నెల్లూరులో బాంబు పేలుడు ఘటనపై విచారణ | Enquiry stated in Bomb Blast In Nellore Court Premises | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

జిల్లా కోర్టు ఆవరణ(మూడో అదనపు జూనియర్‌ జడ్జి కోర్టు ఎదురుగా గల గోడవద్ద)లో సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు గుర్తుతెలియని దుండగులు బాంబు పేల్చారు. పేలుడు దాటికి గోడకు, సమీపంలోని చెట్టుకు, గోడ అవతలివైపున రంధ్రాలయ్యాయి. దుండగులు అరలీటర్‌ సామర్థ్యం కల్గిన ప్రెజర్‌ కుక్కర్‌ను టిఫిన్‌ బ్యాగ్‌లో అమర్చి 9వోల్ట్స్‌ బ్యాటరీలను వినియోగించి పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాస్ట్‌లో అమోనియం నైట్రేట్‌ను వినియోగించినట్లు సమాచారం. బ్లాస్టింగ్‌ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలను ఐఈడీ(ఇంప్రవైజ్‌డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)గా పోలీసులు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement