత్రి టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఒక్క రోజు బంద్ విజయవంతమైంది. జీవోఎం రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం అనూహ్య స్పందన లభించింది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, వైఎస్సార్ సీపీలు, అనుబంధ సంఘాలు బంద్కు మద్దతు పలికాయి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, న్యాయవాదులు, వ్యాపారులు, వాణి జ్య సంస్థల నిర్వాహకులకు తోడు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ప్ర భుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, సినిమా థియేటర్లు, పెట్రోల్బంకు లు పూర్తిగా బంద్ పాటించాయి. ఈ సందర్భం గా జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించిన తెలంగాణవాదులు కేంద్రం, మంత్రు ల కమిటీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా జిల్లాలోని ఆరు డిపోల నుంచి 621 బస్సులు కదలని ఫలితంగా ఆర్టీసీ సుమారుగా రూ.50 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. అదే విధంగా మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. 15 భూగర్భగనుల్లో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బంద్ నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. బంద్కు విశేష స్పందన టీఆర్ఎస్ పిలుపు మేరకు బంద్లో పాల్గొని జిల్లా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మొదలైన బంద్ కోసం తెలంగాణవాదులు పూర్థిస్తాయిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా బంద్లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కాగా బంద్ నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పురవీధుల్లో భారీ ర్యాలీ జరిపారు. అనంతరం ఐబీలో జేఏసీ దీక్షా శిబిరం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాగజ్నగర్ రాజీవ్గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, పాల్వాయి రాజ్యలక్ష్మీలు దుకాణం యజమానులను బంద్ పాటించాలని కోరారు. -
ఆమోదంపై ఆగ్రహం
జగ్గంపేట, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై జీఓఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు భగ్గుమన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జగ్గంపేటలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. పెద్దసంఖ్యలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, సమైక్యవాదులు రాత్రి ఏడు గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, కాంగ్రెస్, మంత్రి తోట నరసింహంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్బాబు, ట్రైనీ ఎస్సై సురేష్ ఆందోళన విరమించాలని జ్యోతులకు నచ్చజెప్పబోయినా ఆయన ససేమిరా అన్నారు. గంటపాటు వేచి ఉన్న పోలీసులు చివరికి జ్యోతులను, పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ జీపులో ఎక్కించబోయారు. తిరస్కరించిన జ్యోతుల సర్వీసు రోడ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లగా కార్యకర్తలు, సమైక్యవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను అనుసరించారు. కేబినెట్ ఆమోదం దారుణం ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి జీఓఎం, కేంద్ర కేబినెట్లు ఆమోదం తెలపడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న తమ అభిమతం కేంద్రానికి తాకేలా చేసేందుకే జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి సమైక్య పోరును సాగిస్తూ దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభజనకు సహకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ పిలుపునకు కట్టుబడి సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలుగుజాతి విచ్ఛిన్నం జరిగేది కాదన్నారు. అక్కడోమాట, ఇక్కడో మాటా చెబుతున్న టీడీపీ కూడా రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సమైక్యాంధ్ర ఉద్యమద్రోహిగా మిగిలిపోతారని, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఆయన రోడ్డుపైకి వస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్, మారిశెట్టి భద్రం, నీలాద్రిరాజు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, వెలిశెట్టి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ, సోమవరం రాజు, సుంకర సీతారామయ్య, అడబాల వెంకటేశ్వరరావు, కుదప శ్రీనివాస్, మారిశెట్టి పుండరీకాక్షుడు, రాయి సాయి, కింగం రమణ, నాళం గోపి, బోరా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల సహా 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నేటి బంద్కు సహకరించండి రాష్ర్ట విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జరపతలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా చేయి కలిపి పోరుబాటలో కలిసి రావాలని కోరారు. రాష్ర్ట చరిత్రలో దుర్దినం రాష్ర్ట చరిత్రలో ఇదొక దుర్దినం. కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది. ఈ నిర్ణయానికి రాష్ర్ట ముఖ్యమంత్రితో పాటు మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలి. రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారు. సమైక్యవాదులంతా చేయి కలిపి శుక్రవారం తలపెట్టిన రాష్ర్ట బంద్ను విజయవంతం చేసి కేంద్రం కళ్లు తెరిపించాలి. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలి. - పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మెజార్టీ ప్రజల అభిమతానికి వ్యతిరేకం రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రిజేష్కుమార్ తీర్పు వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారయ్యే ప్రమాదం ఉంది. మరో రాష్ట్రం ఏర్పడటంతో ఈ ప్రాంతంలో రైతులు పంటలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటూ కేంద్రం సాంపద్రాయాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సాంప్రదాయాలను పాటించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం చేస్తున్న బంద్కు ప్రతివారూ సహకరించాలి. - పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఫల్యమే.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం వరకూ వెళ్లింది. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే. వారు ఎంతసేపూ ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడానికే ప్రయత్నించారు తప్ప విభజనను అడ్డుకోలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారు. సమైక్యాంధ్రను సమర్థిస్తున్నట్టు పదేపదే ప్రకటనలు చేసిన ఆయన ఆచరణలో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయారు. తెలంగాణ ప్రాంతపు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల్లో ఉన్న చొరవ, ఐక్యత సీమాంధ్ర మంత్రులు, నాయకుల్లో లేవు. - కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ప్రజలే తగిన బుద్ధి చెపుతారు రాష్ట్ర విభజనను ఆమోదించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రహీనమైపోయింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ 200 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది. కేంద్ర మంత్రులు గబ్బిలాల్లా పదవులను పట్టుకుని వేలాడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. సోనియా ఆడించమన్నట్టు తలలాడించిన ఈ నేతలు తెలుగుతల్లికి ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్రెడ్డి వంటి సమర్థుడైన నేత అధికారంలో లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్దశ పట్టింది. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి విభజనకు కారకులైన టీడీపీ, కాంగ్రెస్లకు ప్రజలు బుద్ధి చెబుతారు. - జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు -
ఫైనల్.. పది జిల్లాల తెలంగాణే
-
ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై చర్చ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. కాగా జీవోఎం సభ్యులు మాత్రం పూటకో రకమైన ప్రకటనలతో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. రాయల తెలంగాణను కాదనలేమని జైరాం రమేష్ అంటుంటే..... చిదంబరం మాత్రం రాయల తెలంగాణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తెలిపారు. -
రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు!
న్యూఢిల్లీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనలు వెల్లువెత్తటంతో పది జిల్లాల తెలంగాణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జీవోఎం సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణపై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడే పది జిల్లాల తెలంగాణకే సిపార్సు చేయాలని ఆయన... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ప్రతిపాదించారు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్న ఆజాద్ ఈమేరకు ఫోన్లో షిండేతో మాట్లాడినట్లు తెలుస్తుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రత్యామ్నాయంగానే చూడాలని ఆయన షిండేకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గు చూపవచ్చని చెప్పినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్కు నిన్న జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే ఈరోజే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. -
రేపు కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఖరారు చేసింది. జీవోఎం చివరిసారిగా బుధవారం రాత్రి ఇక్కడ గంట సేపు సమావేశమై చర్చించించింది. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును గురువారం కేబినెట్ ముందు ఉంచనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 3న తమకు అప్పగించిన పనిని పూర్తిచేశామని షిండే తెలిపారు. ఇదే జీవోఎం చివరి సమావేశమని, నివేదికను కేబినెట్ పరిశీలిస్తుందన్నారు. కాగా పది జిల్లాలతో కూడిన తెలంగాణనా లేక 12 జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. -
రేపు కేబినెట్ ముందుకు జీఓఎమ్ బిల్లు: షిండే
-
తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు
-
తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తుది నివేదిక ఖరారు చేసింది. జిఓఎం ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశం గంటసేపు జరిగింది. గులాంనబీ ఆజాద్ద్ మినహ మిగతా సభ్యలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసిన తరువాత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ జిఓఎం తన పని పూర్తి చేసిందని తెలిపారు. ఇదే జిఓఎం తుది సమావేశమని చెప్పారు. విభజన బిల్లు ఖరారైందని, వివరాలు తాను చెప్పలేనని అన్నారు. సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ రేపు మంత్రి మండలి ముందుకు తెలంగాణ బిల్లు వెళుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ, 12 జిల్లాల రాయల తెలంగాణ ఈ రెండు అంశాలను జిఓఎం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) కేంద్ర మంత్రి మండలి ముందుకు ఎప్పుడు వెళ్లాలనేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయిస్తారు. -
త్వరలో పార్లమెంట్ కు తెలంగాణ బిల్లు: ఆజాద్
కోల్కతా : తెలంగాణ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పడిన జీవోఎం తన ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. అయితే బిల్లు పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెడతారన్నది తెలియదని ఆజాద్ వ్యాఖ్యానించారు. కాగా డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో తెలంగాణ బిల్లు లేదు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా బిల్లు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ కూడా మంగళవారం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రకటించారు -
తెలంగాణ బిల్లుకు తుదిమెరుగులు
ఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుడు జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదా న్యాయ శాఖ నుంచి హోంశాఖకు చేరింది. ముసాయిదా బిల్లుకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బిల్లుపై జిఓఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈరోజే ఆమోదించే అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం సభ్యులు కూడా నిన్న ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ తెరపైకి రావడంతో కొంత సంక్లిష్టత ఏర్పడింది. -
....ఇంకా ఉంది
-
మళ్లీ భగ్గుమన్న తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాయల తెలంగాణ ప్రక్రియ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రుల కమిటీ(జీఓఎం) భేటీ, ఆ తదుపరి పరిణామాలు మళ్లీ తెలంగాణ ‘లడాయి’కి సంకేతాలు ఇస్తున్నాయి. దాదాపుగా రాష్ట్ర విభజన పూర్తయిందని భావించిన తరుణంలో ‘రాయల తెలంగాణ’ తెరపైకి రావడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ వైఖరిలో 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పులు తెలంగాణవాదులను రగిలిస్తున్నాయి. హైదరాబాద్పై ఆంక్షలు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించిన తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదన జోరందుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో 5న తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నుంచి నిరసనలు, ధర్నాలకు పిలువునివ్వడంతో మళ్లీ తెలంగాణ భగ్గుమననుంది. నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్ర మంత్రుల కమిటీ భేటీ ఏమీ తేల్చకుండా సమావేశం వాయిదా పడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో జిల్లాలో మళ్లీ ఉద్యమ కార్యాచరణలో ఆ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాయల తెలంగాణకు నిరసనగా ఆందోళనలు మంగళవారం ఉధృతంగా సాగాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు రాయల తెలంగాణ వద్దని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించగా, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. న్యూడెమోక్రసీ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. లక్సెట్టిపేటలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆసిఫాబాద్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిల పక్షం అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ పలువురు ఆరోపించారు. 5న బంద్కు పిలుపునివ్వడ ంతోపాటు 6న టీఆర్ఎస్ పొలిట్బ్యూరోలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నందున జిల్లాలో మళ్లీ ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడనుంది. బంద్ను విజయవంతం చేద్దాం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలు తేవడం కుట్ర. ఈ విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అందుకే తెలంగాణలో మరోసారి ఉద్యమించేందుకు అధినేత కేసీఆర్ 5న తెలంగాణ జిల్లాల బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్ సక్సెస్కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, రాజకీయ, న్యాయవాద, డాక్టర్ జేఏసీలతోపాటు తెలంగాణవాదులు బుధవారం నుంచి నిర్వహించే నిరసనలు, ఆందోళనలకు కదిలిరావాలని కోరుతున్నాము. బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 4, 5 తేదీలలో కుంటాల, సారంగపూర్ మండలాల్లో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతులను వాయిదా వేశాము. -
రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు. ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది. పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
-
సమస్యల్ని చెప్పకోవడానికి జీవోఎం పిలవలేదు:జేడీ శీలం
ఢిల్లీ: తమ ప్రాంత సమస్యల్ని చెప్పడానికి వస్తే జీవోఎం నుంచి పిలుపు అందలేదని జేడీ శీలం తెలిపారు. కేబినెట్లో తెలంగాణ అంశం చర్చకు వస్తే ముగ్గురు సీమాంధ్ర మంత్రులు తమ అభిప్రాయాలను చెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం..జీవోఎం తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. ఒకప్రక్క విభజన ప్రక్రియ జరుగుతుంటే సమైక్య రాష్ట్రం అని ఏమి చేయగలమన్నారు. జీవోఎం ఇప్పటి వరకూ ఏం చేయాలనుకుంటుందో తమకు చెప్పలేదన్నారు. ఢిల్లీలోని నార్త్బ్లాక్లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్రం జీవోఎం సమావేశమైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తాం అని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల తెలంగాణ నిర్ణయానికి ఒప్పుకోమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని.. మా పిల్లల చేసిన త్యాగాలు రాయల తెలంగాణ కాదు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది అని, ఆ నిర్ణయాన్ని కేబినెట్ కూడా అంగీకరించింన విషయాన్ని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జీవోఎం చర్చిస్తుందని తాము మంత్రుల బృందాన్ని ప్రశ్నించామన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, పోరాటం జరిగింది అని, తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరామని కేసీఆర్ తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు. ఉన్నపళంగా వారిని వెళ్లమని కోరితే బాగుండదనే విషయం కారణంగా ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామన్నారు. గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వెలువడుతున్నా.. తాము అడ్డదిడ్డంగా మాట్లాడటం ఇష్టం లేక టీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. రాయల తెలంగాణ అంటే మరో యుద్దం తప్పదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు. హైదరాబాద్, రాయల తెలంగాణ, జీవోఎం భేటీ తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా నేడు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. -
తెలంగాణ కు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ స్సష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ముందుకు వెళుతోందని ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జీఓఎం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు జీవోఎం నివేదిక రానుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను సజావుగా నడిపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాయల తెలంగాణకు సోనియా మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో కెబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశ ప్రస్తావన రాకపోవచ్చని తెలుస్తోంది. -
'రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం'
-
రాయల తెలంగాణ దిశగా కేంద్రం!
ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం లభించినట్టు ఎన్డీ టీవీ కధనాన్ని నడుపుతోంది. ఇక సీడబ్ల్యూసీ నిర్ణయానుసారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కాకుండా రాయల తెలంగాణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సిన కీలక అంశాలు, తెలంగాణ బిల్లు వంటి అంశాలపై వివిధ పార్టీల నేతలతో కమల్నాథ్ చర్చించే అవకాశముంది. మరోవైపు పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ హస్తినలోనే మకాం వేశారు. డీఎస్ అధినేత్రి సోనియా గాంధీ, జీవోఎం సభ్యులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జీవోఎం నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఇక రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించేలేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా కిరికిరి పెడితే ఊరుకోమని ఆపార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. -
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
-
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జీవోఎం నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని, కేబినెట్ ఆమోదించాక అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని దిగ్విజయ్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాయల తెలంగాణ అంశంపై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యక్తిగత సంభాషణల వివరాలు మీడియాకు చెప్పలేనని, రాయల తెలంగాణ అంశాన్ని తాను ఖండించదలుచుకోలేదని దిగ్విజయ్ అన్నారు. -
త్వరలోనే పార్లమెంటు ముందుకు టి.బిల్లు: షిండే
ముంబై: తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం తన పనిని దాదాపు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. టీ.బిల్లు అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు. ముందుగా టీ.బిల్లు నివేదికను కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. అనంతరం న్యాయశాఖ నుంచి రాగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని షిండే తెలిపారు. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం
-
శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లు?
పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంశాన్ని గందరగోళంలోకి పడేస్తున్నారు. బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారా.. లేదా అనే విషయమై ఏమాత్రం స్పష్టత లేకుండా చేశారు. ఈ అంశంపై శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. శీతాకాల సమావేశల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. బిల్లు సాధ్యాసాధ్యాలపై నాయకులు చర్చించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్ నాథ్ హాజరయ్యారు. జీవోఎం నివేదికపై సమూలంగా కోర్ కమిటీలో చర్చించారు. సమావేశం దాదాపు గంటసేపటి పాటు కొనసాగింది. అయితే, కమల్ నాథ్ మాత్రం మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో మీడియా ఆయనతో మాట్లాడగా.. ఈ విడత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అయితే కేంద్రం మాత్రం ఎలాగైనా బిల్లు ప్రవేశపెట్టే యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ ఈ విషయాన్ని తెలిపారు. -
ఒకరోజు ముందుగానే కేంద్ర కేబినెట్ భేటీ
-
3న కేంద్ర, రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ : డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరుగుతుందని కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. జీవోఎం ప్రతిపాదనలు కేబినెట్కు వివరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అదే రోజు జీవోఎం నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని షిండే తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశంకానుంది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం రూపొందించిన ముసాయిదా బిల్లుపై సమావేశంలో చర్చించే అవకాశముంది. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశంలో నివేదికపై చర్చించిన తర్వాత కీలకాంశాలపై స్పష్టత ఏర్పడుతుందని... ఆపై అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో చర్చించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
-
4న కేబినెట్ భేటీ
మర్నాడే రాష్ట్రపతి పరిశీలనకు? నేడు కోర్కమిటీ ముందు టీ ముసాయిదా 100 పేజీల జీవోఎం నివేదిక సిద్ధం విభజన ప్రక్రియ అమల్లో మార్పులు వెనకబడ్డ ప్రాంతాలన్నింటికీ ప్యాకేజీ చివరి నిమిషం దాకా మార్పులు: షిండే న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం రూపొందించుకున్న ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్ కోర్కమిటీ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై చర్చించనుంది. కోర్ కమిటీ ఆమోదం పొందాకే వాటిని కేంద్ర కేబినెట్కు పంపాలని హస్తిన పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక వంటివేవీ చర్చకు రాలేదని తెలిసింది. భేటీ ఎజెండాలో ఇవేవీ లేని విషయం తెలిసిందే. హోంశాఖ వర్గాలు చెబుతున్న ప్రకారం డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజన బిల్లును, జీవోఎం నివేదికను ప్రవేశపెడతారు. కేబినెట్లో ఆమోదం పొందిన మర్నాడే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించే అవకాశాలున్నాయి. అయితే విభజన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై శుక్రవారం కోర్కమిటీ చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చిదంబరంతో షిండే, జైరాం భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రులు సుశీల్కుమార్ షిండే, జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ భేటీలో తెలంగాణ, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు బుధవారం నాటి జీవోఎం భేటీ అనంతరం 11 అంశాలకు సంబంధించి జైరాం రూపొందించిన 100 పేజీల నివేదికలోని మంచిచెడులు, అందులో పొందుపరచాల్సిన ఇతరత్రా అంశాలను పరిశీలించారు. కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అంశాలు నివేదికలో ఉన్నట్టు చెబుతున్నా, నిజానికి నివేదికలో ఏమేమున్నాయన్నది మాత్రం చిదంబర రహస్యంగానే ఉంది. భేటీ అనంతరం షిండే తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ గానీ, భద్రాచలం గానీ జీవోఎంకు ప్రతిబంధకాలు కానే కావు. ఇతర సమస్యలేమిటనేది చెప్పలేను. ముసాయిదా బిల్లులో లోపాల్లేకుండా చర్చిస్తున్నాం. సూక్ష్మస్థాయి లోపాలపైనా దృష్టి పెట్టాం. నివేదికను వీలైనంత తొందరగా కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతాం’’ అని పేర్కొన్నారు. చివరి నిమిషం దాకా మార్పుచేర్పులుండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. న్యాయశాఖ పరిశీలనలో టీ బిల్లు హోం శాఖ రూపొందించిన విభజన బిల్లు గురువారం కేంద్ర న్యాయ శాఖకు వెళ్లింది. శాఖలోని లెజిస్లేచర్ విభాగం అధికారులు బిల్లును నిశితంగా పరిశీలిస్తున్నారు. బిల్లు డిసెంబర్ 3న సాయంత్రం జరిగే జీవోఎం సభ్యుల సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం అనంతరం ముసాయిదా బిల్లు, జీవోఎం సిఫార్సులను 4న జరిగే కేబినెట్లో ప్రవేశపెడతారు. అయితే తెలంగాణ బిల్లును వీలైనంత తొందరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సోనియాగాంధీ భావిస్తున్నందున శని లేదా సోమవారాల్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కూడా లేకపోలేని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జైపాల్తో శీలం, దిగ్విజయ్తో మర్రి భేటీలు విభజన అనివార్యమైనందున హైదరాబాద్ను కొద్ది కాలమైనా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర మంత్రి జేడీ శీలం గురువారం కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డిని కలిశారు. హైదరాబాద్ను యూటీ చేసేలా సోనియాకు సూచించాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను కలిశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాజకీయ అస్థిరత ఉండొద్దంటే వాటిని 119 నుంచి 153కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లి ముసాయిదా బిల్లులో పొందుపరిచేలా చూడాలన్నారు. తెలంగాణకు సోనియా పేరు: శంకర్రావు తెలంగాణ రాష్ట్రానికి సోనియాగాంధీ పేరు పెట్టాలని మాజీ మంత్రి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. ఆమె వల్లే రాష్ట్రం ఏర్పడుతోందని మీడియాతో ఆయనన్నారు. విభజనను అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి చరిత్రహీనుడిగా మిగులుతారన్నారు. -
తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
కాంగ్రెస్, కేంద్రం, జీవోఎం తీరుపై ప్రజల్లో ఆందోళన ‘రాయల’పై, హైదరాబాద్పై రోజుకో రకం లీకులు మరోవైపు ముంచుకొస్తున్న పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ రెండో వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! అవి సోనియా జన్మదినమైన డిసెంబర్ 9నే ఉంటాయా? పార్లమెంటులో బిల్లు పెట్టి ఊరుకుంటారా, పొడిగించి ఆమోదిస్తారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం బిల్లుపై ఉంటుందా? ‘ఉమ్మడి’ చిక్కుముడిపై ఎలాంటి పరిష్కారాలు చూపుతారు? సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విభజన అంశానికి చివరికి ఎలాంటి ముగింపు ఉంటుంది? విభజన ప్రక్రియపై కొద్దిరోజులుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చేస్తున్న హడావుడి, ఇంతకాలంగా గందరగోళమయంగా సాగిన చర్యల మధ్య నలుగుతూ వచ్చిన ఈ వ్యవహారం చివరి అంకంలో ఏ రకమైన మలుపులు తిరగనుంది? ఇప్పుడు సర్వత్రా వీటిపైనే చర్చ సాగుతోంది. ప్రధానంగా రానున్న కొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మొత్తం వ్యవహారానికి ఎలా తెర దించుతారు? వంటి ప్రశ్నలు అందరికీ ఉత్కంఠ కలిగిస్తున్నాయి. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చర్చలన్నీ విభజన చుట్టే సాగుతున్నాయి. అయితే డిసెంబర్ 17 లోపే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరేలా పావులు కదుపుతున్నారంటూ వస్తున్న వార్తలు కూడా మరింత అయోమయానికి, మరిన్ని అనుమానాలకే తావిస్తున్నాయి. అందులోని సాధ్యాసాధ్యాలపై కూడా అన్ని వర్గాల్లోనూ సందేహాలే తలెత్తుతున్నాయి. ఇవి చాలవన్నట్టు హైదరాబాద్ హోదాపై, రాయల తెలంగాణపై రోజుకో రకంగా వస్తున్న ఊహాగానాలు రాష్ట్ర ప్రజలను మరింతగా ఆందోళనలోకి నెడుతున్నాయి. జీహెచ్ఎంసీనే ఉమ్మడి రాజధాని చేస్తారని, కాదు హెచ్ఎండీఏ పరిధి మొత్తాన్నీ అని, రాయల తెలంగాణే ఇస్తారని, ఇవ్వబోరని... ఇలా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, కేంద్ర ప్రభుత్వం, జీవోఎం సభ్యులే రకరకాల లీకులిస్తూ గందరగోళాన్ని యథాశక్తి పెంచుతున్నారు. మళ్లీ తెరపైకి ‘డిసెంబర్ 9’ విభజన బిల్లు ముసాయిదాపై జీవోఎం కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర న్యాయ శాఖ రూపొందించే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు’ త్వరలోనే కేంద్ర కేబినెట్కు రానుంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు, అంటే డిసెంబర్ 4న కేంద్ర మంత్రివర్గం సమావేశమై బిల్లును ఆమోదిస్తుందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. పార్లమెంట్ ప్రారంభమయ్యే తొలి రోజునే, అంటే డిసెంబర్ 5న బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన వెనువెంటనే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోరతారా, లేదా కొంత సమయం తీసుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బిల్లును ఆయన ఓ మూడు రోజుల పాటు పరిశీలించాక అసెంబ్లీకి పంపుతారనుకున్నా, డిసెంబర్ రెండో వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశం ఉండేలా కన్పిస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 9 నుంచి 11 మధ్య అసెంబ్లీ సమావేశం కావచ్చు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు జరిగే సమావేశాలైనందున కేవలం విభజన బిల్లుపై అభిప్రాయం తెలిపేందుకు మాత్రమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం కావడం, 2009లో కూడా డిసెంబర్ 9వ తేదీనే కేంద్ర మంత్రి చిదంబరం తొలిసారి తెలంగాణ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ దృష్ట్యా ఈసారి కూడా డిసెంబర్ 9నే అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అలా చేస్తే సొంత పార్టీ నుంచే సోనియాపై విమర్శలు తప్పవని, కాబట్టి ఆ రోజు అసెంబ్లీ సమావేశం ఉండకపోవచ్చని కూడా వాదన వినిపిస్తోంది. పైగా ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజుతోనే ముగిస్తారా?, లేక సుదీర్ఘ చర్చకు ఆస్కారమిచ్చి రెండు రోజులు కొనసాగిస్తారా? అన్నది రాష్ట్రపతి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడిదాకా ఒకవేళ అంతా సాఫీగా సాగినా పార్లమెంట్లో బిల్లు ఎప్పుడు ప్రవేశపెడుతారు, దానిపై చర్చకు ఉండే సమయమెంత? వంటివి కూడా ఆసక్తికరంగా మారాయి. బిల్లు పెట్టబోరంటున్న అధికారులు అధికార వర్గాలు మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అసలు తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలే లేవని చెబుతున్నాయి! డిసెంబర్ 5న సమావేశాలు మొదలై 20వ తేదీ దాకా జరుగుతాయి. మధ్యలో 7, 8, 14, 15 సెలవు దినాలు.అంటే 12 రోజులే జరిగే సమావేశాల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర పడటం ఏ మాత్రం సాధ్యం కాదని ఆ వర్గాలంటున్నాయి. రాజకీయ వర్గాలు మాత్రం అసెంబ్లీ అభిప్రాయం అనంతరం రాష్ట్రపతి నుంచి వచ్చే బిల్లును డిసెంబర్ మూడో వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఆ లెక్కన బిల్లును డిసెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెడతారనుకున్నా దానిపై లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇదంతా కేవలం నాలుగు రోజుల్లో పూర్తి కావాలి! ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఏర్పాటు ప్రక్రియకు దాదాపు 2 సంవత్సరాలు పట్టడాన్ని ఈ సందర్భంగా కొన్ని వర్గాలు ఉదహరిస్తున్నాయి. కానీ ఇప్పుడు మిగిలింది కేవలంబిల్లుకు ఆమోదముద్ర వేయడం మాత్రమేనని, పైగా అందుకు పార్లమెంటులో సాధారణ మెజారిటీ చాలు గనుక ఈ సమావేశాల్లోనే విభజన ప్రక్రియంతా పూర్తయ్యే ఆస్కారం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 4 నెలలుగా గందరగోళమే విభజనపై కాంగ్రెస్ ఆది నుంచీ ప్రతి అడుగూ రాజకీయ వ్యూహంలో భాగంగానే వేస్తోంది. హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీలో తీర్మానం చేసినా జూలై 30 నుంచి ఈ నాలుగు నెలలుగా నలభై రకాల డ్రామాలు నడిపింది! రాయల తెలంగాణ అని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనీ, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతామని.. ప్రతి సందర్భంలోనూ ఆయా అంశాలపై లీకులతో గందరగోళపరుస్తూ వచ్చింది. సీమాంధ్రలో వెల్లువెత్తిన ఉద్యమాన్ని చల్లార్చడానికా అన్నట్టు రోజుకో రకం కథ తెరపైకి తెచ్చి అయోమయ పరిస్థితులను సృష్టించింది. హడావుడిగా పార్టీపరంగా ఆంటోనీ కమిటీ వేసి, మళ్లీ పార్టీల అభిప్రాయమనీ, జీవోఎం ఏర్పాటు చేసి, దానికి వచ్చిన ప్రతిపాదనపై చర్చలంటూ అందరినీ అయోమయంలో పడేసింది. ఇదంతా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎదుర్కొనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేసినట్టు చెబుతున్నారు. ఇంతా చేసి, నాలుగు నెలల ‘కసరత్తు’ తర్వాత కూడా ఇప్పటికీ బిల్లుకు తుది మెరుగుల ప్రక్రియే సాగుతోందంటూ మళ్లీ లీకులే ఇస్తోంది! మొత్తానికి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినా, లేదా దానికి ఏదో ఒక దశలో బ్రేక్ పడినా రాజకీయంగా తనకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా ఉండేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇలా నానాపాట్లూ పడుతోందన్న విమర్శలున్నాయి. డిసెంబర్ 8 తర్వాత పరిస్థితిలో మార్పు? ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా విభజన బిల్లుపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మిజోరం ఎన్నికల్లో మిజోరం మినహా మిగతా రాష్ట్రాల ఫలితాలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిని లోక్సభ సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గా అవి భావిస్తున్నాయి. డిసెంబర్ 8న వాటి ఫలితాలు వెలువడనున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు’కు కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తున్నప్పటికీ సీమాంధ్ర సమస్యలపై బీజేపీ లేవనె త్తే అంశాలకు బిల్లులో పరిష్కార మార్గాలు లేకపోతే అప్పుడు ఆ పార్టీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ఊపు బీజేపీ తీరులో ఎలాంటి మార్పు తేవచ్చు? విభజన బిల్లుపై ఎలాంటి చర్చకు అది పట్టుబట్టవచ్చు? ఇలాంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ మద్దతు లేకుండానే బిల్లు ఆమోదం పొందడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం అంతర్గతంగా ‘ఫ్లోర్ మేనేజ్మెంట్’ చేసిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ అంచనాలన్నీ ఒకవిధంగా ఉండగా, మరోవైపు అసెంబ్లీల ఫలితాలు కాంగ్రెస్కు ప్రతికూలంగా వస్తే యూపీఏ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం కావడమే గాక అవిశ్వాస తీర్మానం, ముందస్తు ఎన్నికల వంటివెన్నో తెరపైకి రావచ్చంటున్నారు. ఒకవిధంగా అసెంబ్లీల ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 8, మర్నాడే వచ్చే సోనియా జన్మదినమైన డిసెంబర్ 9ల్లో జరిగే పరిణామాలపైనే బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు. -
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
-
డిసెంబర్ 4న కేబినెట్కు జీవోఎం నివేదిక
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎట్టకేలకు జీవోఎం నివేదిక ఓ కొలిక్కి వచ్చింది.విభజన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణపై జీఓఎం నివేదిక డిసెంబరు 4న కేబినెట్ ముందుకు రానుంది. అదే రోజు ముసాయిదా బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు పంపనున్నారు. అక్కడ నుంచి వారంలోపే అసెంబ్లీకి పంపిస్తారని హోంశాఖ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ నార్త్బ్లాక్లోని ఆర్థికమంత్రి చిదంబరం కార్యాలయంలో జీవోఎం సభ్యులు భేటీ ముగిసింది. సుశీల్కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత షిండే వెళ్లిపోయారు. అనంతరం సుమారు 40 నిమిషాలపాటు ఆర్థికశాఖ అధికారులతో చిదంబరం, జైరాం రమేష్ చర్చలు జరిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని హోంశాఖవర్గాలు చెబుతున్నాయి. రేపు కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవోఎం నివేదికపై చర్చించే అవకాశముంది. మరోవైపు... పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. -
హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ
న్యూఢిల్లీ : అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం హస్తిన చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ విషయంలో పరిమిత ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నందున.. డిప్యూటీ సీఎం అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఢిల్లీకి పిలిచినట్లు తెలిసింది. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ హైదరాబాద్పై పరిమిత ఆంక్షల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహం, ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలపై తాను ప్రత్యేకంగా రూపొందించిన నోట్ను జీవోఎం సభ్యులకు సమర్పించనున్నట్టు సమాచారం. దామోదర తొలుత కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో భేటీ అవుతారని తెలిసింది. ఆ తరువాత అందుబాటులో ఉన్న జీవోఎం సభ్యులతో భేటీ అవుతారు. -
రాజ్యాంగానికి లోబడే ‘ఉమ్మడి’: దిగ్విజయ్
‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై జీవోఎం కసరత్తు బుధవారం పూర్తవుతుందని.. త్వరలోనే అసెంబ్లీకి విభజన బిల్లును పంపటంతో పాటు శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హెకమాండ్ను ధిక్కరిస్తున్నారనే వాదనను దిగ్విజయ్ నవ్వుతూ కొట్టిపారేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పార్టీకి విబేధాల్లేవు. ఆయన కాంగ్రెస్కు విధేయుడు. విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్తున్నారే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించటం లేదు’’ అని పేర్కొన్నారు. విభజనపై ఆంటోనీ కమిటీ నివేదిక గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆ కమిటీ సోనియాగాంధీ ఏర్పాటు చేసినదే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. -
జీవోఎం భేటీలు ఇంకా ఉన్నాయ్: షిండే
రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశాలు ఇంకా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే చెప్పారు. హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదిక తయారీ పూర్తయిందా? మీ కసరత్తు అయిపోయినట్టేనా?’ అన్న ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘ఇంకా కొన్ని సమావేశాలుంటాయి. ఎన్ని అనేది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు. ‘గురువారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై నివేదిక, బిల్లు చర్చకు వస్తాయా?’ అని అడగ్గా.. ‘‘రేపు కేబినెట్లో ఈ అంశం లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘నివేదిక ఎప్పటికల్లా తయారవుతుంది? ఎప్పుడు కేబినెట్కు అందజేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘‘మొత్తం పూర్తయినపుడు కేబినెట్కి ఇస్తాం. అప్పుడు మా పని పూర్తయినట్టు లెక్క. ఆ సంగతి మీకు ముందే చెప్తాం... సరేనా!’’ అని నవ్వుతూ బదులిచ్చారు. -
ముగిసిన GOM భేటి
-
చివరి దశకు చేరిన తెలంగాణ బిల్లు!
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు చివరిదశకు చేరింది. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇవాళ నిర్వహించే సమావేశమే చివరిదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంశంలోఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. హైదరాబాద్ యూటీకి జీవోఎం నిరాసక్తత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, విద్య, ఉపాధి, శాంతి భద్రతల అంశాలు కేంద్రం చేతుల్లోకి తీసుకుని ఆ బాధ్యతలను గవర్నర్కు అప్పగించే అవకాశాలున్నాయి. వివాదస్పదంగా మారిన భద్రాచలం తెలంగాణకే చెందుతుందని మంత్రుల బృందం తేల్చింది. అయితే పోలవరం ముంపు గ్రామాలు మాత్రం సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించనున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకుంటే తెలంగాణలో అసంతృప్తి ఉంటుందని...అలా జరిగితే రాజకీయ లబ్ధి పూర్తిగా చేకూరదని జీవోఎం సభ్యులు వాదించినట్లు సమాచారం. దీనిపై బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా మంతనాలు జరిగాయి. మరోవైపు... జైరాంరమేష్, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ అయ్యారు. ఇంతకాలం పోరాడతున్నామని బీరాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు పూర్తిగా చేతులెత్తేశారు రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఇంకా సమైక్యంకోసం ప్రయత్నించడంలో ప్రయోజనం లేదని చెప్పారు. కావూరి, కిశోర్చంద్రదేవ్ ఈ తతంగానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ నిర్ణయం కీలకదశలో ఉన్న సమయంలో కావూరి అమెరికా పర్యటన అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. జీవోఎం మరిన్ని భేటీలు నిర్వహిస్తుందని కేంద్ర హోంమంత్రి షిండే అంటూంటే ..... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాత్రం జీవోఎం నివేదిక పూర్తి చేస్తుందంటున్నారు. నివేదికను కేబినెట్ భేటిలో చర్చించిన తరువాత అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపుతామని దిగ్విజయ్ తెలిపారు. ఎలాంటి సవరణలు లేకుండా రాజ్యంగ పరిథిలోనే హైదరాబాద్ను పరిమిత కాలపు ఉమ్మడి రాజధానిగా చేస్తామన్నారు. సీఎం కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిబద్దత కలిగిన నాయకుడంటూ కితాబిచ్చారు. -
టి బిల్లు కోసం సంయుక్త సమావేశాలు?
-
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పడిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) రేపటి సమావేశం ఆఖరి సమావేశం కాదని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జిఓఎం సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదయం కేంద్ర మంత్రులు జైరామ్ రమేష్, జైపాల్ రెడ్డి షిండేతో సమావేశమయ్యారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేయాలన్న ఆలోచనకు జైపాల్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10.30కు షిండేను కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని వారు షిండేను కోరారు. రేపు ఉదయం సీమాంధ్ర మంత్రులతో జైరాం రమేష్ సమావేశమవుతారు. ఇదిలా ఉండగా, జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ గతంలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. అదే తుది సమావేశమని జైరాం రమేష్ అంటే, అది చివరిది కాదని షిండే చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా షిండే ఇది తుది సమావేశం కాదని చెబుతున్నారు. -
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
-
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
-
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
సాధ్యాసాధ్యాలపై సోనియా ఆరా హైదరాబాద్పై జీవోఎం సభ్యులతో మేడమ్ అత్యవసర సమావేశం అలాగైతే సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరిస్తారన్న కేంద్ర మంత్రులు 28 నాటి కేబినెట్ భేటీకల్లా తెలంగాణ బిల్లు సిద్ధం చేయాలని ఆదేశం యూటీకి తాను సుముఖమేనన్న కిరణ్! విభజనకు సహకరిస్తాం.. సీఎంనూ ఒప్పిస్తాం: శీలం రేపు సాయంత్రం 4.30కు భేటీ కానున్న జీవోఎం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ను తాత్కాలిక కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. సోమవారం సాయంత్రం జీవోఎం సభ్యులతో ఆమె అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు, నివేదికలోని అంశాలపై గంటకు పైగా చర్చించారు. జీవోఎం సారథి సుశీల్కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్లతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్తిగా సహక రిస్తామని, అయితే హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల భద్రత కోసం దాన్ని యూటీ చేయాలని ఇటీవల సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇటీవల జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలను విడివిడిగా కలిసి ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో వేగంగా కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుందని, అప్పటి వరకైనా హైదరాబాద్ను యూటీ చేస్తే చాల ని కోరారు. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే అసెంబ్లీలో విభజన బిల్లుకు ఇబ్బంది లేకుండా ఉండేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఒప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయంపై తాము ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితోనూ మాట్లాడామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని జీవోఎం సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం ఈ విషయాన్ని సోనియా దృష్టికి కూడా తీసుకెళ్లారు. యూటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే గాక విభజనపై ఆంటోనీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, నవంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించాలని సోనియా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జీవోఎం సభ్యులంతా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నార్త్ బ్లాక్లో సమావేశమై హైదరాబాద్ యూటీ, ఆంటోనీ నివేదిక సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి తమ నివేదికను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజనను బయటికి మాత్రం వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తామని శీలం సోమవారం సాయంత్రం కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ తెలిపారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని ఆయన తెలిపారు. అంటే కిరణ్ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు. కేబినెట్లో చర్చకు రాని తెలంగాణ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపైనే చర్చ జరిగినట్టు సమాచారం. నేడు షిండేతో మర్రి బృందం భేటీ విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలవనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేయనుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు. -
హైదరాబాద్పైనే పీటముడి
న్యూఢిల్లీ: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజనపై ఇంతకాలం కసరత్తు చేసి తయారు చేసిన నివేదికను జిఓఎంఆమెకు అందజేసింది. సమావేశంలో గంటన్నరసేపు చర్చించారు. హైదరాబాద్పైనే పీటముడిపడినట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నెల 27న జిఓఎం తుది సమావేశం జరుగుతుంది. సోనియా గాంధీ ఇప్పుడు ఇచ్చిన సలహాల ఆధారంగా తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, చిదంబరం పాల్గొన్నారు. -
సోనియాకు GOM తయారు చేసిన నివేదిక
-
సోనియాకు తమ నివేదిక ఇచ్చిన GOM
-
తూతూమంత్రంగా జీఓం సమావేశం
-
జీవోఎం నివేదిక ’గోవిందా.....గోవిందా’
-
జీవోఎం సభ్యులను ఇక కలవను: కోట్ల
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జీవోఎం సభ్యుల తీరును రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, ఇకపై వారు పిలిచినా వెళ్లదల్చుకోలేదని చెప్పారు. ‘‘సీమాంధ్ర కేంద్ర మంత్రులుగా మేం ఏమడిగినా తమకు సంబంధం లేదంటున్నారు. పవర్స్ లేవంటున్నారు. ఏమైనా అంటే మమ్మల్ని అవమానిస్తున్నారు. ఏం చెప్పినా వినడం లేదు’’అని కోట్ల వాపోయారు. జీవోఎం సభ్యులుగా వారికి అసలు బాధ్యతే లేదన్నారు. రాయల తెలంగాణ ఇస్తారా? తెలంగాణ ఇస్తారా? అనేది వాళ్లే తేల్చుకుంటారని, అయితే రాయలసీమను చీల్చాలనుకోవడం మంచిది కాదన్నారు. జీవోఎం తీరు బాధాకరంగా ఉన్నా తాను కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో,.. నేను ఓడితే ఓడిపోవచ్చు. కానీ పార్టీని వీడను’’అని చెప్పారు. సోనియాగాంధీని అపాయింట్మెంట్ అడిగిన మాట నిజమేనని, పిలిస్తే ఆమెకు వాస్తవాలు చెబుతానని కోట్ల అన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్నా ఆగబోదన్నారు. -
వచ్చేవారం మరోసారి జీవోఎం భేటీ
26 లేదా 27న సమావేశానికి అవకాశం: షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) భేటీ గురువారం అసంపూర్తిగా ముగిసింది. ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మరోసారి సమావేశం అనివార్యమైంది. నార్త్బ్లాక్లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశానంతరం హోంమంత్రి సుశీల్కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. ‘‘జీవోఎం భేటీ ముగిసింది. ఇద్దరు సహచరులు హాజరుకాలేదు. చిదంబరం విదేశాల్లో ఉన్నారు. గులాంనబీ ఆజాద్ కూడా లేరు. అందువల్ల వచ్చేవారం మరోసారి సమావేశం జరుగుతుంది. ఎప్పుడనేది చిదంబరం వచ్చాక మాట్లాడి నిర్ణయిస్తాం. సాధ్యమైనంత త్వరగానే ప్రక్రియను ముందుకు తీసుకువెళతాం..’’ అని చెప్పారు. గురువారం నాటి సమావేశానికి హాజరైన మంత్రి వీరప్పమొయిలీ.. తదుపరి జీవోఎం భేటీ ఈనెల 27వ తేదీన ఉండవచ్చంటూ మీడియా అడిగిన ఒకప్రశ్నకు జవాబిచ్చారు. తదుపరి జీవోఎం సమావేశం 26 లేదా 27 తేదీన ఉండవచ్చని షిండే కూడా విలేకరులతో ఇష్టాగోష్టిలో చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెడతామని పునరుద్ఘాటిం చారు. అయితే బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందీ, కచ్చితంగా ఏ రోజున పార్లమెంటులో పెడతారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ‘అవ న్నీ నిర్ణయం అవుతాయి’ అని మాత్రమే చెప్పారు. -
కోట్లకు షాకిచ్చిన కేంద్రం
రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సందర్భంలో సీమాంధ్రపై కొన్ని డిమాండ్లతో కేంద్రానికి నివేదించేందుకు వెళ్లిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డికి ఢిల్లీలో చుక్కెదురైంది. తన డిమాండ్లను గురువారం జీవోఎంకు నివేదించారు. అయితే ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేమని కోట్లకు కేంద్రం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఆయన అలిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి నివేదించిన ముఖ్య డిమాండ్లలో ఒకటి కర్నూలు, అనంతపురం కలిపి రాయల తెలంగాణ చేయాలి. రెండవది సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలి, మూడవది ప్రత్యేక రాయలసీమ. ఈ డిమాండ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన జీవోఎం ఎదుట సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాయల తెలంగాణ అంశం పక్కన పెట్టాలని, విభజన తర్వాత దానిపై ఆలోచిద్దామని కేంద్రం చెప్పడంతో ఆయన తీవ్ర అసంతప్తికి లోనయినట్లు తెలిసింది. తన డిమాండ్లలో ఏ ఒక్క దానికి పరిష్కారం చూపకపోవడంతో తిరుగు ప్రయాణం అయినట్లు మంత్రి కోట్ల వర్గీయులు తెలిపారు. -
27న జీవోఎం భేటీ, నివేదికకు తుదిరూపు
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ నెల 27న మరోసారి సమావేశం కానుంది. తెలంగాణ బిల్లుతో పాటు నివేదికను ఖరారు చేయనుంది. అనంతరం మంత్రుల బృందం కేంద్ర కేబినెట్కు నివేదిక సమర్పించనుంది. దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపనున్నారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సారథ్యంలోని జీవోఎం రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలను చర్చించింది. ఆదాయ, ఆస్తుల పంపిణీ గురించి వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా ఇటీవల చర్చించింది. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు షిండే తెలిపారు. -
తెలంగాణపై పాతపాటే పాడిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ''సాధ్యమైనంత త్వరలో మా ప్రక్రియ పూర్తి చేస్తాం'' అని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే పాతపాటే పాడారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఈ ఉదయం సమావేశమై తెలంగాణ బిల్లు ముసాయిదాపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. కేంద్రానికి తుది నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేసింది. ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోయింది. సమావేశం ముగిసిన తరువాత షిండే విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి కేంద్ర మంత్రులు చిదంబరం, గులామ్ నబీ ఆజాద్ హాజరుకాలేదని తెలిపారు. చిదంబరం విదేశీ పర్యటనకు వెళ్లినందున హాజరుకాలేకపోయినట్లు చెప్పారు. జిఓఎం మళ్లీ ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ రోజు జరుగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం వాయిదాపడిన విషయం తెలసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కారణంగా ఈ సమావేశం వాయిదాపడింది. -
'హైదరాబాద్ను యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం'
న్యూఢిల్లీ : హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం స్పష్టం చేశారు. హైదరాబాద్ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని వారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం ముగిసిన అనంతరం జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, నారాయణ స్వామితో ....కావూరి, శీలం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కావూరి, జేడీ శీలం మాట్లాడుతూ తాము ప్రస్తుతం హైదరాబాద్పై దృష్టి పెట్టామని, ప్యాకేజీలపై తర్వాత చర్చిస్తామన్నారు. జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు ప్యాకేజీల కోసం తాము చేస్తున్న డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్కుమార్షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్ను యూటీ చేయాల్సిందేనని సూచించారు. -
విభజన నివేదిక ఖరారుపై కొనసాగుతున్న కసరత్తు
న్యూఢిల్లీ : నార్త్బ్లాక్లో జీవోఎం సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజనపై తుది నివేదిక విషయంలో జీవోఎం చర్చలు జరుపుతోంది. శుక్రవారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన విధివిధానాలపై.. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం.. గురువారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగింది. నివేదిక వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే కేంద్రమంత్రి చిదంబరం సింగపూర్ వెళ్లడంతో తుది నివేదిక విషయంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం జీవోఎం సభ్యులు కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరాం రమేష్తో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం భేటీ అయ్యారు. కాగా జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకోవటంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. -
కేంద్ర క్యాబినెట్ భేటీ వాయిదా
-
వచ్చేవారం కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈరోజు ఉదయం 11.30గంటలకు సమావేశం కానుంది. విభజన సిపార్సులపై జీవోఎం సభ్యులంతా సమావేశమై నివేదికను ఖరారు చేసి ఆమోదించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రంగా జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం నేడు జైపూర్ పర్యటనకు వెళుతున్నారు. దాంతో వచ్చేవారంలో తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. కాగా రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. -
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
-
టీ-బిల్లునేడు ఖరారు!
-
టీ-బిల్లునేడు ఖరారు!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికను, తెలంగాణ బిల్లు ముసాయిదాను గురువారం ఖరారు చేయనుంది. జీవోఎం సభ్యులంతా గురువారం ఉదయం సమావేశమై నివేదికను ఖరారు చేసి ఆమోదించనున్నారు. అయితే.. ముందుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు గురువారం సాయంత్రం జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికలు వస్తాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. గురువారం ఉదయం జరగబోయే జీవోఎం సమావేశమే చివరిదని.. విభజనపై నివేదికను ఖరారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపుతామని జీవోఎం సభ్యుడైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్ పేర్కొన్నారు. కానీ.. జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే అందుకు విరుద్ధంగా చెప్పారు. కీలకమైన నివేదికను ఇంత తొందరగా ఖరారు చేయలేమని ఇంకా ఒకటి, రెండు సార్లు జీవోఎం సమావేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గురువారం నాటి కేబినెట్ సమావేశానికి నివేదిక వెళ్లకపోవచ్చని కూడా చెప్పారు. మరోవైపు.. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం జైపూర్ పర్యటనకు వెళుతున్నందున గురువారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. జీవోఎం నివేదికకు గురువారం తుది మెరుగులు దిద్దుతుందని.. నివేదికతో పాటు, తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. జీవోఎం భేటీలో కొప్పుల రాజు... రాష్ట్ర విభజన విధివిధానాలపై.. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం.. బుధవారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగింది. హోంమంత్రి చాంబర్లో షిండే, జైరాంరమేశ్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేశారు. జీవోఎం సమావేశానికి రిటైర్ట్ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజును ప్రత్యేకంగా పిలిపించారు. ఆంధ్రప్రదేశ్పై పూర్తి అవగాహన కలిగిన రాజు వారికి ఏం చెప్పారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్, ప్యాకేజీ వంటి అంశాలకు సంబంధించి రాజు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. హైదరాబాద్, ప్యాకేజీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీరు, విద్యుత్, విద్య వంటి అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సహా తెలంగాణ, సీమాంధ్ర నేతలు, వివిధ పార్టీలు లెవనెత్తిన అంశాలను క్రోడీకరించి జీవోఎం నివేదికను ఖరారు చేశారు. గురువారం జీవోఎం సభ్యులందరితో సమావేశమై అందరి ఆమోదంతో జీవోఎం నివేదికను, విభజన బిల్లు ముసాయిదాను కేబినెట్కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత షిండే.. మీడియాతో మాట్లాడుతూ నివేదికను ఖరారు చేయటానికి ముందుగా ఇంకా ఒకటి, రెండు సార్లు జీవోఎం సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఆ తరువాత వచ్చిన జైరాంరమేశ్ మాత్రం షిండే వ్యాఖ్యలకు భిన్నంగా.. గురువారం భేటీలోనే నివేదికను ఖరారు చేసి కేబినెట్కు పంపుతామని చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల తుది ప్రయత్నాలు... జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలుసుకున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచే లా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి బుధవారం సాయంత్రం సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్కుమార్షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్ను యూటీ చేయాల్సిందేనని సూచించారు. ‘యూటీ’ సాధ్యం కాదన్న జీవోఎం సభ్యులు... తొలుత జైరాంరమేశ్, ఆంటోనీలను కలిసి ఈ ప్రతిపాదన తీసుకురాగా వారు తోసిపుచ్చినట్లు తెలిసింది. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే తమ కసరత్తు కొనసాగుతోందని, యూటీ సాధ్యం కాదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో.. ీ కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీని ప్రకటించటంతో పాటు సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి సంస్థలన్నిటినీ ఏర్పాటు చేసేలా సిఫారసు చేయాలని ఆ ప్రాంత కేంద్రమంత్రులు కోరారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవాలని జైరాం సూచించినట్లు తెలిసింది. ఆంటోనీ మాత్రం మంత్రులు చెప్పిన విషయాలను వినేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. సీమాంధ్ర మంత్రులు తర్వాత మొయిలీ,షిండేలను కలిసి తమ ప్రతిపాదనలకు అనుగుణంగా నివేదికలో పరిష్కారాలు చూపాలని కోరారు. వారి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో గురువారం సోనియాని కలవాలని భావించిన నేతలు అపాయిట్మెంట్ కోరినట్లు తెలిసింది. శీతాకాల భేటీలోనే ఆమోదం: మొయిలీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు వీరప్పమొయిలీ చెప్పారు. బుధవారం సీమాంధ్ర కేంద్రమంత్రులు కలిసి వెళ్లిన అనంతరం ఆయన కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ జీవోఎం రూపొందించే నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు ఎప్పుడు వస్తుందో చెప్పలేనని పేర్కొన్నారు. జీవోఎం సిఫారసులను మాత్రం ఈ నెలాఖరు లోగా ఖరారు చేస్తామన్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాలపై చూపే ప్రభావమున్న అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపైనే సీమాంధ్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. మరోవైపు హోంమంత్రి షిండే జీవోఎం సమావేశానికి వచ్చే ముందు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో సమావేశమై వచ్చినట్లు తెలిసింది. వీరిద్దరు ఏయే అంశాలు చర్చించారనేది మాత్రం తెలియలేదు. -
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
శాంతిభద్రతలు గవర్నర్ చేతికి.. జీవోఎం నివేదికలో సిఫారసులు ఆంటోనీ నివాసంలో అర్ధరాత్రి భేటీలో కాంగ్రెస్ పెద్దల ఖరారు రెండు రాష్ట్రాల్లోనూ ‘371డీ’ కొనసాగింపు జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపిణీ సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి ప్యాకేజీలు సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల ఏర్పాటు.. ‘భద్రాచలం, రాయల తెలంగాణల’పై అసెంబ్లీ అభిప్రాయం ప్రకారం ముందుకు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ను తిరస్కరించిన జీవోఎం.. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్కు అప్పగించాలని కూడా జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్ర మంత్రుల బృందం నివేదికకు, విభజన బిల్లు ముసాయిదాను కూడా బుధవారం రాత్రి రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నివాసంలో జరిగిన సమావేశంలో తుది రూపమిచ్చారు. జీవోఎం సభ్యుడు ఆంటోనీతో మరో సభ్యుడు జైరాం రమేశ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్లు సమావేశమై అర్ధరాత్రి దాటేవరకూ నివేదికపై చర్చించారు. పది పేజీలతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను చేర్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అందులో కీలకమైన అంశాలపై పలు సిఫారసులను చేర్చారు. గురువారం సోనియాగాంధీని కలిసి ఆమె సూచనల మేరకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికను కేబినెట్కు సమర్పిస్తారు. ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించిన మేరకు జీవోఎం నివేదికలో పొందు పరిచిన ముఖ్యాంశాలివీ... - హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్ను తిరస్కరించారు. - జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి రాజధాని చేస్తూ, శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్కు అప్పగిస్తారు. - విభజన బిల్లుతో పాటే ఆర్టికల్ 371డీని కూడా పార్లమెంటులో సాధారణ మెజారిటీతో సవరించవచ్చని, దానిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించవచ్చని జీవోఎం పేర్కొంది. ‘ఈ 371డీ ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది’ అని నివేదికలో చేర్చారు. - తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఎదురవుతుందన్న వాదనలను జీవోఎం కొట్టివేసింది. అలాంటిదేమీ ఉండదని, రాబోయే 25 నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయని, అందులో తెలంగాణకు 56 శాతం, సీమాంధ్రకు 44 శాతం విద్యుత్ సరఫరా అయ్యేట్లు జెన్కో సహా ప్రయివేటు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు విద్యుత్ కొరత ఉండదని పేర్కొంది. - జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలని జీవోఎం సిఫారసు చేసింది. - వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచిత ప్యాకేజీలు ప్రకటించాలని చెప్పింది. - సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. - సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్రీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. - భద్రాచలం, రాయల తెలంగాణ అంశాలపై సస్పెన్స్ను జీవోఎం కొనసాగించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. -
త్యాగ ఫలం ఇదేనా?
రాష్ట్ర విభజనపై కేంద్ర మం త్రుల బృందానికి (జీఓఎం) ఇటీవల టీఆర్ఎస్ ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించింది. కృష్ణా పరివాహక ప్రాంతానికి బయట చట్టవిరుద్ధంగా నిర్మిం చిన తెలుగు-గంగ, గాలేరి-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, వెలుగోడు, సోమశిల, కండలేరు, చిత్రావతి, లింగాల కాలువలకు నీటి కేటాయింపులను తమ పార్టీ వ్యతిరేస్తుందని ఆ లేఖలో విస్పష్టంగా పేర్కొన్నట్టు ఆ పార్టీ అధినేత తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైఖరి. వెనుకబడ్డ రాయలసీమను ఎడారిగా మార్చే దుశ్చర్య. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోనివి కావనడం దుస్సాహసం. కృష్ణా మిగులు జలాలు తెలంగాణకే దక్కాలనే దురాశతోనే టీఆర్ఎస్ ఈ వివాదానికి తెరలేపింది. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం, తెలంగాణ అభివృద్ధి ఫోరం లాంటి సంస్థలు కూడా ఇలాగే అర్థసత్యాలు, అసత్యాలు, అభూతకల్పనలతో ప్రాంతీయ దురభిమానాన్ని ప్రకటించాయి. ‘‘శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు కాగా, దానికి మించి 203 నుండి 364 టీఎంసీల వరకు వరద లేదా మిగులు జలాల పేరుతో దోచుకెళ్లడానికి ప్రాజెక్టులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయిన తరువాత మొత్తం కృష్ణా నదినే రాయలసీమకు మళ్లిస్తారు’’ అని తెలంగాణా ఇంజనీర్స్ ఫోరం తమ వినతి పత్రంలో పేర్కొన్నది. ఇది ఎంతటి హాస్యాస్పదమో పామరులకు కూడా బోధపడుతుంది. వాస్తవమేమిటి? మొత్తం కృష్ణా నికర జలాలు 69 టీఎంసీలు. వీటిలో చెన్నైకి 15, ఎస్ఆర్బీసీకి 19, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, కాగా తెలుగు గంగకు 29 టీఎంసీలు. ఇకపోతే గాలేరు-నగరి పథకానికి 38 టీఎంసీల మిగులు లేదా వరద జలాలు. వెరసి 112 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించడానికి వీలుగా నిర్మాణాన్ని చేపట్టారు. కేసీ కెనాల్ 150 ఏళ్ల నాటిది. కాగా, 30 ఏళ్లుగా ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ నిర్మాణంలోనే ఉన్నాయి. గాలేరు-నగరిలో భాగమైన గండికోట జలాశయం మాత్రమే పూర్తయింది. తప్పుడు లెక్కలతో ఎవరిని మోసగించాలని నీటిని అక్రమంగా కొల్లగొడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు? ఇహ హంద్రీ-నీవా (40 టీఎంసీలు), వెలుగొండ (43.5) మిగులు జలాలపై ఆధారపడే నిర్మాణంలో ఉన్నాయి. వీటికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సంబంధమే లేదు. శ్రీశైలం మీద ఆధారపడిన రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు నికర జలాలు 54+మిగులు జలాలు 126.5= 180.5 టీఎంసీలు మాత్రమే. ట్రిబ్యునళ్ల తీర్పులను అమలు చేయడానికి కృష్ణా, గోదావరులకు సంయుక్తంగా లేదా వేరువేరుగా స్వయం ప్రతిపత్తి గల నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేస్తే నీటి సమస్య పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు. కావేరి, తుంగభద్ర బోర్డుల చేదు అనుభవాలను చూస్తూనే ఉన్నాం. కృష్ణపై నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు మిగులు లేదా వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవని విస్మరించరాదు. పైగా కేటాయింపులు లేకుండానే మిగులు జలాలను వినియోగించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛ ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి సమస్యలను బోర్డులు ఎలా నియంత్రించగలవన్నదే మౌలిక ప్రశ్న. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ మిగులు జలాలను 285 టీఎంసీలుగా నిర్ధారించి సింహభాగాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలకు కేటాయించింది. మిగులు జలాలను ఇలా పంపిణీ చేయడం అశాస్త్రీయమన్న మన అభ్యంతరాల దృష్ట్యా ఆ అంశంపై నేడు పునర్విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మిగులు జలాలపై ఈ చిచ్చును రాజేసింది. దగాపడ్డ వారు నీటి దొంగలా? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెస్ నాయకుల మధ్య కుదిరిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (1937) చెల్లని కాసుగా అటకెక్కింది. కృష్ణా, తుంగభద్ర జలాల వినియోగంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని నాడు లిఖిత పూర్వక హామీని ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు లభించేది. కానీ ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుందనే వాదన కు తలొగ్గి నాడు సీమ ప్రజలు తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాలనే మిన్నగా ఎంచారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేయగలిగిన కృష్ణా-పెన్నార్ పథకాన్ని తృణప్రాయంగా కాలదన్నారు. ఆ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికి దోహదపడే ప్రాజెక్టులను, జలాశయాలను నేడు తెలంగాణవాదులు వివాదాస్పదం చేస్తున్నారు. కృష్ణా-పెన్నార్ పథకంలో భాగమైన సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి రాయలసీమకు న్యాయం చేస్తామని చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయి. సిద్ధేశ్వరం స్థానంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు. నాగార్జునసాగర్ను సాధించుకొన్నారు. ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. కరవుకాటకాలు కరాళ నృత్యం చేస్తున్న రాయలసీమ గుక్కెడు నీళ్ల కోసం ఆర్తనాదాలు చేస్తూనే ఉంది. నాడు రాయలసీమ కోల్పోయిన కృష్ణా-పెన్నార్ ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికే తెలుగు-గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అది కూడా దశాబ్దాల రాయలసీమ ప్రజా పోరాటాల ఫలితమే. ఈ వాస్తవాలను విస్మరించి త్యాగాల సీమపై నీటి దొంగ ముద్ర వేయడం ఏం నీతి? నాడే ఈ ప్రాజెక్టులను చేపడితే బచావత్ ట్రిబ్యునల్ ఆ నీటి వాడకాన్ని కూడా చట్టబద్దం చేసి ఉండేది. నమ్మి దగాపడ్డ నిత్య కరువు సీమకు కృష్ణా మిగులు లేదా వరద జలాలు సైతం దక్కడానికి వీల్లేదని టీఆర్ఎస్ వివాదాన్ని రేపుతోంది. {బజేష్కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో 65 శాతం ప్రామాణికమైవిగా నిర్ధారించి, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. ఆ ప్రాజెక్టులో భాగమై న వెలుగోడు, కండలేరు జలాశయాలను వ్యతిరేకించడమంటే ఆ నీటి కేటాయింపును వ్యతిరేకించడమే. కృష్ణా పరివాహక ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజల దప్పికను తీర్చడానికే తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. చెన్నైకు తాగు నీటి కోసం మహారాష్ట్ర, కర్నాటక, ఆం ధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య కుదిరిన ఒప్పం దంలో భాగంగానే కండలేరు నిర్మాణం జరిగింది. కండలేరు, పెన్నా నదుల వరద నీటిని సద్వినియో గం చేసుకోవడానికి వీలుగా 70 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల జలాశయాన్ని నిర్మించారు. సోమశిల (68 టీఎంసీ) పెన్నా నది నీటిపై ఆధారపడినది. చిత్రావతి ఆన కట్ట పెన్నానదికి ఉపనది చిత్రావతిపై నిర్మించినది. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకే చెల్లింది. టీఆర్ఎస్ తదితరులు అంటున్నట్టుగా తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ కేంద్ర అనుమతి లేని అక్రమ ప్రాజెక్టులయితే... అదే ప్రాతిపదికన నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కూడా అక్రమమైనవే కావాలి కదా! ‘శ్రీశైలం’ ఎవరి సొత్తు? కృష్ణానదిపై నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి పారుదల వ్యవస్థ మొత్తానికి శ్రీశైలం గుండెకాయ. నీటి వినియోగంలో ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అది అనివార్యంగా నీటి యుద్ధాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తకూడదనే బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి 1996 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 69ని జారీ చేసింది. దాన్ని ఉల్లంఘిస్తే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణం వెనుక ఉన్న చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సిద్ధేశ్వరం వద్ద జలాశయాన్ని నిర్మించి రాయలసీమకు సాగు నీటిని అందిస్తామంటూ దగా చేసి అక్కడ విద్యుదుత్పత్తి ప్రాజెక్టును, జలాశయాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రజల పోరాటాలకు తలవొగ్గి ఆ ప్రాజెక్టు స్వభావాన్ని సాగునీటి అవసరాలను కూడా తీర్చడానికి వీలుగా మార్చారు. ఆ జలాశయం నిర్మాణంతో కర్నూలు జిల్లాలో మొత్తం 50 గ్రామాలు, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 67 గ్రామాలు ముంపునకు గురయినాయి. చరిత్రను గౌరవించే వారెవరూ శ్రీశైలంపై రాయలసీమ ప్రజలకు హక్కులేదనే సాహసం చేయలేరు. ఆ చరిత్రపై గౌరవం లేదు కాబట్టే శ్రీశైలం జలాశయం నుండి 11 టీఎంసీలకు మించి ఒక్క చుక్క నీటిని కూడా తరలించుకుపోయే హక్కు రాయలసీమకు లేదని కొందరు హుకుం జారీ చేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా విస్తృత ప్రజానీకపు ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి, ప్రత్యేకించి వెనుకబడ్డ, నిత్యకరువు పీడిత ప్రాంతాల కడగండ్లను తీర్చే విశాలమైన దృక్పథంతో ఆలోచించి అతి కీలకమైన నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించాల్సిన బాధ్యత సాగునీటి రంగ నిపుణులపైన, రాజకీయ పార్టీలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. విశ్లేషణ : టి. లక్ష్మీనారాయణ డెరైక్టర్ నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం -
రేపు జిఓఎం తుది సమావేశం : జైరామ్ రమేష్
-
హోం శాఖ అధికారులతో షిండే, జైరాం రమేష్ భేటీ
-
హోం శాఖ అధికారులతో షిండే, జైరాం రమేష్ భేటీ
కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ బుధవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి జీవోఎం ముందుకు వచ్చిన సిఫార్సులు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రతిపాదనల గురించి చర్చించారు. అలాగే, మరోవైపు హైదరాబాద్లో శాంతిభద్రతల పరిస్థితి, నిర్వహణ గురించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ చీఫ్ నుంచి జీవోఎం సమాచారం తెలుసుకుంటోంది. -
తెలంగాణ ఆస్తులను సీమాంధ్రకు తరలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎలాగూ రాష్ట్రం విడిపోతోందన్న కారణంతో తెలంగాణ ప్రాంత ఆస్తులను సీమాంధ్రకు తరలించేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రాంత భూభాగాలను కూడా సీమాంధ్రకు చెందినవిగా చూపుతూ జీవోఎంకు తప్పుడు నివేదికలు పంపుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాస్గౌడ్ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రాచీన ఆలయాల విగ్రహాలను, గోల్కొండలోని ఫిరంగులను పర్యాటక శాఖ విజయవాడకు తరలిస్తోందని, దీన్ని వెంటనే ఆపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి కోరినట్టు చెప్పారు. పోలవరం తమదని, హైదరాబాద్పై హక్కుందని ఇన్నాళ్లు వాదించిన ప్రభుత్వంలోని సీమాంధ్ర నేతలు తాజాగా శ్రీశైలం ఎడమ కాలువ ప్రాంతమంతా కర్నూలు జిల్లా పరిధిలోనే ఉందని తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి
-
సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి
ఏలూరు : జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పాస్ చేస్తే తామేమీ చేయలేమని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానంతోనే పోరాడతామని కావూరి తెలిపారు. అయితే మద్దతు కోసం ఇతర పార్టీ నేతలను కలిసే ఆలోచన లేదని ఆయన అన్నారు. కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు. కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. అయితే అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. -
GOM గోయింగ్ ఆన్ పై ది ప్రైమ్ టైమ్ షో
-
3 రోజుల్లో టీ బిల్లు ఖరారు
-
ఖమ్మంలోనే భద్రాచలం!
