
భద్రాచలం తెలంగాణలో భాగమే: బలరాం నాయక్
న్యూఢిల్లీ : భద్రాచలం తెలంగాణలో భాగమని, ఆ ప్రాంతం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. వారికి అన్యాయం జరిగితే స్థానికులు ఒప్పుకోరని అన్నారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉండాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ పేర్కొన్నారు.