జీవోఎంను కోరిన తెలంగాణ కేంద్ర మంత్రులు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఓకే సాక్షి, న్యూఢిల్లీ: భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు జీవోఎంను కోరారు. ఆర్టికల్ 371(డీ)ని కొనసాగించాలని, రాజ్యాంగ సవరణ అవసరంలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొంత విద్యుత్ ప్లాంట్లు నిర్మించుకునే వరకు ఇప్పుడున్న పద్దతిలోనే కేంద్రం విద్యుత్ను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడ జీవోఎంతో భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జైపాల్రెడ్డి ఏమన్నారంటే.. తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడున్న భద్రాచలం ఖమ్మం జిల్లాలో భాగం. భద్రాచలంతో పాటు పూర్తి తెలంగాణ కావాలి. హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగం. చారిత్రకంగా హైదరాబాద్లో అన్ని మతాలు, భాషల వారికి స్థానం ఉంటూ వచ్చింది. హైదరాబాద్పై కృత్రిమమైన ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ అందరికీ వ్యాపారం, వ్యాపకాలు పెంచుకునే అవకాశం ఉంది. ఉండాలి. ఈ సంస్కృతి నైజాం కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇక ముందూ కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుచ్ఛక్తి కొరత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు ఏ తప్పుడు విధానాల వల్ల విద్యుచ్ఛక్తి కొరత వచ్చిందో చరిత్రలోకి వెళ్లడం లేదు. ఈ దశలో అన్యాయం జరిగిందని చెప్పుకోవడం తగదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా విద్యుత్ ప్లాంట్లు పెట్టుకునేవరకు ఇప్పుడున్న ఫార్ములా ప్రకారం ఐదు, పదేళ్ల వరకు కేంద్రమే తెలంగాణకు విద్యుత్ ఇచ్చేలా చూడాలి. ఆర్టికల్ 371(డీ) విషయంలో సీమాంధ్రప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. 371(డీ) కొనసాగాలి. ఈ విధానాన్ని రెండు ప్రాంతాల్లో అమలు చేయాలి. మేం ముగ్గురం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాం. ఆర్టికల్ 371(డీ)ని కొనసాగించడానికి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కృష్ణా నదీజలాలపై ట్రిబ్యునల్ సరిపోతుంది. గోదావరిపై అక్కర్లేదు. మిగులు జలాలు చాలానే ఉన్నాయి. ఎవరికీ ఆందోళన అవసరం లేదు.. బలరాం నాయక్ ఏమన్నారంటే.. మహబూబాబాద్ లోక్సభ స్థానం(ఎస్టీ)లో భద్రాచలం ఉంది. 1959 నుంచీ ఇది తెలంగాణలోనే ఉంది. గిరిజనులు, కొండరెడ్లు ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఇక్కడ గుడికట్టిన తహశీల్దారు రామదాసును నిజాం జైలులో పెట్టారు.. వంటి వివరాలతో భద్రాచలం చరిత్రను జీవోఎంకు వివరించాను. భద్రాచలానికి అన్యాయం జరిగితే గిరిజనులు, ప్రజలు ఒప్పుకోరు. భద్రాచలం గుడే కాకుండా డివిజన్ మొత్తం తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా. సర్వే ఏమన్నారంటే.. కొత్త రాజధాని నిర్మాణం ఎప్పటిలోపు పూర్తి చేస్తారనేదానిపై నిర్దిష్ట కాలవ్యవధి నిబంధన (సన్సెట్ క్లాజ్) విధించాలి. పదేళ్ల వరకు రాజధాని కట్టుకోకుంటే.. ఇక్కడే ఉండే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా సన్సెట్ క్లాజ్ పెట్టుకోవాలి. 10 ఏళ్లలోపు రాజధానిని కట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ల రాజధాని వారికి, మా రాజధాని మాకు ఉంటుంది అని చెప్పాను. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఎక్కడా లేదు.. సోనియాగాంధీ మాటకు గౌరవించి అంగీకరించాం. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ చరిత్ర, 2004, 2009 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టడం మొదలు సీడబ్ల్యూసీ నిర్ణయం వరకు సంబంధించిన విషయాలన్నీ జీవోఎంకు వివరించాము. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా సరిపోతుంది.. రాష్ట్ర విభజనను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, సీఎం కిరణ్ కూడా వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు.. పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని జైపాల్రెడ్డి చెప్పారు. జాతీయ పార్టీలు కూడా విభజనకు సహకరిస్తున్నాయన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పెట్టడమే అపూర్వమని, 65 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పాటైనా ఎక్కడా ఇలా జరగలేదన్నారు. హైదరాబాద్ రెవెన్యూ పంపిణీ సాధ్యపడదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇద్దరు గవర్నర్లు, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఉండేందుకు, హైకోర్టుల ఏర్పాటుకు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా సరిపోతుందన్నారు. గవర్నర్లకు స్వయంప్రతిపత్తి అథారిటీ అక్కర్లేదని జీవోఎంకు చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలేర్పడి రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలుంటాయన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు. ‘ఒకే రాష్ట్రంలో ఎన్నిక లు జరిగే పరిస్థితి లేదు. అది అనూహ్యం. అసంభవం’ అని చెప్పారు. సీమాంధ్ర నుంచి 9 మంది కేంద్ర మం త్రులు వెళ్లగా, ముగ్గ్గురే ఉన్న మీకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా.. అని ప్రశ్నించగా.. న్యాయమనేది మెజార్టీ, మైనార్టీపై ఆధారపడి ఉండదు. న్యాయాన్యాయాలు పార్లమెంట్ చూస్తుంది. ప్రజల కోరిక, న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుంటుందని బదులిచ్చారు. -
'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి'
దేశ భద్రతకే ముప్పని జీవోఎంతో చెప్పా: కిరణ్ మావోయిస్టు అగ్రనేతల్లో అధికులు ఆంధ్రప్రదేశ్ వారే.. మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వారే జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే.. దీనిపై మాకు సాహిత్యం లభ్యమైంది రాష్ట్రం విడిపోతే మిగులు జలాల హక్కును తెలంగాణ కోల్పోతుంది.. అక్కడ తీవ్ర విద్యుత్ కొరత వస్తుంది సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కోరాను న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు రాష్ట్రాల్లోనూ దారుణ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని.. ముఖ్యంగా నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులతో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనవల్ల సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, విద్య, హైదరాబాద్ భద్రత వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని పరిష్కరించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఇతోధిక సాయం చేయడమే మేలని అభిప్రాయపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఇరు రాష్ట్రాల్లోనూ నక్సలిజం, తీవ్రవాదం, మతకల హాలు చెలరేగే ఆస్కారముంది. దేశానికి అతిపెద్ద సవాల్ నక్సలిజమేనని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కనీసం ఆరేడుసార్లు చెప్పారు. విడిపోతే ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. ఎందుకంటే దేశంలో మావోయిస్టు కేంద్ర కమిటీలోనున్ను 17 మందిలో 11 మంది ఆంధ్రప్రదేశ్ వారే. మొత్తం నక్సలైట్ల సంఖ్యలో 80 శాతం మంది మన రాష్ట్రం వారే. వీరిలో మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వాళ్లే. అలాగే టైర్రరిజం పెరుగుతుంది. జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే. ఈ విషయంపై వారు రూపొందించుకున్న సాహిత్యం మాకు లభ్యమైంది. అందుకే హెదరాబాద్లో ఏ ఉత్సవాలు జరిగినా సీమాంధ్ర నుంచి 25 వేల మంది పోలీసులను తరలించి బందోబస్తు నిర్వహిస్తూ ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. విడిపోతే పోలీసుల సంఖ్య, విజిలెన్స్ తక్కువవుతుంది. తద్వారా నక్సలిజం, టైజంతో పాటు మతకలహాలు చోటుచేసుకునే ఆస్కారముంది. దీనివల్ల రాష్ట్రానికే కాదు.. జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని జీవోఎం సభ్యులకు స్పష్టంచేశాను’’ అని ఆయన సోమవారం జీవోఎంతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీలోని నార్త్బ్లాక్ వద్దకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన కిరణ్కుమార్రెడ్డి సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాపరెడ్డి, పితాని సత్యనారాయణ, టి.జి.వెంకటేశ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావులతో కలిసి జీవోఎం వద్దకు వెళ్లారు. అక్కడ బయట ఉన్న గదిలో మంత్రులందరినీ కూర్చోబెట్టి సీఎం నేరుగా జీవోఎం సభ్యులున్న చాంబ ర్లోకి అడుగుపెట్టారు. దాదాపు గంటన్నర భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం నేరుగా ఏపీ భవన్కు వచ్చి మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి జీవోఎం సభ్యుల వద్ద తాను ఏయే అంశాలను ప్రస్తావించాననే దానిపై దాదాపు గంటకు పైగా వివరించారు. తన అభిప్రాయాలను లేఖ రూపంలో ఇవ్వడంతో పాటు విభజిస్తే జరిగే నష్టాలను కూడా వివరిస్తూ రెండు పుస్తకాలను కూడా అందజేశానన్నారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్పై తీవ్ర ప్రభావం చూపుతుంది... ‘‘విభజన నిర్ణయం హైదరాబాద్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటివరకు ఏ ఉద్యమం జరిగినా నగరంపై ప్రభావం చూపలేదు. రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల ఐటీ ఉద్యోగుల్లో 90 శాతం మంది హైదరాబాద్లోనే ఉన్నారు. ఏటా రూ. 55 వేల కోట్ల టర్నోవర్ జరిగితే రూ. 54 వేల కోట్లు హైదరాబాద్లోనే జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాను. విభజన జరిగితే సాగునీటి ప్రాజెక్టుల అంశం అతిపెద్ద సమస్యగా మారుతుంది. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయే ప్రమాదముంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇంకా తెలంగాణలోని ప్రాజెక్టులకు రూ. 65 వేల కోట్లు, సీమాంధ్రలోని ప్రాజెక్టులకు రూ. 30 వేల కోట్లు కావాలి. విడిపోతే నిధుల సమస్యతో పాటు 74.6 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇచ్చే కార్యక్రమమూ ఆగిపోతుంది. ఎగువ ప్రాంతాన ఉన్న తెలంగాణ.. మిగులు జలాలను వాడుకునే హక్కును కోల్పోతుంది. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ వినియోగంలో సగానికి సరిపడ ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉన్నందున సర్దుబాటు చేస్తున్నాం. విభజన జరిగితే అది సాధ్యపడదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ఓపెన్ కేటగిరి కింద వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు. వారందరిని సొంత జిల్లాలకు తరలించటం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లకు సీనియారిటీ సమస్య ఏర్పడుతుంది. అయినా వెళ్లిపోవాలంటే కోర్టుల్లో వేలాది కే సులు దాఖల య్యే ప్రమాదముంది. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలన్నాను... రాష్ట్రంలో అతిపెద్ద సమస్య విభజనే. అందుకే తెలంగాణకు మంచి ప్యాకేజీ ఇవ్వాలన్నాను. దీంతోపాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఆర్థిక సాయంతో విద్యాపరంగా సౌకర్యాలు క ల్పిస్తే సరిపోతుందే తప్ప విభజన మాత్రం వద్దని, కేంద్ర నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కోరాను. నేను చెప్పిందంతా విన్న జీవోఎం సభ్యులు నా ప్రెజెంటేషన్ బాగుందన్నారు. వాళ్లడిగిన క్లారిఫికేషన్లన్నింటికీ సమాధానాలిచ్చాను. విభజన ఆగిపోతుందో లేదో చెప్పలేదు. ఏం జరగబోతుందో చూద్దాం. విభజన బిల్లు వచ్చినా, రాకున్నా డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఎందుకంటే ఆరు నెలల గడువు కూడా ముగుస్తుంది కాబట్టి సభ నిర్వహించాల్సిందే. అప్పుడు బిల్లు వస్తే విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమసల్యన్నీ హైలెట్ చేస్తా. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం పంపే నివేదికను ఆమోదించవద్దని తెలంగాణ మంత్రులు చెప్తున్నారు. ఏ నివేదికైనా పంపే అధికారం సీఎంగా నాకు ఉంది. కేబినెట్ ఆమోదం అక్కర్లేదు. నన్ను సీఎంగా పిలిచారే తప్ప కేబినెట్ ఆమోదంతో రావాలని చెప్పలేదు.’’ -
విభజనకు పూర్తిగా సహకరిస్తాం!
కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం జీవోఎంకు స్పష్టం చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు (న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలిపారు. విభజన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని జీవోఎంకు స్పష్టం చేశారు. విభజనతో సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిని ఢిల్లీ, పుదుచ్చేరి తరహా కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజల్లో 80 శాతానికి పైగా సంతృప్తి చెందుతారని చెప్పారు. సీమాంధ్రకు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భద్రాచలం డివిజన్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల్ని కచ్చితంగా సీమాంధ్రలో కలపాలని కోరారు. అదే సమయంలో కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అభిప్రాయభేదాలున్నందున నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ముందు కెళ్లాలని సూచించారు. కొత్త రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. ఈ మేరకు రూపొందిం చిన 7 పేజీల నివేదికను జీవోఎంకు సమర్పించారు. సోమవారం ఉదయం పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, జేడీ శీలం, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మిలు సమావేశమయ్యారు. నివేదికను రూపొందించారు. 11 గంటలకు అందరూ కలిసి నార్త్బ్లాక్కు చేరుకున్నారు. జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు. తరువాత కొద్దిసేపటికి మరో సీమాంధ్ర కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ చేరుకుని జీవోఎం సభ్యులకు విడిగా నివేదిక అందజేయడంతోపాటు తన అభిప్రాయాలను చెప్పేసి మిగతావారికంటే ముందే బయటకు వచ్చారు. వాస్తవానికి 10 గంటలకే నార్త్బ్లాక్కు వచ్చిన దేవ్.. కొందరు తనను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ తిరిగి వెళ్లిపోయి గంట తరువాత మళ్లీ వచ్చారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. 12.45 గంటలకు బయటికొచ్చిన మంత్రుల తరఫున జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము సవాల్ చేయట్లేదు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. విభజనపై తొందరపడొద్దని, అనేక సమస్యలు వస్తాయని జీవోఎంకు చెప్పాం. పునరాలోచించాలన్నాం. విభజన అనివార్యమైతే మాత్రం సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలని కోరాం. రాయలసీమ తాగునీటి సమస్యనూ పరిష్కరించాలన్నాం. హైదరాబాద్లోని సీమాంధ్రుల భద్రత విషయంలో కొందరు నేతలు ‘గెటవుట్’ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నందునే యూటీ చేయాలని కోరుతున్నాం. సీమాంధ్రులు 30 లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తున్నందునే తెలంగాణలో కొత్తగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయనే విషయాన్ని గుర్తు చేశాం. కృష్ణా-గోదావరి నదులకు సంబంధించి సాగునీటి పంపిణీతో పాటు హ్రందీ నీవా, గాలేరు నగరి, ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశాలను ప్రస్తావించాం’’ అని శీలం చెప్పారు. జీవోఎం సభ్యు లు సానుకూలంగా స్పందించారని, సీమాంధ్ర ప్రజల అభిలాష నెరవేరుస్తారనే నమ్మకం ఏర్పడిందన్నారు. వైజాగ్లో రాజధాని ఏర్పాటు చేయాలి: కిశోర్ సీమాంధ్ర కే ంద్ర మంత్రుల అభిప్రాయాలను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న కిశోర్ చంద్రదేవ్ తన వైఖరి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని జీవోఎంకు చెప్పారు. ఉమ్మడి రాజధాని పేరు తో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయకుండా తప్పించుకునే ప్రమాదముందని నివేదికలో పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రజలు వ్యయప్రయాసలకోర్చి తెలంగాణను దాటుకుంటూ వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తక్షణమే విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రజలు సీమాంధ్రలో కలిసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని, అవసరమైతే ఆ 4 జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అది సాధ్యంకానట్లయితే రాయలసీమను తెలంగాణలో కలపాలని సూచించారు. రాయలసీమను జిల్లాల వారీగా విభజించి సగం తెలంగాణలో, సగం ఆంధ్రాలో కలపడం ఏమాత్రం సరికాదన్నారు. పనబాక లక్ష్మి కూడా కొత్త రాజధానిని కోస్తాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఐదు పేజీల నోట్ను జీవోఎం సభ్యులకు ప్రత్యేకంగా సమర్పించారు. 7 పేజీల నోట్లోని ముఖ్యాంశాలు.. హెచ్ఎండీఏ పరిధితో పాటు సీమాంధ్రను కలిపే మూడు జాతీయ రహదారులను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అధీనంలోనే ఉండాలి. 1956కు ముందున్నట్టుగా భద్రాచలం, మునగాల, అశ్వారావుపేట ప్రాంతాలను యథాతథంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కొనసాగించాలి. విభజన బిల్లును పరిగణనలోకి తీసుకోవడానికి రాష్ట్ర అసెంబ్లీకి తగినంత సమయం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం, మిగిలిన ఆంధ్రప్రదేశ్కు మధ్య.. నియోజకవర్గాలు, న్యాయ, చట్టబద్దమైన, ఇతర పరిపాలనా సంస్థల మధ్య నిర్దిష్టమైన సరిహద్దులు ఏర్పాటుచేయాలి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో పరిపాలన, న్యాయపరమైన సమస్యలు రాకుండా, రెండు రాష్ట్రాల పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నివసించే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగొద్దు. ఇరు ప్రాంతాల నుంచి పోలీసు నియామకాలు చేపట్టాలి. కేంద్ర బలగాలను ఉంచాలి. రాష్ట్రంలో ప్రాంతాలకతీతంగా వెనుకబడిన అన్ని జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. కొత్త రాజధాని నిర్మాణం, రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, నివాస సముదాయాలు, విద్యుత్, రోడ్డు, రైలు మార్గాలు వంటి కీలక అంశాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కేంద్రమే బాధ్యత వహించాలి. నిర్దిష్ట గడువును విధించి, ఆ గడువులోగా సీమాం ధ్రకు రాజధాని పూర్తిచేయాలి. 20 ఏళ్ల పాటు ఏటా రూ.40 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, మహిళా, మైనార్టీ, మానవహక్కుల కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలను ఉమ్మడిగానే కొనసాగించాలి. పోలీసు నియామకాల్లో 14ఎఫ్ పునరుద్ధరించాలి. కొత్త రాజధానిలో పూర్తిస్థాయి హైకోర్టుతో పాటు, కర్నూలు, విశాఖపట్నంలో హైకోర్టు బెంచీలను ఏర్పాటుచేయాలి. ఆంధ్రా రాజధానికి సుప్రీంకోర్టు బెంచీని కూడా ఏర్పాటుచేయాలి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేయాలి. నదీ జలాలు, సాగుప్రాజెక్టుల పంపకాలు, బొగ్గు, ఆయి ల్, గ్యాస్ పంపకాల్లో సమన్యాయం పాటించాలి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివాదరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, కార్పొరేషన్ల పంపకాలు జాగ్రత్తగా చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి అప్రమత్తతతో పంపిణీ చేయాలి. 371(డీ)ని పరిష్కరించాలి. న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలి. రాష్ట్ర విభజనకు ఆ ఆర్టికల్ అడ్డుకాకుండా చూడాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, నిట్ వరంగల్, ఐఐటీ మెదక్, మెడికల్, పీజీ కాలేజీ వంటి కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ఇరుప్రాంతాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. ఐఐటీ, ఐఐఎం, కేంద్ర వ్యవసాయ విద్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిమ్స్ తరహా వైద్యవిద్యకు యూనివర్సిటీని నెలకొల్పాలి. ఇచ్చాపురం నుండి అనంతపురం దాకా 8 లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలి. బెంగళూరు నుం డి అనంతపురం, నెల్లూరు, చిత్తూరును కలుపుతూ చెన్నైదాకా జాతీయ రహదారి నిర్మాణం చేయాలి. గుంటూరు వద్ద వై జంక్షన్ నిర్మించాలి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఇవ్వాలి. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుచేయాలి. కొత్తగా నిర్మించే రాజధానిలోనూ, విశాఖలోనూ మెట్రో రైలును ఏర్పాటుచేయాలి. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలి. కోస్తాలో ఓడరేవుల అభివృద్ధి చేయాలి. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటుచేయాలి. గిరిజనాభివృద్ధి బోర్డును, కడపలో పారిశ్రామిక జోన్ను ఏర్పాటుచేయాలి. పెట్రో కారిడార్ను విస్తృతపర్చాలి. -
3 రోజుల్లో టీ బిల్లు ఖరారు
ముగిసిన జీవోఎం చర్చలు 3 రోజుల్లో టీ బిల్లు ఖరారు తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో జీవోఎం భేటీలు రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తామని సీమాంధ్ర కేంద్రమంత్రుల హామీ హైదరాబాద్ యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని వినతి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇవ్వాలన్న టీ కేంద్రమంత్రులు లేకుంటే బిల్లుకు బీజేపీ మద్దతివ్వదని, కాంగ్రెస్కు తీవ్ర నష్టమని నివేదన విభజిస్తే నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయన్న ముఖ్యమంత్రి {పహసనంగా జీవోఎం భేటీలు.. ముగ్గురు సభ్యుల గైర్హాజరే నిదర్శనం సంప్రదింపులు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు: షిండే, దిగ్విజయ్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనకు సంబంధించి తుది విడత చర్చల ప్రక్రియ ముగిసిపోయింది. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలనూ వినటంతో.. చర్చల ప్రక్రియను పూర్తిచేసినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ముసాయిదా బిల్లుకు తుది రూపం ఇవ్వటమే మిగిలింది. ఈ పనిలో నిమగ్నమైన జీవోఎం మరో మూడు రోజుల్లో దానిని కూడా పూర్తిచేయనుంది. ఈ నెల 20, 21 తేదీల్లో (బుధ, గురువారాల్లో) జీవోఎం సమావేశమై బిల్లును ఖరారు చేయనుంది. ఆ బిల్లును 21వ తేదీ సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రవేశపెట్టేందుకు సంసిద్ధమవుతోంది. బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే రాష్ట్రపతికి పంపించేందుకు, అటునుంచి రాష్ట్ర శాసనసభకు పంపేందుకు కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజనకు సంబంధించి సంప్రదింపులు పూర్తయ్యాయని జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండేతో పాటు, జీవోఎం సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్లు కూడా ప్రకటించారు. జీవోఎం తన నివేదికను సాధ్యమైనంత త్వరలో కేబినెట్కు పంపుతుందని.. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు టీ బిల్లు వెళ్తుందని వారు ఉద్ఘాటించారు. మూడు భేటీలతో మమ... నిన్నటివరకు సమైక్య రాష్ట్రమే తమ ఏకైక ఎజెండా అని పదేపదే ప్రకటించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. రాష్ట్ర విభజన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవోఎంకు స్పష్టంచేశారు. విభజన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే.. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిస్తే సీమాంధ్రలోని 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతారని సలహా ఇచ్చారు. దీంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మేరకు ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. కొత్త రాజధాని ఎక్కడనే దానిపై తమలోనే బేధాభిప్రాయాలున్న నేపథ్యంలో నిపుణుల కమిటీని వేసి ఎంపిక చేయాలని కోరారు. కిషోర్ చంద్రదేవ్ మినహా సీమాంధ్ర కేంద్రమంత్రులంతా ముక్తకంఠంతో జీవోఎంకు ఇదే విషయాన్ని చెప్పారు. కిషోర్ మాత్రం విభజన జరిగితే ఉమ్మడి రాజధాని అవసరం లేదని, విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదే సమయంలో రాయలసీమను సైతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, సాధ్యంకాని పక్షంలో తెలంగాణలోనే కలపాలే తప్ప సీమను విభజించటం ఏమాత్రం సహేతుకం కాదని సూచించారు. తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు మాత్రం.. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన పరిపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జీవోఎంకు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చే అవకాశం లేదని.. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం టీ-నేతలు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయమనే ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్ నుంచి రెండు బ్యాగ్ల నిండా ఫైళ్లతో జీవోఎం ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి.. గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం, టైజంతో పాటు మతక లహాలు పెచ్చరిల్లే ప్రమాదముందని జీవోఎంకు స్పష్టం చేశానని ఆ తర్వాత మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి సాగునీరు, విద్య వంటి రంగాల అభివృద్ధికి తగిన ఆర్థిక సాయం చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఇక విభజన జరుగుతుందో లేదో వేచి చూడాలని ముక్తాయించారు. జీవోఎం మాత్రం ఈ సంప్రదింపుల ప్రక్రియనంతా తూతూ మంత్రంగా ముగించింది. చివరకు సొంత పార్టీ నాయకులు, రెండు ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన భేటీని సైతం తేలికగా తీసుకుంది. సోమవారం జరిగిన కీలక సమావేశాలకు సీనియర్ మంత్రులైన ఎ.కె.ఆంటోని, చిదంబరం, గులాంనబీఆజాద్లు గైర్హాజరవటమే ఇందుకు నిదర్శనం. హాజరైన నలుగురు సభ్యుల్లోనూ వీరప్పమొయిలీ తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రుల భేటీకి రాలేదు. ఇక బిల్లుకు తుది రూపంపై కసరత్తు... అందరి అభిప్రాయాలు వినడానికే పరిమితమైన జీవోఎం సభ్యులు సమావేశాల తర్వాత సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం ఈ నెల 20, 21 తేదీల్లో ఉదయం 10.30 గంటలకు మరోసారి సమావేశమై తెలంగాణ బిల్లును ఖరారు చేసి, 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపటంతో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని షిండే పునరుద్ఘాటించారు. విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ చేసిన వాదనను దిగ్విజయ్ తోసిపుచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ నిర్ణయమే ఫైనల్ అని, సీఎం సహా ఎవరైనా శిరసావహించాల్సిందేనని స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుందంటూ.. తెలంగాణ ప్రజలకు, యూపీఏ సర్కారుకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక జీవోఎం నివేదికను ఖరారు చేస్తాం ‘‘ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇతరులతో చర్చల ప్రక్రియను మేం పూర్తిచేశాం. ఇప్పుడు జీవోఎం సభ్యులు సమావేశమై కేబినెట్కు సమర్పించాల్సిన నివేదికను ఖరారు చేయటంపై చర్చిస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ నివేదికను సమర్పిస్తాం. తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతాం.’’ - సుశీల్కుమార్షిండే, కేంద్ర హోంమంత్రి, జీవోఎం సారథి సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జీవోఎం సంప్రదింపులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలకూ జీవోఎం పరిష్కారం చూపుతుంది. సీమాంధ్ర అభివృద్ధిపై ఆ ప్రాంతం నేతల డిమాండ్లు సరైనవే. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుంది. తెంగాణ ప్రజలకు, యూపీఏకు శుభాకాంక్షలు.’’ - దిగ్విజయ్సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అన్ని ప్రాంతాల అభిప్రాయాలూ పరిగణనలోకి... ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఈ నెల 21న జీవోఎం మరోసారి భేటీ అవుతుంది. జీవోఎం తుది నివేదిక ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. విభజన అంశాన్ని పెండింగ్లో పెట్టబోం. సీఎం కిరణ్ తన వాదనను వినిపించారు.’’ - వీరప్పమొయిలీ, కేంద్ర పెట్రోలియం మంత్రి, జీవోఎం సభ్యుడు జరగనున్న క్రమమిదీ... ఈ నెల 20, 21 తేదీల్లో జీవోఎం చివరిసారిగా సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పిస్తుంది. 21వ తేదీన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశం ముందుకు ఆ ముసాయిదా బిల్లు వచ్చే అవకాశముంది. కేంద్ర మంత్రిమండలి దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరతారు. దీనికి ఇంత సమయంలో జరగాలని కాలపరిమితి అంటూ లేదు. డిసెంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి. ఆ లోగానే రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలని అసెంబ్లీకి నిర్దేశించవచ్చు. రాష్ట్రపతి అలా కోరిన పక్షంలో మూడు రోజుల్లో రాష్ట్ర శాసనసభను సమావేశపరచడానికి అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ప్రోరోగ్ కానందున మూడు రోజుల కాలపరిమితిలో సమావేశాలను పెట్టడానికి వీలుంది. ఆ లెక్కన నెలాఖరులోగా అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడానికి వీలు ఉంది. అది రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపే గడువును బట్టి ఆధారపడి ఉంది. అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాత బిల్లును రాష్ట్రపతి మరోసారి పరిశీలించి పార్లమెంటుకు పంపిస్తారు. శీతాకాల సమావేశాల్లో బిల్లును పార్లమెంటు ముందు పెట్టే అవకాశముంది. -
'విభజనతో ఇరు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య తీవ్రం'
-
'హైదరాబాద్ను యూటీ చేయాల్సిందే'
-
విభజనతో ఇరు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య తీవ్రం: కిరణ్
రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య విజృంభిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవోఎంతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, సాగునీరు, విద్య, ఉద్యోగాలు.. ఇలా అనేక సమస్యలను ఆయన ప్రస్తావించారు. జీవోఎంకు రెండు పుస్తకాలు కూడా అందించిన ఆయన, తాను నివేదించిన అంశాల గురించి వెల్లడించారు. ఆ అంశాలివీ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికంటే తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. పారిశ్రామికంగా హైదరాబాద్ ఎంతో ఎదిగింది. ముఖ్యంగా ఫార్మా, ఇతర భారీ పరిశ్రమలు చాలా ఏర్పడ్డాయి. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా విద్య, వైద్య పరమైన అవకాశాలు ఉన్నందున సీమాంధ్ర ప్రజలకు సమస్యలు ఏర్పడతాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య నక్సలిజమేనని ప్రధాని గతంలో కనీసం ఆరేడుసార్లు చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలంతా రాష్ట్రానికి చెందినవారే. నక్సలైట్లలో ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యులంతా ఏపీ వాళ్లే. విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య పెరుగుతుంది. రాష్ట్రంలో ఉగ్రవాదుల నుంచి కూడా పెద్ద సవాల్ ఎదురవుతోంది. విభజన వల్ల పోలీస్ వ్యవస్థ బలహీనపడుతుంది. హైదరాబాద్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గణేశ్ చవితి లాంటి పెద్ద పండగ ఏమైనా వస్తే జిల్లాల నుంచి 25 వేల మంది పోలీసులను హైదరాబాద్కు తెస్తాం. అలాంటిది ఇప్పుడు విభజిస్తే అలాంటి పండుగల నిర్వహణే కష్టమైపోతుంది. హైదరాబాద్లో శాంతియుత వాతావరణం ఉంది. ఇటీవల ఎన్నో ఉద్యమాలు జరిగినా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ మీదే ఆధారపడుతున్నారు. ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతికూల ప్రభావం పడుతుంది. విభజన వల్ల సాగునీటి సమస్య తీవ్రమవుతుంది. కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే వివాదాలున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వీటిని వాడుకుంటున్నారు. సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా రైతులు కృష్ణా జలాలతో సాగు చేస్తున్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాల రైతులు నష్టపోతారు. విద్యుత్ పంపిణీలో కూడా చాలా సమస్యలు తప్పవు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును ఎవరెవరు ఎంతెంత పంచుకోవాలన్న సమస్య వస్తుంది. దాంతోపాటు విద్యుత్ ఇరు ప్రాంతాల మధ్య విద్యుత్ పంపిణీలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకే అజమాయిషీలో విద్యుత్ పంపిణీ ఉంటే పర్వాలేదు. కానీ రెండు రాష్ట్రాలైతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో ఉండే విద్యుత్ ప్రాజెక్టులకు విద్యుత్ ఎక్కడ నుంచి ఇవ్వాలి? ట్రిబ్యునళ్లు ఉండటం వల్ల సాగునీటి విషయంలో ఇప్పటికే చాలా వివాదాలున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో ఇప్పటికే గొడవలున్నాయి. 16 శాతం ఉద్యోగాల కోసం, 53 శాతం వ్యాపారం కోసం, మిగిలినవారంతా చదువు కోసం హైదరాబాద్కు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వోద్యోగాల్లో ప్రాంతాలవారీగా రిజర్వేషన్లుంటాయి. విభజన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఇతర ప్రాంతాల ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వాళ్లంతా ఎక్కడికెళ్లాలన్న సమస్య వస్తుంది. -
నెలాఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం: మొయిలీ
ఢిల్లీ: ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మొయిలీ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్నిస్పష్టం చేశారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన సీమాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని గతంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. .సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు. -
జీవోఎంతో ముగిసిన సీఎం కిరణ్ భేటీ
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. కాసేపట్లో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర విభజనపై తుదిదశ చర్చలు జరుపుతున్న జీవోఎం తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులతో సమావేశమైంది. అనంతరం ముఖ్యమంత్రి వారిని కలిశారు. కాగా కిరణ్ ఎక్కువ సేపు మంత్రుల బృందంతో మాట్లాడలేదు. రాష్ట్ర విభజనకు సంబందించి ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంకు నివేదికలు సమర్పించారు. -
హైదరాబాద్ను యూటీ చేయాల్సిందే: సీమాంధ్ర మంత్రులు
ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు కుదిరిందని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. హైదరాబాద్, నీళ్లు, ఉద్యోగాలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై తాము జీవోఎంతో చర్చించామని ఆయన చెప్పారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగిందని, అందువల్ల హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాండిచ్చేరి తరహాలోనే హైదరాబాద్ పాలన ఉండాలన్నారు. సీమాంధ్రలోని ప్రతి విద్యార్థి హైదరాబాద్ కావాలంటున్నాడని చెప్పారు. ఉమ్మడి రాజధాని హెచ్ఎండీఏ పరిధి వరకు ఉండాలని కోరామన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను తెలిపామని, సమస్యలు పరిష్కరించాకే ముందుకెళ్లాలన్నామని అన్నారు. హైదరాబాద్లో మరో నగరం అభివృద్ధి చెందేవరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తాము మూడు నెలల నుంచి చెబుతున్నామని, ఇప్పుడు కూడా రాయలసీమ నీటి సమస్యను ప్రస్తావించామని అన్నారు. హైదరాబాద్లో 30 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల మాటేమిటని తాము కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో ప్రస్తావించామన్నారు. జీవోఎంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు విలేకరులతో మాట్లాడారు. అయితే.. శీలం మాట్లాడుతుండగానే మరో ముగ్గురు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పళ్లంరాజు కూడా మీడియాతో మాట్లాడలేదు. -
ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే
న్యూఢిల్లీ : ఇచ్చిన వాగ్దానం మేరకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని సర్వే కేంద్ర మంత్రి సత్యనారాయణ తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు 12 పేజీలతో కూడిన నివేదిక ఇచ్చామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసమే కాదని.... ప్రత్యేకాంధ్ర కోసం కూడా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని సర్వే సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి రాజధాని అన్న అంశం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరినాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు సర్వే తెలిపారు. -
భద్రాచలం తెలంగాణలో భాగమే: బలరాం నాయక్
న్యూఢిల్లీ : భద్రాచలం తెలంగాణలో భాగమని, ఆ ప్రాంతం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. వారికి అన్యాయం జరిగితే స్థానికులు ఒప్పుకోరని అన్నారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉండాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ పేర్కొన్నారు. -
జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
తెలంగాపై కేంద్ర మంత్రుల బృందం చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందంతో సోమవారం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ఆరంభమైంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్, భద్రాచలం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. 11 అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. సమావేశంలో పాల్గొనేముందు వీరందరూ పల్లంరాజు ఇంట్లో సమావేశమైన చర్చించారు. అంతకుముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, సర్వేసత్యనారాయణ పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల బృందం హైదరబాద్, భద్రాచలం సహా కీలక అంశాలపై చర్చలు జరిపారు. కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా కేంద్ర మంత్రుల బృందంతో భేటీ కానున్నారు. -
జీవోఎంతో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
-
జీవోఎంతో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ కేంద్ర మంత్రుల బృందం సోమవారం జీవోఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ పాల్గొన్నారు. అంతకు ముందు జీవోఎంతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఆ కమిటీ ఎదుట ప్రతిపాదించాల్సిన అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ నేతలు కేంద్రమంత్రి జైపాల్రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశమై నివేదికకు తుది మెరుగులు దిద్దారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏడాదిలోపే నిర్మించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర మంత్రులు విభజనపై జీవోఎంకు నివేదించనున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే కేంద్రమే జోక్యం చేసుకుని త్వరితగతిన కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి తరలించాలని కోరనున్నారు. -
తెలంగాణ, సీమాంధ్ర నేతల సమావేశాలు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కసరత్తు చివరి దశకు చేరుకోవటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి దేశ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. జీవోఎంతో భేటీ నేపథ్యంలో ఓ వైపు తెలంగాణ ప్రాంత నేతలు, మరోవైపు సీమాంధ్ర ప్రాంత నేతలు విడివిడిగా సమావేశం అయ్యారు. ఈరోజు ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం ఎదుట హాజరుకావాల్సిన నేపథ్యంలో.. దానికి ముందుగా కేంద్రమంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రులు, నేతలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రాంత నేతలు ఉదయం 10.30 గంటలకు జీవోఎంతో భేటీ కానున్నారు. ఇక ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 12.30 గంటలకు జీవోఎం సభ్యులను కలుస్తారు. -
జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు క్లైమాక్స్కు చేరింది. దాంతో నేడు జివోఎం భేటీలో పాల్గొనడానికి కిరణ్ హస్తిన పయనం అయ్యారు. తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా ఇవాళ జీవోఎంతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జీఓఎంతో సీఎం భేటీ కానున్నారు. 11 అంశాలపై వీరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేయనున్నారు. -
ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం
-
రాజధాని చుట్టూ.. రామయ్య పై బెట్టు
తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో భేటీలు టీ బిల్లు ముసాయిదాలో మార్పుచేర్పులపైనే జీవోఎం దృష్టి హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే ప్రధాన చర్చలు హెచ్ఎండీఏ పరిధిని యూటీ చేస్తే, భద్రాచలం ఇచ్చేస్తే విభజనకు ఒప్పుకునే దిశలో సీమాంధ్ర కేంద్రమంత్రులు వంద రోజులకు పైగా సాగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోని నేతలు.. తాయిలాలిస్తే విభజనకు తలూపేందుకు సిద్ధం భద్రాచలాన్ని వదులుకోక తప్పదని సందేహిస్తున్న తెలంగాణ కేంద్రమంత్రులు.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితమయ్యేలా పట్టుపట్టాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలకు అనుగుణంగా తెలంగాణ బిల్లు ముసాయిదాలో మార్పులు జరిగేనా? 21న కేంద్ర మంత్రిమండలి భేటీకి ముందే ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం రాష్ట్ర విభజనపై ఢిల్లీ కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే సిద్ధం చేసిన తెలంగాణ ముసాయిదా బిల్లులో స్వల్ప మార్పుచేర్పులపైనే ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) దృష్టి సారించింది. హైదరాబాద్ను యూటీ చేయాలన్న డిమాండ్, ఉమ్మడి రాజధాని పరిధి, అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, భద్రాచలం డివిజన్ను ఎటువైపు ఉంచటం.. ఈ కీలకాంశాలు పీటముడిగా మారటంతో వీటిని పరిష్కరించేందుకు తుది కసరత్తుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జీవోఎం సోమవారం వేర్వేరుగా భేటీ కానుంది. మొన్నటివరకూ సమైక్యగళం వినిపించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. పార్టీ అధిష్టానం ఎజెండాను అమలులోకి తెస్తూ సీమాంధ్రకు ప్యాకేజీలంటూ స్వరం మార్చిన విషయం తెలిసిందే. వంద రోజులకు పైగా సమైక్య రాష్ట్రం కోసం కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని విస్మరించి మరీ.. ప్యాకేజీలు, తాయిలాలు ఇస్తే విభజనకు సరేనంటూ సిద్ధమవుతున్నారు. అలాగే సీఎం కిరణ్కుమార్రెడ్డి కూడా ఒకవైపు సమైక్యవాదన వినిపిస్తూ.. మరోవైపు అధికారికంగా విభజనకు తోడ్పాటునందిస్తున్న విషయం విదితమే. విభజన బిల్లులోనే హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటంతో పాటు సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కేవలం హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే.. అదికూడా ఉమ్మడి రాజధానిగా మాత్రమే గుర్తించాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయటానికి కూడా తెలంగాణ నేతలు అంగీకరించటం లేదు. అలాగే.. భద్రాచలం మాదంటే మాదని ఇరువైపుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జీవోఎం దాన్ని కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తే భద్రాచలం విషయంలో పట్టువిడుపులు తప్పవన్న భావన కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం జరిగే జీవోఎం భేటీల్లో ఈ రెండు అంశాలపై ఒక స్పష్టతకు రావటం.. తదనుగుణంగా ముసాయిదా బిల్లులో మార్పుచేర్పులు చేయటంపై కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలోని జీవోఎం దృష్టి సారిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కీలకమైన అంశాలపై ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వేర్వేరుగా వినిపించే వాదనలను జీవోఎం కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటుంది తప్ప వారు చెప్పే విభజన అనుకూల, వ్యతిరేక వాదనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. వీరిచ్చే నివేదికల ఆధారంగా.. హైదరాబాద్ను యూటీ చేయటం, లేదా ఢిల్లీ తరహాలో పాక్షిక కేంద్ర పాలిత ప్రాంతం, లేదంటే ఒకే గవర్నర్ కింద రెండు రాష్ట్రాల రాజధానులను నడిపించటానికి ఉన్న అవకాశాలు, కేంద్రం పరిధిలోకి తీసుకోవటం వంటి ప్రతిపాదనలపై జీవోఎం కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల భద్రత, హక్కులు వంటి అంశాలను బిల్లులో చేరుస్తారని సమాచారం. మరోవైపు.. వనరుల పంపిణీ, నీటిపారుదల, ఉద్యోగులు, విద్య తదితర అంశాలకు సంబంధించి విభజన బిల్లులో పూర్తి సమాచారంతో సమగ్రంగా చేర్చకుండా.. దేనికదే ప్రత్యేక బోర్డులు, కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీలు పరిష్కారం చూపుతాయని మాత్రమే బిల్లులో చెప్తారని తెలుస్తోంది. ఇక ఆర్టికల్ 371 (డి) విషయంలో జీవోఎం ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చలు జరపగా.. చిన్న సవరణతో ఇరు ప్రాంతాల్లో దాన్ని కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఈ నెల 21న కేంద్ర మంత్రిమండలి ముందు తెలంగాణ ముసాయిదా బిల్లు పెట్టే అవకాశాలున్నందున.. సోమవారం నాటి సమావేశాల అనంతరం ముసాయిదా మార్పుచేర్పుల పనుల్లో జీవోఎం తుది కసరత్తు పూర్తి చేస్తుందని సమాచారం. జీవోఎంతో చర్చలపై విడివిడిగా కసరత్తులు... విభజన కసరత్తు క్లైమాక్స్కు చేరిన దశలో జరుగుతున్న కీలక భేటీలు కావటంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, నేతలు జీవోఎంకు తమ వాదన వినిపించడానికి నివేదికల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు జీవోఎం ముందు హాజరుకానున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉదయం 11.30 గంటలకు జీవోఎం ఎదుట హాజరవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణల నివాసాల్లో ఆ ప్రాంత మంత్రులు, పలువురు రాష్ట్ర నేతలు సమావేశమై.. జీవోఎంకు నివేదించాల్సిన అంశాలపై చర్చించి నివేదికను రూపొందించారు. జీవోఎం కీలకంగా భావిస్తున్న అంశాల్లో ఒకటైన భద్రాచలం విషయంలో వీరు వెసులుబాటు కల్పించే రీతిలో ఈ నివేదికలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు సమక్షంలో సీమాంధ్ర నేతలు సమావేశమై జీవోఎం వద్ద సీమాంధ్రకు కోరాల్సిన ప్యాకేజీలపై ప్రధానంగా చర్చించి ఆ మేరకు నివేదిక రూపొందించారు. అధికారులతో నివేదిక సిద్ధం చేయించిన సీఎం జీవోఎం ముందు హాజరుకావటానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జీవోఎం ముందు హాజరై నివేదిక సమర్పిస్తారు. నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన నివేదికను ఆయన జీవోఎంకు సమర్పించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గత అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలిలో స్పష్టంగా చెప్పిన కిరణ్కుమార్రెడ్డి ఆ తర్వాత పార్టీ కోర్ కమిటీ ముందు కూడా అదే వైఖరి ఉద్ఘాటించారు. ఆనంతర పరిణామాల్లో సీఎం సీమాంధ్ర సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పెద్దలు వాటికి పరిష్కారం చూపిస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చే నివేదికలో.. ప్రధానంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను యూటీ చేయడమా, చేయకపోవడమా, ఒకవేళ చేసినా దాని పరిధి.. ఇలాంటి అంశాలపై సూచనలను కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఆర్టికల్ 371 (డి) విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నందున దానితో పాటు మిగిలిన అంశాలన్నింటిపైనా జీవోఎం ఇప్పటికే స్పష్టతకు వచ్చిందని, పైగా విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్రోడీకరించే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నివేదికను ఉపయోగిస్తారని తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే జీవోఎం ముందు ఒక నివేదిక సమర్పించిన విషయం పత్రికల్లో వచ్చిందే. ఎవరి వాదన వారిదే... తెలంగాణ ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేసిన జీవోఎం దానికి తుదిరూపమిచ్చే పనిలో నిమగ్నం కాగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ విభజన అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివన్నట్లుగానే మాట్లాడుతున్నారు. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా వంద రోజులకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు కావాలని కోరుతున్నప్పటికీ.. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత నేతలు విభజనపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలదీ అదే పరిస్థితి. మరోవైపు విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను హైకమాండ్ ఆదేశాల మేరకు నెత్తికెత్తుకున్న సీఎం కిరణ్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో సీమాంధ్ర సమస్యలు లేవనెత్తాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో జీవోఎం ముందు ఏం చెప్పినా విభజన విషయంలో బయట ఎవరివాదన వారు వినిపించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నేటి జీవోఎం భేటీలు ఇలా... ఉదయం 10:30కు: తెలంగాణ కేంద్రమంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్లతో భేటీ ఉదయం 11:30కు: సీమాంధ్ర కేంద్రమంత్రులు వి.కిశోర్చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణిలతో భేటీ మధ్యాహ్నం 12:30కు: సీఎం కిరణ్తో సమావేశం -
న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి
-
న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. తన నివాసంలో తెలంగాణ కేంద్ర మంత్రులు, నేతలతో జరిగిన సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర సూచించిన 11 అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించినట్లు తెలిపారు. అన్ని విషయాలపై తమలో కూడా మేథోమథనం జరిగినట్లు తెలిపారు. ఉమ్మడి ఉద్దేశాలను దృష్టిలోపెట్టుకొని ఒక నోట్ తయారు చేసినట్లు చెప్పారు. రేపు తెలంగాణకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులం రాష్ట్ర విభజనకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)ను కలుస్తామని చెప్పారు. అయితే తమకు అర్ధగంట మాత్రమే సమయం ఇచ్చినందున తమ ఉమ్మడి అభిప్రాయాలను రాతపూర్వకంగా జిఓఎంకు ఇస్తామని చెప్పారు. -
సోమవారం GOMకి ప్రాధాన్యత
-
విభజన ప్రక్రియను తుది దశకు చేర్చిన కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను సమైక్యవాదినని చెబుతూనే విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారు. కేంద్ర శరవేగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియను కొనసాగిస్తోంది. రాష్ట్ర విభజనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం), కేంద్రంలోని, రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని అంశాలపై చర్చించారు. ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవడం చెకచెకా జరిగిపోతున్నాయి. విభజనకు సంబంధించిన పనులు వెంటవెంటనే పూర్తి చేయాలని అన్ని శాఖలకు కేంద్ర హొం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న జిఓఎం పలువురితో తుది విడత చర్చలు జరుపనుంది. తెలంగాణ బిల్లు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మంత్రి మండలి ఆమోదించిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతారు. రాష్ట్రపతి నుంచి బిల్లు ఈ నెలాఖరుకల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుంది. ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. సీమాంధ్ర ప్రజల నుంచి (కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నుంచి కాదు) ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డిసెంబరు చివరికల్లా రాష్ట్రాన్ని విభజించాలన్నా కృతనిశ్చయంతో ఉంది. ఓ పక్క విభజన ఏర్పాట్లు ఇంత వేగంగా జరుగుతున్నా, సీఎం కిరణ్ ఇంకా తాను సమైక్యవాదినని, జిఓఎం వద్ద సమైక్యవాదం వినిపిస్తానని సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే తనకు పదవి ముఖ్యం కాదని కూడా చెబుతూనే ఉన్నారు. నిన్న విశాఖపట్నం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ సమైక్యం కోసం చేసే పోరాటంలో తాను పదవిని సైతం లెక్క చేయనని చెప్పారు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చినా ఆయన ఇంకా జనాన్ని నమ్మించడానికే ప్రయత్నిస్తున్నారు గానీ, రాజీనామా మాత్రం చేయరు. సిఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడని ఆయన ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రం విభజన జరిగితే తెలంగాణ ప్రాంతమే ఎక్కువ నష్టపోతుందన్న కొత్త వాదన సిఎం ఇటీవల లేవనెత్తారు. పరోక్షంగా విభజన వల్ల సీమాంధ్రకే మేలు కలుగుతుందన్న భావన వ్యక్తమయ్యే విధంగా మాట్లాడుతున్నారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో జరిగిన రచ్చబండలో ఇదేతీరున మాట్లాడారు. విడిపోతే విద్య, ఉద్యోగాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ తెలంగాణకే నష్టమని నొక్కిమరీ చెప్పారు. ఈ నెల 18న జిఓఎం ముందు సమైక్యవాదాన్ని వినిపిస్తానని ఈ రోజు కూడా కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విభజనకు సహకరిస్తున్నట్లు కూడా ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఆయన ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ నెల 18న ఢిల్లీ జరిగే సమావేశంలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కిరణ్కు మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై సీఎంతో కేంద్రం జరిపే తుది చర్చ ఇదేనని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిచోట సిఎం తాను సమైక్యవాదినని చెబుతూ విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'అధిష్టానం వల్లే కిరణ్ సీఎం అయ్యారు'
స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని... ఆ పార్టీనే కాదనుకుంటే కిరణ్ కలలో కూడా సీఎం అవ్వలేరని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను సంప్రదించకుండా కేంద్రమంత్రుల బృందానికి (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, జీవోఎం సభ్యుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
సీఎం కిరణ్ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చదని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పళ్లంరాజు ప్రారంభించారు. అనంతరం పళ్లంరాజు మాట్లాడుతూ... తాను ఎప్పటికి సమైక్యవాదినే అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని ఇప్పటికికూడా పోరాడుతున్నట్లు చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పళ్లంరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నెల 19న జీవోఎం ఎదుట తమ వాదనలు వినిపిస్తామన్నారు. కేంద్రం రాష్ట్ర విభజనపై తమదైన శైలీలో ముందుకు వెళ్తుంది. అయితే ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత కొద్ది కాలంగా గుర్రుగా ఉంది. దాంతో సీఎం పదవిలో మరోకరిని నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో పళ్లంరాజు పైవిధంగా స్పందించారు. -
విభజన.. రాజ్యాంగ ఉల్లంఘనే: అశోక్బాబు
సాక్షి, హైదరాబాద్: విభజనకు సంబంధించి జీఓఎం ప్రతిపాదించిన 11 అంశాల్లో.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఏ ఒక్క అంశానికి పరిష్కారం దొరకదని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజించగలిగే పరిస్థితి లేదన్నారు. సీఎం కిరణ్కుమార్రెడ్డికి, ఉద్యోగుల ఉద్యమానికి సంబంధం లేదన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ఈనెల 24న జరిగే ఉద్యోగ సంఘాల జేఏసీల సమావే శంలో నిర్ణయిస్తామన్నారు. -
శాఖలతో చర్చలు కొలిక్కి
ఉన్నతాధికారులతో 4 గంటలు జీవోఎం చర్చలు ఆర్థిక, న్యాయ, హోం అంశాలపైనే దృష్టి.. బిల్లు, 371-డిపై న్యాయశాఖ ప్రజెంటేషన్లు హైదరాబాద్, శాంతిభద్రతలపై టాస్క్ఫోర్స్తో చర్చ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో చర్చలను ఓ కొలిక్కి తీసుకొచ్చింది. పలు శాఖల కార్యదర్శులతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపిన జీవోఎం, గురువారం సాయంత్రం నుంచి రాత్రి దాకా ఆర్థిక, రైల్వే, సిబ్బంది వ్యవహారాలు, న్యాయ, నౌకాయాన, పౌర విమానయాన, రోడ్డు-రవాణా శాఖల ఉన్నతాధికారులతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమాలోచనలు సాగించింది. నార్త్బ్లాక్లో జరిగిన ఈ భేటీలో జీవోఎం సారథి, హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, సభ్యులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, వి.నారాయణసామి పాల్గొన్నారు. ఆర్థిక, హోం, న్యాయ శాఖలపై సభ్యులు ప్రధానంగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ ప్రతిపత్తి, శాంతిభద్రతల నిర్వహణ, ఆర్టికల్ 371-డి, ముసాయిదా బిల్లు తయారీ, ఆస్తులు-అప్పులు, రెవిన్యూ పంపిణీ వంటి కీలకమైన సున్నితాంశాలపై అభిప్రాయాలను తెలుసుకోవడమే గాక అధికారుల నుంచి అదనపు సమాచారాన్ని కోరారని తెలిసింది. జీవోఎం తదుపరి సమావేశం తర్వాత వీటిపై స్పష్టత వస్తుందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయా శాఖలతో జీవోఎం చర్చల వివరాలు... హోం... హైదరాబాదే ప్రధానం జీవోఎం తొలుత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, టాస్క్ఫోర్స్ చీఫ్ విజయ్కుమార్, సభ్యుడు వాసన్ తదితరులతో భేటీ అయింది. హైదరాబాద్ ప్రతిపత్తి, శాంతిభద్రతల నిర్వహణ, ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో నగరంలో రెండు రాష్ట్రాల పాలనా వ్యవస్థలు, ఉమ్మడి రాజధాని పరిధి, తదితరాలపై చర్చించింది. న్యాయపరమైన చిక్కులుండే కొన్ని అంశాలపై న్యాయ శాఖతో మాట్లాడాలని విజయ్కుమార్, వాసన్ సూచించారు. ఇక ఆస్తులు, అప్పులతోపాటు రెవెన్యూ పంపిణీ విషయంలో హైదరాబాద్ ప్రతిపత్తి ప్రధాన అవరోధం కనుక దానిపై స్పష్టత ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పునరుద్ఘాటించారు. పలు ఆర్థికాంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవోఎం కోరిన మేరకు హైదరాబాద్ విషయంలో రెండు మూడు ఆప్షన్లతో పంపిణీ నివేదికలను నాలుగైదు రోజుల్లో సమర్పిస్తామని తెలిపారు. న్యాయ శాఖ నుంచి రెండు విభాగాల అధికారులు కీలక సమస్యలైన 371-డి, హైదరాబాద్ ప్రతిపత్తి, బిల్లు తయారీ సంబంధిత అంశాలపై కీలకమైన న్యాయ శాఖలోని రెండు విభాగాల ఉన్నతాధికారులతో జీవోఎం గంటన్నర పాటు చర్చించింది. ముందుగా న్యాయ వ్యవహారాలు, తర్వాత శాసన వ్యవహారాల ఉన్నతాధికారులతో సమీక్షించింది. వారు సవివరంగా ప్రజెంటేషన్లు ఇచ్చారు. అయినా 371-డి, బిల్లు తయారీలపై ఇంకా స్పష్టత రాలేదని, వాటిపై అదనపు సమాచారాన్ని జీవోఎం కోరిందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్రతిపత్తిపైనా న్యాయ శాఖ అభిప్రాయాలను కోరారు. 371-డిని ఉంచడమా, తొలగించడమా అన్నది జీవోఎం నిర్ణయించాల్సిందేనని అధికారులు స్పష్టీకరించారు. సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు తొలి ప్రతిని జీవోఎం ముందుంచారు. వారికి సభ్యులు కొన్ని సూచనలిచ్చారు. 20కల్లా ముసాయిదా బిల్లును పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. వాల్తేరు రైల్వే జోన్పైనా చర్చ విశాఖ కేంద్రంగా కొత్తగా వాల్తేరు రైల్వే డివిజన్ ఏర్పాటు తదితరాలపై జీవోఎంకు రైల్వే బోర్డు చైర్మన్ నివేదిక ఇచ్చారు. పాలనాపరమైన సమస్యలను పరిహరించేందుకు కొన్ని సూత్రాలను సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు సూచించినట్టు సమాచారం. కోస్తా తీరంలోని రేవులు, దుగ్గరాజపట్నం వద్ద తలపెట్టనున్న భారీ ఓడరేవు ప్రాజెక్టుతో పాటు జలమార్గాల అభివృద్ధి తదితరాలపై నౌకాయాన శాఖాధికారులు వివరించారు. రాష్ట్ర, జాతీయ రహదారులు, టోల్ పన్ను వసూలు కేంద్రాలు, సరిహద్దుల మార్పుతో పన్నుల సూళ్లలో వచ్చే మార్పులు తదితరాలపై ఆ శాఖ అధికారులతో జీవోఎం సమీక్షించింది. -
రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మరోమారు ఢిల్లీ పయనం కానున్నారు. శుక్రవారం ఉ.6.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన తెలంగాణ మంత్రులు జీఓఎంతో సమావేశమవుతారు. వీరిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి, ఇతర మంత్రులు జీఓఎంతో భేటీ అవుతారు. ఈ రోజు జీఓఎంతో సమావేశమైన కేంద్ర కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈనెల 18 వ తేదీన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీఓఎం సభ్యులతో భేటీ కానున్నారు. వచ్చే సోమవారం ఉ.10.30కు టి.కేంద్ర మంత్రులతో జీఓఎంతో భేటీ కానుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఉ.11.30కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమవుతారన్నారు. అనంతరం మ.12.30 గంటలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీఓఎంతో బేటీ అవుతారు. ఈ నెల 20వ తేదీలోగా ముసాయిదా బిల్లుకు తుది రూపమిచ్చే అవకాశం ఉందని జైరాం రమేష్ తెలిపారు. -
డిసెంబర్ 15లోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకు పోతోంది. సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె చేపట్టినా పట్టించుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పావుల్ని కదుపుతోంది. విభజన పర్యవసానాలను పక్కన పెట్టి కేంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై దూకుడు ప్రదర్శిస్తోంది. విన్నపాలు, విజ్క్షప్తులను పట్టించుకోకుండా విభజన కార్యాచరణపై మున్ముందుకే కేంద్రం కదులుతోంది. నవంబర్ 28 లోపు తెలంగాణ బిల్లుకు తుది రూపు కల్పించేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ప్రధాని, సోనియా గాంధీల ముందుకు జీవోఎం తుది నివేదికను త్వరలోనే అందించనుంది. డిసెంబర్ 15 లోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం అడుగులేస్తోంది. దాంతో రానున్న వారం రోజులు అత్యంత కీలకమవ్వనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే
రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో నవంబర్ 18న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అవుతారు అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవాలు జరుగుతున్న కారణంగానే జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి భేటి కాలేకపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు గురించి చర్చకు వస్తుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేను అని షిండే మరో ప్రశ్నకు జవాబిచ్చారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ బిల్లును ప్రవేశ పెడుతాం అని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా వివరణ ఇచ్చారు. -
శిశుపాలుడుకి మించి తప్పులు చేసిన సీఎం: పాల్వాయి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిశుపాలుడుకి మించి తప్పులు చేశారని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన రెడ్డి ఆరోపించారు. సీఎం భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. అధిష్టానం ఆయనను డిస్మిస్ చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు. మంత్రి మండలి ఆమోదంలేకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఆ నివేదికను కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) పరిగణలోకి తీసుకోరాదని ఆయన కోరారు. టీడీపీ ఎంపీకి దుమ్ముగూడెం టెండర్లను ఖరారు చేయాలనుకుంటున్నారన్నారు. -
'సీఎం మార్పుపై తనకు తెలిసింది శూన్యం'
సీఎం పదవి నుంచి కిరణ్ను తప్పిస్తారన్న సంగతి తనకు తెలియదని రాష్ట్ర మంత్రి ఎస్. శైలజానాథ్ వెల్లడించారు. సీఎం మర్పు విషయంలో తన వద్ద ఉన్న సమాచారం శూన్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... నేడు న్యూఢిల్లీలో జరగాల్సిన కేంద్రమంత్రుల బృందం (జోవోఎం) సమావేశం వాయిదా పడింది, అందువల్ల సీఎం ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై తన దైన శైలీలో ముందుకు వెళ్తుండగా, సీఎం కిరణ్ మాత్రం తాను ముమ్మాటికి సమైక్యవాదినే అని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. దాంతో సీఎం కిరణ్ వైఖరిపై అధిష్టానం గుర్రగా ఉన్న సంగతి తెలిసిందే. -
సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. విభజన ప్రక్రియ తుది దశకు చేరిందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సీఎం కిరణ్కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం సీఎంకు సూచించింది. అయితే ఏ కారణం వల్లనో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 18న ఆయన జిఓఎంతో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
సీడబ్ల్యూసీ ‘విభజన’ నిర్ణయం శిరోధార్యం: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానమే తమకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు వినిపిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన బొత్స బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తొలి నుంచి ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు చెబుతున్నారని, ఇప్పటికీ ఎవరూ మాట మార్చలేదన్నారు. అఖిలపక్షంలో కూడా అదే వాదనలను వినిపించామని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ తమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను వినిపిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ప్రాంతాల వారీగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు చెబుతారన్నారు. అసెంబ్లీలో బిల్లుపై మెజార్టీ, మైనార్టీ అనేది ఏమీ ఉండదని, విప్ కూడా ఉండదని చెప్పారు. కేంద్ర మంత్రి షిండేను తాను రహస్యంగా కలవలేదని, అందరి ఎదుట రాష్ట్రానికి రావలసిన తుపాను సహాయక నిధులు విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చానని తెలిపారు. జీవోఎం ముందుకు రావాలని తనను పిలవలేదని, పిలిస్తే వెళ్తానన్నారు. ముఖ్యమంత్రికి జీవోఎం నుంచి పిలుపు వచ్చిన విషయం తనకు తెలియదన్నారు. జీవోఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన నివేదిక గురించి ప్రస్తావించగా అలాంటి నివేదిక పంపినట్లు తనకు తెలియదని చెప్పారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, అది కేంద్రం పరిధిలో విషయమని అన్నారు. -
కాంగ్రెస్ పార్టీది దివాళాకోరుతనం: నారాయణ
మంత్రుల బృందం( జీవోఎం) ముందు కాంగ్రెస్ భిన్న వాదనలు వినిపించడం ఆ పార్టీ దివాళాకోరు తనానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిలపక్షం భేటీని ఏర్పాటు చేయమని తాము అడిగామని, అయితే రహస్యంగా ఒక్కోపార్టీని ఎందుకు పిలిచారని ఆయన జీవోఎంను ప్రశ్నించారు. అలాగే రహస్య మంతనాలు ఎందుకు జరపాల్సి వచ్చిందని అడిగారు. రాష్ట్ర విభజన జరిగే నేపథ్యంలో రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మళ్లీ ఆ ప్రాంతంలో ఉద్యమం ఎగసి పడే అవకాశాలున్నాయన్నారు. జీవోఎం సభ్యులు సీమాంధ్రలో ఏర్పడే కొత్త రాష్ట్రం గురించి తనను కొన్ని ప్రశ్నలు వేశారని చెప్పారు.అందులోభాగంగా కొత్త రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చని వారికి సమాధానం ఇచ్చినట్లు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి:గట్టు
-
జీవోఎం ముందు 'వట్టి' కోర్కెల చిట్టా
హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలని రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మంత్రుల బృందం (జీవోఎం) ఎదుట తన కోర్కెల చిట్టా విప్పారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవోఎంను కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంచాలని, హైదరాబాద్ రెవెన్యూ ఆదాయంలో 60 శాతం తమకు ఇప్పిస్తారని జీవోఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.1956కు ముందు ఉన్న రాష్ట్రాన్ని తమకు ఇవ్వగలుగుతార అని జీవోఎంను ప్రశ్నించారు.తమ పార్టీ ఆదేశాల మేరకే నివేదికలిచ్చామని వట్టి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తాను సంధించిన ప్రశ్నలను పరిష్కరించి ఆ తర్వాత విభజనపై ముందుకు వెళ్లాలని వట్టి వసంతకుమార్ జీవోఎంకు సూచించారు. -
ముఖ్యమంత్రి కిరణ్కు జీవోఎం నుంచి పిలుపు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి జీవోఎం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం ఉదయం 8 గంటలకు జీవోఎంతో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో జీవోఎం భేటీ అయ్యింది. అయితే ఈ భేటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఐఎం, బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ, సీపీఎం పార్టీలో మంత్రలు బృందం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయి. మరోవైపు విభజనకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు చెప్పకుండా, తమవద్ద ఉన్న ప్రతిపాదనలేమిటో వివరించకుండా, విభ జనతో ముడిపడిన అనేకాంశాల వివరాలు, వివరణలేవీ లేకుండా మంత్రుల బృందం మొక్కుబడిగా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో జీవోఎం భేటీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌనమే సమాధానమయింది. -
GOM నుంచి సీఎం కిరణ్కు పిలుపు
-
ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విడదీస్తున్నారు: మైసూరా
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో వైఎస్ఆర్ సిపి నేతలు ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తొలి నుంచి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న వైఎస్ఆర్ సిపి విభజనకు వ్యతిరేకంగా తన వాదన వినిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎదురయ్యే సమస్యలను జీవోఎం దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్ఆర్ సిపి తరపున మైసురారెడ్డి, గట్టు రామచంద్రరావు జీవోఎంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. భేటీ అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీసేటప్పుడు చేయాల్సిన ఆలోచనలు చేయటం లేదన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో విభజన వాదాలు ఉన్నాయని అయితే వాటి గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఎందుకు విడదీయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రాల విభజనపై ఓ కమిషన్ లేదా కమిటీ వేసి విభజనపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఓట్లు.... సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత బాధపడతారో ఆలోచించాలని ఆయన అన్నారు. -
'తెలుగు జాతిని కాంగ్రెస్, బాబు అవమానిస్తున్నారు'
ఢిల్లీ: తెలుగుజాతిని కాంగ్రెస్... తెలుగుదేశం పార్టీ అవమానిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకటే విధానమని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లాగా రెండు వైఖరులు ఉండవని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని గట్టు ఆరోపించారు. విభజన వల్ల అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. -
కాసేపట్లో GOMతో YSRCP భేటీ
-
రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనది
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భేటీ కానుంది. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనదన్నారు. మొదటి ఎస్సార్సీ ఆధారంగా రెండు అసెంబ్లీల తీర్మానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. విభజన వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఇబ్బంది పడతాయన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే విభజన అంశాన్ని తెరమీదక తెచ్చారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్య రాష్ట్రమేనని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేంద్రమంత్రుల బృందం చెబుతున్న విధానాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను విడగొట్టడానికి తప్ప సమైక్యంగా ఉంచడానికి కావని మైసూరా మండిపడ్డారు. జల వివాదాలకు సంబంధించి కేంద్ర జల వనరుల మంత్రి చైర్మెన్ గా ఇరు ప్రాంతాల సీఎంలు, కార్యదర్శలతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరిస్తారనడం వెర్రి ఆలోచన అన్నారు. జీవోఎంతో చర్చల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంవి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు పాల్గొననున్నారు. సీపీఎం కూడా జీవోఎంతో భేటీ కానుంది. -
నేడు సీవోఎంతో వైఎస్ఆర్సీపీ,సీపీఎం భేటీ
-
జనవరిలోగా తెలంగాణ: రాజనరసింహ
-
విభజన అంశాన్నిపునరాలోచించుకోవాలి: వట్టి